Friday 16 June 2017

హిందూ ధర్మ ప్రహేళికలు - ద్రౌపది మానభంగ పర్వం!

          "ఒరులేయవి యొనరించిన నరవర! అప్రియము తన మనంబున కగుఁదా నొరులకు నది సేయకునికి పరాయణము పరమ ధర్మపథములకెల్లన్" – (ఇతరులు మనపట్ల ఏ పని చేస్తే మనకిష్టం వుండదో ఆ పని ఇతరులకు చేయకపోవడం ఉత్తమ ధర్మం). ఈ ఒక్క ముక్కని విన్నవాళ్ళకి మళ్ళీ సందేహాలు రాకుండా యెక్కించడానికే వేదవ్యాసుడు "జయ" అనే పేరుతో ఒక ఇతిహసం రాశాడు.కవిత్రయం దాన్ని తెలుగులోకి అనువదించారు,అదే "శ్రీ మదాంధ్ర మహాభారతం" అనే పేరుతో కీర్తిని గడించింది.ఆ కధలోని సార్వజనీనత వల్ల విన్న ప్రతి ఒక్కరూ ఆ కధను సొంతం చేసుకున్నారు.మొత్తం కధ పెద్దది కాబట్టి కొంచెం రచనాశక్తి ఉన్న ప్రతివాడూ ముఖ్యకధలోని ఒక సనివేశాన్ని ఆధారం చేసుకుని గానీ అందులో ఉన్న అనేకానేకమైన ఉపకధల్లో ఏదో ఒకదాన్ని తీసుకుని గానీ తమ పాండిత్యానికి గుర్తింపు తెచ్చుకునే దురద లాంటి సరదాని చూపించాడు.

          "రామాయణ మహాభారతాలు నిజంగా జరిగాయా?వీటిలోని యదార్ధత ఎంత?ఆ కధలలో వర్ణించబడిన వారు చారిత్రక వ్యక్తులా?అయితే వారు జీవించిన కాలం యేది?" అనే ప్రశ్నలు అర్ధం లేనివి!ఎందుకంటే,జరిగిన కధనే కావ్యరూపంలో చెప్పినప్పటికీ నూటికి నూరుశాతం వాస్తవాలను చెప్పడం సాధ్యం కాదు - ఇది నేను మనసా వాచా కర్మణా నమ్మి చెప్తున్నది!జరిగిన కధనే తీసుకున్నాడా కల్పించి రాశాడా అన్నదానితో సంబంధం లేకుండా కావ్యంలో చెప్పింది నచ్చితే పాటించడం,నచ్చకపోతే వొదిలెయ్యడం అత్యుత్తమమైన పని!అది గాక ఇంకే పనికి దిగినప్పటికీ ఆ పనిలో ఎన్ని సంవత్సరాలు అకుంఠిత దీక్షతో గడిపినప్పటికీ అదంతా పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్టే!

          వాటి మీద మితిమీరిన భక్తితో అవి యదార్ధాలని నిరూపించాలని తపనపడేవాళ్ళు కూడా ఆ కధల్లోని నాయక పాత్రలకి బ్రాహ్మణాధిక్యతని అంటగట్టి ఆయా రచయితలకి కులదోపిడీని శాశ్వతం చెయ్యాలనుకున్న ఎజెండాని రుద్దుతున్న వాళ్లలాగే పరమ మూర్ఖులు - సందేహం లేదు!ఎందుకంటే అది చరిత్ర అని నిరూపించటంతో పని లేకుండానే వాటిలోని విషయంతోనే అవి ఒక కులాన్ని అణిచేసి ఇంకో కులాన్ని పైకెత్తే ఎజెండాతో రాసినవి కావని నిరూపించవచ్చు - గోటితో పోయేదానికి గొడ్డలెందుకు?

శ్లో.శృణు యక్ష!కులం తాత!న స్వాధ్యాయో నచ శ్రుతం
కారణం వా ద్విజత్వేన వృత్తమేవ న సంశయః

          "ఓ యక్షుడా!కులమును గురించి చెబుతాను విను.ఓఎ తండ్రీ!బ్రాహ్మనత్వమున కర్ధమున కధ్యయనము కారణము కాదు.ధర్మమును స్మరించుత కానే కాదు.ప్రవర్తనయే ముఖ్యము.సందేహము లేదు!" - ఇది అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకి జవాబులు చెప్తున్న సందర్భంలో ఉంది.ఇంకా గట్టిగా "ఏదో ఒక మూల ఒక మంచి మాట ఇరికించారు.వాస్తవంలో మాత్రం ఆ కధ కింద కులాల్ని అణిచేసి బ్రాహ్మణులు మాత్రమే గొప్పవాళ్ళని ప్రచారం చెయ్యటానికే ఉపయోగించుకున్నారు - అది ఖాయం" అని మొండిగా వాదించేవాళ్ళకి ఇంకొక సాక్ష్యం చూపించి వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేస్తాను.

శ్లో.న కులేన న జాత్యవా క్రియయా బ్రాహ్మణో భవేత్
చండాలోపి హి వృత్తస్థో బ్రాహ్మనస్య యుధిష్ఠిర!
ఏక వర్ణమిదం పూర్ణం విశ్వమాసీ ద్యుధిష్ఠిర!
కర్మక్రీఅవిశేషేణ చాతుర్వర్ణం ప్రతిష్ఠితం
సర్వేవై యోనిజా మర్త్యా స్సర్వే మొత్రపురీషేణః
ఏకేంద్రియేంద్రియార్ధశ్చ తస్మా చ్చీలగుణై ర్ద్విజః
శోద్రోపి శెలసంపన్నో గుణవాన్ బ్రాహ్మణో భవేత్
బ్రాహ్మణోపి క్రియాహీనః శూద్రాత్ప్రవరో భవేత్
న జాతి ర్దృశ్యతే రాజన్ గుణాః కల్యాణకారకాః
జీవితం యస్య దర్మార్ధం పరార్ధే యస్య జీవితం.

          "ఓ యుధిష్ఠిర!కులముచేతను పుట్టుకచేతను ఒకడు బ్రాహ్మణుడు కాడు.కార్యము చేతనే ఒకడు బ్రాహ్మణుడు కాగలడు.జన్మచేత చండాలుడైనను సద్వర్తన చేత బ్రాహ్మణుడు కాగలడు.మొదట ప్రపంచమంతయును ఏకవర్ణమే, కర్మక్రియావిశేషము చేతనే చాతుర్వర్ణము ప్రతిష్ఠింపబడినది.సర్వులూ ఒక్కలాగున యోనిమార్గము నుండియే జన్మించుచున్నారు.ఇంద్రియములను ఏకం చేసి ఇంద్రియార్ధాలను కోరేవారు మాత్రమే బ్రాహ్మణులు.జన్మతః శూద్రుడు కూడ సదాచారముతో వృద్ధి పొంది క్రమేణ బ్రాహ్మణుడు కాగలడు.సదాచారమును విడిచి శూద్రకర్మ చేసినట్లయితే పుట్టుకచేత బ్రాహ్మణుడైనను శూద్రుడే యగుచున్నాడు.కావున ఓ రాజా!పుట్టుకతో పని లేదు గుణమే ప్రధానము.ఎవరు తమ జెవితమును ధర్మార్ధమును పరార్ధము నియోగించెదరో వారిదే అసలైన జీవితము. ఇది సత్యం!"

