Wednesday 3 August 2016

ఈ ఆంధ్రద్వేషపండితప్రకాండులు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా లేక మరొకటా?

     "మీ రెండు రాష్ట్రాల మధ్యనా ఎందుకింత అసహనం?ఈ విషయం మాకు అర్ధం కావడం లేదు!" - తెలంగాణ, స్టేట్ మరియూ ఆంధ్రప్రదేశ్ రాష్త్రం యొక్క ప్రతినిధుల్ని ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది!సందర్భం బాబ్లి ప్రాజెక్టుకి సంబంధించిన నదీజలాల పంపిణీ విషయానికి సంబంధించి ఏర్పడిన కమిటీలో విభజన వల్ల తెలంగాణని కూడా కొత్త మెంబరుగా చేర్చడం విషయంలో ఆంధ్ర ఏమో తెలంగాణని చేర్చమని అంటుండగా తెలంగాణ ఏమో ఆంధ్రని తొలగించమని కోరడంలో ఉన్న ఔచిత్యం యేమిటో ఆయనకి అర్ధం కాలేదట!

     కమిటీలో ఏపీ కొనసాగింపుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ, "ఆంధ్రప్రదేశ్ సమస్య మీతో కాదు,మిమ్మల్ని కూడా కమిటీలో చేర్చమని కోరుతోంది - అయినా మీరు ఏపీని తప్పించాలని ఎందుకు కోరుతునారు?" అని జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు.గౌరవనీయులు కాబట్టి హుందా అయిన భాషలో ప్రశ్నించారు,కానీ అసలు అర్ధం "ఆంధ్రా కమిటీలో ఉంటే నీకేంటి నెప్పి?నోర్మూసుకుని నీళ్ళలో నీ వాటా నువ్వు తీసుకుపో!" అని మొట్టికాయలు వేసినట్టు:-)

     "గోదావరి అంతర్రాష్ట్ర నది.దిగువ రాష్ట్రాలకూ ప్రయోజనాలు ముడిపడి వుంటాయి.బాబ్లీ నుంచి నీరు కిందకి ప్రవహిస్తుంది గాబట్టి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆందోళన పడటం సహజం.ఈ కమిటీలో తెలంగాణను చేర్చాలని ఏపీ కోరుకుంటున్నది.ఈ కమిటీ నుంచి ఏపీని తొలగించాలని తెలంగాణ కోరుకుంటున్నది.ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకింత అసహనం ఉందో మాకు అర్ధం కావడం లేదు.బాబ్లీ ప్రాజెక్టుపై గతంలో సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది.కోర్టు విధించిన పరిమితుల మేరకు ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర నీటి వాడకం  జరిపేలా పర్యవేక్షించడమే ఈ కమిటీ పని.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రెండూ కలిసి మహారాష్ట్రపై నిఘా వెయ్యవచ్చు.మహారాష్ట్ర తనకు కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోకుండా నిరోధించవచ్చు.ఆంధ్ర,తెలంగాణ రెండూ ఈ కమిటీలో ఉంటే ఇద్దరికీ లాభమే" అని చెప్తూ జస్టిస్ ఠాకూర్ తాం తుది తీర్పును వెలువరించారు.

     అయితే,తెలంగాణ తరపు న్యాయవాదులు మాత్రం తమకు మహారాష్ట్రతో అసలు సమస్యలే లేవనీ,వారికి ఆంధ్రప్రదేశ్ కమిటీలో ఉందటమే సమస్య అనె బల్లగుద్ది చెప్పి ఉన్నారు.రకరకాల తింగరి వాదనలు వినిపించినాక ఆఖరికి ఈ ప్రాజెక్తు వల్ల ఏపీకి న్యాయంగా వచ్చేది 1 TMC మాత్రమేనని లెక్కలు గట్టి "ఇంత చిన్న ప్రాజెక్టుపై కమిటీలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉండటం తగదు" అని నీతులు చెప్తూ ఇప్పుడు ఏపీని తొలగించకుంటే తాము వేరే కేసు దాఖలు చెస్తామని అంటున్నారు.

     అంటే,తాము ఎక్కడుంటే అక్కడ ఆంధ్ర ఉండకూడదు.ఉంటే ఇబ్బందిగా ఉంటుంది,అక్కడినుంచి ఆంధ్రని తొలగించేవరకు విశ్రమించం అని కరాఖండిగా తేల్చేశారు - ఒకప్పుడు "మేం ఎగువన ఉంటం,మీకు నీళ్ళు బందు జేస్తం" అన్న వీరి రాకాసి ముఖ్యమంత్రి నీచపు హెచ్చరికని కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాధికారులు.ఒక ప్రాంతం మీద,ఒక ప్రాంతం ప్రజల మీద ఇంత ద్వేషం ఉన్న వాళ్ళు ఏనాడైనా పైకొచ్చినట్టు దాఖలా ఉందా చరిత్రలో!మటిగొట్టుకు పోయే కాలం దాపరించిన వాళ్ళు మాత్రమే ఇంత బరితెగించి పబ్లిక్ డయాస్ మీద ఇంత అధమస్థాయిలో మాట్లాడగలరు!ఈ వార్తని గానీ విషయాన్ని గానీ కేవలం తెలుగువాళ్ళు మాత్రమే కాదు,ఇంగ్లీషు పేపర్సులో వేస్తే ప్రపంచంలో ఇంగ్లీషు వచ్చిన ఏ దేశీయుదైనా చదువుతాడే - వీళ్ళ తెలివితేటల్ని చూసి ఎంతమంది ఎన్నిరకాలుగా నవ్వుకోవొచ్చో అన్నిరకాలుగానూ నవ్వుకుంటూ ఉంటారేమోన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా వీళ్ళకి?నవ్వుకోవడానికి పనికొచ్చే అతితెలివి తప్ప సీరియస్ కంటెంటు ఉందా వీళ్ళ యేడుపులో!ముఖం మీద ఉమ్మేసి చెప్పితే గానీ అర్ధం కాదా?

