Sunday 27 May 2018

మహానటికి మరోవైపు - ఎవరినీ నొప్పించకూడదని విలన్ని హీరోని చెయ్యాలా?


        దెబ్బకి ఒకే ఒక్క సినిమాతో అంతకు ముందు ఎవరికీ తెలియని కీర్తి సురేష్ కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న సావిత్రి అంత పాప్యులారిటీ తెచ్చేసుకుంది!దాన్సిగదరగ తంతే గారెల బుట్టలో పడ్డం అంటే ఇదే గావాల - ఇంక తెలుగోళ్ళు ఎక్కడెక్కడి సన్నాసుల్నీ యెతికెతికి మరీ బయోపిక్కు బయస్కోపుల్తో జనాల్ని బయం పెట్టి సంపతారేమో!యెవడే కొత్తపని జేసినా ఈడేంది చేసింది,మా కులపోడు ఎప్పుడో జేసేసిండు అనేవోళ్ళు పల్నాటియుద్ధం బ్రహ్మనాయుడి బయోపిక్కని గూడా అనీగల్రు!

          గంటన్నర సినిమాకే బోరు గొట్టేసిందని మధ్యలో లేచొచ్చే కాలంలో ఈ కాలం వాళ్ళు కంటితో చూడను గూడా చూడని సావిత్రి గురించి పాత సినిమాలంత పొడుగాటి సినిమా తీసి హిట్ చెయ్యడం విచిత్రమే!ఈ సినిమా చూశాక్ బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్కుని మూలకి నెట్టేశాడని అంటున్నారు - నిజమో కాదో!నాగశ్విన్ అంత రీసెర్చి చేసి చూపించిన కధలో తేడా రానివ్వకపోయినా గుమ్మడి వెంకటేశ్వర రావు చేసిన దాన్ని యస్వీ రంగారావుకి ఫిరాయించడం లాంటివి తెలిసే చేశానంటున్నాడు గాబట్టి వదిలేసినా చూపించకుండా వదిలేసిన అతి ముఖ్యమైన భాగాల మీద వస్తున్న విమర్శల్ని చూసి బహుశా కోరి ఇలాంటి విమర్శల్ని తెచ్చుకోవటం దేనికని భావించి ఉండవచ్చు. 

