Tuesday, 7 December 2021

Crypto Currency అనేది New World Order కోసం లూసిఫర్ మతస్థుల ప్లానులోని భాగమా?

నిన్నటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం చెప్పిన రెండు విషయాలను అర్ధం చేస్కున్న వెంటనే ఇది సామాన్యులకు సౌకర్యాలను అమర్చడం కోసం కాదనీ అవినీతి ఆర్జనని చట్టబద్ధం చెయ్యడం కోసం రూపొందించిన వ్యవస్థ అనిపిస్తున్నది నాకు.

మొదటిది దాని పనితీరు:క్రిప్టోకరెన్సీ తొలి లావాదేవీ 2009 నాడు అమెరికాలో జరిగింది.ప్రపంచ స్థాయి కొంపలు ముంచే యవ్వారాలన్నీ అమేరికాలోనే మొదలవటం యాదృఛ్చికం కాదు,ఇలాంటి యదవ పన్లకి ల్యాబరేటరీ కింద వాడుకోవటానికే అమెరికా ఇప్పుడున్న రూపంలో ఉంది.ఆండ్రూ జాక్సన్ అనే ఉద్దండపిండం బతికున్ననంత కాలం అక్కడ అడుగుపెట్టలేని లండను బ్యాంకర్లు 1907 నుంచి మొదలుపెట్టి యేడేళ్ళలో Federal Reserve Bank  ఏర్పాటును పూర్తి చేసి ఇలాంటి యదవ పన్లకి ల్యాబరేటరీ కింద వాడేసుకుంటున్నారు.సరే, చరిత్ర తర్వాత గానీ క్రమేపీ క్రిప్టో కరెన్సీని కొనేవారి సంఖ్య పెరిగింది.అవును!క్రిప్టో కరెన్సీని వాడాలంటే ముందు కొనుక్కోవాలి.ఇక్కడే దీనిలోని అవినీతి తెలిసిపోతుంది.ఉద్యోగులకి జీతాల రూపంలోనూ వ్యాపారులకి లాభం రూపంలోనూ వచ్చిపడి చేతుల్లో ఫెళఫెళ లాడే కరెన్సీ నోట్లు మన దేశపు ఎపెక్స్ బ్యాంక్ అయిన ఇండియన్ రిజర్వ బ్యాంక్ ముద్రించినవి.వాటి వాడకం సజావుగా ఉంటేనే దేశపు ఆర్ధికం పారదర్శకమైన ఎదుగుదలను చూపిస్తుంది.నల్లధనం అంటేనే అన్ని లెక్కలూ చెప్పి పన్నుకు కట్టడం మానేసి చెలామణీ నుంచి పక్కకి తీసిన సంపద అయితే రిజర్వ బ్యాంక్ ముద్రించని క్రిప్టో కరెన్సీని కొనుక్కుని వాడటం ఆంటే ఎంత ప్రమాదకరమైన వ్యవహారమో ఆలోచించండి!

నైతిక పరమైన కోణం నుంచి చూస్తే అసలు చెయ్యకూడనిది అయినప్పటికీ ఒక్కసారే కుబేరులం అయిపోవచ్చనే దురాశతో కుర్రతనం కొద్దీ చేసినప్పటికీ దేశపు ఆర్ధికం మీద అది చూపించే ప్రభావం చాలా రెట్లు ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. రకమైన ప్రమాదం గురుంచి తెలియక పోవడం చేతనే మధ్య తరగతి వాళ్ళూ బీదరికంలో మగ్గుతున్నవాళ్ళూ నిరుద్యోగంతో బాధపడుతున్న కుర్రాళ్ళూ ఆక్ర్షితులై అతి వేగంగా పెరిగి ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేసింది.

ప్రతి క్రిప్టో కరెన్సీ ఒకడి చేత తయారై ఒక గ్రూపు కింద విడుదల అవుతుంది - ప్రస్తుతం బిట్ కాయిన్, ఎధెరియం, రిపిల్, లైట్ కాయిన్, బిట్కాయిన్ క్యాష్, బినాన్స్, సోలానా, టెధర్, కార్టానో, పోల్కాడోట్, డోజ్ కాయిన్, మూన్ కాయిన్, మొనెరో, జెడ్ క్యాష్, అవలాంచ్, టెర్రా వంటివి అన్నీ ఒకేలా పనిచేస్తాయి.ప్రతి నాణేనికీ దానికంటూ డూప్లికేట్ తయారు చెయ్యలేని కోడ్ ఉంటుంది గనక దొంగనోట్లు ముద్రించడం లాంటి యవ్వారం కుదరదు. అంత నిక్కచ్చి అయిన సెక్యూరిటీని మెయింటెయిన్ చెయ్యడం అద్భుతమే! కానీ స్థాయి సెక్యూరిటీ యొక్క అవసరం ఏమిటి?

దీని వాడకం తయారీదారులు ఇచ్చిన నెట్వర్క్ అక్కవుంట్ ఉపయోగించి లాగిన్ అయిన వెంటనే తయారీదారు తయారు చేసిన ప్రతి కాయిన్ యొక్క అన్ని ట్రాన్సాక్షన్లనీ చూడగలగటంతో మొదలవుతుంది.వాళ్ళు మీకు కూడా కొంత మూలధనం ఇస్తారు.మీకు ఇచ్చే మూలధనం ఎవరు ముద్రించినదీ కాదు,మైనింగ్ అనే ప్రక్రియతో సృష్టిస్తారు.ఇప్పుడు మీరు తయారీదారు దగ్గిర కరెన్సీని కొనుక్కున్న ఇతర వాడకందార్లతో పిజ్జాలూ బర్గర్ల వంటి వాటిని అమ్మటం కొనటం చెయ్యవచ్చును. అంటే ఒక పిజ్జా షాపు యజమానికి "టెధర్" ఎక్కవుంటు ఉండి అతని కస్టమర్లకీ "టెధర్" ఎక్కవుంటు ఉన్నప్పుడు సహజంగానే యజమాని వాళ్ల మధ్యన జరిగిన  బదలాయింపును ఆమోదిస్తాడు.

క్రిప్టోకరెన్సీకి ప్రాణమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రతి ట్రాన్సాక్షనల్ రికార్డునూ నమోదు చేసి ఇతర్లకి చూపించే పట్టికని బ్లాక్ చెయిన్ లెడ్జర్ అంటారు.ప్రతి ఒక యూజరూ తను చేసిన ట్రాక్సాక్షన్లతో సహా ఇతరుల అన్ని ట్రాన్సాక్సన్లనీ చూడగలడు, కానీ, ఎవరు ఎవరికి కాయిన్ ఇచ్చారు అనేది మూడో వ్యక్తి తెలుసుకోవడం దాదాపు అసాధ్యం!అయితే, ఒక పిజ్జా కొనుక్కోవడానికి ఇంత పెద్ద వ్యవస్థ అవసరమా?అనవసరం, అందుకే ఇది అక్రమార్జన పరులు తమ నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్న అనైతికమైన ద్రవ్య విధానం అనేది.భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదట నిషేధిస్తూ చట్టం చెయ్యలని అనుకుని లాబీయిస్టుల ఒత్తిడి వల్ల నిషేధించడం గాక నియంత్రించడం గురించి ఆలోచిస్తున్నారన్న నేపధ్యంలో రెండవ అంశం గురించి చూడాలి.

రెండవది దాని ఆవిష్కర్త: 2009 నాడు Satoshi Nakamoto పేరుతో ఒక కధనాన్ని శ్వేతపత్రం తరహాలో వదలితే దాన్ని వాడేసుకోవటమూ అతని కధనానికి చట్టబద్ధతని కల్పించేసి గుడ్డెద్దు చేలో పడినట్టు కొనసాగడమే తప్ప ఆవిష్కర్త ఎవరు అనేది ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు - ఆవిష్కర్త గురించి ఎందుకు అంత రహస్యం, గోప్యత, నిగూఢత?మిలిటరీ ఉపయోగించే స్థాయి క్రిప్టోగ్రఫీని,షేర్ మార్కెట్ ఉపయోగించుతున్న స్పెక్యులేషన్ వల్ల డిమాండును బట్టి విలువ మారే తరహా సాంకేతికతనీ రంగరించి ప్రభుత్వాలు చెయ్యాల్సిన కరెన్సీ విడుదలని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించి ఒక పోటీ ఆర్ధిక వ్యవస్థని నిర్మించిన వ్యక్తి పనిని రహస్యంగా ఉండి చెయ్యటం దేనికి?

డిమాండును పెంచడానికి అవసరమైన కొరతను సృష్టించడానికి "రెండు కోట్ల పది లక్షల" బిట్ కాయిన్లని మాత్రమే సృష్టించగలిగేటట్లు సాఫ్ట్వేర్ లిమిటేషన్ పెట్టడం వెనక అతని ఉద్దేశం ఏంటి?ఇప్పుడు లాభం కనిపిస్తున్నందువల్ల పూర్వాపరాలు ఆలోచించని మూఢత్వం ఎక్కువైన దాని వాడకందార్లకి భవిష్యత్తులో వ్యవస్థ నిర్మితి వల్లనే అనుకోని సమస్యలు వస్తే పరిష్కరించే జవాబుదారీ తనం ఎక్కడ ఎవరి దగ్గిర ఉంది?