          ఇది కూడా మహాభారతం అరణ్యపర్వం లోనిదే!విమర్శించే వారిలోనూ సమర్ధించే వారిలోనూ ఒక్కరు కూడా అసలు కధ చదవలేదు - అదే అసలైన దరిద్రం!మరి, కధలో యెక్కడా యే పాత్రా కూడా బ్రాహ్మణ కులాధిక్యతని సమర్ధించనప్పుడు దీనిని బ్రాహ్మణ కులాన్ని  పొగట్టానికీ ఇతర కులాల్ని చిన్నచూపు చూట్టానికే వ్యాసుడు ఈ కధని రాశాడని యెందుకు అంటున్నారు?అప్పటి సమాజంలో బ్రాహ్మణాధిక్యత లేదని యేవరూ అనట్లేదు.అసలు ఉనికిలోనే లేకపోతే కధలో ప్రస్తావించటమే సాధ్యపడదు కదా!అసలెక్కడా కనబడని దానికోసం అంత బుర్ర బద్దలు కొట్టుకునే వాడెవడు, బుర్రతక్కువసన్నాసులు తప్ప!రచయిత  యెక్కడ చాన్సు దొరికితే అక్కడల్లా అది తప్పనే చెబుతున్నాడు, అయినా అతనికి దుర్మార్గం అంటగడుతున్నారు - ఇది యే రకం సాహిత్యవిశ్లేషణ కిందకి వస్తుంది?

          ఆ కధలు వాస్తవం అనుకోవడానికి ఉన్న ఒకే ఒక కారణం రచయిత యొక్క ప్రతిభయే - పాత్రలు చాలా సహజంగా ప్రవర్తించటం, ప్రాంతాల వర్ణన వాస్తవికంగా ఉండటం, కధలో జరిగినట్టు చెప్తున్న సన్నివేశాలలో ఉన్న కార్యకారణసంబంధానికీ ఈనాడు మన కళ్ళముందు జరుగుతున్న సంఘటనలలో ఉన్న కార్యకారణసంబంధానికీ పోలికలు ఉండటం!దేవుళ్ళూ మనుషులూ కలిసి మెలిసి  తిరగడం లాంటివాటిని  అభూతకల్పనలని కొట్టిపారెయ్యొచ్చు గానీ ముఖ్యమైన కధని మాత్రం అసలెక్కడా జరగటానికి వీల్లేదని కొటిపారెయ్యలేము గదా!పత్రికల్లో అక్కడక్కడా జరుగుతున్నవిగా వస్తున్న నేరాలకు సంబంధించిన వార్తలలో మనుషులు ధృతరాష్ట్రుడిలానో, దుర్యోధనుడిలానో,శ కునిలానో, కర్ణుడిలానో, భీముడిలానో ప్రవర్తిస్తూ ఆశ్చర్యం కలిగించడం లేదా?ఒక పెళ్ళయిన ఆడది తనకి నచ్చని మరో పెళ్ళైన ఆడదాన్ని అవమానించడానికి తన భర్తని రెచ్చగొట్టి అతన్ని తనకి నచ్చని స్త్రీ చీరని లాగమని పురికొల్పింది = ఇందులో ఉన్నది యేమిటి?అంటే, నీకు నచ్చని వ్యక్తి మగాడయితే తన్నాలనిపిస్తుంది. నీకు నచ్చని వ్యక్తి ఆడదయితే కొంగుపట్టి లాగాలనిపిస్తుంది - అవునా?అక్కడ కురుసభాభవనంలో ద్రౌపదికి జరిగిందీ అలాంటీ అవమానమే అయితే హిందూద్వేషులు మాత్రం అక్కడ వాస్తవంగా జరిగింది మానభంగమనీ రచయితా పౌరాణికులూ అలా చెప్పడానికి సిగ్గుపడి వస్త్రాపహరణం అని ముసుగు తొడిగారనీ యెందుకు అంటున్నారు?

          చిత్రమయిన విషయం ఏమిటంటే,మొదట మహాభారతం వాస్తవమని ఇటువైపు వారు వాదిస్తుంటే ఆధారాలు ఏమాత్రం దొరకనంతవరకు అది కల్పితమనీ అది యదార్ధమని నమ్ముతున్నవాళ్ళు పిచ్చిపుల్లయ్యలనీ అవహేళన చేశారు,ఇప్పుడు ద్వారక లాంటి సాక్ష్యాలు కనబడటంతో అది గనక నిజమయితే తమ పరువు పోతుంది గాబట్టి అడ్డం తిరిగి ఇలాంటి అడ్డగోలు వాదనలని ముందుకు తెస్తున్నారు - ఎంత నీచమయిన మనస్తత్వం!ఆ కధ అబద్ధం అని అరిచేదీ వాళ్ళే!నిజమయితే మీ హీరోయిన్ని విలన్ రేప్ చేశాడు,మీ హెరోలు గుడ్లప్పగించుకుని చూశారు అని అరిచేదీ వాళ్ళే!దీనివల్ల వాళ్ళు సాధించేది యేమిటి?పెద్దగా సాధించేది యేమీ ఉండదు, హిందువుల్లో అందరూ యెర్రిపప్పలు ఉండరు - అక్కడక్కడా హరిబాబు లాంటి చిచ్చరపిడుగులు కూడా ఉంటారు. అసలు నిజాన్ని సాక్ష్యాధారాలతో సహా చూపించి బుర్ర రామకీర్తన పాడిస్తారు. అది జరిగేలోపు మనం చూడు హిందువుల్ని యెట్లా నిలువుడ్లేసుకుని చూసేలా చేశామో అని కొంతకాలం చంకలు గుద్దుకోవటానికి పనికొచ్చే శునకానందపు స్వయంతృప్తితో నిండిన మితిమీరిన ఆత్మవిశ్వాసం - అంతే!

          మహాభారత యుద్ధానికి ఆఖరి కారణం ద్రౌపదికి కురుసభలో జరిగిన పరాభవం అయితే మొదటి కారణాన్ని వెతుక్కుంటూ కధలో వెనక్కి వెనక్కి వెళీతే చాలా చిత్రమైన సంగతులు కనబడతాయి.యెంత చిత్రమైన సంగతులు అంటే అది నిజంగా ఒక రచయిత కల్పించిన కధే అయితే గనక అంతటి సంవిధానం ఇమడ్చగలిగిన ప్రతిభకి ఆశ్చర్యపోకుండా ఉండటం అసాధ్యం!తండ్రికి సంతోషం కలిగించడం కోసం దేవవ్రతుడు తన రాజ్యార్హతని,వివాహాన్నీ వదులుకుంటూ భీషణ ప్రతిజ్ఞ చేసినప్పుడే కురుక్షేత్ర సమరానికి విత్తనం పడింది!దాశరాజు పెట్టిన మడతపేచీకి ఒప్పుకుని కొడుకుకు అన్యాయం చెయ్యలేక అప్పటికి వెనక్కి తిరిగి వచ్చినా వ్యామోహాన్ని జయించలేక కుంగిపోవడం వల్లనే గదా గాంగేయుడు శపధం పట్టి భీష్మ నామధేయుడు అయ్యింది!భీష్ముడి చేతా ప్రియుడి చేతా తిరస్కరించబడిన అంబ తపస్సు చేసి శిఖండి జన్మ యెత్తడంతో సమరానికి కారణం మరింత బలపడింది!మునిసేవ చేసి తరించాల్సిన సమయంలో దేహభ్రాంతిలో పడి ధర్మాన్ని మరిచి కళ్ళు మూసుకున్న తల్లి వలన ధృతరాష్టుడికి అంధత్వం ప్రాప్తించి శంతనుడిలోని స్త్రీవ్యామోహం ధృతరాష్ట్రుడిలో పుత్రవ్యామోహం రూపంలో మరింత ప్రస్ఫుటమై సకలసద్గుణవంతుడైన సుయోధనుణ్ణి చెడగొట్టి దుర్యోధనుడనే చెడ్డపేరు తెచ్చిపెట్టి కుక్కచావు చచ్చేలా చేసింది!

