Tuesday 3 September 2019

చందమామకు సూర్యుడు పిల్లనిచ్చిన మామ అవుతాడా?అవునని ఋగ్వేదమే బల్లగుద్ది చెప్తుందహో!

సోముడికీ సూర్యకళకీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే వివాహ శుభ యాత్రని వర్ణించే RV (X.85) భాగం మొత్తం ఋగ్వేదంలోనే కవిత్వం ధగద్ధగాయమానమై వెల్లివిరిసే కమనీయ సౌందర్య సంభరితమైన సంతత శారదాంఘ్రి నతమస్తక సరసజనైక మనోవేద్యం!
"ఇంకేముంది,హరిబాబు మళ్ళీ పిట్టకధలు చెప్పేస్తున్నాడు!చీల్చేద్దాం, చెండాడి గెల్చేద్దాం!" అని పరుగున పరుగున పాఱొచ్చే ఛీరంజీవి వై లాంటి ఎదవలకి ఉసూరుమనిపించినా సరే - నిజం చెప్పేస్తున్నాను, ఇది చంద్రగ్రహణం ఏర్పడేటప్పుడు భూమి మీద నుంచి చూస్తే మనకి కనిపించే దృశ్యానికి వెనక జరిగే తతంగం లోని దశల్ని వర్ణించే శాస్త్రసాంకేతిక సంబంధమైన వ్యవహారం. వైదిక సాహిత్యం గంభీరమైన సాంకేతిక విషయాల్ని చెప్పటానికి "ౘందమామకి సన్నజాజికి పెళ్ళి కుదిరింది..." తరహా కవిత్వాన్ని వేదం ఎందుకు వాడుకున్నదో అర్ధం చేసుకోలేని గాడిదలకి "సూర్యగోళం చంద్రగోళానికి పిల్లనివ్వడం యేంటి?చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకి సిగ్గు లేదా!" అని అనిపిస్తుంది - గాడిద కేమి తెలుసు గంధపు చెక్కల వాసన?
ఈ సూక్తంలో మొత్తం 47 మంత్రాలు ఉన్నాయి గానీ అన్నీ మనకి అనవసరం.ముఖ్యమైన భావాన్ని చెప్పే మంత్రాల అర్ధం తెలుసుకుంటే చాలు.Earth is held by truth(భూమికి సత్యం ఆధారం) and the heaven is upheld by Sun(ఆకాశానికి సూర్యుడు ఆధారం). Ādityas depend on the cosmic order(ఆదిత్యులకు విశ్వలయ ఆధారం), while Moon is stationed in the sky(చంద్రుడు వాయురాకాశాల మధ్యన స్థిరుడై ఉన్నాడు).
(1)  సోముడనే పేరుగల చంద్రుడు తారకల సమీపంలో ఉన్నాడు.
 (2)  చంద్రుడు సోమలతను చూర్ణం చేసిన ఆసవాన్ని నిరంతరం గ్రోలుతూ ఉంటాడని సర్వులూ భావిస్తారు. కానీ జ్ఞానులకి మాత్రమే అందులోని రహస్యమూ చంద్రుని నిజస్వభావమూ తెలుస్తుంది.
(3)  సోమా! నీవు ఏడు వరసల రక్షణ వలయాల్ని దుస్తుల మాదిరి ధరించి ఉన్నావు. మానవులు నిన్ను యధాతధం స్వీకరించలేరు, వారికి నీవు సులభ పానయోగ్యుడవు కావు.
(4)  సోమా! దేవతలు నిన్ను పానం చేసే కొద్దీ అంతమనేది లేక మరింత వృద్ధినే పొందుతావు. వాయువు నిన్ను రక్షిస్తాడు, ఇలా దేవతల చేత త్రాగబడుతూ సంవత్సరాలకు కారణమై చంద్రుడు కాలస్వరూపుడై ఉన్నాడు.