ఒక కారును తయారు చేసిన వ్యక్తి కారుని మార్కెట్టుకు పంపించేసి చేతులు ముడుచుకుని కూర్చోడు.మొదటి సారి కారును అమ్ముతున్నప్పుడు అతను తయారు చేసింది అంతకు ముందు వాడకంలో లేని కొత్త వస్తువు గనక కారుని ఎలా ఉపయోగించుకోవాలో అతనే నేర్పాలి.ఇగ్నిషన్ కీని తిప్పటం, స్టీరింగ్ వీలుని హ్యాండిల్ చెయ్యటం,బ్రేకుల్ని వెయ్యటం లాంటివి నేర్పనిదే కారు కొన్నవాడు దాన్ని ఎలా నడుపుతాడు?ఇప్పుడు అనేక రకాల కార్లు వచ్చాయి కాబట్టి డ్రైవింగ్ స్కూళ్ళు నడిపేవాళ్ళకి సమాచారం ఇస్రున్నారు తయారీదార్లు.పాడైపోతే బాగు చెయ్యటానికి మెకానిక్కులు ఉన్నారు.అంటే మనం వాడుతున్న ప్రతి వస్తువుకీ దానికి సంబంధించిన సమాచారం అందించే బాధ్యత ఉన్న వ్యవస్థని కూడా తయారీదారులే సృష్టించి ఇస్తున్నారు.అలాంటప్పుడు క్రిప్టో కరెన్సీకి తయారీదారుడు ఎందుకు బాద్యత తీసుకోవడం లేదు?

అతని పేరుని బట్టి అతను జపానీయుడు అని అనుకుంటే అది చాలా అమాయకత్వంతో కూడిన పొరపాటు.2011 ఏప్రిల్ నెలలో ఆఖరి సంభాషణ నమోదైన తర్వాత తన గురించి ఎంత ఆసక్తి కనిపిస్తున్నప్పటికీ బయటపడని నిగూఢత క్షమించరాని నేరం కాదూ!ఆసక్తి గల పరిశోధకులు మాత్రం అతన్ని బైటికి లాక్కు రావాలని పట్టువదలని విక్రమార్కుల వలె శ్రమిస్తూనే ఉన్నారు - మార్చి 2014 నాడు Newsweek అనే పత్రికలో కధనాన్ని వ్రాసి Dorian Nakamoto కావచ్చునని అన్నారు గానీ అతను స్వయాన నేను కాదు పొమ్మన్నాడు,డిసెంబర్ 2015 నాడు Wired Magazine అనే పత్రికలో కధనాన్ని వ్రాసి Craig Wright కావచ్చునని అన్నారు గానీ అతను స్వయాన నేను కాదు పొమ్మన్నాడు,Dominic Frisby అనే రచయిత “Bitcoin: The Future of Money?” అనే పరిశోధనాత్మకమైన గ్రంధంలో Nick Szabo కావచ్చునని అన్నాడు గానీ అతను స్వయాన నేను కాదు పొమ్మన్నాడు.అతను గ్రంధంలో చూపించిన ఆధారాలు మాత్రం బలమైనవే గానీ అసలు వ్యక్తి ఒప్పుకోనప్పుడు ప్రయోజనం ఏమిటి?

Stefan Thomas అనే ఒక ప్రోగ్రామర్ 500 పైన ఉన్న Satoshi Nakamoto పోష్టుల టైం స్టాంపుల్ని పట్టి చూస్తూ వాటిని పరిశీలించి చూస్తే అవి Greenwich Mean Time ప్రకారం 5 a.m. and 11 a.m. అయ్యి Japan Standard Time ప్రకారం 2 p.m. and 8 p.m అయ్యి జపనీయుల నిద్రాసమయాలకు భిన్నమై విచిత్రమైన స్లీపింగ్ ప్యాటర్న్ కనిపిస్తుందని చెప్తూ అతను జపనీయుడు కాకపోవచ్చునని అనుమానిస్తున్నాడు.

అతనితో సంభాషించిన Laszlo Hanyecz అనే ప్రోగ్రామరు ఒకే వ్యక్తి అంత సమగ్రమైన వ్యవస్థను నిర్మించడం అనేది నమ్మలేకపోతున్నానని అన్నాడు.Gavin Andresen  ఆనె మరొక ప్రోగ్రామర్ సోర్స్ కోడ్ చూసి “He was a brilliant coder, but it was quirky!” అనేశాడు.Source code comments,forum postings అన్నింటిలోనూ  British English వాడకమూ తన మొదటి బిట్ కాయిన్ మైనింగు చేస్తున్నప్పుడు London's Times newspaper ప్రస్వావన కనిపించటమూ చూస్తే అతను లండను బ్యాంకర్ల మనిషై ఉంటాడనే అనుమానం బలపడుతున్నది నాకు.

నిజానికి ఇప్పుడు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో బలోపేతం అయిన క్రిప్టో కరెన్సీకి అంటగడుతున్న మంచి లక్షణాలు ఒకప్పుడు వాడకంలో ఉండి కనుమరుగైన లోహపు నాణేల వ్యవస్థకు సహజమైన లక్షణాలే - సృష్ట్యాది నుంచీ భారతీయులు కనుక్కుని వాడుతున్న నాణేల వ్యవస్థని 17వ శ్సతాబ్దం నుంచీ ప్రపంచాధిపత్యం కోసం కలలు గంటున్న ఇల్యూమినాటీ బ్యాంక్స్టర్లు(banksters) 1835ల నాడు లోహపు నాణేల వల్ల సమస్యలు వస్తున్నాయని వూదర గొదుతూ చేసిన చట్టాలతో రద్దు చేసి పేపర్ కరెన్సీని చలామణిలోకి తెచ్చాకనే ఆర్ధిక వ్యవస్థలు అస్థిరం కావడం మొదలయ్యింది!

ఇవ్వాళ్టి క్రిప్టో కరెన్సీకి చూపిస్తున్న మొదటి అనుకూలత నకిలీ నాణేలను సృష్టించలేకపోవటం అన్నది ఆనాటి లోహపు నాణేలను అనుకరించడమే కదా!పేపర్ కరెన్సీ ఆలోచన లండను బ్యాంకర్లకి ఎలా వచ్చిందో చూస్తే పేపర్ కరెన్సీ వాడకంలోని నీచత్వం ఏమిటో తెలుస్తుంది.హిందూమతాన్ని మూఢనమ్మకాల పుట్ట అని విమర్శించే క్రైస్తవులకి వాళ్ల మతం గురించి ఓ అంటే ఢం తెలియదు.వాళ్లకీ అనేకమంది దేవుళ్ళు ఉన్నారు,దెయ్యాలూ ఉన్నాయి,ఆ దెయ్యాల్ని వదలగొట్టే మంత్రగాళ్ళూ ఉన్నారు,అనేక ప్రాంతాలు పుణ్యక్షేత్రాల కింద చెలామణి అవుతూ భక్తుల నుంచి డబ్బులు పిండుతూ ఉన్నాయి.వీటిలో జెరూసలేం యాత్ర చాలా ఖర్చుతో కూడుకున్నది.అంత డబ్బుని మోసుకు పోవడమూ చూపు శివుడి మీద చిత్తం చెప్పుల మీదా అన్నట్టు ఆ డబ్బు సంచుల కాపలా పెద్ద సమస్య అయ్యింది.దానికి పరిష్కారం ఈ లండను బ్యాంకర్లు చూపించారు.యాత్రికులు తమ స్వస్థలంలో ఉన వీళ్ళ బ్యాంకుల్లో డబ్బూ, లగేజీ అప్పగించి ఒక రశీదు తీసుకుంటే దారి పొడుగునా ఉన్న వాళ్ళ బ్రాంచీల దగ్గిర తిరిగి తీసుకునే ఏర్పాటు చేశారు.

పోను పోనూ బద్ధకం వల్ల కావచ్చు అవసరం లేక కావచ్చు కొందరు యాత్ర పూర్తయిపోయినతర్వత కూడా రశీదులు చూపించి తమ డబ్బునీ వస్తువుల్నీ వెనక్కి తీసుకెళ్ళకపోవటం బ్యాంకర్లకి తలనెప్పి అయ్యింది.ఇక అసలు వ్యక్తి డబ్బు కోసమూ వస్తువుల కోసమూ రావటం జరగదని రూఢి అయ్యాక బ్యాంకర్లు తమ మదుపుల కోసం వాడుకునేవాళ్ళు.అటువైపున కస్టమర్లు సైతం ఇతర్లకి డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తమ వద్ద ఉన్న రశీదుల్ని ఇచ్చి బ్యాంకుల నుంచి తీసుకోమనేవాళ్ళు.అనుకోకుండా మొదలై అప్పుడప్పుడు జరిగిన కొన్ని వినిమయాల తర్వాత ఈ రెంటినీ కలిపి చూస్తే లండను బ్యాంకర్లకి అసలు తమ అధీనంలో ఒక్క రూపాయి కూడా లేకుండా కోట్లు మిలియన్లు,ట్రిలియన్ల రేంజిలో గాలిలోనుంచి డబ్బును సృష్టించి కస్టమర్లకి అప్పులు ఇచ్చి వడ్డీతో కలిపి కష్టమర్ల కష్టార్జితం నుంచి వసూలు చేసుకునే కొత్త దారి కనిపించింది.

ఇందులో ఉన్న అత్యంత నీచమైన విషయం ఏమిటో తెలియాలంటే మన దేశపు రిజర్వ బ్యాంక్ యొక్క పనితీరును అర్ధం చేసుకోవాలి.డబ్బుని తయారు చెయ్యటానికి కూడా చాలా డబ్బు ఖర్చవుతుందండోయ్!కాగితం,సిరా, సాంకేతికత, ముద్రణ సౌకర్యం - ముఖ్యంగా నకిలీ నోట్లని తయారు చేసే వీలు లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలతో సహా ప్రతి సంవత్సరం కొత్త కరెన్సీని ప్రజలకి అందుబాటులోకి తేవటానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ రేంజిలోనే ఉంటుంది - 2016లో అక్షరాలా 3,421 కోట్లు, అంటే 502 మిలియన్ డాలర్లు!ఆ యేడాది స్థూల జాతీయోత్పత్తి 84 లక్షల కోట్లలో ఇది 0.04% మాత్రమే కావచ్చు, కానీ అంత తక్కువ శాతం పొదుపైన విషయమే అయినప్పటికీ నిర్వహణ చాలా చాలా కష్టం. మనకన్న అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ కరెన్సీ తయారీని out-source చేసేసుకుని హ్యాపీగా ఉంటున్నాయి.ఎక్కువ స్థాయిలో కరెన్సీ నోట్లని ఉపయోగించేవీ సొంతంగా తయారు చేసుకునేవీ అయిన దేశాల్లో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది మన దేశం.ఫెళఫెళలాడే కొత్త నోట్లని మురిపెంగా చూసుకుని పదే పదే తడుముకుని మురిసిపోయే మనస్తత్వం వల్లనే డెబిట్ కార్డు వాడకం పెరగటంలేదు, అన్ని విషయాల్లోనూ అమెరికన్లని ఇమిటేట్ చెయ్యటమే ఆధునికత అనుకునేవాళ్ళు కూడా ఈ విషయంలో మాత్రం కార్డు కన్న కరెన్సీనే ముద్దు చేస్తున్నారు!!