          చిన్ననాడు ఆప్తమిత్రులై పరిస్థితుల ప్రభావం వల్ల గర్భశత్రువులైన  ద్రోణుడు - ద్రుపదుడు అనే మిత్రద్వయం కూడా కధ తప్పనిసరిగా జురుక్షేత్ర సమరం వైపుకే నడవటానికి దోహదం చేశారు!పాండవమధ్యముడైన అర్జునుణ్ణి ఇష్టపడటం,ఆ మొహమాటం వల్ల సందర్భం వచ్చినప్పుడు పాండవుల్ని సమర్ధించడం తప్ప విడిస్తే ద్రోణుడిలో ఐశ్వర్యం పట్ల ప్రీతి, అహంభావం, మితిమీరిన క్రౌర్యం లాంటి చెడు లక్షణాలే ఎక్కువ - అర్జునుడి లాంటి యువకులే దివ్యాస్త్రాలను సామాన్యుల పైన వెయ్యకుండా నిగ్రహించుకుంటే ద్రోణుడు మాత్రం తన సేనాధిపత్యంలో జరిగిన యుద్ధంలో దానిని కొన్నిసార్లు అతిక్రమించాడు.పద్మవూహంలో అభిమన్యుడి పతనానికి కారణమయిన యుద్ధ నియమాల అతిక్రమణలు ఇతని ఆదేశం మేరకే జరిగాయి!అలా యుద్ధనియమాల అతిక్రమణ జరగకపోతే అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి విజయవంతంగా బయటపడటానికి అవకాశం ఉంది.ఏకలవ్యుడిని బొటనవేలు అడగటం కూడా ఇతనిలోని అహంకారం/క్రౌర్యం వల్లనే జరిగింది.ఇక్కడ విశేషం యేమిటంటే ఏకలవ్యుడు నిమ్నజాతి/బలహీన జాతి అనుకుని పొరపాటు పడిన హిందూద్వేషులు కులాధిపత్యాన్ని తీసుకొచ్చారు గానీ అతను తల్లికి చెల్లెలి కొడుకుగా శ్రెకృష్ణునికి సోదరుడు అవుతాడు!కేవలం గొల్లపల్లెలో కొన్నేళ్ళు పెరగడమే తప్ప వాసుదేవుడైన శ్రీకృష్ణుడు క్షత్రియుడే కదా!ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధన్వుడు నిషాద జాతికి చ్గెందినవాడు. తల్లి సులేఖ శ్రీకృష్ణుని తల్లి దేవకికి చెల్లెలు అవుతుంది.హిరణ్యధన్వుడు జరాసంధుడి రాజ్యంలోని నిషాదులకు నాయకుడు.ఇప్పటి హిందూద్వేషులు అనుకుంటున్నట్టు అణచివేఅతకు గురయి కుమిలే దుస్థితి అతనికీ ఏకలవ్యుడికీ లేదు.జరాసంధుడు చేసిన అనెకానేక యుద్ధాలలో ఒక యుద్ధంలో అతడు చనిపోయినప్పుడు ఏకలవుడు నిషాదులకు రాజయ్యాడు.వస్తుతః తన రాజ్యంలోని క్రూరమృగాల బారినపడి చనిపోతున్న సాధుజంతువులని రక్షించడం కోసం విలువిద్య నేర్వాలనుకున్న భూతదయాపరుడు.కానీ తన ఏకాగ్రతని భగ్నం చేసిన కుక్క మీదకి శబ్దవేధిని ప్రయోగించే సమయంలో అంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడో!

          ద్రోణుడు బొటనవేలును అడగటంతో ఇతని కధ ముగిసిపోలేదు, రెట్టించిన పట్టుదలతో పరిశ్రమించి బొటనవేలు లేకుండానే మహాధానుష్కుడై జరాసంధుడి సైన్యంలో కీలకస్థానం సంపాదించి రాజభోగాలు అనుభవిస్తూ ఉండేవాడు.శ్రీకృష్ణుడు రుక్మిణిని పరిగ్రహించిన సందర్భంలో రుక్మికి సాయంగా వచ్చినవాళ్ళలో ఏకలవ్యుడూ ఉన్నాడు,అక్కడ శ్రీకృష్ణుని చేతిలో హతమయ్యాడు.అయితే, అతని విశిష్టమైన పరాక్రమాన్నీ అతనికి జరిగిన అన్యాయాన్నీ అతనితో తన బంధుత్వాన్నీ అతడు గనక కౌరవ పక్షంలో ఉంటే కురుక్క్షేత్ర సమరంలో జరగాల్సిన అసుర సంహారం మరింత కష్టసాధ్యమయ్యే పరిస్థితినీ లెక్కలు వేసుకుని అప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల ధృష్టద్యుమ్నుడిగా ద్రుపదుడి ఇంట జన్మించాడు.మహాభారత కధలోని ప్రతి పాత్రలోనూ ఏదో ఒక లోపం ఉండి ఆ లోపం వల్లనే అతనికి ఒక గాయం తగిలి తన లోపాన్ని తెలుసుకుని చల్లబడటానికి బదులు తనకి అన్యాయం చేసిన వ్యక్తి మీద ప్రతీకారంతో దహించుకుపోతూ అతన్ని కురుక్షేత్ర సమరమనే రణయజ్ఞానికి సమిధగా నిలబెడుతుండటం చూస్తే ఆ సంవిధానం ప్రపంచ సాహితీ చరిత్రలోని మరే కావ్యంలోనూ లేకపోవటం కూడా గమనిస్తే అలాంటి గొప్ప కావ్యం మన దేశపు సాహితీ క్షేత్రంలో వికసించినందుకు ప్రతి భారతీయుడూ గర్వించాలి!ధృష్టద్యుమ్నుడి కోసం యజ్ఞం చేసేటప్పుడు ద్రోణవధ లక్ష్యం అయితే ద్రౌపది కోసం యజ్ఞం చేసేటప్పుడు అర్జునుడిని పెళ్ళాడే కూతురుని కోరుకున్న ద్రుపదుడు యుద్ధానికి పడుతున్న పీటముడిలో మరొక బలమైన ముడిని వేశాడు.గర్భవాసాన జన్మించనిది ద్రౌపది!బాల్యం ఎరుగనిది ద్రౌపది!తనకి అన్యాయం జరిగితే ధిక్కరించడమే తప్ప నిస్సహాయతతో విచారించడం తెలియని శక్తిస్వరూపిణి ద్రౌపది!

