Sunday 22 September 2019

భారత దేశపు రాజ్యాంగమే ఎందుకు కులాన్ని అంత తప్పనిసరి చేసింది?

ఒక మనిషి యొక్క అస్తిత్వాన్ని నిర్వచించి నిర్ధారించే అంశాలను వరసగా పేరిస్తే ఇలా ఉంటుంది - పేరు, లైంగికత, వృత్తి, భాష, ప్రాంతం, కుటుంబం, మతం, జాతీయత అనేవాటి తర్వాతే కులం అనేది వస్తుంది! చాలామంది దృష్టికి రాని ఒక వింత ఏమిటంటే భారత రాజ్యాంగం పౌరులలో ప్రతి ఒక్కడికీ ఈ అస్తిత్వాలలో దేనినైనా తన సొంత నిర్ణయంతో సొంత బాధ్యతతో మార్చుకునే అవకాశం కల్పించింది - అనుమతి పొంది మీ పేరును మీరు మార్చుకోవచ్చు, వైద్యప్రక్రియ ద్వారా లైంగికతని కూడా మార్చుకోవచ్చు, మీ ఇష్టమైనన్ని వృత్తుల్ని చేపట్టవచ్చు, ఏ భాషనైనా నేర్చుకుని జనాభా లెక్కల్లో మాతృభాషగా నమోదు చేసుకోవచ్చు, దేశం లోపల గానీ దేశం బయట గానీ ఏ ప్రాంతంలోనైనా స్థిరపడవచ్చు, విడాకులు తీసుకుని కుటుంబాన్ని మార్చుకోవచ్చు, నీ ఇష్టాన్ని బట్టి  తాత తండ్రుల నుంచి సంక్రమించే వారసత్వాన్ని కూడా మార్చుకోవచ్చు!
కానీ  మీ కులాన్ని మార్చుకుంటాంటే రాజ్యాంగం ఒప్పుకోదు!బ్రాహ్మడిగా పుడితే బ్రాహ్మడే, రెడ్డిగా పుడితే రెడ్డే - ఒక కులంలో పుట్టాక ఎంత గింజుకున్నా కులాన్ని మార్చుకోలేరు.మతం మారినా ఒప్పుకుంటుంది గానీ రాజ్యాంగం మీ కులాన్ని మార్చటానికి ఒప్పుకోదు!కులాంతర వివాహం చేసుకున్నా భార్య భర్త కులంలోకి వెళ్ళడమే జరిగేది, అది మామూలుగా జరుగుతున్నదే కదా. ఇలాంటి ఎడ్జెస్టుమెంట్లు లేకుండా సరాసరి ఒక వ్యక్తి తన పేరును మార్చుకున్నట్టు కులాన్ని మార్చుకోవటానికి అనుమతి ఇస్తుందా? రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఇస్తారు కాబట్టి ఆ సౌకర్యం కల్పించడంలో సాంకేతికపరమైన సమస్యలు వస్తాయని రాజ్యాంగం కులాన్ని అంత గట్టిగా పట్టించుకుంటుందా!నాకయితే అది పెద్ద అవరోధం అని అనిపించడం లేదు, రిజర్వేషన్ల గురించి మంచి పరిశోధన చేసిన అధికారికమైన పాండిత్యం ఉన్నవారు చెప్పాలి.
ఇంకొక విచిత్రం ఏమిటంటే ప్రగతిశీల పురోగామి వామపక్ష దళిత సిద్ధాంతకర్తలు ఏ కాలంలో బ్రాహ్మణ మతం కులాన్ని స్థిరం చేసిందని చెప్తున్నారో ఆ ఇప్పటి రాజ్యాంగం అమలులో లేని వెనకటి కాలంలో మనుషులు తమ కులాల్ని మార్చుకోగలిగేవారు!ఇప్పటివాళ్ళు నమ్మలేరు గానీ బ్రాహ్మణేతర కులంలో పుట్టి వేదం నేర్చుకుని బ్రాహ్మణులైన వాళ్ళు కూడా ఉన్నారు - ఒకటీ రెండూ అరుదుగా జరగటం కాదు, ఎక్కువ సంఖ్యలోనే జరిగాయి. దీనికి శాసనాల సాక్ష్యం ఉంది!ఆధునికత వెల్లి విరియాల్సిన 19వ శతాబ్దపు రాజ్యాంగం పనిగట్టుకుని కులాల్ని శిలాసదృశం చేస్తే దీన్ని వ్యతిరేకించే దమ్ము లేనివాళ్ళు ఎవడికిష్టం వచ్చిన కులంలోకి వాడు మారిపోతూ బతికిన 01వ శతాబ్దపు మనుషుల్ని ఇవాల్టి దుస్థితికి కారణం అని తిట్టడం ఎంత నీచమైన పని!