అన్ని వారసత్వాల లాగే నోట్లని తయారు చేసుకునే వారసత్వం కూడా తెల్లదొరల నుంచి సంక్రమించినదే. నిన్నమొన్నటివరకు అన్ని ముడిసరుల్నీ దిగుమతి చేసుకుని వాటితో నోట్లని తయారు చేసుకునేవాళ్ళం - ముఖ్యమైన watermarked paper జర్మనీకి చెందిన Giesecke & Devrient నుంచీ బ్రిటనుకి చెందిన De La Rue వంటి కంపెనీల నుంచీ కొనుక్కునేవాళ్ళ్ళం - మొత్తం ఖర్చులో 95% దీనికే సరిపోతుంది.భారత దేశం ప్రతి సంవత్సరం 22,000 మెట్రిక్ టన్నుల కాగితాన్ని ఉపయోగించుకుంటున్నది.2016 జూన్ ఆఖరుకి Reserve Bank of India (RBI) తయారు చేసి వదిలిన నోట్ల సంఖ్య 21.2 బిలియన్లు.వాటికి అయిన ఖర్చే పైన మనం చూసిన 4,321 కోట్ల రూపాయలు.ఈ ఖర్చును తగ్గించి పేపర్ కరెన్సీ వాడకం వల్ల ఎదురయ్యే సవాళ్ల నుంచి ఆర్ధిక వ్యవస్థని రక్షించటానికే మోదీగారు De-Monitization అస్త్రాన్ని ప్రయోగించారు.ఏమైతేనేం, 2015 నుంచి out-sourcing ఆగిపోయింది.ప్రస్తుతం అన్ని 500, 2000 నోట్లూ మైసూరులోనే తయారవుతున్నట్టు తెలుస్తున్నది - రిజర్వ్ బ్యాంక్ పూర్తి వివరాల్ని చెప్పటం లేదు. మన నోట్లని మనమే ముద్రించుకోవటం మొదలుపెట్టిన 90 యేళ్ళకి పూర్తి స్వదేశీ నోట్లని వాడుకోగలుగుతున్నాం - నిజంగా గొప్ప విషయమే!

డబ్బు ప్రజల మధ్య ఎలా వ్యాపిస్తుంది అనేది కేవలం పరిచయం మాత్రమే గనక పైపైన తడిమి వదిలేశాను.ఇప్పటినుంచి విషయం క్రమేణ సంక్లిష్టం అవుతుంది.ఈజీగా తేల్చెయ్యాలంటే రిజర్వ్ బ్యాంక్ ఎలా పని చేస్తుందో చెప్పేస్తే చాలు.కానీ, ఇది ఇలాగే ఎందుకు జరగాలి అనే సందేహం తీరాలంటే కొంచెం చరిత్రలోకి తొంగి చూడాలి."దేశభక్తి" ఇవ్వాళ ఆకర్షణీయమైన పదం. కాని, ఒకప్పుడు "దేశం" అనే పదానికి ప్రాంతం ఆని తప్ప్ప మరొక ప్రత్యేకత లేదు.అప్పుడు "రాజభక్తి" ఆకర్షణీయమైన పదం - ఈ రెంటికీ తేడా ఏమిటి?దేశం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి, దేశానికీ రాజ్యానికీ మధ్యన తేడాలూ పోలికలూ ఏమిటి అని సవాలక్ష సందేహాలతో సతమతం అయిపోకుండా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రాజ్యానికి కావలసిన డబ్బుని రాజ్యం చెప్పుచేతల్లో నడిచే ఖజానా ముద్రిస్తుంది, దేశానికి కావాల్సిన డబ్బుని ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండని ఒక సెంట్రల్ బ్యాంక్ ముద్రిస్తుంది.ప్రపంచ చరిత్రలోని అనేక ప్రాచీన కాలపు రాజ్యాలు విచ్చిన్నమై ఆధునిక కాలపు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతనే వాటిని దేశాలు అని వ్యవహరించటం గమనిస్తే ఇది ఎంత ఖచ్చితమైన నిర్వచనమో అర్ధం అవుతుంది.

మన దేశపు ఆర్ధిక వ్యవస్థకు అతి కీలకమైన Reserve Bank of India(RBI) ఒక సర్వస్వతంత్రమైన సంస్థ - 1. Issue of Bank Notes, 2. Banker to Government, 3. Custodian of Cash Reserves of Commercial Banks, 4. Custodian of Country’s Foreign Currency Reserves, 5. Lender of Last Resort, 6. Central Clearance and Accounts Settlement, 7. Controller of Credit అనే అతి ముఖ్యమైన విధుల్ని నెరవేరుస్తున్నది కాబట్టి ఆర్ధికశాస్త్రంలో పట్టు లేని వ్యక్తులు దాన్ని ఉపయోగించుకుని సత్ఫలితాలు పొందాలే తప్ప దర్పాన్ని ప్రదర్శించితే శృంగభంగం తప్పదు - అటువైపున ఉన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నరు కూడా అహంకారి అయితే తన మీద ప్రభుత్వం చేస్తున్న పెత్తనానికి కినిసి తప్పుడు సలహాలు ఇస్తే ప్రధాని పరువూ పోతుంది ప్రజలూ కల్లోలానికి గురవుతారు!

రిజర్వ్ బ్యాంకు నోట్లని ముద్రించటానికి ఉన్న సాంకేతికపరమైన మార్గదర్శకాలు చాలా తక్కువ.ఇందుకోసం 1956లో Minimum Reserve System అనే ఏర్పాటు చేసుకుంది.దీని ప్రకారం రిజర్వ్ బ్యాంకు సర్వకాల సర్వావస్థల్లోనూ తన అధీనంలో 200 కోట్ల రూపాయలను బంగారం నిల్వల రూపంలోనూ విదేశీమారకద్రవ్యం రూపంలోనూ ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది.నోట్ల తయారీలో గానీ ఇతర విధుల విషయంలో గానీ ఇది ఎలాంటి ప్రభావాన్నీ చూపించకపోయినా ఒక కంపెనీ ప్రభుత్వానికి చూపించాల్సిన మూలధనంలా ఉంటుంది.ఇక ప్రతి సంవత్సరం కొత్త నోట్లని ముద్రించడానికి స్థూల జాతీయోత్పత్తిని కాక growth rate అనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.కరెన్సీ అనేది చేతులు మారేది అమ్మకం, కొనుగొళ్ళు అనేవి జరిగే చోటనే కదా - మరి ఇన్ని కొత్త ట్రాన్సాక్షన్లు జరుగుతాయని రిజర్వ్ బ్యాంకు ఎలా వూహిస్తుంది?

వూహలతోనూ స్వప్నాలతోనూ ఆర్ధికాన్ని నడిపిస్తే హార్దికం ఫెడేల్ మంటుంది - గ్రోత్ రేట్ 9% ఉంటే 9 x 2 + 4 = 22% అని లెక్క ఉంది.అంటే రాబోయే సంవత్సరంలో సాధించగలమని అంచనా కట్టిన గ్రోత్ రేటుకి రెండింతల స్థాయిలో కరెన్సీ కావాలి,ఇక 4 శాతం అనేది నిరంతరం ఎదుగుతున ఆర్ధిక వ్యవస్థలో ఉండే మినిమం ఇన్‌ఫ్లేషన్ యొక్క శాతం.ఈ 4% ద్రవ్యోల్బణం వాంఛనీయమే!

మనం ఒక ఉద్యోగం చేస్తే వచ్చే నెల జీతం,మనం ఒక వస్తువును అమ్మితే వచ్చే లాభం, మనం వేరేవాళ్ళకి అప్పు ఇస్తే వచ్చే వడ్డీ అనే రకరకాల మార్గాలలో వచ్చే డబ్బు రిజర్వ్ బ్యాంక్ ముద్రించి ఇచ్చినదే అయి వుండాలి - దీన్నే వైట్ మనీ అంటారు.అలా కాక మనం ఒక వస్తువుని లక్ష రూపాయలకి అమ్మి క్రయపత్రంలో పదివేలకే అమ్మినట్టు రాస్తే ఆ మిగిలిన తొంభై వేలూ బ్లాక్ మనీ అవుతుంది. దీనితో గనక బహిరంగ మార్కెట్టు దగ్గిర క్రయవిక్రయాల్ని చేస్తే ఠపీమని రిజర్వ్ బ్యాంకు పట్టేసుకోగలుగుతుంది!మరి, నల్ల కుబేరులు బహిరంగ మార్కెట్టు దగ్గిర దేన్నీ కొనడానికి పనికిరాని పద్ధతిని ఏ లాభమూ లేకుండా ఎందుకు అనుసరిస్తున్నారు?

నల్ల ధనంలో ఎక్కువ శాతం దేశంలో అరాచకం సృష్టించే అరాచక మూకలకు ఆయుధాలను కొనుగోలు చేయడానికి పోతుంది,మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం ద్వారా తన నలుపుని తొలగించుకుని కొంత శాతం తెలుపు అయిపోతుంది.దీనికి కేవలం క్రైస్తవ మత సంస్థలే కాదు హిందూ మత సంస్థలు కూడా సహాయం చేస్తున్నాయి. తర్వాత స్థానం తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వంలో ఉన్నవారికి ముడుపుల కింద పోతుంది - జగన్ కావచ్చు, కేసీయార్ కావచ్చు,చంద్రబాబు కావచ్చు,మోదీ కావచ్చు, అద్వానీ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు - నల్లధనాన్ని సృష్టించేవాళ్ళు గానీ వ్యాపింపజేసేవాళ్ళు గానీ అందుకునేవాళ్ళు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు నిజమైన అభివృద్ధిని చూపించటానికి తమ శక్తియుక్తుల్ని ఉపయోగించరు!