          మామూలు లెక్క ప్రకారం ఒకసారి ద్రోణుణ్ణి చంపటం కోసం యజ్ఞం చేసి ధృష్టద్యుమ్నుణ్ణి పొందాక రెండోసారి యజ్ఞం చెయ్యాలనే ఆలోచన ఎవరికీ రాదు,కానీ ద్రుపదుడికి ఎందుకు వచ్చింది?మరోసారి యజ్ఞం చేసి అర్జునుడికి భార్యగా ఒక కూతురుని ఎందుకు ఆశించాడు?అధికస్య అధికం ఫలం అన్నట్టు ఉబలాటంతో చెయ్యలేదు,బలమైన కారణమే ఉంది.మహభారతంలోని ప్రతి పాత్రలోనూ రాజనీతిలోని యేదో ఒక కోణం ఆవిష్కరించబడి ఉంటుంది!అప్పటికే దుర్తోధనుడికి పాండవుల పట్ల పుట్టిన మత్సరం విషయం ద్రుపదుడికి తెలుసు, అది యెటూ యుద్ధానికి దారి తీస్తుందని కూడా తెలుసు, యుద్ధం అంటూ వస్తే ద్రోణుడు దుర్యోధనుడి వల్ల పొందుతున్న ఉద్యోగపదవీవైభవాల్ని వదులుకుని పాండవుల వైపుకి రాడని కూడా తెలుసు, తనకి పాండవులతో వియ్యం కలిస్తేనే ద్రోణుడు రణంలో ప్రతికక్షి అవుతాడు - ఇది ద్రుపదుడి లోని దూరదృష్టి!

          అందరూ అనుకుంటున్నట్టు ద్రౌపది క్రిందటి జన్మలో శివుడి కోసం తపస్సు చేసినప్పుడు యెకాయెకిన నాకు ఐదుగురు భర్తలు కావాలని అడగటం గానీ తత్తరపాటుతో నాకు భర్త కావాలి అనే మాటని అయిదుసార్లు ఉచ్చరించడం గానీ జరగలేదు.పూర్తి స్పృహలో ఉండి ముందునుంచీ తపస్సుకు సంకల్పంగా ఉంచుకున్న కోరికనే చాలా స్పష్టంగా అడిగుంది.వారనీ వీరనీ లేకుండా స్త్రీలు కోరుకున్నట్టు ఒక్క భర్తనే కోరుకుంది - అయితే తను ఆశించిన 14 లక్షణాలు ఒకే పురుషుడిలో ఉండటం అసాధ్యం గనక పరమశివుడే ఒక్కొక్క పురుషుడిలో వాటిలో కొన్ని లక్షణాలు ఉన్న ఆయిదుగురు ఆమెకు భర్తలు కావడం ద్వారానే ఆమె కోరిక తీరుతుందని సర్ధి చెప్పాడు!ద్రౌపది అడిగిన లక్షణాలలో ముఖ్యమైనవి ధర్మం,బలం,కౌశలం,సౌందర్యం,సహనం - వీటిలో ధర్మానికి యుధిష్ఠిరుడు,బలానికి భీముడు,కౌశలానికి అర్జునుడు,సౌందర్యానికి నకులుడు,సహనానికి సహదేవుడు ప్రతీకలుగా నిలిచారు.మామూలుగా ఒక స్త్రీ ఒక పురుషుడికి భార్యగా ఉండాలని కోరుకోవడం అంటే ఆ స్త్రీ ఆ పురుషుడికి విధేయతని ప్రదర్శించడం అని భావిస్తారు.కానీ ద్రౌపది మత్స్యయంత్రాన్ని కొట్టి అర్జునుడు తనని గెలుచుకునప్పటికీ ధర్మరాజుతో సహా పంచపాండవులకీ భార్య అయినప్పటికీ ఆమె యేనాడూ దాసత్వాన్ని ప్రదర్శించలేదు సరిగదా వారిమీద తనే ఆధిక్యతని ప్రదర్శించింది - యే అనుమానమూ అఖ్ఖరలేదు, నిజం!పంచ మహాపతివ్రతలలోనూ ఆమెదొక చిత్రమైన పాతివ్రత్యం.

          అసలు అంతరార్ధం ప్రకారం రామాయణం లాగే మహాభారతం కూడా భగవంతుణ్ణి చేరుకోవటానికి యోగసాధకుడు చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అయితే పాండవులు మానవదేహంలోని అయిదు ప్రధానమైన చక్రాలకు ప్రతిరూపం.ద్రౌపదిని కులకుండలిని అని వ్యవహరించడం ఆమె మానవదేహంలో మూలాధారం దగ్గిర ప్రభవించి సహస్రారం చేరుకునే శక్తిస్వరూపం అనేది తెలియజెప్పటానికే!ఆమెకున్న పేర్లలో ఉన్న మహాభారతి అనేది ఈ మహాభారత కధ మొత్తం ఆమెకి సంబంధించినదే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.పెళ్ళికి ముందు ద్రౌపది తన పాంవపత్ని స్థానాన్ని మరెవరితోనూ పంచుకోననీ మరే ఆడదాన్నీ తనతో కలిసి జీవించడానికి తీసుకురాకూడదనీ షరతు పెట్టింది!ఆ నియమానికి కట్టుబడటం వల్లనే అర్జునుడు ఎంతమందిని పెళ్ళి చేసుకున్నా ఎక్కడివాళ్ళని అక్కడే ఉంచి వచ్చాడు తప్ప ఇంద్రప్రస్థానికి తీసుకురాలేదు - ఒక్క సుభద్ర మాత్రం మినహాయింపు!సుభద్రని అనుమతించడం అనేది శ్రీకృష్ణుడి సూచన వల్ల జరిగింది.శ్రీకృష్ణుడికీ ద్రౌపదికీ ఉన్న అనుబంధం చాలా నిగూఢమైనది.వారు ఇద్దరూ అయోనిజులు కాబట్టి మిగిలిన వారికి వలె దేహధారుల బాంధవ్యాలు వారికి లేకపోయినా ఒకరితో మరొకరు సోదర-సోదరి భావంతో ప్రవర్తించడం కనిపిస్తుంది.ఇద్దరినీ కృష్ణ నామధేయంతో వ్యవహరిస్తారు.సోదర భావం ఉన్నప్పుడు ద్రౌపది "సోదరా!" అని కృష్ణుణ్ణి పిలుస్తుందనీ కృష్ణుడు "సోదరీ!" అని ద్రౌపదిని పిలుస్తాడనీ అనుకోవడం సహజం,కానీ కృష్ణుడు ద్రౌపదిని "సఖీ!" అని పిలిస్తే ద్రౌపది కృష్ణుణ్ణి "సఖా!" అని పిలవడం గమనించాలి!అది ఎందుకంటే,అసురసంహారం కోసం ప్రభవించిన వారిద్దరూ సరి సమానులే - ద్రౌపది స్త్రీరూపంలోని కృష్ణుడు,కృష్ణుడు పురుషరూపంలోని ద్రౌపది!