     తమ రైతుల కోసం చుక్కనీటిని కూడా వదలరట,ఆంధ్ర కి మాత్రం ఈ ఒక్క టీయంసీ నీటికి ఆశపడవద్దు అని నీతులు చెప్పటం!అసలు పొరుగు రాష్ట్రం యొక్క నీటి అవసరాల గురించిన లెక్కలు చెప్పే అధికారం వీళ్ళకి ఉందా?తన రాష్ట్రానికి ఎంత నీరు వాటాగా వస్తుంది,ఎగువ రాష్ట్రం తనకి న్యాయమైన వాటాని వదుల్తుందా ,దిగువ రాష్ట్రం ఎక్కువ అడుగుతున్నదా అన్ చూసుకుని మూసుకుని కూర్చోకుండా ఏపీ గురించి ప్రస్తావన అయినా ఎందుకు చెస్తున్నది?ఏపీ కమిటీలో ఉందాలా అక్కర్లేదా అని మాట్లాడాలసిన అవసరం తనకేంటి?అసలు ఒకనాటి సమైక్య  రాష్త్రంలో "బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం జరుగుతున్నది,మహారాష్ట్ర అన్యాయంగా ఎత్తు పెంచేస్తునది,ఆంధ్ర పాలకులు వివక్షతోనే పట్టించుకోవటం లేదు" అని అల్లాడిపోయినవాళ్లకి హఠాత్తుగా తమ నీళ్లని దోచుకునే అవకాశం ఉన్న మహారాష్త్ర మిత్రుడై తాము అన్యాయం చేస్తే అల్లాడిపోవటమే తప్ప తమకు అన్యాయం చెయ్యలేని దిగువ రాష్ట్రమైన ఏపీ సమస్య ఎప్పుడు ఎందుకు అయ్యింది?మహారాష్ట్రకి తమ ఇష్టానుసారం నీళు వాడుకునే స్వేచ్చ ఇచ్చ్గేసి తను కూడా ఇష్టానుసారం ప్రాజెక్టులు ఎగాదిగా కట్టేసి కాంట్రాక్టర్లని బాగుచెయ్యాలనే దురద తప్పిస్తే ఎగువ రాష్ట్రం మంచిదవటానికి మరో కారణం ఉంటుందా?

     తమకి ప్రత్యేకంగా నష్టం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ కమిటీలో ఉంటే వీళ్ళకి ఇబ్బంది యేమిటి?ఇదొక్కటే అయితే,సాంకేతికమైన వాదనలు మనకి పూర్తిగా తెలియవు గాబట్టి ఓకే!కానీ రెందేళ్ళ పైన హైదరాబాదులోనే ఉన్నారు గదా,ఫైళ్ళు అడిగి తీసుకోలేకపోయినారా!ఎంత శత్రుత్వం ఉన్నవాడయినా తన ఇంటినుంచి ఇతర్లు పొయ్యేటప్పుడు తన మంచితనం చూపించుకోవటానికైనా మర్యాదగా ఉంటాడే, అఖరి నిముషాల్లో వొచ్చిపడి బండిల్స్ వూడదియ్యమని గొవ చేశారు, ఎందుకు?వాళ్ళూ ప్రభుత్వోద్యోగులే,వీళ్ళూ ప్రభుత్వోద్యోగులే  - పద్ధతులు తెలియవా?ఉద్యమం వేడిలో కనీసపు మానవసహజమైన సంస్కారాలు కూడా మంట గలిసిపోయినాయా?

     నిన్నగాకమొన్న తెలంగాణ ఎంసెట్-2 విషయంలో అభాసుపాలైన ఎదవలు ఒకప్పుడు ఆంధ్రా ఎంసెట్ కూడా మేమే నిర్వహిస్తాం అని అత్యంత సమర్ధులకి మల్లే గప్పాలు కొట్టారు - దిక్కుమాలిన కాంగ్రెసుకి ముఫ్ఫయ్ సీట్ల ముష్టిలెక్క చూపించి అడ్డగోలు బిల్లుతో దొడ్డిదారిన రాష్త్రం తెచ్చుకున్న మత్తు దిగక!ఇప్పటికైనా మత్తు దిగుతుందో లేదో?ఆంధ్రద్వేషపు మత్తు దిగేవరకు మొట్టికాయలు తప్పవు - తెలంగాణ హైకోర్టును మాత్రమే కాదు తెలంగాణ సుప్రీంకోర్టును ఏర్పాటు చేసుకున్నా సరే!

     షెడ్యూల్ 8,9,10,11,12 కింద వందల కొద్దీ ప్రభుత్వ కార్యాలయాలూ పరిశ్రమలూ ఆంధ్రాకి రావలసినవి ఉన్నాయి.మా ప్రాంతంలో కట్టారు గాబట్టి అవి మావే అంటున్నారు అదేదో సినిమాలో ఒక కమెడియన్ "వాడు నీ సైకిలు బాగు చేస్తాడు,నువ్వు వాడి పెళ్ళానికి కడుపు చెయ్యి - ప్ఫ్ ప్ఫ్ ప్ఫ్" అని బూతు జోకు వేసినట్టు.ఈ లెకన తెలంగాణ NRIలు కూడా కెరీర్ ముగిసిపోయి దేశానికి తిరిగి వచ్చేటప్పుడు తమ స్వార్జితాన్ని ఆయా దేశాల్లో వదిలేసి కట్టుగుడ్డల్తో వస్తారా?యెదవ తెలివితేటలు!ఒక శాఖకి సంబంధించిన అక్కౌంటును కూడా స్తంభింపజేసి తనవైపుకి ఫిరాయించుకోవాలని సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వమే ప్రయత్నించి కోర్టు చివాట్లతో వెనకి తగ్గితే గానీ ఆంధ్రాకి న్యాయం జరగలేదు.నాగార్జున సాగర్ రెండ్య్=ఉ కాలవల్లో ఒకటి తెలంగాణకీ ఒకటి ఏపీకి నీటివాటాతో సహా దఖలు పడిపోయాక ఆంధ్రప్రదేశ్ భూభాగంలొ ఉన్న కాలవని కూడా మేమే మెయంటెయిన్ చేస్తాం అనటంలో అర్ధం ఏమిటి?నీ రాస్ట్రంలోని కాలవ సంగతి చూసుకుంటే చాలదా?పొరుగు రాష్ట్రపు కాలవ గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు కదా,అయినా ఎందుకు తెంపరించి ఆ పోలీసులూ ఈ పోలీసులూ అభాసుపాలయ్యేవరకు వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం?ఆ నీళ్ళు కూడా దోచుకోవటానికా!ఆంధ్రప్రాంతంవాళు మమ్మల్ని అరవయ్యేళ్ళపాటు దోచుకున్నారని గర్జించినవాళ్ళు ఇవ్వాళ రెండేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ వనరుల్ని దోచుకుంటే తప్ప తెలంగాణ బాగుపడదని తేల్చినట్టు కాదా ఇలాంటి లత్తుకోరు యవ్వారాలకి దిగటమంటే?