పైన చెప్పిన మంత్రాలు ఈ సూక్తం యొక్క అధిదేవతను కీర్తించే పరిచయ సూచకమైనవి. వీటి తర్వాత వచ్చే ఏడు మంత్రాలూ (v.6-12) సూర్యభవ అయిన వధువు సూర్యకళ తన ప్రియభర్త అయిన సోముణ్ణి చేరుకోవడానికి చేస్తున్న కళ్యాణవధూగమనయాత్ర ఉపమాఉపమేయరభేదమై అది అన్వయమా ఉత్ప్రేక్షయా ప్రతీపమా ఉల్లేఖమా దీపకమా రూపకమా సందేహమా సహోక్తియా విశేషోక్తియా అన్యోన్యమా వికల్పమా కావ్యలింగమా మీలితమా ఉన్మీలితమా గూఢోక్తియా తద్గుణమా ఉదాత్తమా అని తెలుసుకోలేనంత నిగూఢమైన వర్ణన!సామగానమే ఆమెకు డ్రేపమానం!మానసమే ఆమెకు వాహనం!అంబరమే ఆమెకు ముఖంబరం!శుక్రతారాద్వయమే ఆమెకు రధచోదక వృషభద్వయం! తర్వాత వచ్చే (v.35) మంత్రంలో అశ్వినీ కవలలు దృశ్యంలోకి వచ్చి ఆమె దుస్తులను వర్ణసంశోభితం చెయ్యకపోతే అసలు ఆమె అసూర్యంపశ్యయే!
samānām samvatsarāṇām māsa ākṛtiḥ |
somo rūpaviśeṣairoṣadhiścandramā vā||      Nirukta (11.4-5)
ఈ కవలల్ని సహాయకులని చెప్పడం వల్ల అసలు సన్నివేశం జరిగే స్థలాన్ని సూచిస్తున్నాడు కవి. అంతకు మించిన ప్రయోజనం ఉంటే గింటే ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులైనవాళ్ళకి తెలుస్తుంది గానీ ప్రస్తుతం మనలాంటివాళ్ళకి అది అప్రస్తుత ప్రసంగమే!.
sūryāyā vahatuḥ prāgāt savitā yam avāsṛjat|
aghāsu hanyante gāvo’rjunyoḥ paryuhyate ||  (X.85.13)
ఈ మంత్రానికి సంప్రదాయకమైన అర్ధం ఏమిటంటే,పెళ్ళి కానుకలతో సహా పెళ్ళికూతురును మోసుకెళ్తున్న ఎడ్లబండి మఖానక్షత్రసమూహంచే ఉత్సాహపరచబడి అర్జునీ నక్షత్రసమూహంలో కొలువై ఉన్న ఆమె భర్త వైపుకు నడుస్తున్నది అని.
సాయన భాష్యం కూడా దీనిని సమర్ధిస్తున్నది. అయితే ఇక్కడి పదాల్ని ఆకాశంలో జరిగేవాటికి ఆరోపించితే gāvaḥ అనే ధాతువు మంత్రాధిష్ఠాన దైవానికి సంబంధించిన కాంతి కిరణాలనే అర్ధం వస్తుంది.ఇప్పుడు మనం చాలా సూటిగాచంద్రకాంతి యేమో మఘ రాశి వైపుకు ప్రయాణిస్తుంటే సూర్యకళ యేమో అర్జునీ రాశిలో ఉన్న చంద్రుని వైపుకి ప్రయాణిస్తున్నది.” అని అర్ధం చేసుకోవచ్చును - వారెవ్వా, లెక్క ప్రకారం చెప్పిన కవిత్వం కదూ!
కవిత్వం అతి అయితే కపిత్వం అవుతుంది, అది మరీ ఎక్కువైతే పైత్యం ప్రకోపించి హరిత్వం అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి చంద్రుని నీడ Regulus అనే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఒక భాగమైన ఆరు నక్షత్రాల మఘ సమూహం నుంచి మొదలై పూర్వ-ఫల్గుని అనే అర్జునీ సమూహం వైపుకి సాగుతుంది అని తెలుసుకుంటే ఓ పనైపోతుంది - ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఈ గ్రహణం అనే తతంగం జరిగేది Leonis constellation దగ్గిర. హమ్మయ్య, ఓ పనైపోయింది బాబూ! 
తర్వాతిదైన (v.14) మంత్రం అశ్వినీ కవలలు సూర్యకళను తమకు సమర్పించమని అడగినప్పుడు విశ్వదేవసమూహం వారిని సమర్ధించినట్లు చేసిన ప్రస్తావనలోని అంతరార్ధం యేమిటో తెలియడం లేదు.బహుశా, ఈ గ్రహణఛాయ సాగుతున్న నీడ వల్ల కనబడకుండా పోయే మరో రెండు నక్షత్రాలకు ఇది సూచన కాబోలు!అయితే, మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, viśvedevāḥ అని ప్రస్తావించబడిన విశ్వశక్తులకు సంబంధించిన 3339 అనే సంఖ్య గురించి - ఇది ఏమిటో చెప్పకుండా ఇక్కడితో పని ముగించేస్తే పెరుగన్నం వడ్డించని పెళ్ళి భోజనంలా ఉంటుంది నా వ్యాసం!