          పంచ మహా పతివ్రతలలో మిగిలిన నలుగురూ  తమకు జరిగిన అన్యాయానికో లేదా పరీక్షా సమయపు దుస్సహమైన బాధకో కించపడటమో సర్దుకుపోవడమో చేశారు గానీ ద్రౌపది మాత్రం అన్యాయానికి తల వంచలేదు, మౌనంగా దుఃఖించి మూల కూర్చోలేదు, తిరగబడింది, నిప్పులు గక్కింది, కొమ్ములు తిరిగిన మగవాళ్లని సైతం దుమ్ము దులిపేసింది - ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకున్నాక గానీ శాంతించలేదు!ద్రౌపదిగా ధృతరాష్ట్రుణ్ణి గానీ సైరంధ్రిగా వీరటుణ్ణి గానీ ఆమె తనకి జరిగిన అవమానానికి న్యాయం చెయమని అడిగి వూరుకోలేదు,నన్ను రక్షించలేని మీ పరాక్రమం,సింహాసనం,ప్రాభవం అన్నీ దండగ అని కుంబద్దలు కొట్టిచెబుతుంటే ఒక్క మగాడు నోరెత్తి జవాబు చెప్పలేకపోయాడు - స్వాభిమానంతో అగ్నిశిఖలా జ్వలించే ద్రౌపదికి నిజంగా అక్కడ బలాత్కారసంభోగమానభంగసమే జరిగి ఉంటే దుశ్శాసనసంహారం 14 సంవత్సరాలు వాయిదా పడివుండేది కాదు,డాసత్వానికి కట్టుబడ్డారు గాబట్టి పాండవులు చెయ్యలేకపోయినా శ్రీకృష్ణుడే ప్రతీకారం తీర్చుకునేవాడు!అక్కడ జరిగింది యేదీ ఈ వెధవల స్వయంతృప్తి కోసం జరగలేదు - దుర్యోధన దుశ్శాసనులు కూడా ధర్మం తెలిసినవాళ్ళే,పాండవుల పట్ల మత్సరం అనే ఒక చెడు లక్షణం తప్ప దుర్యోధనుడిలో మరొక చెడు లక్షణం లేదు.లాక్షాగృహదహనం నుంచి మాయాద్యూతం వరకు చేసిన చెడుపనులు అన్నీ ఇవి నేను నా శత్రువులైన పాండవుల పట్ల చేస్తున్నాను గాబట్టి సరైనవే అనే సమర్ధన తెచ్చుకుని చేసినవే!ఈ హిందూ మతతత్వవాదులు బ్రాహ్మణాధిక్యతతో గబ్బుపట్టిపోయి అయిందానికీ కానిదానికీ దుర్మార్గులైన బ్రాహ్మలకి పొర్లుదణ్ణాలు పెట్టిన సోషలిష్టు మార్క్సిష్టు దళితిష్టు వ్యతిరేక పాండవుల్ని మంచివాళ్ళని పొగుడుతున్నారు గాబట్టి క్నాదు క్నాదు, మేం చచ్చినా ఒప్పుకోం, కౌరవులే మంచివాళ్ళు అని రెచ్చిపోతూనే మళ్ళీ వాళ్ళు ద్రౌపదిని రేప్ చేశారని చెప్పడం అంటే తాము మంచివాళ్ళని అంటున్నవాళ్ళకి రేపిస్టు ముద్ర వెయ్యటం అని కూడా తెలుసుకోలేని బుర్రతక్కువతనం వ్యాసుడికి లేదు!

          వాదన చేస్తున్నది బుర్రతక్కువవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వాదనలో కొన్ని బలమయిన పాయింట్లు కూడా ఉన్నాయి, అందుకే ఏకలవ్యుడి దగ్గిర్నుంచీ దుర్యోధనుడి వరకూ ప్రతి పాత్ర గురించీ పరిశోధించి రాస్తున్నది. లేని పక్షంలో పైన చెప్పిన పాయింటు ఒక్కటి చాలు గదా!వారి విశ్లేషణలలో కూడా ఇదే రూపంలో కాకపోయినా మూలకధ ఎక్కడో ఒకచోట జరిగి ఉంటుందనే అనుకుంటున్నారు.అయితే, ప్రధాన రచయితలైన వ్యాసుడూ, శుకుడూ, వైశంపాయనుడూ అప్పటి కాలమాన పరిస్థితుల వల్ల కధను ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా కొన్ని వాస్తవవిరుద్ధమైన కల్పనలు చేశారనీ, తర్వాత కాలంలోని రచయితలు మళ్ళీ మళ్ళీ ఆ కధల్ని తిరిగి చెప్తున్నప్పుడు మరికొన్ని కల్పనల్ని చేర్చారనీ కాబట్టి ఇప్పుడు కధలో భాగమై కనబడుతున్న సన్నివేశాలు అప్పటి సనివేశాల యదార్ధతను ప్రతిబింబించటం లేదనీ వారి వాడన!కానీ వేదవ్యాసుడు కధలో యే పాత్ర అయినా క్రూరమైన హత్య గానీ నీచమైన మానభంగం గానీ చేసి ఉంటే తడుముకోకుండా చెప్పేశాడు - ప్రతి పాత్రనూ తన స్వకపోలకల్పితమైన పాత్రగా భావించి రాగద్వేషాలు ప్రదర్శించకుండా తన చుట్టూ ఉన్న ప్రపంచంలో జవజీవాలతో తిరుగాడుతున్న ఒక యదార్ధమైన వ్యక్తిగా తను చూసి ఒక సన్నివేశంలో మంచిపని చేస్తే మంచిగానూ ఒక సన్నివేశంలో చెడుపని చేస్తే చెడుగానూ అరమరికలు లేకుండా చూపించి అతడు మంచివాడా చెడ్డవాడా అనేది మననే తేల్చుకోమనడం వేదవ్యాసుడి రచనా శిల్ప వైశిష్ట్యం!ఉదాహరణకి తన శపధాన్ని మరలించుకుని వంశాన్ని నిలబెట్టమని అడిగిన సత్యవతికి అలాంటి అతిక్రమణల వల్ల ఉపయోగం ఉండదని భీష్ముడు చెప్పే దీర్ఘతమసుడి కధలో దేవగురువు బృహస్పతి తన పెద్దన్న ఉతధ్యుడి భార్య మమతను బలాత్కరించటానికి ప్రయత్నిస్తాడు!అంతటితో ఆగకుండా దురుద్దేశంతో కూడిన తన ప్రయత్నాన్ని మమత గర్భంలో ఉండి తన తల్లిని రక్షించుకునే సదుద్దేశంతో తీవ్రంగా వ్యతిరేకించిన శిశువుని యేమాత్రం పశ్చాత్తాపం లేకుండా శపిస్తాడు - బృహస్పతి విషయంలోనే మొహమాట పడనివాడు దుశ్శాసనుడి విషయంలో దేనికి సంకోచిస్తాడు?ఆదిపర్వంలో "द्रौपदी च सुभद्रा च वासांस्याभरणानि च।  प्रायच्छन्त महाराज स्त्रीणां ताः स्म मदोत्कटाः" అనే భాగం ఏమి చెప్తుందో తెలుసా!ద్రౌపదీ సుభద్రా ఓక ఉత్సవంలో మధుపానంతో మత్తెక్కిపోయి ఒంటిమీదున్న నగల్నీ వస్త్రాల్నీ కూడా విప్పి ఇతరస్త్రీలకి ఇచ్చెయ్యడం మనల్ని కంగారు పెడుతున్నది గానీ వేదవ్యాసుడు రాయటానికి సంకోచించలేదు, ఎందుకని?