        బయోపిక్ అంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని విశేషాల్నీ చూపించాలి,ఆ లెక్క ప్రకారం చూస్తే నాగ్ అశ్విన్ ఆ కాన్సెప్టుకి అన్యాయమే చేశాడు.కేవీ రెడ్డి చాలెంజిని టేకప్ చేసి రెండే రెండు కన్నీటి చుక్కలు రాల్చిన దృశ్యం గురించి నేను చాలాకాలం క్రితమే చదివాను - అది నమ్మలేని విషయమే అయినా వాస్తవంగా జరిగిందే!అలాంటి అపురూపమైన విషయాల్ని పక్కన పెడితే ఆ తరం నటీమణులు జమున,భానుమతి,కాంచన వంటివాళ్ళు కూడా తక్కువ స్థాయిలో లేరు.కానీ కధలా చెప్పగలిగిన డ్రమెటిక్ కంటెంట్ వాళ్ళ జీవితాల్లో లేదు గనక ఇకముందు కూడా వాళ్ళ బయోపిక్స్ రావు.సావిత్రి 1936లో పుట్టింది,అంటే తెలుదు సినిమా కూడా కొత్తగా ఎదుగుతున్న రోజుల్లో ఎక్కడో తెనాలి అనే వూళ్ళే అత్యంత బీద కుటింబంలో ఉట్టి 16వ ఏటనే సినిమాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే తారాస్థాయికి చేరి ఎంత వేగంగా పైకి వెళ్ళీందో అంతే వేగంతో కిందకి వచ్చేసి 45 ఏట నేఅత్యంత విషాదకరమైన స్థితిలో చనిపోయిన సావిత్రి జీవితంలో మ్నకి కనబడుతున్న ఉత్ధానపతనాల వల్లనే కదా సావిత్రి అందరికీ అంత ప్రీతిపాత్రమైంది - అసలైఅన్ విషయాన్ని ఎందుకు వదిలివేశారు?
          మొదటి కారణం సావిత్రి బతికి ఉన్నప్పుడు ఆమెని ఏమాత్రం పట్టించుకోని విజయ చాముండేశ్వరి ఇప్పుడు కూతురు హోదాలో పెట్టిన పెట్టిన షరతులు కారణం అని తెలుస్తున్నది.మా నాన్న దేవుడు,నేనూ మా నాన్నా మా అమ్మా ఎంతో సంతోషంగా బతికాం అని తను చెబుతున్నది నిజమే అయితే కారు షెడ్దులో చూశానని అంటునన్ కె.రామలక్ష్మ్ అబద్ధాలు చెప్తున్నటు కాదూ!అనద్రితో పాటూ కూతురు కూడా సావిత్రికి అన్యాయం చేసినట్టు సావిత్రిని ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళూ తన జీవితాన్ని దగ్గిరగా చూసినవాళ్ళూ చెబుతున్నారు.ఇవన్నీ దాచేసి తియ్య్యడంతో ఇది సావిత్రి మీద తీసిన ఫాంటసెయే అవుతుంది తప్ప బయోపిక్ అని చెప్పుకునే అర్హత కోల్పోయింది!రెండవ కారణం ఈ మధ్యన తీసిన సినిమాలు తీవ్రమైన నష్టాన్ని తీసుకురావడంతో వైజయంతి మూవీస్ బ్యానరుకి చాలా పెద్ద గ్యాప్ వచ్చి ఇది కం బ్యాక్ సినిమా కాబట్టి వివాదాలతో చికాకులు తెచ్చుకోవడం ఇష్టం లేక వెనక్కి తగ్గి ఉంటారు.రాం గోపాల్ వర్మలా వివాదాలతో మార్కెట్ చేసుకునే మనస్తత్వం వీళ్ళకి లేకపోవటం వల్లనూ సావిత్రికి ద్రోహం చేసిన వ్యక్తి కూడా పరిశ్రమకి ఇన్సైడర్ కాబట్టి మొహమాటం వల్లనూ సావిత్రికి అన్యాయం చేసిన వ్యక్తికి ఇప్పటికీ అభిమానులూ సమర్ధకులూ ఉండటం వల్లనూ సావిత్రికే అతను నాకు అన్యాయం చహెశాడు అని చెప్పుకోలేని దుస్థితి దాపరించడం వల్లనూ సావిత్రికి వాస్తవ జీవితంలోనే కాదు తనమీద తీసిన సినిమాలోనూ అన్యాయమే జరిగింది - ఎంత దురదృష్టం!బయోపిక్ అని చెప్పుకోకుండా తీస్తే ఎన్నయినా చెయ్యవచ్చు!ప్రతాపరుద్రీయమే తీసుకోండి - అసలు జరిగినది ఒకటయితే అలా కాకుండా మరోలా జరిగితే బాగుండేది అని అనిపించిన భావాన్ని కధగా మలిచి వాస్తవంగా ఇలాగే జరిగిందేమో అనిపించేటంత సహజంగా ఉంటుంది  ఆ నాటకం.కధాకావ్యం చరిత్ర ఎప్పటికీ కాదు - అలాంటప్పుడు బయోపిక్ అని చెప్పి అసలు ఆమె జీవితంలో ఇతరులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్ని వదిలెయ్యటం నాకు నచ్చలేదు!
          సావిత్రినే ఏవరో అడిగారు బయోపిక్ రాయమని.తనే వ్త్సాహం చూపించలేదు,"నేను రాయడం మొదలుపెడితే అందర్నీ తిట్టాల్సి వస్తుంది.వాళ్ళనిఈ వీళ్ళనీ తిటినా పోయిన కాలం తిరిగి రాదు.ఒకరన్ లేదు,మా అమ్మ తప్ప అందరూ నాకు ద్రోహమే చేశారు!" అని.దాదాప్ సావిత్రిని అభిమానించేవాళ్ళు అందరూ తిట్టుకుంటున్న జెమినీ గణేశన్ గురించి ఒక్క సావిత్రే కాదు,తనతో కొంతకాలం బతికి విడిపోయిన ఎవ్వరూ చెడుగా మాట్లాదటం లేదు,ఎందుకని?కోరి తెచ్చుకున్న దరిద్రానికి ఎవర్ని తిడితే ఎవరు వూరుకుంటారు?