తర్వాత వచ్చే (v.20) నుంచి (v.35) వరకు మన పెళ్ళిళ్ళని వర్ణిస్తున్నట్టే ఉంటాయి.పెళ్ళి కూతురు మేలిముసుగు రాగి రంగులో ఉండటం భూమి మీదనుంచి చూసినప్పుడు మధ్యలో ఉన్న చంద్రగ్రహం నలనిదై చుట్టూ వ్యాపించిన సూర్యకాంతి వలయానికి ప్రతీక, పోలిక అదిరింది కదా!ఇవన్నీ ఎవరికి వాళ్ళు చదివి ఆనందించాల్సినవి కాబట్టి ఇక్కడ అవన్నీ యెత్తేసి సూటిగా విషయంలోకి వెళ్ళిపోతున్నాను.
ఒక చోట విశ్వదేవతాసమూహం కళ్యాణ వేదిక మీద అగ్నిని వ్రేల్చుతారని ఇన్నది.మరొక చోట ఈ సూర్యకళ సోముడి నుంచి ఒక గంధర్వుడి చేత స్వీకరించబడి ఆ గంధర్వుడి చేత అగ్నికి సమర్పించబడినట్లు ఉన్నది.ఇవన్నీ గ్రహణ సమయపు నభోమండలపు వర్ణనలే తప్ప పెళ్ళి కూతుర్ని వంతులు వేసుకుని అనుభవిస్తున్నట్టు పాషండ మతాల వారు వూహించుకుని పులకించిపోయే భావదారిద్య్రపు అఘాయిత్యాలు ఇక్కడ లేవు!
ఇక్కడ 3339 గురించిన వ్యాఖ్యానం గానీ నిరూపణ గానీ విశ్లేషణ గానీ ఇవ్వకపోవడం వల్ల పండితులలో కూడా కొంతకాలం రకరకాల వూహలూ పోహలూ చెలరేగి కొంత గందరగోళం ఏర్పడింది.  సాయణుల వారు తైత్తిరీయ బ్రాహ్మణం(II.7.12.2)  మీద నమ్మకం పెట్టేసుకుని 33 ఋగ్వేద దేవతలకి మిమంచిన సంఖ్య ఏదైనా కొసరు కింద చేప్పేసుకుంటే సరిపోతుందని తప్పుకునేశారు.Shama Shastry లాంటి ఆధునిక కాలపు పరిశోధక పండితులు 33 సంవత్సరాల కాలచక్రం అయ్యుంటుందని చెప్పి వదిలేశారు.
ఆయనేమో 30 సంవత్సరాలలో 371 చాంద్రామాసాలు వస్తాయని లెక్క చెప్పారు.Kak అనే మరొక పండితుడు ఒక సంవత్సర కాలంలో అగ్ని రూపాన్ని ధరించే దేవతల సంఖ్య 3339 అయ్యి ఉండవచ్చని అనుమానించాడు. ఆయన ఈ సంఖ్యని 9, 371ల గుణకాల(factorials) కింద విడగొట్టి మళ్ళీ వాటిని తిధులూ వాటి భ్రంశాలూ కింద పరిగణించి ఆఖరికి సూర్యమాన సంవత్సరపు తిధుల పేర్న సర్దేసి లెక్కని మడిచేసి తన బరువును దించేసుకున్నాడు. మనపాటికి ఇది బాగానే ఉంది కదా అనిపించి case closed! అని చెప్పెయ్యొచ్చు, కానీ జ్ఞానులు ఉన్నారే - వీళ్ళు తలుపు తెరిచే ఉన్నప్పటికీ సొరంగాలు తవ్వి మాత్రమే తప్పించుకోవాలనుకునే టామ్ సాయర్ లాంటి అల్లరి బుడుగులు. ఇది అసలు సమాధానం కాదూ, ఇంకా ఏదో మిస్సయ్యిందీ అని సణగడం ఆపలేదు!మధ్యలో ఇండాలజిస్టులు దూరి, "అబ్బే!అప్పుడేదో 33 సంఖ్యని చెప్పి ఇప్పుడీలా దాన్ని పెంచి చెప్పి ఉంటారు, ఛందస్సు కోసం చేసిన ఎడ్జస్టుమింటు ఏమో,అంతే అయ్యుంటుంది " అని దఫదఫాలుగా రకరకాలుగా పక్కతాళం వెయ్యడం మొదలుపెట్టారు.