మన దేశంలోని పొలిటికల్ అనలిస్టులు చాలామందికి ఎలెక్షన్ కమిషనులకీ కోర్టులకీ నూటికి నూరు శాతం అటానమీ ఇచ్చేస్తే పొలిటికల్ కరప్షన్ని మటుమాయం చెయ్యొచ్చుననే  మూఢవిశ్వాసాలు ఉన్నాయి.రాజ్యాంగం ఆయా రంగాలని సృష్టించినది ప్రభుత్వాధినేతల ఉపయోగార్ధం అయితే ఆ రంగాలకి సర్వస్వతంత్రత ఇవ్వడం సాధ్యం కాదనే కామన్ సెన్సు కూడా ఉండటం లేదు ఆయా వ్యవస్థలకి ఫుల్ అటానమీ కోరుకునేవారికి.జాతీయ స్థాయి చీఫ్ ఎలెక్షన్ కమిషనుకి ఫుల్ అటానమీ ఇవ్వాలంటే ఇప్పటిలా ప్రధానమంత్రి లేక కేంద్ర ప్రభుత్వం నామినేట్ చెయ్యటంలా గాక మరెలా చెయ్యాలి?దానికి కూఒడా ఎన్నికలు నిర్వహించాలా?అప్పుడు ఆ ఎన్నికలోనూ ఈ రొచ్చు కనపడదని గ్యారెంటీ గానీ వ్యారెంటీ గానీ ఉందా!అయితే, వీళ్ళెవరికీ తెలియని వింత యేమిటంటే రిజర్వబ్యాంకుకి ఆ ఫుల్ అటానమీ ఉంది.కేవలం చైర్మన్ని నియమించటం, ఆయన జీతభత్యాలనూ ఆయన కింద పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలనూ ఖజానా నుంచి చెల్లించటం  మినహా ప్రధానమంత్రి గానీ రాష్ట్రపతి గానీ పనితీరులో జోక్యం చేసుకోలేని స్థాయిలో సర్వస్వతంత్రతని రిజర్వ బ్యాంకుకి దఖలు పర్చింది రాజ్యాంగం.

అసలైన దుర్మార్గం ఏమిటంటే రిజర్వ బ్యాంకు యొక్క ఏడు విధులూ రిజర్వ బ్యాంకు భారత ప్రభుత్వం మీద పెత్తనం చెయ్యడానికే తప్ప భారత్ ప్రభుత్వం రిజర్వ బ్యాంకు మీద పెత్తనం చెయ్యడానికి వీల్లేని సుకుమారమైన అమాయకపు సాంకేతికత చాటున దాక్కుని దేశానికి కావాల్సిన డబ్బుని శాసించే అధికారాన్ని ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండని ఒక సెంట్రల్ బ్యాంక్ చేతిలో పెట్టాయి. దీనివల్ల ఎవరికీ అనుమానం రాని రీతిలో జరుగుతున్న దొంగ నాటకం ఏమిటంటే, ఒక రూపాయి నోటు జీతం రూపంలో గానీ లాభం రూపంలో గానీ వడ్డీ  రూపంలో గానీ నీ చేతికి వస్తున్నదంటేనే అది రిజర్వ్ బ్యాంక్ నీకు అప్పుగా ఇచ్చినట్టు,నువ్వేదయినా వస్తువుని ఎవరి దగ్గిరయినా కొంటే తిరిగి రిజర్వ్ బ్యాంకుకి తీసుకున్న అప్పుని చెల్లించేసినట్టు.నమ్మకం లేదా?

రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు వెనక్ ఉన్నది దోపిడీని చట్టబద్ధం చెయ్యడం అనే విషయంలో అనుమానం ఉంటే మీరు ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించేటప్పుడు జరిగే తంతుని గమనించండి.Loans rely on the honesty of the borrower but not the honesty of the lender అనేది ఎంతమందికి తెలుసు?మనం అప్పు కోసం మనకు తెలిసిన వడ్డీవ్యాపారి దగ్గిరకి వెళ్ళినప్పుడు అతని దగ్గిర ఉన్న డబ్బుని తీసుకునేది మనం కాబట్టి అతను తన కష్తార్జితాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం అతని డబ్బుని వడ్డీతో సహా తిరిగి చెల్లించగలమని గ్యారెంటీ ఇవ్వడం సబబే అనిపిస్తుంది.ఒకటో రెండో సార్లు మనం ఋణగ్రహీతలుగా ఉన్నప్పటికీ ఒకవేళ మనం భవిష్యత్తులో ఋణదాతగా మారితే మనమూ అతనిలానే మన డబ్బును వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవడం కోసం గ్యారెంటీలు అడుగుతాం కదా అనిపిస్తుంది.

వ్యక్తిగా అతను మంచివాడో చెడ్డవాడో అనవసరం,అతను మనకిచ్చే డబ్బు ఎక్కణ్ణించన్నా కొట్టుకొచ్చినా మనకు తెలిసే అవకాశం లేదు - అతని చేతినుంచి విచ్చు రూపాయలు మన చేతికి వస్తున్నాయి కాబట్టి అతని కష్టార్జితాన్ని గురించి మనం ఎదవ డౌట్లు వేస్తే ఏమవుతుంది, అతను అప్పు ఇవ్వడు.మరి, ఆ అప్పు చెయ్యక తప్పనిసరి పరిస్థితిలో ఉన్న మన గతి యేంటి? ప్రపంచం మొత్తం మీద వ్యక్తులుగా చేసే వడ్డీ వ్యాపారమూ సంస్థలుగా చేసే బ్యాంకింగ్ వ్యాపారమూ నష్టం లేని లాభాన్ని పిండుకోగలుగుతున్నది ఋణగ్రహీతల యొక్క అనేకానేకమైన దురాశావ్యామోహాలనుంచి పుట్టిన బలహీనతల వల్లనే!కొట్టుకొచ్చినదే కావచ్చు, తన అధీనంలో ఉన్న డబ్బునే అప్పుగా ఇస్తే అది నూటికి నూరు శాతం న్యాయమే అనుకోవచ్చు!

కానీ తన అధీనంలో లేని డబ్బుని అది తన అధీనంలో ఉన్నదేనని బొంకి తనే మనకి ఇచ్చినట్టు ఒప్పందపత్రం రాసుకుని 100 మనకిచ్చి తను మన దగ్గిర్నుంచి 150 తీసుకున్నాడని తెలిస్తే ఒప్పందపత్రం మీద సంతకం చేసిన మన విశ్వసనీయత దెబ్బ తింటుంది కాబట్టి ఇచ్చేస్తాం గానీ అతను మనకి 0 రూపాయలు ఇచ్చి మననుంచి 150 రూపాయలు తీసుకోవడం మోసమని తెలిసి మనసు ఉసూరుమంటుంది, అవునా?కానీ మీరు ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి అప్పు తీసుకునేటప్పుడు మీకు అప్పురూపంలో ఇస్తున్న నోట్ల కట్టలు అతని అధీనంలో ఉన్న న్యాయమైన ఆర్జన నుంచి ఇస్తున్నవి కాదు.బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఒక బ్యాంకు తన అప్పటి నికర ఆస్తుల విలువను మించిన అప్పును ఇవ్వవచ్చును.అయితే ఈ బ్యాంకింగ్ చట్టాలు ప్రజల పట్ల నిబద్ధత గల నాయకులు చట్టసభలలో చర్చించి రూపొందించినవి కాదు.యదవ పన్లకి ల్యాబరేటరీ కింద వాడేసుకుంటున్న అమేరికాలో బ్యాంకర్లు వాళ్ల కోసం తయారు చేసుకున్న చట్టాల్ని చట్టసభలో ఉన్న వాళ్ళ పెంపుడు కుక్కల చేత ఆమోదింపజేసుకున్నారు.

మరొకసారి టూకీగా చెప్తాను.మీరు ఒక బ్యాంకునుంచి 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు.మీకు ఆ వెయ్యి రూపాయల నోట్లకట్టల్ని రిజర్వ్ బ్యాంకునుంచి తీసుకుని మీకు ఇస్తున్నట్టు తన ఖాతా పుస్తకంలో ఎక్కించేటప్పుడు అతని మొత్తం ఆస్తుల విలువ వంద రూపాయలే ఉంటుంది - అనుకోండి!మీవైపునుంచి మీరు తను ఇచ్చిన 1000 రూపాయలకీ వడ్డీతో కలిపి ఇవ్వగలరనే గ్యారెంటీ ఇచ్చే పత్రాలు ఇస్తారు, దురదృష్టం వల్ల గానీ మరే ప్రతికూలత వల్ల గానీ అలా తిరిగి ఇవ్వలేకపోతే మహారాజశ్రీ కోర్టు వారు కలగజేసుకుని మిమ్మల్ని ఖైదు చేసీ మీ ఆస్తుల్ని జప్తు చేసీ అతనికి 1000 రూపాయలకు తగ్గకుండా జమ చేయించే నిబంధనలకు మీరు చచ్చినట్టు ఒప్పుకుంటారు.సరే, అలాంటి దురదృష్టాలు ఏవీ ఎదురు కాలేదు, సంవత్సరం తర్వాత 1500 అయిన మొత్తాన్ని అతనికి ఇచ్చేశారు - అనుకోండి!అతని దగ్గిర 100 రూపాయలు ఉన్నప్పుడు మీకు 1000 రూపాయలు ఇచ్చాడు,అందులో 1000-100=900 ఎక్కడి నుంచి వచ్చాయి?ఇదివరకు అయితే తెలియదు అనిపించేది, కానీ అది శూన్యం నుంచి సృష్టించిన మాయ డబ్బు ఆనెది ఇప్పుడు తెలుస్తుంది,కదూ!ఇప్పుడు మీరు ఇచ్చిన 1500 నుంచి 100 తీసి పక్కన పెడితే 1400 ఎక్కడినుంచి వచ్చాయి?సంవత్సరం క్రీతం అయినా ఇప్పుడయినా అది మీకు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే వస్తుంది, అవునా?అంటే, ఇప్పుడు మీరు భవిష్యత్తులో 1500 సంపాదించగలను అనే ధీమాతో 1000 రూపాయలు తీసుకున్న సంవత్సరం తర్వాత అతనికి మీరు తిరిగి ఇచ్చిన 1500 రూపాయల నుంచే అతను సంవత్సరం క్రితం మీకు ఇచ్చిన 1000 రూపాయలూ ఉన్నాయి - అతను మీకిచ్చిన వెయ్యి రూపాయలకి అదనం కలిపి అతనికి ఇచ్చిన 1500 మొత్తంలో 100 రూపాయలు మాతమే బ్యాంకు యజమాని కష్టార్జితం అయినప్పుడు మీరు అతనినుంచి తీసుకున్న 1000 కూడా మీ కష్టార్జితమే కదా!మన డబ్బునే మనం బ్యాంకు యజమానినుంచి తీసుకుని దానికి వడ్డీ కలిపి బ్యాంకుయజమానికి తిరిగి ఇవ్వటం న్యాయమా!