          ధర్మరాజు కౌరవులతో రెండుసార్లు జూదం ఆడాడు.మొదటిసారి వోడిపోయినప్పుడే ద్రౌపదికి అవమానం జరిగింది.వస్త్రదానం అనేది మహిమగా శ్రీకృష్ణుడి ప్రమేయంతో జరిగిందని చెప్పబడుతున్నప్పటికీ సభలోని కలకలం ద్వారా ధృతరాష్ట్రుడు జరిగినది తెలుసుకుని చాలా బాధపడి ద్రౌపదిని మూడు వరాలు కోరుకోమంటాడు.మొదటి వరంగా తనకూ తన భర్తలకూ దాస్యవిముక్తిని కోరుకుని రెండవ వరంగా జూదం ద్వారా తన భర్త కోల్పోయిన సమస్త సంపదల్నీ తిరిగి ఇవ్వమని కోరుకుని మూడవ వరాన్ని వొదిలేసింది.దీనితో పాండవులు మునుపటి వైభవాన్ని పొందటమే కాకుండా ఇప్పుడు దుర్యోధనుడి పని కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది!పగతో రగిలిపోతున్న వాళ్ళని కూడదీసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా వెంటనే మళ్ళీ జూదానికి పిల్చి ఈసారి 12 యేళ్ళు అరణ్యవాసం 1 యేడు ఆజ్ఞాతవాసం అని మెలిక పెట్టారు.అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో కనుక్కుని బయటపెడితే మళ్ళీ 12 యేళ్ళ అరణ్యవాసం 1 యేడు అజ్ఞాతవాసం చెయ్యాలి.ఒకసారి వోడిపోయిన ధర్మరాజు మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంటే మానహాని ఒకటే కారణం - ఆట తెలిసినవాడు మరో ఆటగాడు పిలిచినప్పుడు వెళ్ళకపోతే పిరికితనం అంటగడతారు గనక వెళ్ళాడు.దుర్యోధనాదులకు లక్ష్యం పాండవులని రాజ్యభ్రష్టుల్ని చెయ్యడమే తప్ప ద్రౌపది మీద పగ గానీ వాంచ గానీ లేదు.సంజయుడు ధృతరాష్టుడు "ఎలాగూ అన్నేళ్ళు ముష్టెతుకుని బతకటానికి అలవాటు పడి ఉంటావు,అలాగే సర్దుకుపోరాదా రాజ్యం కోసం గొడవ చెయ్యకుండా?" అని ధర్మరాజుకి తను చెప్పి పంపిన సందేశం వినిపించటానికి ధర్మరాజును కలిసినప్పుడు ధర్మరాజు కుశలం అడుగుతూ మేము అక్కడ ఉన్నప్పుడు బ్రాహ్మణులకు చేసిన దానాల్ని ఎవరూ అపహరించలేదు గదా అని అడిగితే మీమీద మత్సరమే తప్ప మరే నీచగుణమూ లేని దుర్యోధనుడు బ్రాహ్మణద్రవ్యాన్ని అపహరించడు గదా అని సంజయుడు అంటాడు.దాన్ని బట్టే అక్కడ దుర్యోధన దుశ్శాసనులు చేసినవి కొప్పు పట్టుకుని ఈడ్చుకు రావటం,కొంగు పట్టుకుని లాగటం లాంటి పొగరుతో కూడిన దుడుకు చేష్టలేనని తెలుసుకోవచ్చు.

          ద్రౌపది "నేను ధర్మవిజితనా?అధర్మవిజితనా?" అని అడగటం,"నన్నోడి తన్నోడెనా?తన్నోడి నన్నోడెనా?" అని అదగటం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి గానీ నిజానికి ద్రౌపది వేసిన చిక్కుప్రశ్న అది కాదు.భర్త దాసుడయితే భార్య దాసి కాకుండా యెలా వుంటుంది?ఈ ధర్మసూత్రం ద్రౌపదికి తెలియదా!అప్పుడు పాటిస్తున్న ధర్మం ప్రకారం ద్రౌపది మారు మాట్లాడకుండా సభలోకి వచ్చి తన భర్తల పక్కన తల వంచుకుని నిలబడాలి - అయితే, దాసి అయినప్పటికీ యేకవస్త్రయైన తను నిండుసభలోకి రాకూడదనే స్వతంత్ర నిర్ణయం తీసుకున్నది.యే నేరమూ చేయని ఒక వ్యక్తిని అతని ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉన్నది ధర్మం యెట్లా అవుతుంది?ఆ ధర్మం పేరుతో జరుగుతున్న అధర్మాన్నే ద్రౌపది ధిక్కరించింది. అప్పటివరకు ధర్మం అంటే నియమపాలన మాత్రమే, మానవీయత లేదు - ద్రౌపది తనకోసమే అడిగినా ధర్మసూత్రాలని మానవతా కోణం నుంచి చూసి వాటిని తిరగ రాయమని సూచించింది!శ్రీకృష్ణుడికి తప్ప ద్రౌపది వాదన ఇతరులకి అర్ధం కాలేదు - అందుకే,భీష్మద్రోణాదులతో సహా మంచివాళ్ళు కూడా ద్రౌపదీ మానసంరక్షణ కోసం ఆమె సఖుడైన భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సమరంలో విధించిన శిక్షకు పాత్రులు కాక తప్పలేదు.ధర్మాధర్మాలకి సంబంధించిన పండిత చర్చలు కూడా చెయ్యగలిగిన ద్రౌపది యొక్క వ్యక్తిత్వాన్ని ఇంత గొప్పగా నిలబెడుతున్న సనివేశాన్ని రేప్ సీనులా చూసినవాళ్ళ వివేకం ఏ స్థాయిలో ఉన్నట్టు?

          దుర్యోధనుడు ద్రౌపదికి తొడని చూపించిన సన్నివేశం మూలభారతంలో ఉన్నట్టు లేదు,మయసభలో ద్రౌపది నవ్విన సన్నివేశం అయితే మాత్రం లేదు - ఇవ్వాళ మనకి తెలిసిన కధ పురాణ ప్రస్తావనలూ,జానపదుల కల్పనలూ కలిసిపోయిన గుభేల్ దస్త్రం.వ్యాసుడి రచనకే ఉత్తర భారతపు వెర్షన్,దక్షిణ భారతపు వెర్షన్ అని రెండు రకాల వెర్షన్లు ఉన్నట్టు తెలుస్తున్నది.మూలభారతం ప్రకారం దుర్యోధనుడికీ దుశ్శాసనుడికీ కూడా ఆమెని దాసత్వానికి అంగెకరింపజేసి తమ ఆధిక్యతని చాటుకోవటమే తప్ప లైంగిక దాడి చెయ్యాలనే ఉద్దేశం లేదు.ద్రౌపది సుశ్శాసనుడికి చెప్పినది తను సరైన స్థితిలో లేనని,అతడి వాదన "నీ వస్త్రధారణతో మాకు సంబంధం లేదు,నువ్వు మా దాసివి,సభకు రమ్మని శాసించాం,నువు రావాల్సిందే!" అని.సభలో నీచమైన ప్రస్తావన వచ్చింది కర్ణుడి నుంచి - "ఆమె ఇప్పుడు ఉమ్మడి సొత్తు గనక యేకవస్త్ర అయినా ఫరవాలేదు,నగ్నంగా ఉన్నా ఫరవాలేదు" అనేశాడు!అంతే కాదు,పాండవులని నగ్బంగా నిలబడమని ఆదేశించాడు,వారు శిరసావహించారు - దాసులు కదా!పాండవులు పాటించిన తర్వాత కూడా ద్రౌపది తిరస్కరించడం వల్లనే దుశ్శాసనుడు ఆమెని వివస్త్రని చెయ్యాలని ప్రయత్నించాడు.ద్రౌపది వ్యతిరేకించినది దీనినే - తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే ధర్మాన్ని ధిక్కరించింది!ఇలాంటి స్త్రీ పాత్రలలో బానిసత్వం ఉందని అశోకాలు పెడుతున్న వోల్గా లాంటి స్త్రీవాదులకి నిజంగా స్త్రీత్వం అంటే ఏమిటో తెలుసా?