వేదాన్ని ఉన్నది ఉన్నట్టు చదివేసి మనకి ఠక్కున ఏది తోస్తే అదే అక్కడ ఉన్నట్టు అహంకారం చూపించి మన తిండియావని బట్టి మాంసభక్షణనీ సెక్సుయావని బట్టి వ్యభిచారమునూ త్రాగుడు కక్కుర్తిని బట్టి వెన్నెల్లో కల్లునూ వెతుక్కుని మరీ కనుక్కుంటే వేదాన్ని చెప్పిన దేవుడిదా తప్పు? Rothschilds ఇక్కడ దించిన కొందరు మర్మద్విజులు విష్ణువు అవతారమైన పరశురాముడు క్రైస్తవిక క్రూసేడ్లనూ ఇస్లామికీ జెహాదుల్నీ పోలిన నిష్కారణ హింస చేశాడని రాసి ఇరికించిన కొత్త కధల చెత్తని తీసేస్తే మొత్తం 108 అని చెప్పబడే ఉపనిషత్తుల్లోనూ అనేక పురాణాల్లో ప్రముఖమైన అష్టాదశ పురాణాల్లోనూ ఏకసూత్రత ఉంటుంది.ఒకచోట క్లుప్తం అనిపించిన విషయం మరొకచోట విస్తరించి ఉంటుంది. కొందరు ఓపిక తక్కువ వాళ్ళూ తప్పులే పట్టాలనుకున్నవాళ్ళూ "ఇక్కడ ఒకలా ఉంది, అక్కడ ఒకలా ఉంది, అసలిది వేదంలో ఎక్కడా లేదు - కాబట్టి ఇవి వైరుధ్యాలు! వైరుధ్యాలు కాబట్టి అసత్యాలు!" అని కొట్టి పారేసి కాలరేగరేస్తారు గానీ General pathologyలో Cardiologyని ఎందుకు కలిపెయ్యలేదు?Cardiology అనేది General pathology పునాదుల మీద నిర్మించబడిన specialization కాబట్టి Cardiologyలో కనిపించే విషయాలు General pathologyలో కనిపించకపోవచ్చు!అంత మాత్రాన Cardiologyకీ General pathologyకీ సంబంధం లేదంటే ఎట్లా?అలా ఇక్కడ ప్రస్తావించబడిన 3339 సంఖ్యకి సంబంధించిన అన్ని వివరాలనూ మనం బ్రహ్మాండ పురాణంలో చూస్తాము.
అన్నీ వేరు వేరు విషయాలను ప్రతిపాదించే స్వతంత్ర గ్రంధాల వలె కనిపించినప్పటికీ అన్నీ ఒకే సత్యాన్ని ప్రతిపాదిస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయే తప్ప 18 పెద్దవీ 18 చిన్నవీ అయిన పురాణాలు ఒకదానితో ఒకటి విభేదించుకోవు!అన్ని ప్రముఖమైన పురాణాలలోనూ ఖగోళ సంబంధమైన విషయాలను గురించి చెప్పేటప్పుడు ధృవనక్షత్రంతో ముడిపడిన మహామేరునిర్మితినే అనుసరించారు పూర్వఋషులు. ప్రస్తుతం అత్యంత ప్రాచీనమైన బ్రహ్మాండ పురాణం చంద్రుడి వృద్ధి క్షయాలనీ దేవతల సోమపానాన్నీ ముడిపెట్టి కాలస్వరూపం యొక్క అసలు రహస్యాన్ని ఎలా కళ్ళకు కట్టినట్టు బోధపరుస్తున్నదో చూడండి!
āpūrayan suṣumṇena bhāgam bhāgamahaḥ kramāt |
suṣumṇā āpyāyamānasya śuklā vardhanti vai kalāḥ ||        BP. I. ( 23.61)
శుక్లపక్షంలో సూర్యుడు తన సుషుమ్నా కిరణాలతో తాకుతూ ఉండటం వల్ల చంద్రుడిలోని కాంతివంతమైన అంశాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది.