ఇంత సుకుమారమైన దోపిడీని న్యాయం అనిపిస్తున్న అతి ముఖ్యమైన ఆర్ధిక చట్రాన్ని శాసించే రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన అన్ని మార్గదర్శకాల్నీ రూపొందించింది సాక్షాత్తూ అంబేద్కర్ మహానుభావుడే.రిజర్వ్ బ్యాంక్ మన దేశపు  ప్రభుత్వం కన్న అంతర్జాతీయ ద్రవ్యనిధికే ఎక్కువ అనుసంధానించబడి వుంటుంది!కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్ లోటుని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి - రిజర్వ్ బ్యాంకు నుంచే కదా!ఆ రిజర్వ్ బ్యాంకు ఎక్కడి నుంచి  తీసుకుంటున్నది?అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తను అప్పు చేసి తెచ్చి మన ప్రభుత్వాలకి అప్పు ఇస్తున్నది.కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాలలో గానీ మేధావుల బడ్జెట్ విశ్లేషణలలో గానీ రాబడి పోబడి లెక్కలనే చూపిస్తారు, డెఫిసిట్ వస్తే అంకెల్ని మాత్రం చెప్పేసి వూరుకుంటారు గానీ ఆ డెఫిసిట్ స్థానంలోకి తెచ్చే అప్పు స్వతంత్రం వచ్చినప్పటినుంచి తీరకుండా ఉన్న అప్పుకి ఇంకెంత పెంచుతుంది అనేది మాత్రం చెప్పరు - అసలు ఆ ప్రస్తావననే దాటవేస్తారు.

ఈ మొత్తం కనిపిస్తున్న ఆర్ధిక చట్రం సంప్రదాయకమైన ఆర్ధిక శాస్త్రం ఆమోదించినది కాదు,లూసిఫర్ మతస్థులైన ఇల్యూమినాటీలు వండివార్చిన Rothschilds Banking System అనే విషవృక్షానికి పుట్టిన కొమ్మల్లో ఒకటి - Debt based Economy అంటారు దీన్ని.దీన్ని రుద్దడమే ఒక కుట్ర అయితే ఇప్పుడు దీనిమీదకి క్రిప్టో కరెన్సీని కూడా ఎక్కిస్తున్నారు.

ప్రాచీన మధ్య యుగాల నాటి భారత దేశపు చరిత్రను కమ్యూనిష్టు చరిత్రకారులూ కాంగ్రెసు మేధావులూ కలిసి వండివార్చిన గ్రంధాలను బట్టి చూసినప్పటికీ ఆ రెండు యుగాల నాడు జీవించిన మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ ఈనాడు జీవిస్తున్న మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ పూర్తి తేడా కనిపిస్తుంది.చాలా వెనక్కి వెళ్ళనక్కరలేదు, CE 1960ల నాడు పుట్టిన మా తరానికి మా పెద్దలు ఒకప్పుడు బాధతోనూ ఒకప్పుడు నవ్వుతూనూ చెప్పుకున్న తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోగలగడం ఎట్లా సాధ్యపడిందో తెలుసా - ఆనాడు జీవించిన మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ ఈనాడు జీవిస్తున్న మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ పూర్తి తేడా కనిపించడం ఇటీవలనే జరిగిన ఒక కుట్ర ఫలితం గనక!

నాణెపు వ్యవస్థను తీసేసి పేపర్ కరెన్సీకి జనాన్ని అలవాటు చెయ్యడం వల్లనే మన దేశంలోని సాంస్కృతిక పరమైన విధ్వంసం జరిగందనేది నేను బల్లగుద్ది చెప్పగలను!ఎందుకంటే, చరిత్ర కందని పూర్వ కాలం నుంచీ వీళ్ళు ధ్వంసం చెయ్యక ముందు వరకు ప్రజల శ్రమకు నాణెం ఒక భౌతికరూపం.అది ఎలాగంటే, ఒక రాజు ఒక నాణెం ముద్రించలంటే అంతకు ముందర పన్నుల రూపంలో ఖజానాకు చేరిన లోహం నుంచే తీసుకునేవాడు.ఒకవేళ వ్యాపారస్థులు తమ వ్యాపారం కోసం అదనపు నాణేలు కావాలంటే లోహాన్ని తనే టంకశాలకు ఇచ్చి తయారు చేయించుకునే వాళ్ళు.చాలా సహజంగా నాణేనికి వాడే లోహం అన్నిటికంటే విలువైనది కాబట్టి ఇతర వస్తువుల దరల్ని నిర్ణయించడం కూడా ఎంతో సరళంగా వుండేది.భూమినుంచి పుట్టే ప్రతి వస్తువుకీ ధరను నిర్ణయించాల్సిన అవసరం కూడా వుండేది కాదు.అవసరం,లభ్యత, లాభం వంటి అంశాలని బట్టి వస్తువులకి ధరలను నిర్ణయిస్తే సరిపోయేది.ఉదహరణకి అప్పట్లో అన్నాన్ని అమ్మడం శిరఛ్చేదం విధించదగిన భయంకరమైన నేరం,ఇవ్వాళ హోటల్ లేని నగరాలే కాదు, పల్లెటూళ్ళు కూడా లేవు!

మానవులకే కాదు మానవులు తయారు చేసిన వస్తువులకి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి,తమని వాడుతున్న మనుషులకి తమ సవ్భావాలను అంటుంచే శక్తి కూడా ఆ వస్తువులకి ఉంటుంది.లోహపు నానేఅలు వాడుతునన్ కాలంలో నైతికపరమైన విశృంఖలత చాలా తక్కువగా ఉండటమూ పేపర్ కరెన్సీని వాడుతున్నప్పుడు నైతికపరమైన విశృంఖలత చాలా ఎక్కువగా ఉండటమూ కాకతాళీయం కాదు.ఒక రాజ్యంలోని అత్యంత విలువైన లోహం నుంచి నాణెం తయారు చేసి కొత్తగా విఉవను నిర్ణయించాల్సిన వస్తువుకూ ఆ నాణేనికీ సంబంధం కలుపుతున్నప్పుడు జరిగేది ఆ వస్తువుకు అంతకు ముందర లేని విలువ/మర్యాద/గౌరవం హెచ్చుతున్నట్లు ఆ నాణేన్ని వాడుతున్న వ్యక్తుల స్వభావంలో ఉన్నతమైనవీ తమకు గౌరవాన్ని పెంచేవీ అయిన అంశాల పట్ల ప్రీతి కలుగుతుంది. ఒక దేశంలోని అత్యంత చవకైన కాగితం నుంచి నాణెం తయారు చేసి కొత్తగా విలువను నిర్ణయించాల్సిన వస్తువుకూ ఆ నాణేనికీ సంబంధం కలుపుతున్నప్పుడు జరిగేది ఆ వస్తువుకు అంతకు ముందర ఉన్న విలువ/మర్యాద/గౌరవం తగ్గుతున్నట్లు ఆ నాణేన్ని వాడుతున్న వ్యక్తుల స్వభావంలో చవకబారువీ తమకు న్యూనతను తెచ్చిపెట్టేవీ అయిన అంశాల పట్ల ప్రీతి కలుగుతుంది.

క్రిప్టో కరెన్సీ నిర్మితి వెనక ఉన్న మరొక విచిత్రమైన లక్షణం షేర్ మార్కెట్ల మాదిరి స్పెక్యులేషన్ని బట్టి షేరు విలువ మారినట్టు డిమాండును బట్టి నాణెం విలువ మారడం - నాణెం అనేది స్థిరమైన విలువతో ఉండి దానితో సంబంధం కలుపుతున్న వస్తువుల ధరలను మార్పు చేర్పులకు గురిచెయ్యడం న్యాయం అయితే ఇక్కడ నాణేనికే విలువ మారడం ఎలా జరుగుతున్నది?గుడ్డెద్దు చేలో పడినట్టు వూరూ పేరూ లేనివాడెవడో కనిపెట్టాడు,మనకి లాభం వస్తున్నది గాబట్టి వాడేసుకుందాం అనుకోవటమే తప్ప వాడుతున్నవాళ్ళలో ఎవరికీ భవిష్యత్తులో తమకే బ్యాండు పడితే లాభం సంగతి అట్లా ఉంచి చిప్పకూడు తినాల్సి వస్తుందేమో అనే అనుమానం కూడా రావటం లేదు - పోగాలము దాపరించినవాడు అని చెప్పి పెద్దలు ఏయే పనులను గురించి హెచ్చరించారో ఆయా పనుల్ని జంకూ గొంకూ లేకుండా చేసేస్తున్నారు.