          ఒకప్పుడు బీదరికంలో బతికి కాలం కలిసొచ్చి కొంత ఐకొచ్చి ఇతర్లై కొడా ఇంకా పైకొస్తారనిఒఇంచే కాలంలో హఠాత్తుగా కిందకి పడిపోయిన అందరూ చ్గేసిన "ఆ ఒక్క అత్ప్పూ చెయ్యకుండా ఉంతే ఎంత బాగుండేది!" అనిపించే సావిత్రి చేసిన ఆ ఒక్క తప్పొ జెమినీ గణేశన్ అనే కామపిశాచిని ఆదర్సప్రేమికుడని నమ్మి పెళ్ళి చేసుకోవడం.అదీ పెంచి పెదద్ చహేసి అతని ఆ స్థాయికి తీసుకొచ్చిన పెద్దమనిషి అదేమితని అడిగితే ఆడబ్బంతా నువ్వే తీస్సుకోమని అన్నింటినీ కాదనుకుని వెళ్ళాల్సీన్ ఉత్తముడా ఆత్ను?కాదే!తను రహస్యంగా పెళ్ళి చేసుకునే నాటికే ఇద్దరు అధికారికమైన భార్యలూ ఉంపుడుకత్తెలు లేక ముండలు అని మనం పిలుచుకునే ఇద్దరు అనధికారీమైన భార్యలూ ఉన్నవాడికోసం తల్లీ బంద్గువులూ మిత్రులొ శ్రేయొభిలాషులూ వద్దని మొత్తుకుంటున్నా వినకుండా వెళ్ళిన అమనిషి ఆత్ని గురించి చెడు మాట్లాడియే,"మరి,ఎందుకు వెళ్ళావు?,ముందు తెలియలేదా?" అని అడుగుతారు కదా!
          సాక్షాత్తూ విజయ చాముండేశ్వరి మీడియా సాక్షిగా తీసినంతవరకు అబద్ధాలు ఏమీ లేవు అని చెప్పిన ఈ సినిమాలోనే వేరే అమ్మాయిని తెచ్చుకుబి కులుకుతున్న సన్నివేశం ఉందిగా - అటువంటివాణ్ణి కూడా "మ నాన్న దేవుడు!" అని పొగుడుతున్న విజయ చాముండేశ్వరిని ముఖం మీదనే వుమ్మెయ్యాలి!వీళ్ళంతా పురుషాధిక్య సమాజపు పక్షపాత బుద్ధిని సమర్ధించే ముండల మిఠాకోరు వెధవల పెంపుడు చిలకలు!నిజానికి జెమినీ గణేశన్ ఇప్పటికీ ఈ ఆదవాళ్ళని కావాలనే అన్యాయం చేశాదని అనటానికి ఒక్క సాక్ష్యం కూడా కనిపించనివ్వని జిత్తులమారి! 

        జెమినీ గణేశన్ తర్వాత తన జీవితంలోకి వచ్చినవాళ్ళకి దూరం అయ్యాడు  గానీ మొదటి భార్యని మాత్రం వదల్లేదు, ఎందుకని? ఆండాళమ్మ తండ్రి బాగా దబున్నవాడు.జెమినీ గనేశన్ కడు బీదవాడు.నాకు వాళ్ళ గురించి అంత ఎక్కువ తెలియదు గాబట్టి వూహిస్తున్నాను - అతను ఆస్తిని కూతురు పేర్న ఉంచి ఉండాలి.ఆమె వరస చూస్తే పూజలూ పునస్కారాలూ తప్ప ఇంకేదీ పట్టించుకోని మనిషిలా ఉంది!కె.రామలక్ష్మి బసవరామతారకం గురించి "జీవితంలో ఆమె చేసిన పనులు నుంచొనుట,కూర్చొనుట,చీరలు ధరించుట,విప్పి మడతలు పెట్టుట,పిల్లలని కనుట" అని చెప్తుంటే నాకు నవ్వాగలేదు.ఆ రకం భార్యలు ఇప్పుడూ ఉన్నారు,ఇకముందు కూడా ఉంటారు.జెమినీ గణేశన్  ఎంత వ్యూహాత్మకమైన సన్నివేశాలని సృష్టించి మురిపించినా అతని జీవితంలోకి వచ్చిన ప్రతి ఆడదీ శలభంలా తనంతట తనే ఈ కామాగ్నిలో దూకిందనేది అందరూ ఒప్పుకోవలసిన నిజం! 