రాజ్యాంగమే కులాన్ని తమ పౌరుల అస్తిత్వానికి మౌలికమైనదిగా భావించినప్పుడు అస్తితం పునాదుల మీద పదవులను సాధించాలని అనుకునేవాళ్ళు మిగిలిన అస్తిత్వాలను వాడుకున్నట్టే కులాన్ని వాడుకోవడంలో తప్పు లేదని న ఆభిప్రాయం. అసలు అస్తిత్వాల మీద రాజకీయం నడపడాన్ని తిట్టకుండా కేవలం కులాన్ని వాడుకున్నందుకు వాళ్ళని తిట్టాల్సిన పని లేదు.రాజ్యాంగం భాషని మార్చుకోవచ్చునని వెసులుబాటు ఇచ్చినప్పటికీ స్వయాన మన తెలుగువాళ్ళమే భాష పేరుతో రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం! రాజ్యాంగం ప్రాంతాన్ని మార్చుకోవచ్చునని వెసులుబాటు ఇచ్చినప్పటికీ తెలంగాణ్యులు ప్రాంతం పేరుతో రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నారు!మరి, రాజ్యాంగం అప్రధానం చేసిన అస్తిత్వాలనే ప్రధానం అనుకుని ప్రజలు వాళ్ళకీ వీళ్ళకీ అధికారం ఇవ్వటానికి అంతలా పిచ్చెత్తిపోతూ ఉంటే సాక్షాత్తూ రాజ్యాంగమే ప్రధానం అని చెప్పిన కులం అనే అస్తిత్వం తమకు అధికారం రాబట్టుకోవటానికి పనికొస్తుందని అనుకున్నప్పుడు కులాన్ని వాడుకోవటంలో తప్పేమిటి? మిగిలిన అన్ని రకాల అస్తిత్వ ఉద్యమాలూ న్యాయమైనవి అయినప్పుడు ఏ కులం గొప్ప కోసం ఆ కులం వాళ్ళు ఏకమై ఉద్యమం చెయ్యడాన్ని అన్యాయం అనడమే అసలైన అన్యాయం!
అసలు కులనిర్మూలనే తన జీవిత లక్ష్యం అని ప్రకటించి దానికోసం పోరాడిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇలా ఎందుకు తయారు చేశాడు?అస్పృశ్యతని తను అనుభవించింది కులాన్ని పుట్టుకకి అతికించడం వల్లనే అని వాదించి గాంధీ కూడా అస్పృశ్యతని నిర్మూలించడం కోసం నిజాయితీగా ప్రయత్నించటంలేదని ఎన్నోసార్లు విమర్శించినవాడు తను ప్రవేశపెట్టిన రాజ్యాంగంలో కులాన్ని పుట్టుకకి అతికించితే ఎందుకు వ్యతిరేకించలేదు!
ఈ ముడి విడాలంటే అంబేద్కర్ పేరును ఒకసారి నిశితదృష్టితో పరిశీలించాలి - తండ్రి పేరు Ramji Maloji Sakpal అయితే ఇతని పేరు Bhimrao Ramji Sakpal అని ఉండాలి కదా!ఉత్తర దేశంలో అధికంగా వినపడే SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR వంటి బ్రాహ్మణుల ఇంటిపేరు అస్పృశుడైన ఇతనికి ఎలా వచ్చింది?నోరు తెరిస్తే "జై భీం!" అని గర్జిస్తూ బ్రాహ్మణుల మీద నోరు పారేసుకునేవాళ్ళు అమాయకులూ కాదు అణిచివేతకు గురైన అసహాయులూ కాదు కులనిర్మూలన కోసం అహరహం తపించేవాళ్ళూ కాదు - వీళ్ళే ఇవ్వాళ నిలువెల్లా కులపిచ్చితో దహించుకుపోయే కాలాంతక నరాంతక దేవాంతకులైన దేశ విఛ్ఛిన్నం కోసం కంకణం కట్టుకున్న అసత్యవాదులు!ఇంటిపేరు బ్రాహణులది అయినప్పుడు ముక్కూ మొహం తెలియని వాడు Bhimrao Ramji అనే వ్యక్తి దళితుడని తెలుసుకోగలగడం సాధ్యమేనా?అదీ ఆ వ్యక్తి "నా పేరు Bhimrao Ramji Ambedkar!" అని చెప్తున్నప్పుడు, అతని స్కూల్ సర్టిఫికెట్లలో కూడా అలాగే ఉన్నప్పుడు!
ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అని మనం ఇవ్వాళ స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న చరిత్రలో చాలా అబద్ధాలు ఉన్నాయి - అందులో అంబేద్కర్ అనుభవించిన అస్పృశ్యత కూడా ఒకటి!నిజానికి ఇతన్ని స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి తమ ఇంటిపేరైన Sakpal ఇవ్వకుండా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన Mandangad తాలూకాలో ఉన్న  Ambadawe గ్రామం నుంచి వచ్చినవాళ్ళమని చెప్పి Ambadawekar ఆనె ఇంటిపేరును ఇస్తే Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చి నమోదు చేశాడు. ఒక బ్రాహ్మణుడు అతను అస్పృశ్యుడని తెలిసే ఏమాత్రం అసహ్యం చూపించకుండా తన ఇంటిపేరునే ఇచ్చి ఆదరించడం దేన్ని సూచిస్తుంది?ఇప్పటివరకు ఈ విషయం జై భీం గాళ్ళు ఎందుకు చెప్పలేదు, నిజాన్ని దాచిపెట్టడం కూడా అబద్ధం చెప్పటమే కదా!
Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి నమోదు చేసి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చడం వరకు తెలిసినందుకే ఇంత ఆశ్చర్యం కలుగుతుంటే Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister)ల పేర్లు మార్చడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, Bhimrao Ramji Sakpal తన తండ్రి సంతానంలో 14వ వాడు! Bhimrao Ramji Sakpal కన్న పెద్దవాళ్ళైన అన్నలకూ అక్కలకూ అతన్ని స్కూల్లో చేర్చకముందే పేర్లు మారి ఉంటే అది ప్రపంచంలో మిస్టరీలు అని చెప్తున్న అన్ని మిస్టరీలనీ మించిన పెద్ద మిస్టరీ అవుతుంది!Bhimrao Ramji Sakpal కన్న పెద్దవాళ్ళైన అన్నలకూ అక్కలకూ అతన్ని స్కూల్లో చేర్చిన తర్వాత పేర్లు మారి ఉంటే అలాంటివి రెండు మిస్టరీలు రంగంలో ఉంటాయి - "Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి నమోదు చేసి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చడం!", "Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister)ల పేర్లు మార్చడం!" అనేవి.
ఇవన్నీ నిజాయితీ గల చరిత్రకారులు పరిశోధించి నిగ్గు తేల్చాల్సిన వివాదాస్పదమైన విషయాలు కాబట్టి ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం.అంబేద్కర్ పుట్టుక వల్ల మాత్రమే అస్పృశ్యుడు.అతని ఇంటిపేరులో బ్రాహ్మణత్వం ఉంది.స్కూల్లో చేరినప్పుడు ఇంటిపేరును ఇచ్చిన Krishnaji Keshav AmbedKAR మాత్రమే కాదు, హైస్కూలు దశలోనూ ఎంతోమంది బ్రాహ్మణ గురువులు చురుకైన ఈ కుర్రాణ్ణి అభిమానించి అక్కున జేర్చుకున్నారు. ఉన్నతవిద్యకు స్కాలర్షిప్పు ఇవ్వడమే కాకుండా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రోత్సహంచినది మహారాజులూ సంస్థానాధీశులూ, బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత స్నేహపాత్రుడైన ప్రముఖ న్యాయవాది, లండనులో రాజప్రసాదాన్ని బోలిన నివాస భవనం("We will require Rs 40 crore to purchase the house and later annual maintenance of Rs 61 lakh. We can recover some of the maintenance amount from rent as we will give four rooms to four Dalit students, who come to London on scholarship to pursue higher studies. Similarly, one bedroom will be for professor on official visit." - IndiaToday.in, Mumbai February 3, 2015) - బీదరికమూ అస్పృశ్యతా రెండూ ఇతని పట్ల అబద్ధాలే!