ఇప్పుడు వేలాంవెర్రి కింద తయారిన షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లూ ఆ ఇన్వెస్టర్ల సలహాలు విని షేర్లు కొంటున్న కస్టమర్లూ తమ ఒక్కొక్కరి ట్రాన్సాక్షన్లలో కొన్ని సార్లు నష్టపోయినా మళ్ళీ లాభం రావడంతో సంతృప్తి పడిపోయి కొనసాగుతున్నారు గానీ మొత్తం అందర్నీ కలిపి లెక్కలు వేస్తే ఆ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఎవరి వల్ల మారుతున్నాయో ఆ ఇన్సైడర్లకి అస్మదీయులైన కొందరికే అనియతమైన లాభలు వస్తున్నాయనేది తెలుస్తుంది.మహాకవి శ్రీశ్రీ లాంటూవాళ్ళు తమ జీవితాల్లో అనుభవించి పలవరించిన బ్లాక్ మండే ఇన్సైడర్ల మాయాజాలమే.ఒక్క అమేరికాలో చంకనాకిపోయి ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లలో ఇన్వెస్టర్లే అక్షరాల 10,000 మంది అయితే మామూలు కష్టమర్లు లక్షల్లో నమోదు అయ్యారు.

గత యాభయ్యేళ్ళలో మనం వార్తాపత్రికల్లో చూసి గుండెలు బాదుకున్న ప్రతై కుంభకోణం వెనుకా ఉన్నది బ్యాంకులే!ద్రవ్యోల్బణం(inflation) అనేది దానంతటది రాదు - రిజర్వ బ్యాంకు ప్రమేయం లేనిదే inflation గానీ దాని బాబు లాంటి deflation గానీ ఉనికి లోకి రావు.ఇప్పటి ఆర్ధిక వ్యవస్థయే సంప్రదాయకమైన ఆర్ధిక శాస్త్రం ఆమోదించని Debt based economy అనే వికృతమైనది అయితే దీనినుంచి బయట పడాల్సింది పోయి దీనిమీదకి క్రిప్టో కరెన్సీ అనే మరొక దరిద్రాన్ని తెచ్చి పెట్టటం అమానుషం.

ఇది నూతన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పేరున చెలరేగిపోతున్న ఇల్యూమినాటీల వ్యూహమే అని చెప్పటానికి కనబడుతున్న ప్రముఖమైన సాక్ష్యం Satoshi Nakamoto గురించిన నిగూఢతయే.వాళ్ళ గురించి ఈ మధ్యనే రెండు విచిత్రమైన విషయాలు తెలుసుకున్నాను.ఒకటి Rothschilds అనేవాళ్ళు ఒకప్పుడు ఆ స్థాయిలో రాజ్యాల మీద పెత్తనం చేసి ఆయా దుర్మార్గాలు చేసినప్పటికీ తర్వాత కాలంలో వాళ్ళ పట్ల వ్యతిరేకత పెరిగీ వాళ్ళ వ్యాపారాలలోకి ఇతరులు చొరబడీ వాళ్ళ ప్రాభవం నశించిపోయి కనుమరుగైపోయారనే వార్తా కధనాలు ఎక్కువయ్యాయి.రెండవది వాళ్ళు తమ 2050 నాటికి నూతన ప్రపంచ రాజ్యపు ఏర్పాటు అనే లక్ష్యం  గురించి ఒక పరిశోధకుడికి రిపోర్టు ఇమ్మని పురమాయిస్తే అతను ఇంటర్నెట్ వల్ల వాళ్ళు దాచెయ్యాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్లని గురించిన సమస్త సమాచారమూ అందరికీ తెలిసిపోవడం వల్ల 2050 నాటికి నూతన ప్రపంచ రాజ్యం ఏర్పడటం దాదాపు అసాధ్యం అని తేల్చి చెప్పాడనే ఒక వార్తా కధనం ఒకటి కనబడి అదృశ్యమైపోయింది. బహుశః అందువల్లనే Satoshi Nakamoto అనే తమ అంతరంగికుడిని అనామక స్థాయిలో ఉంచేశారు కాబోలు!

అక్రమార్జనపరులు తమ నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికీ దురాశాపరులు కన్నుమూసితెరిచేలోపు కోట్లకి పడగలెత్తడానికీ తప్ప దేశపు ఆర్ధిక స్వావలంబనకు ఎటువంటి ప్రయోజనమూ లేని క్రిప్టో కరెన్సీని నిషేధించడమే ఉత్తమం.ఈ నూతన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పట్ల హైందవేతర సమూహాలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు,ఉండదు.నిన్న గాక మొన్న 43 నెలల నూతన ప్రపంచ రాజ్యం వస్తున్నది,మనం ఎదురేగి స్వాగతించుదాం అని ఒక పాష్టరు వేసిన పోష్టరు చూశాను.అంటే, వాళ్లకి లూసిఫర్ మతస్థులు చేస్తున్న దరిద్రాలు అన్నీ తెలుసు,వాళ్ళు కూడా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు అనే కదా దీని అర్ధం - కాకపోతే నరంలేని నాలికని మడతపెట్టి వాళ్ళు వేసే మెలిక ఏంటంటే అది తెస్తున్నది సాతాను భక్తులే, అయినప్పటికీ 43 నెలల తర్వాత మా ఏసు వస్తాడు అని,వాళ్ళని తుదముట్టిస్తూ దేవుడి రాజ్యం ఏర్పాటు చేస్తాడు అని!

ఒక్క హిందువులకి తప్ప కమ్యూనిష్టులతో సహా ప్రతి ఒక్కడికీ 2050 నాటికి లూసిఫర్ మతస్థులు ఏర్పరచబోతున్న నూతన రాజ్య వ్యవస్థ ఎట్లా ఉంటుందో తెలుసు.వాళ్ళు దాన్ని ఆమోదిస్తున్నారు కూడా.హిందువులకే తమ చుట్టు ఎంత భయంకరమైన కుట్ర నడుస్తున్నదో తెలియడం లేదు.గతంలో మనం చూపించిన అజ్ఞానమే మనల్ని ఇప్పుడు కష్టపెడుతునదనేది తెలుసుకోవాలి తప్ప వాళ్ళనీ వీళ్ళనీ నిందించి ప్రయోజనం లేదు.ప్రస్తుతం ప్రతి హిందువూ క్రిప్టో కరెన్సీని వాడకూడదనే సంకల్పం తీసుకోవాలి.భారతీయ జనతా పార్టీ అభిమానులూ కార్యకర్తలూ నాయకులూ తమ జాతీయ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేసి క్రిప్టిఎ కరెన్సీని నిషేధించేలా చెయ్యాలి.

జై శ్రీ రాం!

Monday, 29 November 2021

చరిత్రని వక్రీకరించడం ఎలా చేస్తారు? అలా వక్రీకరించడం వల్ల వాళ్ళకి లాభం ఏంటి!

చరిత్రని వక్రీకరించడం ఎలా చేస్తారు, అలా వక్రీకరించడం వల్ల వక్రీకరించేవాళ్ళకి లాభం ఏంటి అనేవి తెలుసుకోవాలంటే సిపాయిల తిరుగుబాటుకి కొవ్వు తూటాల గురించిన పుకారు కారణం అనే పొడుపుకధని విప్పితే చాలు!సిపాయిల తిరుగుబాటు జరగడానికి అతి ముఖ్యమైన సంఘటన కొవ్వు తూటాల పిట్టకధ ఒక్కదాన్ని పట్టి చూస్తే ఇన్నేళ్ళ పాటు ఇన్ని తరాల భారతీయులు ఎలా మోసపోయారో అర్ధమై ఇంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే ఇంగ్లీషు వాళ్ళు అంత స్థాయిలో మన దేశం మీద పెత్తనం చెయ్యగలిగారని తెలిసి జాలి వేస్తుంది!

ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న విషయాలు టెంతు క్లాసు వరకు మనం అందరం చదువుకున్న పుస్తకాల్లో గానీ ఇప్పటికీ హిస్టరీ స్టూడెంట్లు చదువుతున్న పుస్తకాల్లో గానీ కనపడవు, కానీ ప్రతి విషయానికీ Documentary proof ఉంది. భారత సిపాయిలు వాడటానికి వ్యతిరేకించారని అంటున్న Enfield Pattern 1853 rifle-musket అనే తుపాకిని బ్రిటిష్ సైన్యం 1853 నుంచే వాడుతున్నది.అప్పటి వరకు 1842 నాడు ఆమోదించిన smoothbore musket అనే తుపాకీకి బదులు War Department యొక్క ప్రాధమిక అనుమతితో 1854 మొదలు 1856 వరకు జరిగిన క్రిమియన్ యుద్ధంలో వాడారు.పనితనం బాగుండటంతో 1855 సంవత్సరం నాటి February నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం తరపున పోరాడుతున్న సైన్యానికి అధికారికమైన అనుమతి ఇచ్చేశారు.

ఒక సబ్బును తయారు చేసిన వాళ్ళు గానీ ఒక కారును తయారు చేసిన వాళ్ళు గానీ వస్తువు గురించి ఏమీ చెప్పరా!అది సబ్బు అయితే అందులో ఏమి దినుసులు వాడారు,మిగిలిన సబ్బుల కన్న ఇందులోని ప్రత్యకత ఏంటి అనే విషయాలు చెప్పరా?అది కారు అయితే దాన్ని స్టార్ట్ చెయ్యడం ఎట్లా,గేర్లు మార్చడం ఎట్లా,మైలేజి ఎంత వస్తుంది,పికప్ ఎలా ఉంది అనే విషయాలు చెప్పాలి కదా!అలాగే Pattern 1853 Enfield తుపాకిని భారత సైనికులకి ఇచ్చేటప్పుడు దాని బుల్లెట్లలో ఆవు కొవ్వు వుందో పంది కొవ్వు ఉందో చెప్పకపోవటం ఎట్లా సాధ్యం?ఒక క్రికెట్ ఆటగాడు తనకు కావలసిన బ్యాటును ఎంచుకోవడానికి ఎంత సమాచారం సేకరిస్తాడో ఎంత సమయం తీసుకుంటాడో ఒక సైనికుడు తను ఉపయోగించే తుపాకీని గురించి తెలుసుకుంటాడు కదా!