        అయితే వాళ్ళంతట వాళ్లే వచ్చారు,కొంతకాలం ఇతని రొమాంటిక్ సెన్సుని తనివితీరా అనుభవించారు, రొమాన్సు మత్తు దిగాక వదిలేసిపోతే ఇతన్ని వాళ్ళు దుర్మార్గుణ్ణీ చెయ్యడం ఎంతవరకు న్యాయం అని సరిపెట్టుకుందామా?సావిత్రి కష్టాలకి స్వయంకృతమే కారణమా?ఇతని ప్రమేయం ఏమీ లేదా?ఉంది!సావిత్రి పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి చూస్తే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడి ఉండేది లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేది కానీ తాగుడుకి బానిసై ఉండేది కాదు.అయితే తాగుడు అలవాటు చేసినవాడు పిల్లతో మాత్రం జాలికబుర్లు చెబుతూ వాళ్ళు దేవుడని భ్రమించేలా నటించి ఉంటాడు.ఒక్క సావిత్రి తప్ప మిగిలిన ఆడవాళ్ళు అతనికన్న తక్కువ స్థాయిలో ఉండబట్టి సుఖపడి వదిలేశాడు.కానీ సావిత్రి అతనికన్న పైకి ఎదుగుతున్నది - !సావిత్రి స్వయంగా అతని ప్రవర్తనలోని వింత లక్షణాన్ని గురించి చెప్పింది.తను డైరెక్షన్ చేస్తానన్నప్పుడు చాలా గట్టిగా వద్దన్నాడట.అయినా పట్టించుకోకుండా తను మొదలుపెడితే ఆ తర్వాత అతని ప్రవర్తన చూసి సావిత్రికే వింతగా అనిపించిందట.తను వద్దన్నాడు - ఓకే!కానీ భార్య కదా,తను వద్దన్నా చేస్తున్నదంటే ముచ్చట పడుతున్నదని సర్దుకుపోవాలా!ఆ సినిమా పనులన్నీ తనకి తెలిసినవే గదా,తనూ సాయం చెయ్యవచ్చు గదా!అబ్బే,ఆ వంకకే రాకుండా దూరంగా తిరిగాడట!గాజుపెంకుని పిడికిట పట్టినట్టు ఇలాంటి సన్నివేశాలు ఎన్ని జరిగితే సావిత్రికి ఇంత నీచుడి మొహం జన్మలో మళ్ళీ చూడకూడదన్నంతగా మనసు విరిగిపోయి ఉండాలి! 