అతని అభిమానులు నిజాలు చెప్పకుండా దాచెయ్యడం వల్ల మనకి తెలియకపోబట్టి రాజకీయ, సామాజిక, ఆర్ధిక విషయాలపట్ల ఇతని నమ్మకాలు కూడా మనం నమ్మలేనివిగా ఉంటాయి.దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక అధికారికమైన జాతీయభాషను ఏర్పాటు చేసుకోలేక హిందీని చెయ్యాలని కొందరూ చెయ్యవద్దని కొందరూ తన్నుకు చస్తున్నారు గానీ అంబేద్కర్ ఆనాడే జైభీం గాళ్ళు కూడా దడుసుకు చచ్చేటట్టు సంస్కృతాన్ని జాతీయబాషగా చెయ్యమన్నాడు!
మొదట్లో హిందువుల ఆలయాలతో పాటు ఇతర మతస్థుల పవిత్ర స్థలాలు కూడా పూర్తి ప్రభుత్వాధీనంలో ఉండేవి.అప్పటి కలక్టరుకి తన అధీనంలో ఉన్న ప్రాంతంలో ఇప్పటి దేశ పధానమంత్రికి ఉన్నట్టు పోలీసుల్నీ సైన్యాన్నీ నడిపించే అధికారాలు కూడా ఉండేవి.హిందువుల మతపరమైన వేడుకల సమయంలో కలక్టరు బంగళాలో తుపాకుల్ని పేల్చడం లాంటివి కూడా చేసేవాళ్ళు.అయితే పాస్టర్లు మందలా వచ్చేసి ఈ క్రైస్తవ కలక్టర్లు అవిశ్వాసులని ప్రోత్సహించడం నచ్చక గొడవ చెయ్యడంతో హిందువుల ఆలయాల్ని హిందువులకి పూర్తిగా అప్పజెప్పేశారు.సరిగ్గా ఇదే సమయంలో యూరోపియన్ రాజకీయ భావజాలంలో "మతాన్నీ రాజకీయాన్నీ వేరు చెయ్యటం" అనే సెక్యులరిస్టు పైత్యం పుట్టి మన దేశంలోకి కూడా వచ్చిపడి సోషలిష్టు కమ్యునిష్టు రేషనలిస్టు లెఫ్టిస్టు రైటిస్టు రాయిస్టు రప్పిస్టు మేధావులకి పిచ్చెక్కించింది!ఆటలో అరటిపండు లాంటి హాస్యరసగుళిక యేంటంటే వీటన్నిటికీ పిచ్చెక్కిపోయినవాళ్ళలో నూటికి తొంభై శాతం మంది హిందువులే.అంతకన్న విచిత్రం యేమిటంటే అంతకుముందు దూరం పెట్టేసిన  మతసంస్థల్ని వాటి ఆదాయాన్ని నొల్లుకోవచ్చుననే లాభం కనపడి ప్రభుత్వం వశం చేసుకుందామని చట్టం చేస్తున్నప్పుడు ఈ సోషలిష్టు కమ్యునిష్టు రేషనలిస్టు లెఫ్టిస్టు రైటిస్టు రాయిస్టు రప్పిస్టు మేధావులు లేని ఇతర మతాల వాళ్ళు కుదరదని తెగేసి చెప్పడంతో వాటిని ప్రభుత్వాధీనంలోకి తెచ్చే సాహసం అప్పటి బ్రిటిషు ప్రభుత్వం చెయ్యలేకపోయింది.
అయితే, తర్వాత అదే ఆలయనిర్వహణ గురించి మనవాళ్ళు చట్టాలు చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ చాలా న్యాయంగా మాట్లాడాడు గానీ కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ అని లేకుండా అన్ని పార్టీలలోనూ ఉన్న హిందూ నాయకులు ఆలయాల్ని ప్రభుత్వం నుంచి తప్పించి అంతకు ముందున్న ధర్మకర్తల వ్యవస్థను పునరుద్ధరించటానికి అంబేద్కర్ న్యాయమైన సూచనల్ని తిరస్కరించి మిగిలిన అన్ని మతాల వారికీ వారి ప్రార్ధనా స్థలాల మీద ఉన్న హక్కుల్ని హిందువులకి తమ ప్రార్ధనా స్థలాల మీద లేకుండా చేశారు!