ఖడ్గాన్ని ఖడ్గమే రద్దు చేస్తుంది,ద్వేషం ద్వేషంతోనే అంతమైపోతుంది - తస్మాత్ జాగ్రత్త!!!

29 comments:

  1. ఎవడెంత నవ్వుకుంటే నాకెంటి. నేను వాళ్ళని తిడితేనే మా వాళ్ళు సంకలు కొట్టుకొనేది.. ఇట్టాంటి వాటీకోసమె బుడ్డి పట్టుకోని మరీ ఎదురు చూస్తుంటారు. మరి పని చెబితే వాళ్ళకి చెయ్యడానికి చేతవ్వొద్దూ?

    ReplyDelete
  2. ఎవడెంత నవ్వుకుంటే నాకెంటి. నేను వాళ్ళని తిడితేనే మా వాళ్ళు సంకలు కొట్టుకొనేది.. ఇట్టాంటి వాటీకోసమె బుడ్డి పట్టుకోని మరీ ఎదురు చూస్తుంటారు. మరి పని చెబితే వాళ్ళకి చెయ్యడానికి చేతవ్వొద్దూ?

    ReplyDelete
  3. మీ వ్యాసం లోపటి మేటర్ నేను చదవలేదు గానీ ఇలాంటి హెడ్డింగ్ పెట్టడానికి మీకు బాధ అనిపించట్లేదా ? తెలంగాణా వారు కూడా సాటి తెలుగువారే .. నిజానికి చెప్పాలంటే ఆంధ్రావాల్లె చంద్రబాబు మోజులో పది గడ్డి తినేవాల్లగా ఉన్నారు ..

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రాబాయ్ గారూ, మీరు వ్యాసాన్ని ఆసాంతం చదివితే ఆ ప్రశ్న వేసేవారు కాదేమో అనవచ్చు కదా హరిబాబుగారు?

      ఉద్యమం వేడి అని చెప్పుకొని ఆరోజుల్లో తె.ఉద్యమకారులూ సానుభూతిపరులూ సదరు ఉద్యమనాయకులూ ఎలాంటి మాటలు మాట్లాడారో మరిచినట్లు మాట్లాడుతున్నారే! 'మేము తెలుగువాళ్ళం‌ కాదు' అని ఒకటి రెండు టీవీ ఫోన్‌ఇన్ కార్యక్రమాల్లో కొందరు ఫోన్ చేసి వీరావేశంతో‌ రంకెలు వేసిన వేసిన సంగతి మీకు తెలియదో మర్చిపోయారో! ఆంధ్రప్రాంతం వారు చంద్రబాబుమోజులో హెచ్చుశాతం‌ఐతే ఇతరపార్టీలకు అన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదే. ఆ మాటకు వస్తే తెలంగాణాప్రాంతంలో గులాబీదళపతిమోజులో ఎడాపెడా సీట్లిచ్చి ఏమి చెప్పినా ఓహో‌ అంటున్నారే అన్నది మీకు తెలియదా?

      తెలంగాణావారు సాటి తెలుగువారే అని ఆంద్రావాళ్ళు అంటున్నా సాటి తెలుగువాళ్ళు అని తెలంగాణావారు అంటున్న దాఖలాలు లేవు -ద్వేషభావాలు సుస్పష్టంగానే వెలిబుచ్చుతున్నారు వీలైన చోటల్లా. ఎవరైనా ఎత్తి చూపితే మాత్రం దాన్ని 'విషకక్కటం' అంటూ ఒక పడికట్టు పదంవాడుతూ చిందులు త్రొక్కుతారు.


      విషయానికి వస్తే హరిబాబుగారు ప్రస్తావించిన అంశాలు ఆలోచించదగ్గవే కాని తదన్యం కావు. ఐతే జనాకర్షణకోసం టపా శీర్షికను దురుసుగా ఉంచవలసిన అవసరం లేదని మాత్రం అభిప్రాయపడుతున్నాను.

      Delete
    2. The first Telugu poet was a Kannada poet? How come?

      HYDERABAD: Who was the first Telugu poet? Most Telugus believe it was Nannaya, the 11th century poet. But efforts are afoot in Telangana to prove that the roots of Telugu poetry predate Nannaya by several centuries. The effort to find a precursor to Nannaya is a bid to secure the 'classical status' tag for Telugu.

      http://www.newindianexpress.com/states/telangana/The-first-Telugu-poet-was-a-Kannada-poet-How-come/2016/07/18/article3535742.ece

      Delete
    3. @UG sriram, last para in this article says. ROFL moment for me.
      Interestingly, not many know that Pampana was born in Vangiparru in Guntur district in Andhra Pradesh and migrated to seek royal patronage under the Vemulavada Chalukya king Arikesari in Vemulavada

      Delete
  4. హరిబాబు గారు,

    వ్యాసంలో మీరు వేసిన సహేతుకమైన ప్రశ్నలు ప్రతి అవమానపడిన వ్యక్తి గుండెల్లో ఎప్పటికీ మెదిలేవే. కానీ వ్యాస శీర్షికను మార్చవలసిందిగా పెద్దలు శ్యామలీయం గారితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. వ్యాసం తెలంగాణా వ్యక్తులను కూడా ఆలోచింపచేస్తుంది. కానీ వ్యాస శీర్షిక తెలంగాణా లోని మంచి వ్యక్తుల మనసులను ( అందులో మీ అభిమానులు కూడా వుండచ్చు ) గాయపరుస్తుంది.

      Delete
  5. "మేము తెలుగువాళ్ళం కాదు" అని టీవీలో కొంతమంది రంకెలు వేస్తే, రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణా, జమ్మూ & కాశ్మీర్ ఒకప్పుడు అసలు భారతదేశంలో భాగమే కాదు అంటూ స్టేట్‌మెంట్లిచ్చారు కదా ఓ తెలంగాణా ఎం పి గారు. 🙁
    అయినా హరిబాబు గారు, శ్యామలీయం గారు, తదితరులూ - ప్రపంచ పటం మీదనుంచి ఆంధ్ర రాష్ట్రం సమూలంగా తుడిచిపెట్టుకుపోతే ఎంత బావుంటుందీ అనేది వాళ్ళ వాంఛ అయ్యుండచ్చేమో అనే అనుమానం మీకిప్పటికీ రావడం లేదా? 🤔

    ReplyDelete
    Replies
    1. తెలంగాణ భారతదేశంలో భాగమేకాదు అని కవిత ఆ మాట అన్న వెంటనే,నమో ప్రభుత్వం సీరియస్ అయ్యింది అంతే, పక్క రోజు డిల్లి పేపర్ ఏడిషన్ లో (తెలుగు పేపర్లలో రాలేదు) మాటలను వెనక్కుతీసుకొంట్టూ వార్త వచ్చింది.