        ఆఖరికి సావిత్రికే విసుగుపుట్టి "నా ఇంట్లో నుంచీ నా జీవితం నుంచీ ఫో!" అన్నాక ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టు మళ్ళీ ఆండాళ్ళమ్మ గూటికే చేరాడు.ఆ తరంలో ఆండాళ్ళమ్మా సమాజమూ జెమినీ గణేశన్  ఎంతమంది ఆడవాళ్ళ బతుకుల్తో ఆడుకున్నా క్షమించింది గనకనే ఈ తరంలో కమలహాసన్,పవన్ కళ్యాణ్ కూడా జెమినీ గణేశన్ దారిలో నడుస్తున్నారు.పేర్లూ మొహాలూ మార్పు తప్ప అవే సన్నివేశాలూ అవే కబుర్లూ అవే మోహాలూ అవే అహంకారాలూ అవే విషాదాలు రిపీట్ అవుతున్నాయి.ఈ కధలు అన్నింటిలోనూ మగవాళ్ళకి మళ్ళీ ఆడవాళ్ళు దొరుకుతున్నారు గానీ ఆడవాళ్ళకి మాత్రం మిగులుతున్నది జీవితకాలపు ఒంటరి బతుకే!మరో పెళ్ళి చేసుకునే ఉద్దేశం వెలిబుచ్చినందుకే కాపు క్షత్రియ వీరులు ప్రకృతి విరుద్ధమైన పాపకార్యం యేదో జరిపోతున్నంత ఆవేశపడిపోయి పవన్ ఆనే తమ గాడ్ తరపున భీబత్సప్రదర్శనలతో పవన్ కళ్యాణ్ పక్కలో పడుకున్న ఆదది మరో మగాడి పక్కలో పడుకోకుండా నిగ్రహించి దైవద్రోహం జరక్కుండా ఆపారు.
          ఆడవాళ్ళు సెలెబ్రిటీ మొగుళ్ళ కోసం యెగేసుకుపోయే ముందు ఒక్కసారి సావిత్రిని గుర్తు చేసుకుంటే కమలహాసన్,పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళకి అంతమంది పెళ్ళాలు దొరికేవాళ్ళు కాదు గదా!


అదీ మనం సావిత్రి జీవితం నుంచి నేర్చుకోవలసిన పాఠం - పురుషుల్లారా వర్ధిల్లండి!

9 comments:

  1. కాదల్ మన్నన్ జెమిని గణేషన్ ను గురీంచి పట్టుకొని ఎంతలేసి మాటలంట్టున్నారు? ఆయనది విశాల హృదయం. ఆయన ప్రేమ కుల మతాల కతీతం. 72+ వయసులో ఆరోగ్యం బాగాలేక, ఆసుపత్రిలో చేరిస్తే క్రైస్తవ నర్స్ ను ప్రేమలో పడేసి పెళ్ళి చేసుకొన్న వార్తలు వచ్చాయి. ఆ వార్తలు చదివి బాంబే నుంచి సినినటి రేఖ తండ్రి సేవ చేసుకోవటానికి చెన్నై కి పరుగెత్తుకొచ్చింది :)



    అంతటి ఉదారుడిని, ప్రేమే హృదయుడిని

    ReplyDelete
  2. Radha Thota ఈ మహానటి సినిమా పక్కన పెడితే
    జెమినీ గణేశన్ కేరెక్టర్
    గురించి మాట్లాడితే.....

    ఇతను తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన వాడు...
    ఇతని తాత గొప్ప అభ్యదయ వాది.....
    ఇతని మేనత్త " ముత్తు లక్ష్మి" తమిళనాడు లో మొట్టమొదటి లేడీ డాక్టర్.....
    ఆమెకూడా అభ్యుదయ వాది.....
    ఒక తెలుగు రెడ్డి ని వివాహం చేసుకుని కూడా తన ఇంటిపేరు ఆరోజుల్లో నే మార్చు కోలేదు....
    ఆమె సలహా లేకుండా ఏమెడికల్ ప్రాజెక్టు గవర్నమెంట్ ప్రారంభం చేసేవారు కాదంట....

    ఆమె కుమారుడు కూడా డాక్టర్..
    ఆయన పేరు మీద మొదలైనదే "అడయార్ కాన్సర్ హాస్పిటల్ "

    ఈజెమినీ గణేశన్ కి కూడా స్త్రీ విద్య అంటే అత్యంత మక్కువ....

    పట్టు పట్టి మెదటిభార్య కూతుర్ల లో ఇద్దరి ని డాక్టర్లు చేశాడు....
    వారిలో కమలా సెల్వరాజన్ మొట్టమొదటి " టెస్ట్ ట్యూబ్ బేబీ సంటర్" " జెమినీ గణేశన్ టెస్ట్ ట్యూబ్ సెంటర్ "
    పేరుమీద మొదలు పెట్టారు...
    సావిత్రమ్మ కుమార్తె కు
    16 సంవత్సరాలకే చదువు ఆపేసి పెళ్లి చేయడానిని
    జెమినీ గణేశన్ తీవ్రంగా
    వ్యతిరేకించి పెళ్లి సమయంలో మద్రాసు లో ఉండకుండా
    ఆఫ్రికా వెళ్ళి పోయాడంట....