మరి, భారత సైనికులు ఎందుకు అలా రెచ్చిపోయారు?అసలు ఇంగ్లీషువాళ్ళు అలాంటి బుల్లెట్లని వాడారా అని నేను వేసుకున్న ప్రశ్నకి దాదాపు అన్ని వైపుల నుంచీ There is no conclusive evidence that either of these materials was actually used on any of the cartridges in question. అనే జవాబు వచ్చింది.మరి, పుకారు ఎలా వచ్చింది?తమ తరపున ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికుల వాడకం కోసం తుపాకులు ఇచ్చిన ప్రభుత్వమే తమ సైనికుల్ని అవమానించి తమమీద తిరగబడేలా చెయ్యటం సాధ్యమా!

అది ప్రజాస్వామ్యం కానివ్వండి, నియంతృత్వం కానివ్వండి, సామ్రాజ్యవాదం కానివ్వండి,మానవవాదం కానివ్వండి రాజ్యవయ్వస్థ నిలబడాలంటే పోలీసులు, సైనికులు ప్రభుత్వాధినేతలకు విధేయులై ఉండాలి.అలాంటి కీలకమైన సైన్యం విషయంలో ఆంగ్లేయ ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండానూ కొవ్వు తూటాల ప్రాక్టికల్ జోకులు వేస్తూనూ తిరుగుబాటును కోరి తెచ్చుకున్నారని అనుకోవడం కేవలం అమాయకత్వం మాత్రమే కాదు బుద్ధి తక్కువ తనం కూడా!

మొదటి బుల్లెట్టు Barrackpore దగ్గిర పేలింది 1857 మార్చి 29, పేల్చింది మంగళ్ పాండే.కానీ, అది వ్యక్తిగతమైన కారణంతో జరిగింది తప్ప బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చెయ్యాలనే ఉద్దేశం లేదు.అతని స్నేహితులు కొందరు మాత్రమే అధికారుల మీద కాల్పులు జరిపారు తప్ప రెజిమెంట్ మొత్తం వాళ్ళకి సహాయం చెయ్యలేదు.అయితే ఇంగ్లీషు వాళ్ళు మొత్తం రెజిమెంటుని శిక్షించారు.దీనికి ప్రతిధ్వని అన్నట్టు 1857 మే 10 85 మంది కొవ్వు తూటాలు వాడటానికి తిరస్కరించి జైలుపాలైన బెంగాల్ సైనికులు జైలునుంచి తప్పించుకుని సమీపాన ఉన్న సైనిక స్థావరాన్ని దోచుకోవడంతో తిరుగుబాటు ఒక స్పష్టమైన రూపం తీసుకుందని చెప్తున్నారు.

అత్యంత కీలమైన దశలో బ్రిటిష్ ప్రభుత్వం చాలా అలసత్వాన్ని ప్రదర్శించింది, ఎందుకో మరి! తిరగబడే అవకాశం ఉందని అనుమానం ఉన్న రెజిమెంట్లని నిరాయుధుల్ని చెయ్యటం తప్ప తిరుగుబాటును అణిచే కార్యక్రమం పెట్టుకోకపోవడం ఎంత విచిత్రం?అలా శెలవులు తీసుకున్న చాలామంది సైనికులు ఇళ్ళకి పోయారే తప్ప తిరుగుబాటులోకి వెళ్ళలేదు - కొన్ని దశాబ్దాల నుంచీ సైనికులకి జీతాలు తక్కువ ఇచ్చి కష్టపెట్టటమూ హిందూ ముస్లిం మతాలని అవహేళనలు చేసి అవమానించడమూ నిజమే అయితే వాళ్ళకి కూడా కోపం రావాలి కదా - అబ్బే, వాళ్ళు ఇవ్వాళ్తి మెకాలే భక్తుల లాంటివాళ్ళు అంటారా?మీ ఇష్టం!కానీ నేను నమ్మను.తిరుగుబాటుదారులు హఠాత్తుగా మొదలైనప్పటికీ ఢిల్లీని పట్టుకోవాలనే వ్యూహాత్మకతను ప్రదర్శించడం ఒక వింత అయితే బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు దారులు ఢిల్లీని పట్టుకునే వరకు ఆగి వేచి చూసి అప్పుడు విరుచుకు పడి అణీచివెయ్యటం మరొక వింత!

ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి విడిపించి ఆఖరి మొఘల్ బహదూర్ షాని బందీని చేసుకున్నాక కాన్పూరు, లక్నోల దగ్గిరే కాస్త గట్టి దాడి చెయ్యాల్సి వచ్చింది.అయితే, అది మరీ తమ ఉనికికే ముప్పు వచ్చేటంత ప్రమాదకరమైన తిరుగుబాటు కాకపోవటంతో ఆడుతూ పాడుతూ యుద్ధం చేశారు.1859 జులై 8 నాటికి ఎక్కడి తిరుగుబాట్లు అక్కడే అణిగిపోయి అందరూ గప్ చుప్ సాంబారు బుడ్డి అయిపోయారు.

మొత్తం ఉపఖండంలో బ్రిటిష్ ప్రభుత్వం తరపున పోరాడుతున్న సైనికుల్లో 35,000 మంది మాత్రమే శ్వత జాతీయులు.బెంగాల్ రెజిమెంటు మాత్రమే తిరుగుబాటు అని అంటున్న హడావిడిలో పాల్గొన్నది.మద్రాసు, బొంబాయి రెజిమెంట్లు అసలు తిరుగుబాటులో పాల్గొనలేదు.ఇక శిఖ్ఖులూ పంజాబీ ముస్లిములూ గూర్ఖాలూ ఇవ్వాళ అస్పృశ్యతకి గురయ్యారని సానుభూతిని తెచ్చుకున్న భీమ్రావ్ రాంజీ సక్పాల్/అంబేద్కర్ పూర్వీకులైన మెహర్లూ బ్రిటిష్ ప్రభుత్వం తరపున పోరాడి సైనికుల తిరుగుబాటు అనే ప్రప్రధమ భారత స్వాతంత్య్ర పోరాటాన్ని అణీచి వేశారు.దీనికి ఆయా వర్గాల వారికి మొఘలుల పట్ల ఉన్న వ్యతిరేకత కారణం అని దాదాపు అందరు విశ్లెషకులూ సమర్ధిస్తున్నారు గానీ నమ్మబుద్ధి కావడం లేదు నాకు.

సైన్యం అనగానే మనకి ఒక పవిత్ర భావం వచ్చేస్తుంది."అయ్యో పాపం, మన కోసం చచ్చిపోతున్నారు" కదా అని సెంటిమెంటు తన్నుకొస్తుంది.కానీ, ఎంత గొప్ప ఆదర్శం కోసమే అయినప్పటికీ తను చావడానికే కాదు ఇతరుల్ని చంపడానికి సిద్ధపడిన వాళ్ళు కూడా మనలాగే ఉంటారని అనుకోవడం పిచ్చితనం.సైన్యంలో చేరిన వెంటనే ఎకాఎకిన యుద్ధరంగానికి వెళ్ళరు.ట్రెయినింగ్ ఉంటుంది,ప్రతి రోజూ ప్రాక్టీస్ చెయ్యాలి,డయట్ దగ్గిరుంచి అన్నిటినీ కొలతల ప్రకారం తీసుకోవాలి.ప్రాణత్యాగం అనేది వేరే దారి లేనప్పుదు జరుగుతుంది గానీ వీలైనంతవరకు తనని తను రక్షించుకుంటూ మిత్రుల్ని రక్షిస్తూ శత్రువుల్ని చంపటానికి మానసిక శిక్షణ చాలా అవసరం,కదా!ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారో ప్రతి సైనికుడికీ అవన్నీ ఎవరు సమకూర్చుతున్నారో వాళ్ళమీద మతం పేరుతోనూ మరొక పేరుతోనూ తిరగబడటం న్యాయమేనా?

అదీగాక, యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చంపడానికీ చావడానికీ సిద్ధపడి బయల్దేరుతారు.మిగిలిన రోజుల్లోని దినచర్య తక్కిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే ఉంటుంది.అప్పుడు వాళ్ళు నెలజీతాలు ఎవరినుంచి తీసుకుంటున్నారో వాళ్ళ మీద మూర్ఖపు కారణాలు చెప్పి తిరగబడితే నష్టం ఎవరికి? భారతీయులు కాని సైనికాధికారులలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు.అవసరార్ధం తీసుకున్న అనుభవం లేని కుర్ర మంద ఒళ్ళు దాచుకుని వెనకెనక ఉండిపోయి భారతీయ సైనికుల్ని ముందుకు తోసి గెలుపుని ఆస్వాదించారు.వీళ్ళకి కూడా Rothschilds,illuminatti,freemason త్రయం తమను అనవసరమైన యుద్ధాలకి నడిపిస్తున్నదని తెలీదు.ఇక వాళ్ళూ వీళ్ళూ అని కాక పై స్థాయి అధికారుల్లో 50% పైన Lt Gen JFR Jacob , Vice Admiral BA Samson . Lt Gen RM Jacob  and Maj Gen JR Samson వంటి ప్రచ్చన్న యూదులు ఉన్నారు.ఇంగ్లీషు సైన్యంలో బాహాటంగా కనిపిస్తున్న వీళ్ళూ భారతీయ బ్రాహ్మణత్వం చాటున దాక్కున్న చిత్పవన యూదులూ మొఘలుల తరపున యుద్ధం చేశారు, శంభాజీకి రహస్య సహాయం చేశారు,రహస్య కుట్రలతో శివాజీ వంశం ఆంతరించి పోయాక పీష్వాల తరపున యుద్ధం చేశారు - మంగళ్ పాండే మొదలు రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల వరకు అందరూ లండను బ్యాంకర్లు ఇచ్చే నెల జీతాలకి ఆశపడి ఎవడి పక్కన చేరి ఎవణ్ణి చంపమంటే వాణ్ణి చంపే వృత్తి సైనికులే తప్ప స్వదేశం,స్వజాతి అనే ఆదర్శాలు పెట్టుకుని ధర్మం కోసం యుద్ధం చేసే ప్రవృత్తి వాళ్ళకి లేదు.వాళ్ళకి లేని ఆదర్శాల్ని అంటగట్టి మనం ఆవేశపడటం దేనికి?