      సోనియా ను ఆడించినట్లు మోడి దగ్గర చేద్దామనుకొని ప్రయత్నించబోయారు, నమో దెబ్బకు తోక మూడిచారు.

      Delete
    2. > ప్రపంచ పటం మీదనుంచి ఆంధ్ర రాష్ట్రం సమూలంగా తుడిచిపెట్టుకుపోతే ఎంత బావుంటుందీ అనేది వాళ్ళ వాంఛ అయ్యుండచ్చేమో అనే అనుమానం ....
      ఈ అనుమానం‌ ఎన్నడో రావటమూ దాన్ని వ్యక్తీకరించటమూ చేసానండీ. ఒక తెలంగాణాబ్లాగరుమిత్రుల వారు ఐతే, తెలంగాణారాష్ట్రం సిధ్ధించటం కోసం అవసరమైతే ఆంధ్రప్రాంతంవారంతా సామూహికంగా ఆత్మహత్యచేసుకోవలసిందే అని సిధ్ధాంతీకరించారండి.

      ప్రస్తుతం ఢిల్లీదొరతనం వారైతే ఆంధ్రప్రదేశం అనేది ఒకటి భారతదేశంలో ఉందని గుర్తించటం కూడా ఇష్టం లేనట్లే మాట్లాడుతున్నారు కదా. భాజపావారికి బాగానే తెలుసును, ఎప్పటికైనా కొంచెం సీట్లు రాల్చేది తెలంగాణావారే కాని ఆంధ్రాలో స్వంతంగా ఎన్నటికీ ఖాతా తెరవలేమూ అని. అందుకే వారికి ఆంధ్రావాళ్ళకి ఏదైనా చేయటం దండగ అన్న అభిప్రాయం ఉన్నట్లుంది.

      Delete
  6. కేసీయార్ భాషలో చెప్పుకోవాలంటే... ఆంద్రోళ్ళను తిట్టేటప్పుడు వాళ్ళు అందరు ఆంద్రోళ్ళూ కాదు, కేవలం ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించేటోల్లను మాత్రమే తిడుతున్నాం (కొడుతున్నాం, చంపుతాం కూడా) అని కదా... అలాగే... ఈ శీర్షికలో హరిబాబు గారు తిడుతున్నది అందరు తెలంగానోళ్ళను కాదు... బాబ్లి కమిటీ లోనుంచి ఆంద్రను తీసేయాలని వాదిస్తున్న తెలంగాణ వాళ్ళను మాత్రమే అనుకోవాలి. (భానుప్రియ స్టైల్లో) అర్ధం చేసుకోరూ....

    ఫణీంద్ర పురాణపండ

    ReplyDelete
  7. @Syaamaleeyam and all
    ఐతే జనాకర్షణకోసం టపా శీర్షికను దురుసుగా ఉంచవలసిన అవసరం లేదని మాత్రం అభిప్రాయపడుతున్నాను.
    @haribabu
    నేను ఏ పోష్టునీ జనాకర్షణ కోసం రాయటం లేదు.టైటిల్,కంటెంట్,ఫినిషింగ్ టచ్ అన్నీ ఓక్ ప్లను ప్రకారం వేస్తాను.రీడబిలిటీ అవసరమే కానీ దానికోసం దిగజారుడు పనులు చెయ్యను!అయినా జకీర్ నాయక్ పోష్టులో గోరక్షకుల్ని "గోపుచ్చం గాళ్ళు"అనీ దేశంలో ఉన్న బ్రాహ్మణులందర్నీ "గోష్పాదం గాళ్ళు" అన్నప్పుడు ఎవరూ "ఆ ఫలానివారిలో మిమ్మల్ని అభిమానించేవారు బాధపడుతారు,కాబట్టి ఆ పదాల్ని తొలగించండి!" అని విన్నపాలు చెయ్యలేదు,ఎందుకనో!గోవులూ,బ్రాహమణులూ అంత తక్కువైపోయి తెలంగాణ ద్వేషపండితులు ఆ వర్గాలకన్నా ఎక్కువ ఎలా అయ్యారో!

    ReplyDelete
    Replies
    1. "ఆ ఫలానివారిలో మిమ్మల్ని అభిమానించేవారు బాధపడుతారు,కాబట్టి ఆ పదాల్ని తొలగించండి!" అని విన్నపాలు చెయ్యలేదు,ఎందుకనో ....

      సాధారణంగా మీబ్లాగులో ఎక్కువగా కనపడే కామెంటర్ లు కూడా జాకీర్ నాయక్ పోస్టులో కనబడలేదు, దాన్నిబట్టే చెప్పొచ్ఛు మనవాళ్ళెంత పిరికోళ్ళో, అందులోనూ మీరు ఇస్లాంని టచ్ చేశారు. మీలాగ కటువుగా చెప్పకపోయినా సాధారణ భాషలోనైనా భావంవ్యక్తం చెయ్యడానికి వెనకాడేవాళ్ళని ఏమంటాం.

      Delete
  8. "ప్రపంచ పటం మీదనుంచి ఆంధ్ర రాష్ట్రం సమూలంగా తుడిచిపెట్టుకుపోతే ఎంత బావుంటుందీ అనేది వాళ్ళ వాంఛ అయ్యుండచ్చేమో అనే అనుమానం" -

    haribabu
    అనుమానం కాదు,ఉత్త్తరాది పెత్తనం చేజారిపోకూడదన్న ఉద్దేశమే భాజపాని కూడా ఆ తప్పుల తడక బిల్లుని ఒప్పుకుని ఆంధ్రని నడిబజారులో నిలబెట్టి నాటకాలు ఆడే దుర్మార్గం చేసేలా నడిపిస్తున్నది.

    ఉత్తరాది లాబీయింగ్ అనే మాటని మొదటిసారి విన్నప్పుడు నేనూ నమ్మలేదు.కానీ నా రీసెర్చిలో కొన్ని విషయాలు తెలిశాక నమ్మక తప్పడం లేదు.ఆర్య,ద్రావిడ సిద్ధాంతాన్ని కమ్యూనిష్టు ధాపర్ ప్రచారంలోకి తేవడానికి ముందునుంచే మన శాస్త్రాలలోనే "వింధ్యకి ఎగువన ఉన్నత తరగతికి చెందిన ఆర్యులు ఉంటారు,వింధ్యకి దిగువన మిశ్రమ జాతులు ఉంటారు" అనే సూత్రీకరణలు ఉన్నాయి,గమనిచారా?ఈ జకీర్ నాయక్ పోష్టుకి సంబంధించిన విషయసేకరణలో నేను స్వయంగా చదివాను.అన్ని కులాలలో మాదిరిగానే బ్రాహమణులలో కూడా ఉత్తమ జాతి బ్రాహ్మణులూ,అధమ జాతి బ్రాహ్మణులూ ఉన్నారు!