    ఈవిషయాలన్నీ నేను జెమినీ గణేశన్ కేరెక్టర్ ని
    ఎలివేట్ చేయడాని చెప్పడం లేదు.....

    నేను మొదట చెప్పిన విధంగా
    ఓపురుషుడు ఏక కాలంలో ముగ్గురు స్త్రీ లని వివాహం చేసుకుని..

    అందరికీ సమాన స్థాయిలో ప్రేమించడం అందరినీ సంతోషంగా ఉంచగలగడం సాధ్యం కాదు.....

    కనుక సావిత్రమ్మ, జెమినీ గణేశన్ ల ప్రేమ పెళ్లి ....

    సావిత్రమ్మ జీవితం లోని ఆటుపోట్లను చూశాక అర్ధం ఐన విషయం ఇది...

    ReplyDelete
  3. మీ దృక్కోణంనుంచి మీ పాయింట్స్ బలంగా ప్రెజెంట్ చేశారు. జెమినీ గణేశన్ విజయచాముండేశ్వరిగారికి తండ్రి కనుక మన అంత కరాఖండిగా ఆలోంచించలేరు. తండ్రి అన్న బంధం ఉంది కదా?

    జెమినీ ఇంతమందిని పెళ్లి చేసుకుని, కొన్నిసార్లు చేసుకోకుండా, వాళ్ళందరి జీవితాలలో బాధను, దుఃఖాన్నీ నింపడం క్షమించరాని నేరం. మీరు చెప్పినట్టు కమల్, పవన్కళ్యాణ్ లాంటివాళ్ళు ఇదే దారిలో నడుస్తున్నారు.

    అయితే జెమినీ సావిత్రిని డైరెక్షన్, సినిమా నిర్మాణం వద్దని చెప్పింది ఆమెకు లౌక్యం లేదని, డబ్బు వ్యవహారాలు తెలియవని అనుకోబట్టే. చివరికి అలాగే అయ్యింది. ఆమెను ఆ సినిమా తీయమని ముగ్గులోకి లాగినవాళ్ళు ఒక్కక్కరూ జారుకుంటే, ఆ నష్టం మొతం సావిత్రిగారి నెత్తిన పడింది. అయినా, ఆతరువాత ఆమె ప్రాప్తం సినిమా తీసి మరిన్ని నష్టాలు మూటకట్టుకున్నారు. దీనికి కూడా జెమినీ వద్దనే మొత్తుకున్నారట. ఎంతోమంది ఈ విషయాలను ధృవీకరించారు. కంపల్లె రవిచంద్రన్ గారి పుస్తకం చదవండి, వీలుంటే.

    ReplyDelete
  4. "ఇది నిజ జీవిత కథ కాదు... కల్పన... ఎవరి జీవితాన్నైనా పోలి ఉంటే యాదృచ్చికమే" అనే డిస్ క్లైమర్ వేసినట్టున్నాడండీ.

    పవన్ కళ్యాణ్ సంగతి... ఒకరికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చాక మరొకరిని చేసుకున్నాడు కాబట్టి జెమినీగణేశన్ లా నేరస్తుడు కాదేమో.

    అభిమానుల ఉన్మాదాన్ని పట్టించుకోడం రేణూ దేసాయ్ తప్పు. తను పుణేలో ఇంకో పెళ్ళి చేసుకోదలచుకుంటే ఇక్కడి గొట్టం గాళ్ళని పట్టించుకోవడం వేస్ట్.

    ReplyDelete
  5. అవునూ .. సావిత్రికి భారత రత్న ఎందుకు ఇవ్వకూడదు ??
    ఆవిడకు అభిమానులు లేరా లేక ఆడది కాబట్టి, ఆడవాల్లు సినిమా రనగములోకి రావడమే పాపం కాబట్టి, ఇవ్వకూడదా ? ఆమె వ్యక్తిగతంగా కష్టాలు పడింటే పడిండొచ్చు, కానీ .. ఆవిడ స్థాయి మరే హీరోయినుకూ లేదంటే అతిశయోక్తి కాదు కదా!