అన్ని విషయాల్లోనూ అంత న్యాయమైన అభిప్రాయలను కుండబద్దలు కొట్టి చెప్పిన అంబేద్కర్ ప్రధానమంత్రి అయి వుంటే మన దేశం యాభై యేళ్ళలోనే దేశ విదేశ మార్కెట్లని కొల్లగొట్టి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రబావశీలమైన స్థానం చేరుకునేది - ఇతర స్వాతంత్య్ర నాయకులతో ఉన్న వ్యక్తిగత విభేదాల వల్లా బ్రిటిషు వాళ్ళతో స్నేహమూ మొహమాటమూ ఉండటం వల్లా స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర వహించకపోవడం అతన్నీ దేశాన్నీ ఎక్కువ స్థాయిలోనే దెబ్బతీసింది! "ఇంగ్లీషువాళ్ళ పరిపాలన న్యాయంగానే ఉంది, వాళ్ళ మీద పోరాడటం అనవసరం" అనడం అప్పుడు తను ఒక్కడే కాదు, గురజాడ లాంటివాళ్ళు కూడా అన్నారు గానీ కాంగ్రెసు దాన్ని అంబేద్కరుని తొక్కెయ్యడానికి ఉపయోగించుకునేసింది - వ్యూహాత్మకతలో అంబేద్కరు కూడా గట్టివాడే గానీ ఇక్కడ తడబడి వెనక్కి తగ్గాడు.
ఇక ఆర్ధిక విషయాల్లోనూ రాజకీయ భావజాలం విషయంలోనూ తన స్నేహితులైన బ్రిటిష్ మేధావులతో అతను మమేకమైపోయాడు.Masonic outfit ఉన్న Israel పట్ల విపరీతమైన ఆప్యాయతని ప్రదర్శించాడు. Rothschilds యొక్క ఆర్ధిక విధానమైన credit based economicsను సమర్ధించాడు.Reserve Bank of India (RBI) ఏర్పాటులో అంబేద్కర్ ప్రమేయం చాలా తక్కువ, బ్రిటిషువాళ్ళు వలస రాజ్యాలు తమ చేతి నుంచి జారిపోకుండా చూసుకోవడం కోసం ఆచరణాత్మకమైన సలాహాలూ సూచనలూ ఇవ్వమని పురమాయించిన Hilton Young Commission అనే సంస్థ భారతదేశపు ఆర్ధికచట్రం ఎలా వుంటే తమకు లాభమో అలా తీర్చి దిద్దిన గ్రంధాన్ని చట్టసభ ముందు ఉంచి ఆర్ధిక విషయాల్లో కనీసపు అవగాహన కూడా లేని ఇతరులతో ఒప్పించడం మాత్రమే ఆయన చేసినది.ఒకటి మాత్రం నిజం - RBI యొక్క నిర్మితిలోని ప్రతి అంశమూ Rothschilds యొక్క ప్రపంచాధిపత్యపు ప్రణాళిక ప్రకారమే Bank of Englandకు నకలుగా రూపు దిద్దుకున్నదనే విషయం అంబేద్కరుకు స్పష్టంగా తెలుసు, అయినా ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్త పడ్డాడు!భారత రాజ్యాంగం కూడా దేశదేశాలూ తిరిగి ఉత్తమోత్తమ రాజ్యాంగాలను చదివి అనేకమైన ఉన్నత భావాలను పుణికి పుచ్చుకున్న అత్యుత్తమ గ్రంధం కానే కాదు.
ఈస్టిండియా కంపెనీ రాణి చేతి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు తమ పరిపాలనా సౌలభ్యం కోసం లండనులో అప్పటికే ఉన్న డాక్యుమెంట్లను ఇక్కడికి తెచ్చి వాడుకున్నారు. Government of India Act 1935 కొంత పెంచింది. ముస్లిం నాయకులకి పాకిస్తాన్ పంచి ఇవ్వటం కోసం 1936-37 నాడు జరిగిన Provincial elections సామాన్య ముస్లిములు ఎటూ పాకిస్తాన్ కోసం అంగలార్చిపోతున్నారన్న ధీమాతో ఇంగ్లీషువాళ్ళు ఇప్పటిలా ఎన్నికల అక్రమాలు చెయ్యకుండా న్యాయంగా జరిపించేసరికి అనూహ్యమైన ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెసు ఆనాడు పరిపాలించింది దీని ఆధారంగానే!రాజ్యాంగ సభ చేసింది ఇంకొన్ని ఆకర్షణీయమైన అంశాల్ని చేర్చటమే తప్ప పాతవాటిని, అదీ స్వదేశీ భావన లేని విడేశీ దుర్మార్గం అనిపించే వాటిని కూడా తీసెయ్యలేదు!