    దేశ చరిత్రకి సంబంధించిన ఒక చిత్రమైన విషయం చూదండి.గుప్తులూ,మౌర్యులూ వింధ్యకి ఇవతలివైపుకి రానేలేదు,అధవా వచ్చినా కొద్దికాలం మాత్రమే అతి తక్కువ ప్రాంతాన్ని పరిపాలించారు.కానీ శాతవాహనులలో మొదటి వాదైన శ్రీముఖుడి నుంచి చివరి రాజు వరక్కొ సుమారు 600 సంవత్సరాలు ఈశాన్యరాష్ట్రాల్నీ కాశ్మీరునీ మినహాయించిన సెంట్రల్ ఇండియా అని చెప్పదగిన విశాలమైన భూభాగాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా పరిపాలించారు.కేవలం రాజధాని వింధ్యకి దక్షిణాన ఉండటం అనే ఒక్క కారణంతో వీరిని దక్స్జిణాదికి చెందిన స్థానిక రాజవంశం అని మాత్రమే మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటూ పెరిగాము.దేశంలో శాలివాహన శకమే ఎక్కువగా వాడటమే వీరి సుదీర్ఘమయిన మరియూ విస్తారమీన్ వైభవానికి సాక్ష్యం!

    రాజధాని వింధ్యకి అవతలివైపున ఉంటే వారు మొత్తం దేశానికి చెందినవారుగానొ,రాజధాని వింధ్యకి ఇవతలివైపున ఉంటే వారు స్థానికులు ఎలా అవుతారు?దక్షిణాది రాష్ట్రాల స్థానిక చరిత్రలకి ప్రోత్సాహం కానీ,నిధులు కానీ సరంజామాలు కానీ ఉండవు.23 జిల్లాల తెలుగు రాష్త్రంలో ఎన్నో గ్రామాలలో పాత శిలాయుగం నాటి మానవ జీవనపు ఆనవాళ్ళు ఉన్నాయి.వాటి గురించి గట్టి పరిశోధనలు జరిగి ఉంటే తెలుగుకి ప్రాచీన భాష హోదా కోసం ఇంత రంధి అవసరం అయ్యేది కాదేమో.ఇవ్వాళ తెలుగువాళ్ళు సంస్కృతాన్ని ఎందుకు గౌరవించాలి,సంస్కృత పదాల్ని తీసెయ్యాలి అనేవాళ్ళని చూసి జాలి వేస్తున్నది!సంస్కృతంలోకి వెళ్ళిన తెలుగు పదాలు చాలా ఉన్నాయి.అసలు సంస్క్రతం వల్ల తెలుగు బాగుపడిందా తెలుగుతో సాంకర్యం వల్ల సంస్కృతం పరిపుష్తం అయ్యిందా అనేది తెలుసుకోవలసిన విషయం!ఇవ్వాళ్టి సంస్కృతం పాణిని సంస్కరించినది.అంతకు ముందర ఉన్న భాషారూపంలోనే తెలుగు సంస్కృతం మధ్యన ఆదానప్రదానాలు జరిగి ఉండవచ్చును కదా!

    ప్రస్తుతానికి వస్తే జిలేబీ బ్లాగులో కొంతకాలం క్రితం 2022 తర్వాత మోదీ మధ్యంతరంగా దిగిపోయి దక్షిణాదికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతాడనే జోస్యం గురించి వచ్చింది - గుర్తుందా?మన రాజకీయ నాయకులు కూడా లాంటివాటిని నమ్ముతారని మీకు తెలియనిదా!దాని ప్రకారం అలాంటి అవకాశం జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికీ తెలిసిన చంద్రబాబుకి మాత్రమే ఉన్నది. అతను మాత్రమే ఆ క్యాటగిరీలోకి,అవునా కాదా?బహుశా తనని సంహరిస్తాడని అనుకుంటున అష్టమ గర్భాన్ని ముందు తనే చంపేస్తే తనకి చావు ఉండదన్న కంసుడి లాజిక్ కాంగ్రెస్ మరియూ భాజపా పార్టీల్లో ఉన్న ఉత్తరాది నేతలకి కామన్ మోటివ్ అయి ఈ దుర్మార్గపు వ్బహ్జన పరిష్కారంగా దొరికి ఉందవచ్చును - ఆలోచించండి!లేనిపక్షంలో ఆంధ్రకి సాయం చేస్తేఅనే గానీ ఆంధ్రలో వోట్లు పడవని తెలిసినా మొండిగా ఆంధ్రకి అషాయాని వ్యతిరేకించహడానికి సహేతుకమైన కారణం యేదీ లేదు.

    చంద్రబాబుకి రాష్ట్రం లోపలే సమస్యల్ని సృష్టించి జాతీయ రాజకీయాల వైపుకి చూదనివ్వకుండా ఉందటమే కాంగ్ర్సుకీ,భాజపాకీ,తెరాసాకీ ఇవ్వాళ ఉన్న కామన్ ఎజెండా!అందువల్లనే విభజాన్ బిల్లులో ఉన్న ఏఅ అంశాన్నీ నేర్వేర్చహకుండా జాగు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం.ప్రతయేక హోదా ఇవ్వకపోవటానికీ,ఆంధ్రాకి అవసరమయిన మినిమం రాజ్యాంగబద్ధమయిన సహాయాలు కూడా చెయ్యకపోవటానికీ ఇంతకన్నా హేతుబద్ధమయిన కారణం ఏదీ నాకు తోచహ్టం లేదు!

    2014 ఎన్నికల్లోనే భాజపా ఎక్కువ సీట్లు అడిగి అక్కడ తొట్టిగ్యాంగ్ అబ్యర్ధుల్ని నిలబెట్టింది.నేను అప్పుడు ఓక పోష్టు కూడా వేశాను.బాబు తెలివిగా అఖరు నిముషాలో ఎలర్ట్ అయి జాగ్రత్త పదకపోయి ఉంట తెదెపా పరిస్థితి మరోలా ఉందేది,అవునా కాదా?