          పాండవులను అభిమానించే భీష్ముడు,ద్రోణుడు,విదురుడు పాండవుల భార్యకి జరుగుతున్న అవమానాన్ని కళ్ళప్పగించి చూస్తూ యెందుకు నిలబడ్డారనేది తెలుసుకుంటే తప్ప ద్రౌపది అప్పుడు నిలబడిన దయనీయమైన స్థితీ తిరుగబటంలో ద్రౌపదికి మాత్రమే సాధ్యమైన వైదుష్యం అర్ధం కాదు!పాండవుల దాసత్వానికి కారణమైనది ద్యూతక్రీడ.దీనినే అక్షవిద్య అని కూడా అంటారు.దీనివలన కష్టాల పాలైన నలుడి కధ అప్పటికే ప్రచారంలో ఉన్నది.కురు పాంవుల మధ్యన రెండుసార్లు జరిగింది - విదురుడూ శ్రీకృష్ణుడూ మాత్రమే వ్యతిరేకించారు,అందులో ధర్మాధర్మవిచక్షణని కోల్పోయి మత్తెక్కించేలా చేసే లక్షణం ఉంది గనక వూహించరాని విపరీతాలు జరగవచ్చును అనే భావంతో!కానీ మిగులిన వారికి మాత్రం అట్లా అనిపించలేదు - కేవలం క్రీడయే కదా అని కొట్టిపారేశారు.అదీగాక అప్పటి కాలంలో ద్యూతార్జితం కూడా రాజులకు యుద్ధార్జితం లాంటిదే.మనం ఇవ్వాళ సినిమాల్లోనూ నాటకాల్లోనూ చూస్తున్నటు నాలుగు పాచికలతో ఆడే తేలికపాటి ఆట కాదు - పాచికలు,గవ్వలు,శంఖాలు వంటివాటిని ఉపయోగించి ఆటగాడి గణితశాస్త్ర పాండిత్యానికి ప్రాధాన్యత ఉన్న సంక్లిష్టమైన ఆట.అది - తేలికపాటి ఆట అయితే చతురంగ బలాలను సమకూర్చుకుని చేసే యుధానికి సమానం యెట్లా అవుతుంది?

          కురుసభలో పెద్దలు చూసిన దృశ్యం ఇది:ద్యూతక్రీడ రాజులకు ధర్మమే, ధర్మరాజు ఓడిపోయాడు, ద్రౌపది కూడా దాసియే, ఆమె దుర్యోధనాదుల ఆజ్ఞల్ని పాటించాల్సిందే, పాండవులు పాటించారు కదా!అక్కడ రచయిత శకుని మాయాద్యూతం వల్ల ఓడిపోయాడని చెప్తున్నాడు గానీ ధర్మరాజు మాత్రం దానిని ఇతరులకు చెప్పలేని నిస్సహాయతలో ఉండిపోయాడు - యుద్ధానికి పడిన ముడుల్లో అతి ముఖ్యమైనది ధర్మరాజు యొక్క ద్యూతక్రీడావ్యామోహం!సాంకేతికంగా ధర్మరాజు ఆటలో మోసం జరిగిందని గొడవ చేసినా దానివల్ల ప్రయోజనం లేదు, ఉండదు.అక్కడి వారందరికీ తల దిమ్మెక్కిపోయే విచిత్రం దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చెయ్యడానికి ప్రయత్నించడం కాదు, ద్రౌపది దుర్యోధనాదుల ఆజ్ఞను తిరస్కరించి వారందరూ ధర్మం అనుకున్న దానిని ప్రతిఘటించడమే! ఎందుకంటే, వారికి ధర్మం అంటే నియమపాలన అని మాత్రమే తెలుసు. ద్రౌపది తన స్వాభిమానం కోసం పోరాడుతున్నది.తన స్వాభిమానానికి విరుద్ధమైన దాన్ని అధర్మం అని ప్రకటించి కొత్త దారిని వెయ్యమంటున్నది - ఇవ్వాళ దీనినే హక్కుల కోసం పోరాటం అంటున్నాము.

          అంతమంది అన్ని విధాల పావులు కదుపుకుంటూ వస్తున్నప్పటికీ యుద్ధాన్ని ఆపగలిగినవాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉన్నారు!తల్లి చేసిన పొరపాటు వలన అన్యాయానికి గురయ్యానని బుడిబుడి ఏడుపు ఏడుస్తూ తన కొడుకు కోసం తమ్ముడి కొడుకులకి అన్యాయం చెయ్యడానికి సిద్ధపడిన ధృతరాష్టుడు "ఎలాగూ అన్నేళ్ళు ముష్టెతుకుని బతకటానికి అలవాటు పడి ఉంటావు,అలాగే సర్దుకుపోరాదా రాజ్యం కోసం గొడవ చెయ్యకుండా?" అని ధర్మరాజుకి తను చెప్పి పంపిన దిక్కుమాలిన సొల్లు కబుర్లు అక్కడ చెల్లలేదని తిరిగొచ్చిన సంజయుడు చెబుతూ అటువైపున యుద్ధానికి సిద్ధపడి ఉన్న యోధులను గురించి చెప్పాక గుండెలు జారిపోయి కనీసం కొడుకు ప్రాణాలను రక్షించుకోవడానికయినా రాజీకి సిద్ధపడ్డాడు!కానీ, అప్పటివరకు లాక్షాగృహంలో తమ్ముడి కొడుకుల్ని నిలువునా చంపేస్తున్నారని తెలిసి కూడా నువు రాజువు కావడానికి ఏం చేసినా నాకిష్టమేనని గాలి కొట్టి వదిలినందుకు దుర్యోధనుడు అప్పటికే తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు చెట్టెక్కి కూర్చున్నాడు. సాక్షాత్తూ గాంధారి "వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే మిగిలినది నీ వైభవాలకి చాలదా?స్నేహంగా ఉంటే ధర్మరాజు నీకోసం కొత్త రాజ్యాల్ని సాధించి ఇస్తాడురా నాయనా!నీ క్షేమం కోసమే చెబుతున్నాను వినరా బాబూ!అక్కడ కృష్ణుడు ఉండగా నీకు విజయం దక్కదు - నా మాట వినరా!" అని బతిమిలాడి చెప్పినప్పుడు దుర్యోధనుడు విని ఉంటే యుద్ధం జరిగేది కాదు.ఒక మనిష్ వ్యక్తిగత జీవితంలో గానీ ఒక జాతి సామాజిక జీవితంలో గానీ పునాదులు కదిలిపోయి తిరిగి కోలుకోలేనంతటి భీబత్సం ఎదురయ్యే సంఘటనలు ఎనిసార్లు జరిగినా అన్నిసార్లూ ఇష్టానికీ ధర్మానికీ మధ్య నిలబడి ఎటో ఒకవైపుకి జరగాల్సి వచ్చినప్పుడు ఇష్టం వైపుకు జరిగడమే కారణం అనేది ఆ తండ్రీకొడుకుల దురవస్థ నుచి తెలివైనవాళ్ళు నేర్చుకోవలసిన పాఠం!