Bhakṣārtham amṛtam somaḥ pourṇamāsyām upāsate |
ekām rātrīm suraiḥ sarvaiḥ pitṛbhiḥ sarṣibhiḥ saha ||
somasya kṛṣṇapakṣādau bhāskarābhimukhasya tu |
prakṣīyante pitṛdevaiḥ pīyamānāḥ kalākramāt ||
trayaśca trimśataścaiva trayaḥtrimśat tathaiva ca |
trayaśca trisahasrāśca devāḥ somam pibanti vai ||
ityetaiḥ pīyamānasya kṛṣṇā vardhanti vai kalāḥ |
kayanti tasmāt śuklāśca kṛṣṇā āpyāyayanti ca ||       BP.I. (23.66-69)
దేవతలు చంద్రుణ్ణి సమీపిస్తున్నారు.దివ్యఋషులు కూడా మిక్కిలి కాంతివంతమైన పౌర్ణమి నాటి రాత్రివేళ కురుస్తున్న అమృతం కోసం తహతహ లాడుతూ వస్తున్నారు.సోముడి నుంచి స్రవించే రుచిరసోమరుచి వారిలోని అగ్నిని సమాధాన పరుస్తున్నది.అలా రోజుకు మూడువందలముగ్గురు,ముప్పైముగ్గురు,మూడువేలముగ్గురు చంద్రుని నుంచి సోమరసాన్ని స్వీకరించి తేజస్వంతులు అవుతుంటే చంద్రుడు వారు స్వీకరించిన లెక్క ప్రకారం క్షీణిస్తున్నాడు.దానివల్ల చంద్రునిలో కాంతివంతమైన అంశలు తగ్గి కాంతిహీనమైన అంశలు పెరుగుతున్నాయి.అయ్యా, లెక్కల్లో పూరయినవాళ్ళు క్యాలికులేటర్లు తీసుకుని 3003+303+33= అని నొక్కితే 3,339 అని జవాబు వస్తుంది!
మనం అందరం లెక్కల్లో పూర్ అని మన్లో ప్రతి ఒక్కరికీ తెలుసు కాబట్టి మొహమాటపడకండి. నేనేదో మిమల్ని వెక్కిరిస్తున్నాననీ అనుకోనక్కర్లేదు, నేను కూడా సేమ్ టు సేమ్, నో షేమ్!ఇంతకీ చంద్రుడి నుంచి వెన్నెలని, అదేనండీ హిందూద్వేషులు మన దేవతలు తాగి ఛస్తున్నారని కుళ్ళుకు చచ్చే సోమరసాన్ని రోజుక్కొంచెం జుర్రేస్తున్న 3339 మందీ ఎవరో తెలుసా!కృష్ణపక్షంలో వచ్చే తిధులు బాబూ అవి, శుక్లపక్షంలో కూడా అన్నే ఉంటాయి - వెరసి నెలకి 6678 తిధులు!
"అయ్యబాబోయ్!ఎంత గొప్ప విషయం తెలిసిపోయింది?" అని మొహం పెట్రోమాక్సు లైటులా పెట్టకండి, హిందూమతం అనే ముదనష్టపు ముద్దుపేరున్న సనాతనధార్మిక సంప్రదాయం ప్రకారం కాలమే దైవం, దైవమే కాలస్వరూపం - "విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిం, విశ్వమేవేదం పురుషః తద్విశ్వ ముపజీవతి!" అన్న దాని ప్రకారం మనకి విశ్వం,కాలం,దైవం ఒక్కటే.కాబట్టి All to All దైవాన్ని చూడాలనుకున్న జ్ఞాని వీలయినంత ఎక్కువ కాలం విశ్వనిర్మితిని గురించి తెలుసుకోవటంలో గడపాలి!అంత సత్వం లేనివాళ్ళు వీలయినంత ఎక్కువ కాలం పరోపకారం చేస్తూ జీవిస్తే One to One రూపంలో దేవుడు వాళ్ళ దగ్గిరకే వస్తాడు!

ఎలా వుంది నా లెక్క?

2 comments:

  1. V.V. Balakrishnaసెప్టెంబర్ 11, 2019 9:51 AM
    మగ నెమలి కంటినుండి కారే నీటి చుక్కను తాగడం వలన ఆడ నెమలికి సంతానోత్పత్తి కలుగుతుంది. కాబట్టి శ్రీ కృష్ణుడు నెమలి బ్రహ్మచర్యానికి మెచ్చుకొని తలపై నెమలీకను అలంకరించుకోడానికి ఇష్టపడతాడు

    hari.S.babu
    ఎంతకాలం ఈ సుత్తి వాక్యం వాడుతారో!చూసే నాబోటివాళ్ళకు సిగ్గు వేస్తున్నది తప్ప వాడకం మాత్రం ఆగడం లేదు.

    ReplyDelete
  2. హరి బాబు గారు
    సనాతన ధర్మం పురాణాలు ఏది పట్టుకొని చూసినా ఇప్పుపుడు ఉన్న సైన్సు తో లెక్క లేస్తే హిందు పురాణాలలో నున్న వన్ని నిజమే గ్రహించనారు కూడా
    ఆంజనేయ స్వామి సూర్యుణ్ణి చూసి మాడి పండు అనుకోని లకించిన దూరాన్ని కూడా పురాణాల్లో ఉంది అదికూడా దూరం నిజమే అని అమెరికా సైటిస్టులు లెక్క కట్టిన దానికి పురాణాలలో ఉన్న దానికి సరిపోయినది

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...