    అడిగినవాళు ఒకందుకు అడిగారు,ఇచ్చినవాళ్ళు ఓందుకు ఇచ్చారు - ఆంధ్రావాళ్ళు అమాయకంగా బలయ్యారు:-(

    ReplyDelete
    Replies

    1. ఔరా ! జిలేబి కి జోస్యం కూడా తెలుసా :)

      టపా బాగుంది ; టైటిల్‌ అదురహో ! కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి


      జిలేబి

      Delete
  9. dharmanni kapadandi....ade manalni kapuduthundi......gelupu eppudu nyayanide....

    ReplyDelete
  10. @andhraboy
    మీ వ్యాసం లోపటి మేటర్ నేను చదవలేదు గానీ ఇలాంటి హెడ్డింగ్ పెట్టడానికి మీకు బాధ అనిపించట్లేదా ? తెలంగాణా వారు కూడా సాటి తెలుగువారే .. నిజానికి చెప్పాలంటే ఆంధ్రావాల్లె చంద్రబాబు మోజులో పది గడ్డి తినేవాల్లగా ఉన్నారు .
    @haribabu
    నా టైటిల్ వ్యాఖ్యలో ఉన్న గడ్డి తినడం లాంటి "గడ్డితినేవాళ్ళుగా " ఆంధ్రావాళ్ళు ఎపుడు ఉన్నారు?
    చంద్రబాబు గానీ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినవాళ్ళు గానీ ఏనాడూ ద్వేషభాష మాట్లాడలేదు కదా!

    నిజానికి టైటిల్ చూసి ఇబ్బందిపడిపోకుండా తెలంగాణలోని మంచివాళ్ళు ఈ ప్రశ్నని ద్వేషభాషాపండితుల్ని నిలదీస్తూ వేస్తే తప్ప ఈ రెండు రాష్ట్రాలూ ప్రశాంతంగా ఉండవు!

    తెలంగాణలోనే ఉన్నవారికి కూడా ఇక్కడ చెన్నైలో కూర్చుని నాకు తెలిసిన మాత్రం తెలంగాణ యొక్క నిజమైన దుస్థితి గురించి తెలియకపోవడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది - ఎందుకింత మందకొడితనం?

    తెలనఘాణలోని నిజమైన మేధావులకి నేను చెప్పేది ఒకటే.
    ఈ ద్వేషభాషాపండితులు ఇంత బరితెగించి ఆంధ్రాని ఇబ్బందిపెట్టడమే పనిగా అహరహమూ శ్రమిస్తున్నా ఆంధ్రావాళ్ళ వెంట్రుకముక్క కూడా పీకలేరు,పీకలేక ఫెయిలయినా మళ్ళీ మళ్ళీ వెధవపనులు చేస్తూ మాటిమాటికీ పరువు పోగొట్టుకుంటున్నారు!మీ ప్రభుత్వాధికార్లూ,మీ మంత్రులూ,మీ ముఖ్యమంత్రీ పరువు పోగొట్టుకుంటుంటే ఎవరు ఏదవాలి?ఎవరు రియాక్ట్ అవ్వాలి?మీరా?నేనా!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియూ అధికారులూ చాలా చురుగ్గా ఉన్నారు గమనించారా?"రెండో ర్యానులో ఉన్నవాడు పదమూడో ర్యాంకులో ఉన్నవాణ్ణి కాపీ కొట్టటం యేంటి?" అన్న మాడూపగిలే రిటార్టుకి ముఖం చెల్లకుండా సైలెంటయిపోయాక్ కూడా వాళ్ళకి ఎక్కడం లేదు.నేను పెట్టిన టైటిల్ ప్రశ్న మీరు వాళ్ళముందు వాడితే ఫలితం అద్భుతంగా ఉంటుంది - నాదీ గ్యారెంటీ, టెస్ట్ చేసి చూదండి1

    మహాభారతంలో చెప్పిన "ఇతరులు నీకు ఏది చేస్తే కష్తం కలుగుతుందో అది ఇతరులకు చెయ్యకుండా ఉండటం" మామూలు సమయంలో పాటించాల్సిన నీతి అయితే తమ భాషతో,పనులతో ఇతరులకి నెప్పి కలిగించేవాళ్ళకి ఇతరుల భాష వల్ల ఆ నెప్పి కలిగితే గానీ మైకం దిగదు అనే లాజిక్ ప్రకారమే ఆ టైటిల్ అట్లా పెట్టాను!

    నిజానికి ద్వేషపండితులకి రాష్త్రం సాధించుకున్నామన్న ఆననదం ఎప్పుడో ఇగిరిపోయింది.అటువైపునా ఇటువైపునా ఉన్న కొందరు ఆశిస్తున్నట్టు రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ళూ అరమరికలు లేకుండా కలిసిపోతే తెలంగాణ భౌతిక,రాజకెయ అస్తిత్వం అదృస్యమైపోతుందనే భయంతో నిద్రపట్టని స్థితిలో ఉన్నారు.అందుకే పదే పదే ఈ వెర్రిపనులు చేసి ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు - ఒక పధకం ప్రకారమే కదుల్తున్నారు!

    కానీ వాళ్లకి ఆంధ్రావాళ్ళ గురించిన ఒకనిజం తెలియదు.ఆంధ్రావాళ్ళు మర్యాదకి ప్రాణం ఇస్తారు.మర్యాదగా ఉన్నంతకాలం మనోడే లెమ్మని వూరుకుంటారు.మర్యాద తప్పితే మాత్రం డొక్కచించి డోలు కడతారు.అక్కడ మా ప్రభుత్వమూ ఇక్కడ నేనూ ఇప్పుడు చేస్తునది అదే!

    మీ రాష్త్రం మాటిమాటికీ పరువు పోగొట్టుకోకుండా ఉందటానికయినా మీరు కళ్ళు తెరిచి వాళ్ళని ఆ చెత్తపన్లు చెయ్యకుండా ఆపగలిగితే బాగుంటుంది.

    ReplyDelete
  11. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  12. @ Haribabu,

    It was all I could do not to roll my eyes and retort, “Fine, whatever, actually I don’t care if you had fun or not.”

    http://rachabanda.sakshyammagazine.com/2015/07/blog-post_22.html?showComment=1437661412240#c6245875908108869167

    ReplyDelete
  13. 8 teachers quit after being told not to sing National Anthem on I-Day

    http://timesofindia.indiatimes.com/city/allahabad/8-teachers-quit-after-no-to-National-Anthem-on-I-Day/articleshow/53582774.cms

    When the principal protested, he allegedly said that those who are objecting to my decision on National Anthem, could leave the school. Eight teachers decided to resign in protest against the decision of the manager.