          బలరాముడు గొడవ చేసినట్టు పనిగట్టుకుని దొంగదెబ్బనే వేశాడో,కృష్ణుడు సమర్ధించినట్టు దుర్యోధనుడు గాలిలోకి పైకెగిరితే అలవాటులో పొరపాటుగానే తగిలిందో గానీ భీముడు కొట్టిన దెబ్బకి తొడలు విరిగి కూలిన దుర్యోధనుడు "ధర్మయుద్ధం చేస్తే నేనే గెల్చేవాణ్ణి,మీరు కూడా అధర్మమే చేశారుగా - నేను అధర్మం చేశానంటే యెట్లా?అయితే గియితే దొందూ దొందే అవుతాం గానీ!" అని తనకి నెప్పి పుట్టినప్పుడు పాండవుల్ని దెప్పిపొడవటానికి ఉపయోగించిన తెలివిని తను భీముడికి విషం పెట్టినపుడు, లక్కయింట్లో మొత్తం పాండవుల్ని పదతల్లితో సహా చంపాలనుకున్నప్పుడు, మాయాద్యూతంతో పాండవుల రాజ్యాన్ని లాక్కోవాలనుకున్నప్పుడు చూపిస్తే ఈ నెప్పితో కూడిన కుక్కచావు తప్పేది కదా!"నాకేంటి?బతికినంత కాలం వైభవంగా బతికాను!పాండవులే పిచ్చోళ్ళలా యవ్వనమంతా కారడవుల్లో తిరిగారు గానీ!" అని విర్రవీగినవాడు తను చచ్చాక తల్లి గుండెలు బాదుకుని యేడవటం చూసి ఉంటే ఎలా వుండేవాడు?

          దుర్యోధనాదుల్ని మందలించి ఆపగలిగిన వారు కూడా తలలు వంచి కూర్చోవడమే తప్ప కలగజేసుకుని ఆపకపోవటానికి దాసులు ప్రభువుల ఆజ్ఞల్ని పాటించటం వారి దృష్టిలో ధర్మం గనకనే - దాన్ని తిరస్కరించిన ద్రౌపదీ ఆమె స్వాభిమానాన్ని కాపాడిన కృష్ణుడూ నడిపించిన నిగూఢమైన రాజనీతి సౌందర్యమే మహాభారత కధని కాలాలు దాటించి దేశాలు దాటించి సజ్జనులకు నీతిబోధలా కనిపిస్తూ దుర్జనులకు శిరోవేదన కలిగుస్తున్నది. హిందువులు మంచివాళ్ళని పొగిడినవాళ్ళనల్లా చెడ్డవాళ్ళని గొడవచేసి హిందువుల్ని చీకాకు పరిచి వాళ్ళని మానసికంగా బలహీనపరచడం ద్వారానే మనకు అధికారం సంఫ్రాప్తిస్తుందనే తెలివితక్కువ ఎజెండాతో స్వీయలోపాల్ని తెలుసుకోకుండా పాండవుల మీద పడి యేడ్చిన దుర్యోధనాదుల్ని మంచివాళ్ళని పొగుడుతున్న స్వైరిణులూ ముళ్ళకంచెలూ ఇంకా ద్రౌపది రేప్ సీనుని తల్చుకుని పులకరించి కలవరించుతున్న ఈనాటి హిందూమతద్వేషులు కూడా నాటి కౌరవాధముల వలె హతమారిపోయి పాండవులను వరించిన విజయశ్రీ నేటి హిందూధార్మికయోధులను వరించటం తధ్యం!

రసపట్టులో తర్కం కూడనట్టే ధార్మికచర్చలో ఎజెండాల పైత్యం ఉండకూడదు!

8 comments:

  1. Haribabu garu,

    Asalu emi cheppadalchukunnaru meeru. Deenikante Actual Maha Bharatam baaga ardham avutundemo?

    ReplyDelete
  2. మీ వ్యాఖ్య చాలా అద్భుతంగా ఉంది.కాకపొతే ఒక చిన్న సవరణ
    దుర్యోధనునికి సుయోధనుడు అన్న పేరు లేదు అది కూడా కల్పితమే
    యెందుకంటే దుర్యోధన అన్న పేరుకి అర్దం గెలువ నసాధ్యమైన వాడు అని అర్ధం
    సుయోధనుడు అంటే సులభంగా గెలువ గలిగిన వాడు అని అర్ధం
    భీమునికి దుర్యోధనుడిని గెలవడం కష్టంగా ఉన్నపుడు అర్జునుడు ఉరుభంగం చెయమని సైగ చేసాడు అది దుర్యోధనుడు కూడా చూశాడు కాని భీముడు మాత్రం అతని వక్షస్తలం పైననే కొట్టాడు అది తప్పించుకొవడనికి గలిలోకి యెగిరినడు అతని తొడలకు తగిలి మణించాడు.

    ReplyDelete
    Replies
    1. >>దుర్యోధనునికి సుయోధనుడు అన్న పేరు లేదు అది కూడా కల్పితమే

      hari.S.babu
      మీరన్నది నిజమే!నేను ధృతరాష్ట్రుని సంతానం యొక్క వంద పేర్లనీ చూశాను,దుర్యోధనుడు అన్నదే అసలు పేరు అని నాకూ తెలుసు - కాకపోతే సద్గుణసంపన్నత గురించి చెప్తూ పాజిటివ్ అర్ధం రావడం కోసం సుయోధనుడు అని వాడాను.బహుశా మిగిలిన వాళ్ళు కూడా అదే అర్ధంలో వాడి ఉంటారు!

      కావాలనే వాడాను గాబట్టి మార్చను గానీ నిజం తెలిసి సరిదిద్దాలనే మీ ప్రయత్నానికి కృతజ్ఞతలు!

      Delete
    2. వెంకట్17 June 2017 at 21:27

      అయితే "ఎం చేద్దామంటావు సుయోధనా" అనే శకుని మాటలు అబద్దాలేనా

      Delete
  3. అలాగే కులం అంటే కుటుంబం/వంశం అని అర్ధం అంతే కాని వర్ణం/ వర్గం అని కాదు

    ReplyDelete
  4. వెంకట్17 June 2017 at 21:32

    రంగనాయకమ్మ గారి "ఇదండీ మన భారతం" పుస్తకం చదివిన తరువాత, రెండవ సారి జూదానికి వెళ్ళడానికి ధర్మరాజు యొక్క బలహీనత తప్ప ఎటువంటి అంగీకారయోగ్యమైన కారణం కనిపించట్లేదు నాకు. జూదానికి వెళ్ళడానికి నిరాకరించడం తప్పు అంటూ ఏవేవో చెబుతాడు కానీ, ఆయనకున్న వ్యసనం తప్ప మరేవీ సహేతుకమైన కారణాలని నాకనిపించట్లేదు

    ReplyDelete
  5. ఆమేదో కోడి బుర్ర. ఆమే పుస్తకాలు చదివితే అలానే అర్థమౌతుంది. ఆమే ఒక్కటే ప్రపంచం లో నిజాయితి పరురాలైనట్లు ఇంట్లో కూచొ చంకలు గుద్దుకొంట్టుంది. తనను తాను నిజాయితి పరురాలుగా ఊహించుకోవటం రంగనాయకమ్మ కున్న బలహీనత. ఎంతమంది చెప్పినా ఆమే ఎమి మారింది. ధర్మరాజు బలహీనతగురించి మాట్లాడుతున్నాది.

    ReplyDelete
  6. >>కులముచేతను పుట్టుకచేతను ఒకడు బ్రాహ్మణుడు కాడు.కార్యము చేతనే ఒకడు బ్రాహ్మణుడు కాగలడు.జన్మచేత చండాలుడైనను సద్వర్తన చేత బ్రాహ్మణుడు కాగలడు.

    ఏ కులంలో పుట్టినోడు ఆ కులానికే అని ఎప్పుడు మొదలైంది?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...