ఒక రకంగా చూస్తే అతివాదులని పేరు పడిన తిలక్ నాయకత్వంలో ప్రజలూ ఉద్యమాలూ నడిచిన కాలంలోనే జాతీయత, స్వాభిమానం, ప్రజాశ్రేయస్సు వంటి వాటి కోసం నిజమైన పోరాటం అని చెప్పదగిన వ్యవహారం నడిచింది, మితవాదుల గ్రూపుకి చెందిన గాంధీ రంగం లోకి దిగాక జరిగిన ఉద్యమాలూ ప్రయత్నాలూ సమావేశాలూ అన్నీ శాంతియుతమైన అధికార మార్పిడి కోసం తప్ప ప్రభుత్వ నిర్వహణలో గానీ ఆర్ధిక చట్రంలో గానీ ఇంగ్లీషువాళ్ళకి భిన్నమైన అంశాల్ని ప్రతిపాదించాలని గానీ అనుసరించాలని గానీ ఎవరూ అనుకోలేదు - అది వాళ్ళు తెలిసి చేసిన తప్పు కాదు, ఆ రకమైన పాండిత్యమే వాళ్ళకి లేదు!
ఈ శాంతియుతమైన అధికార మార్పిడి అనేది బ్రిటిష్ రాజరికపు సమూహం నుంచీ భారతీయ రాజరికపు సమూహం మధ్య జరిగిన వ్యాపార ఒప్పందం లాంటిది, ప్రజలకు దీనిలో ప్రమేయం గానీ భాగం గానీ లాభం గానీ లేవు.ఇంగ్లీషువాళ్ళకీ కాంగ్రెసువాళ్ళకీ ప్రజలు కేవలం విధేయులుగా ఉండటమే కావాలి. ఆ విధేయత తెచ్చుకోవటం అంత ఈజీ కాదు, ప్రజల్ని కులాన్ని బట్టి చీల్చి ప్రతి కులాన్నీ ఒంటరి ఒంటెని చెయ్యడం చాలా అవసరం.వాళ్ళకి అవసరం గనక వాళ్ళంతట వాళ్ళు తొలగించరు - ఇక ప్రజలు చూస్తే మన ఉద్యోగాలు ఆంధ్రావాళ్ళు లాక్కున్నారని లక్ష ఉదోగాలు అక్షరాలా లెక్క చూపించి రెండు విడతలు ఎన్నికైన తర్వాత కూడా గొర్రెల్ని కాసుకోమని క్రూరమైన జోకు వేసినా కోపం తెచ్చుకోకుండా ఒక్క గట్టి నోటిఫికేషను కూడా ఇవ్వని కేసీయారు లాంటి వాళ్ళని అవతార పురుషుల కింద కొలిచే అజ్ఞానంలో ఉన్నారు.
ఇప్పటికీ ఈ వ్యాసం చదువుతున్న మీకు బోధపడలేదని నాకు గ్యారెంటీగా తెలిసిన విషయం ఏమిటో చెప్తాను వినండి, ఆర్ధిక చట్రంలో Rothschilds Bank of Indiaని ఉంచటానికీ రాజ్యాంగంలో కులాన్ని పుట్టుకకి అతికించటానికీ వెనక ఉన్న ఉద్దేశం ఒకటే - ఇది లేకుండా అది ఉండలేని అది లేకుండా ఇది ఉండలేని అదీ ఇదీ లేకుండా మనం ఉండలేని ఏకేశ్వర ఏకస్వామ్య ఏకమేకమే దోపిడీ పూరిత మహామోహ మాయాజాలం!ఈ జంట దరిద్రాలకి పరిష్కారం బోయి భీమన్న గారి "గుడిసెలు కాలిపోతున్నాయి!" కవిత చివరి రెండు మూడు పంక్తుల్లో దొరుకుతుంది.
*గుడిసెలు కాలిపోతున్నై*
*ఓహో కాలిపోతున్నై*

*ఎవరీ గుడిసెలో పాపం*
*మాల మాదిగలవే అయివుంటై*
*గుడిసెలు మరివరికుంటై*

*ధర్మ సంస్థాపనార్ధం*
*ఈ గుడిసెలు*
*మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటే*
*పోతుంటై పుట్టుకొస్తుంటై* అని ప్రతి అక్షరంలోనూ అనంత వ్యంగ్యాన్ని కూరిన కవితని మీ అంతట మీరు చదివితేనే తత్వం బోధపడుతుంది గనక ఇక్కడ నేను ఇవ్వటం లేదు - ఎవడి జిజ్ఞాస వాడిదే!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...