    .


    .
    "I had said that in the National Anthem there is a line 'Bharat Bhagya Vidhata...' which was misconstrued. 'Bharat' cannot be our Almighty or master of fate and it is 'Allah', who has the power to change our future and no one else," he said

    ReplyDelete
  14. వడ్డించిన విస్తరి లాంటి రాజధానితో రాష్ట్రం వచ్చింది అయినా ఇంకా ద్వేషం ఎందుకో అర్ధం కాదు. దోపిడీ దోపిడీ అంటారు, అవి పడికట్టు మాటలే అనిపిస్తుంది. సామాన్య ప్రజల్లో లేని భావాల్ని నాయకులు రెచ్చగొడుతున్నారనిపిస్తుంది. (ఉమ్మడి) రాష్ట్రంలో తతిమ్మా ప్రాంతాల్ని నిర్లక్ష్యం చేసి వీళ్ళ హైదరాబాదుని అభివృద్ధి చేయడమా? అంత అభివృద్ధి చెందిన నగరాన్ని ఇప్పుడు పళ్ళెరంలో పెట్టి వీళ్ళకే అప్పగించారుగా! కోస్తా, రాయలసిమ ప్రాంతాల్లో చెప్పుకోదగిన అభివృద్ధేమీ లేదు. ఏదో కోస్తాలో కాస్త సారవంతమయిన భూములు కాబట్టి కనీసం పంటలు మాత్రం పండుతాయి. అంతకు మించి చెప్పుకోదగిన అభివృద్ధేమీ లేదు. ఇప్పుడు రాజధాని కూడా లేదు. ఉదాహరణకి చూడండి - 1970 ల్లో మా స్నేహితులం కూర్చుని మాట్లాడుకునేప్పుడు ఓ సారి - ఊళ్ళ నుంచి జనం డిగ్రీ పాస్ అయ్యో అవకో రైలెక్కి బస్సెక్కి హైదరాబాదెందుకు జేరుకుంటున్నారు - అనే ప్రశ్న వచ్చింది. అంటే ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో అన్నింటికన్నా హైదరాబాదులోనే ఎక్కువగా ఉన్నాయనీ, దానికి ముఖ్య కారణం మిగిలిన
    చోట్ల గణనీయమైన అభివృద్ధి జరగటం లేదనీ అనుకున్నాం (అందరికీ తెలిసిన సంగతేలెండి). సరే ఆనాటికి హైదరాబాదులో భారీ పరిశ్రమలు, సంస్ధలు ఏమేమున్నాయని కూర్చుని లిస్ట్ తయారు చేశాం. 1970 వ దశకం నాటికే 23 ప్రభుత్వ పరిశ్రమలు,సంస్ధలూ ఉన్నాయని తేలింది. 23 ..... 23 ....... అన్నీ ఒక్క ఊళ్ళోనే! ఆ list ఇదిగో ఇక్కడ క్రింద ఇస్తున్నాను వ్యాఖ్య నిడివి పెద్దదయినా సరే అని.

    నేను చెప్పదల్చుకున్న పాయింట్ - ఈ సంస్ధలన్నీ ఉద్యోగావకాశాలు కల్పించినవే కదా, అన్నీఒకే ఊళ్ళో విరాజిల్లే బదులు ఒక్కోటి ఒక్కో జిల్లాకి ఇచ్చినట్లయితే (ఆ జిల్లాలోని వాతావరణం, భూమి రకం అనుకూలతని బట్టి) ఆ జిల్లా కాస్త అభివృద్ధి చెందుండేది కదా, కొంచెం వికేంద్రీకరణ జరిగేది కదా. కానీ అలా చెయ్యకుండా ఆనాటి పాలకులు (ఆఁ, ఆఁ, ఆంధ్రా పాలకులే) కేంద్ర ప్రభుత్వం పెడతానన్న ప్రతి సంస్ధనీ హైదరాబాదులోనే పెట్టించారుగా. ఇంకేవిటి బాధ? ఇంక దోపిడీ ఎక్కడ జరిగింది? ఇక ప్రైవేట్ వ్యాపారాలు, పరిశ్రమల విషయానికొస్తే వారు కూడా తమ ప్రాంతాల్ని విస్మరించి హైదరాబాదులోనే స్ధాపించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించారుగా?
    ఈ లిస్ట్‌లో వాటికి దీటైన సంస్ధ ఒక్కటి కోస్తాలో గానీ రాయలసీమలో గానీ స్ధాపించారా (ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్రోజెక్ట్ మినహాయించి)? ఇకెందుకండీ బాధ, ద్వేషమున్నూ?
    -----------------------
    (list in my continuation comment..)

    ReplyDelete
    Replies
    1. (continuation of my previous comment..)
      ---------------------------------------
      1956 నుంచీ 1979 మధ్యలో హైదరాబాదులో స్ధాపించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధల లిస్ట్ (వీట్లల్లో కొన్ని మూతపడ్డాయి, కొన్ని ఖాయిలా పడ్డాయి అనేవారికి నేను చెప్పేదొక్కటే - ఈ lisT 1970 వ దశకం నాటి పరిస్ధితి అని అర్ధం చేసుకోమని. అలాగే ఈ liSt సంపూర్ణం అని కూడా నేనడం లేదు; నాకు గుర్తున్నంత వరకు మాత్రమే అని మనవి).