    సావిత్రికి భారత రత్న ఇవ్వాలని ఎందుకు ఏ స్త్రీవాది కానీ, ఇప్పుడు ఆడవారికి సినిమా రంగములో సముచిత స్థానం కావాలని గొంతు విప్పుతున్న సినిమా ఆడవారు (హీరోయిన్లూ, క్యారక్టర్ ఆర్టిస్టులూ అందరూ), ఆమె అభిమానులం అని చెప్పుకునే ప్రేక్షకులు కానీ ఎందుకు అడగడం లేదు ??

    బహుషా సావిత్రికి కులం ప్రాథిపదికా అభిమానులు లేకపోవడం కారణమా ? లేక ఎంత గొప్పనటైనా ఆడదైతే ఆమెను తమకు "ప్రతినిధి"గా అంగీకరించలేని జనాల పురుషాహంకార భావజాలమా ? ఏది కారణం. ఆవిడ ఎవరికి తక్కువ ? ఏనటుడికి కన్నా తక్కువ ??

    #BharatRatna2Savitri #BharatRatna2Mahanati

    ReplyDelete
    Replies
    1. మగాళ్ళకీ గొప్ప కులపోళ్ళకీ కూడా లాబీయింగ్ వల్లనే వచ్చాయండీ!కె.రామలక్ష్మి చాలా విషయాలు చెప్పింది అవార్డుల కోసం చేసే లాబీయింగ్ గురించి.భానుమతి గొప్ప నటి,కాదనడం లేదు గానీ ఆవిడకి వచ్చిన అవార్డుల వెనక ఒక స్టూడియో యజమాని హోదా ఉండడం,ఆ స్థానం వల్ల ఫీల్డులో పలుకుబడి ఉండటమే ఎక్కువ పనిచేసింది.సొంత సినిమాలు సక్సెసయ్యి బాగా సంపాదించి ఉంటే సావిత్రి కూడా కొనుక్కోగలిగి ఉండేది!


      ఇప్పుడు సావిత్రికి అవార్డు కోసం సొంత చిలుము వదిలించుకుని లాబీయింగ్ చేసే తీరిక ఎవరికి ఉంది?నిన్న మొన్నటి వరకు యస్వీ రంగారావు కాపు అనే సంగతే ఎవరికీ తెలియదు.ఇప్పుడు ఫీల్డులో చిరంజీవి కుటుంబంలోనే నలుగురు సూపర్ హీరోలు ఉన్నారు.మావాడు అనే పేరు మీద వాళ్ళు ట్రై చెయ్యవచ్చుగా!ఎందుకు చెయ్యడం లేదు?

      ఎవడి గోల వాడిది!పక్కోడి పేరు గురించిన చింత మనకేల?

      Delete
  6. ఈ తరంలో కమలహాసన్,పవన్ కళ్యాణ్ కూడా జెమినీ గణేశన్ దారిలో నడుస్తున్నారు

    even nagarjuna also.

    what about gemini ganeshan daughter allegations regarding savithri's affairs.

    ReplyDelete
  7. ఒక income tax కట్టని fraudulent defaulter లాగా సావిత్రిని depict చేశారని అనిపిస్తోంది..
    ఒకవేళ అదే నిజమయితే, అలాంటి defaulter ని మనమెందుకు glorify చేయాలి, ఎంత మహానటైతే మాత్రం??
    పైగా తమ బ్రతుకు తెరువు కోసం సినిమాలు చేశారే గానీ, వీళ్ళేమైనా దేశాన్నుద్ధరిస్తున్నారా?? నేనెలాగైతే నా జీవితం గడవటానికి పాఠాలు చెబుతున్నానో,వాళ్ళూ అలాగే సినిమా చేస్తున్నారు. BIOPIC తీయాల్సిన గొప్పేముంది.

    ReplyDelete
  8. see my discussion with a proud muslim at this link
    The Mysterious Black Stone of Kaaba and first look dont miss to look
    I won with a hilarious answer!
    that fellow is really a nice guy!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...