      (1).BHEL 1964 (2).Balloon Facility (TIFR & ISRO jointly)(National Balloon Facility) 1961 (3).CCMB 1977 (4).CIEFL 1958 (Central Institute of English and Foreign Languages)(now university EFLU) (5).DLRL 1961 (6).DMRL 1963 (7).DRDL 1962 (8).ECIL 1967 (9).HAL (Hindustan Aeronautics Ltd) 1965 (10).HCL (Hindustan Cables Ltd)1972 (11).HMT 1965 (12).IDPL 1967 (13).MIDHANI 1973 (14).NFC (Nuclear Fuel Complex) 1971 (15).NGRI 1961 (16).NIN (National Institute of Nutrition)(shifted from Kolkatta)1958 (17).National Institute of Rural Development (NIRD)1977 (earlier NICD 1964)(18).NRSA 1974 (National Remote Sensing Agency) (19).Rice Research Institute 1965 (20).Sorghum Research Institute 1958 (21).Survey of India Training Institute (IISM)1967 (22).South Central Railway Zone formed in 1966 (Secunderbad as Head Quarters) (23).University of Hyderabad 1974
      -----------------
      ఇవి కాక ఇంకా 1956 కన్నా ముందు నుంచే ఉన్న సంస్ధలు (1970 ల నాటికి) - (1).Sardar Vallabhbhai Patel National Police Academy .. Sept 1948 (2).Praga Tools Ltd 1943 (trfd to Defence Ministry in 1963) (taken over by HMT in 1986 under Industries Ministry) (3).RRL (now IICT)(by State of Hyd as CLSIR = Central Laboratories for Scientific Industrial Research and taken over by CSIR and renamed as RRL in April 1956) (renamed as IICT in April 1989) (4).Geological Survey of India (GSI) Training Institute (5).Hyderabad Allwyn Industries 1942 - కొన్ని వెంటనే స్పురిస్తున్నవి (examples only).
      ------------------
      ఇంకా, ప్రసిద్ధి చెందిన కొన్ని (మచ్చుకి) ప్రభుత్వేతర సంస్ధలు -
      (1).Institute of Public Enterprises (IPE) (formed as a society) 1964 (2).International organisations like ICRISAT (1972), ASRC (American Studies Research Centre, on OU Campus) (1964), British Library (1979) - లాంటివి కూడా ఉండినాయి ఆనాటికే.
      ------------------
      1970 వ దశకం తర్వాత ఆవిర్భవించిన వాటిలో - (1). NIPER (National Institute of Pharmaceutical Education & Research) 2007 (central govt organisation) (2).Genome Valley 1999 (public-private collaboration)- నాకు వెంటనే గుర్తొస్తున్నంత వరకూ.
      -------------------
      ఇక చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక Hitec City (IT Industry) గురించి చెప్పేదేముంది.
      --------------------

      Delete
    2. చెప్పడం మరచాను - పైన నా రెండో (continuation) కామెంట్‌లో ఇచ్చిన list లో చూపించిన సంవత్సరాలు ఆ సంస్ధ ప్రారంభించిన సంవత్సరం అని గమనించ మనవి.

      Delete
    3. విన్నకోట వారూ, వడ్డించిన విస్తరి లాంటి రాజధానితో రాష్ట్రం వచ్చింది అయినా ఇంకా ద్వేషం ఎందుకో అర్ధం కాదని ఎందుకు ఆశ్యర్యపోతున్నారూ? ఆ ద్వేషం అన్నది తమ అస్తిత్వంలో ఒకభాగం అని వారు భావిస్తున్నారని అనుకోవాలేమో? ప్రజలు అలా భావిస్తున్నారా - నాయకులు అలా భావిస్తున్నారా అన్న ప్రశ్న కూడా సమంజసం కాకపోవచ్చును. ఎందుకంటే అలా భావిస్తున్నది ఒకవేళ నాయకులు మాత్రమే అందామన్నా ఆ నాయకులను ఎన్నుకుంటూ వారికి అస్తిత్వాన్నీ అధికారాల్నీ ఇస్తున్నది ప్రజలే కదా. ప్రజల్లో అటువంటి అహేతుక ఆంద్రద్వేషంపైన తిరస్కరణ ఉన్నపక్షంలో ఛోటా-బడా అనిలేకుండా అందరూ (ప్రజావర్గాలకూ, నాయకవర్గాలకు చెందినవాళ్ళూ) అదే దంపుళ్ళపాట నిరంతరాయంగా పాడుతూ పోయే పరిస్థితి ఉండేదే కాదు.

      Delete
  15. శ్యామలీయం గారూ మీరన్నదీ పాయింటే. అయితే నాయకులే కాక ప్రజావర్గాలు కూడా అదే భావనతో ఉన్నారంటే దానికి కారణం నాయకులు పదే పదే చెబుతున్న ద్వేషపు మాటలు వినీవినీ ఆ భావనే ప్రజల మనసుల్లోకి ఇంకి పోయుండచ్చేమో అనిపిస్తుంది - మేకని అది మేక కాదు కుక్క అని పదిమంది చేత అనిపించిన కథలో లాగా. ఈ అహేతుక ద్వేషం ఎంతగా ముదిరిపోక పోతే ఈ మధ్య కోర్ట్ వారు కూడా "మరీ ఇంత ద్వేషమా" అని ఆశ్చర్యపోయారు? విభజన జరిగిన తర్వాత వెంటనే పలు విషయాల్లో అది బయటపెట్టుకోవడం మొదలయిపోయింది. విభజన తర్వాత జరగవలసిన ప్రక్రియ పూర్తయ్యేందుకు వ్యవధి కూడా ఇవ్వకుండా అసహనంగా ప్రవర్తించడం. సంస్ధల విభజన. నీటివివాదాల సంగతి సరే. పైగా రాజధాని కూడా లేని ఆంధ్రాతో పోలిస్తే తమకి మాత్రం మిగులుతో సహా సౌకర్యవంతంగా ఉండేట్లు జరిగిన విభజన తర్వాత కూడా ఆంధ్రోళ్ళకి ఏదిస్తే అది మాగ్గూడా ఇయ్యాలె అని కేంద్రానుద్దేశ్యించి మంత్రుల ప్రకటనలు ! అంతేలెండి మీరన్నట్లు అకారణ ద్వేషం అస్తిత్వంలో భాగం (second nature) అయిపోయిందనుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. దోపిడీదోపిడీ‌ అంటున్నారు కదా, దోచుకోబడ్డామని గోలచేసి వేరుపడిన వారు ధనికులుగానూ, దోంగలన్న దొంగముద్ర బలవంతగా వేసి తోసివేస్తే ఆ దోపిడీదారులనబడ్డ వాళ్ళు బీదగానూ ఉండటం ఎందుకు ఎవరికీ విడ్డూరం అనిపించదో అని ఆశ్చర్య కలుగుతుంది. ఐతే దీనికీ వారు సమాధానం చెప్పారనుకోండి, ఆ దోపిడీ లేకపోతే మరింత ధనికులుగా ఉండేవారేనట - బహుశః ఒక అత్యంతసంపన్నదేశం కన్నా ధనికులుగా కూడా. కోర్ట్ వారు కూడా "మరీ ఇంత ద్వేషమా" అని ఆశ్చర్యపోవటం తమాషాగా ఉంది - మొత్తం విభజనోద్యమమే విద్వేషాగ్ని ప్రాతిపదికపైన జరిగినప్పుడు ద్వేషం తప్ప మరి ఏముందక్కడ?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...