వీటన్నింటిని బట్టి చూస్తే ఆనాటి తిరుగుబాటుకి కొవ్వు తూటాల ప్రహసనం మాత్రం కారణం కాదని అర్ధం అవుతున్నది కదా!అసలు ఒక సైనిక స్థావరంలో అలా జరిగిందని మరో స్థావరంలోని సైనికులకి తెలియడం కూడా అసాధ్యమే - సైనిక స్థావరాల లోనికి మనుషుల రాకపోకలే కాదు సమాచారం కూడా సైనికాధికారుల అధీనంలోనే ఉంటుంది.

మొదటి బుల్లెట్టును పేల్చిన మంగళ పాండే తిరగబడింది కూడా కొవ్వు తూటాలను గురించి కాదు, బ్రాహ్మణుడు గనక లోగొంతుకతో మంత్రపఠనం చేస్తుంటే పై అధికారికి తనని తిడుతున్నట్టు అనిపించి అవమానించాడు.అక్కద జరిగిన కలహం ముదిరి మంగళ్ పాండే స్నేహితులు అతని తరపున తిరగబడ్డారు.తర్వాత కధ మనకి తెలిసిందే,జైల్లో పెట్టారు, విచారించారు, శిక్ష వేశారు - అంతే!

బెంగాల్ రెజిమెంటులో ఉన్న 1,30,000 సైనికుల్లో దాదాపు 40,000 మంది బ్రాహ్మణులూ రాజపుత్రులూ ఉన్నారు.తిరుగుబాటును అణిచివేయడానికి బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడిన పంజాబ్ బెటాలియన్లో 10,000 మంది సైనికులు ఉన్నారు.తిరుగుబాటును అణిచివేశాక జరిగిన అధికార కేంద్రీకరణ సమయానికి బెంగాల్,బొంబాయి, మద్రాస్ అనే మూడు ముఖ్యమైన సైన్యాలని కలిపేస్తున్నప్పుడు సైన్యంలో 43,000 మంది బ్రిటిష్ వాళ్ళు ఉంటే 2,28,000 మంది ఇండియన్లు ఉన్నారు.ఇందులో తిరగబడిన మంగళ్ పాండే బృందానికి బెంగాల్ సైనికులు 85 మందిని కలిపినప్పటికీ ఇప్పుడు వర్ణిస్తున్నట్టు ఇంగ్లీషువాళ్ళు భయపడేటంత భయావహమైన పరిస్థితి లేదు.

ఇక సైనికులు తిరుగుబాటు చేశారనే పుకారును విని స్వతంత్రించిన భారతీయ రాజప్రముఖులు ఎవరో వారి బలాబలాలు ఏమిటో చూస్తే లెక్కలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ దగ్గిర బహదూర్ షా II,లక్నో దగ్గిర బేగం హజ్రత్ మహల్,కాన్పూర్ దగ్గిర నానా సాహెబ్,ఝాన్సీ దగ్గిర లక్ష్మీబాయి,జగదీశ్ పూర్ దగ్గిర కున్వర్ సింగ్,అలహాబాద్ దగ్గిర మౌల్వీ లియాకత్ ఆలీ, ఫైజాబాద్ దగ్గిర మౌల్వీ అహ్మదుల్లా,మధుర దగ్గిర సేవి సింగ్,గోరఖ్ పూర్ దగ్గిర గజానన్ సింగ్,గ్వాలియర్ దగ్గిర తాంతియా తోపే లాంటివాళ్ళు చాలామంది తిరగబడ్డారని చెపున్నారు.ఇప్పటి కధనం ప్రకారం సైనికుల తిరుగుబాటు పుకారును విని అంతమంది రాజులు ఒకేసారి ఇంగ్లీషువాళ్ళ మీద తిరగబడి ఉంటే మూడు లక్షల లోపు ఉన్న బ్రిటిష సైన్యాన్ని విడగొట్టి పంపకాలు చేసి అందర్నీ ఒకేసారి అణీచివెయ్యడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడేది కాదు.మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు గానీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపేలకి బాల్యస్నేహం ఉండటం వల్ల ముగ్గురూ తమ తమ సైన్యాల్ని కలిపి నడిపించితే చాలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే గొప్ప అంతటితో అంతమైపోయి ఉండేది, అది జరగలేదు.

అయితే, వారిలో వారు సంప్రదించుకునే అవకాశం ఇంగ్లీషువాళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఇంగ్లీషువాళ్ళు రెండేళ్ళ మధ్యన ఒక్కొక్క రాజ్యాన్ని చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకోగలరు, కదూ - అసలు జరిగింది అదే!భారతీయ రాజ్యధినేతల్ని వూరించే స్థాయిలో అసలు సిపాయిల తిరుగుబాటు జరగనే లేదు.మొదట స్వదేశీ రాజ్యాలను ఒకే వూపున గానీ ఒక్కొక్కరిని విడివిడిగా దొంగదాడి చేసి గానీ ఓడించి ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసుకుని ఉపఖండాన్ని విక్టోరియా రాణి గొదుగు కిందకి చేర్చిన తర్వాత బెంగాల్ రెజిమెంటులోని సైనికులు ఇప్పటీ రుణాచల్ ప్రదేశ్ అయిన అప్పటి ఇంగ్లీషువాళ్ళ గంజాయి తోటలకి కాపలా పనికి వెళ్ళి రహస్యగోపనం కోసం ఇంగ్లీషువాళ్ళ క్రూరత్వానికి బలై చచ్చిపోయిన అమాంబాపతు వ్యవహారాన్నీ మంగళ్ పాండే దుడుకుతనపు వ్యవహారాన్నీ కలిపి  అల్లితే ఇప్పుడు మనం నమ్ముతున్న కట్టుకధ తయారైంది. భారతీయ సైనికులు చేసిన తిరుగుబాటుని అణిచివేసే క్రమంలో జరిగిన ఆక్రమణని సర్వజనామోదయోగ్యం చెయ్యడంతో పాటు ఆయా రాజుల వ్యక్తిగత కారణాలతో జరిగిన యుద్ధాల్ని దేశభక్తికి అంటుగట్టటం ఇంగ్లీషువాళ్ళు చేస్తే అనుమానం వస్తుంది గనక తమ స్వజనంలో ఒకడైన చిత్పవన్ యూదు వినాయక్ దామోదర్ సావర్కార్ చేత వ్రాయించారు చరిత్రని.

నిజానికి అప్పటి భారతీయ ప్రభువులకి ఐకమత్యం గానీ బ్రిటిషువాళ్ళ మీద పోరాడి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టడం గానీ అవసరం లేదు.మనం చదువుకుంటున్న చరిత్రని చెక్కింది ఆంగ్లమానసపుత్రులు కాబట్టి అక్కడ జరిగిన అసలు విషయాన్ని దాచేసి "అందరూ కలిపి పోరాడితే, తమ తమ సైన్యాల్ని కలిపి నడిపించితే చాలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే గొప్ప అంతటితో అంతమైపోయి ఉండేది కదా!" అని మనకి సందేహం రానివ్వని చావు తెలివితో "హిందూ,ముస్లిం ప్రభువుల మధ్యన ఉన్న మతభేదాల వల్లనూ  హిందూ  రాజులకు ఉన్న సొంత గొప్పల వల్లనూ ఇంగ్లీషువాళ్ల చేతిలో ఓడిపోయారు!" అనే పాటను ఎత్తుకున్నారు.

ఎక్కడో ఒక దొంగ వెధవ మన ఇంటిని కొల్లగొట్టాలని ప్లాను వేసి రోజుల తరబడి మన ఇంటి చుట్టూ తిరిగి ఆనుపానులు తెలుసుకుని కన్న వేసినప్పుడు ముందే తెలుసుకోగలగడం మనకి సాధ్యమా!అసలు ఎవరికి సాధ్యం?1650 నాడు మొఘల్ దర్బారు నుంచి అనుమతి పొంది శాశ్వత వ్యాపార స్థావరం ఏర్పాటు చేసుకుని మొదటి అడుగు వెయ్యడం,1750 నాడు ప్లాసీ యుద్ధంతో భారతదేశపు రంగస్థలం మీద రెండవ దశ విస్తరణకు చేరుకోవటం,1850 నాడు భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ మీద సాధించిన విషపట్టును లండనులోని రాజకీయ వ్యవస్థకు బదలాయించడం,1950 నాటికి భారతదేశానికి రాజకీయ స్వాతంత్య్రం మాత్రం ఇచ్చి వాళ్ళు చేసిన అప్పుల్ని తీర్చాల్సిన ఆర్ధికబానిసత్వంలోకి నెట్టెయ్యడం అనేవి భారతదేశపు చరిత్రని తమకు అనుకూలమైన దిశలోకి నడిపించుకోవటంలో లండను బ్యాంకర్లు చూపించిన ప్రణాళికాబద్ధమైన వ్యూహనిర్మాణ చాతుర్యానికి అద్భుతమైన సాక్ష్యాలు!

నేను విశాఖపట్నంలో చదువుతున్నప్పుడు యూనివర్సిటీ మెయిన్ గేటు వైపునుంచి లైబ్రేరీ వైపుకి వెళ్తున్నప్పుడు కరెంటు స్తంభాల పక్కన ఉండే ఫ్యూజుబాక్సుల మీద "1947 ఉరి అమలు!" అని వ్రాసి ఉండటం చదివేవాణ్ణి.తరిమెల నాగిరెడ్డి వ్రాసిన "తాకట్టులో భారతదేశం" గుర్తొచ్చి పుస్తకం చదివిన వాళ్ళలో ఒక కుర్రాడు అలా వ్రాసి ఉంటాడని అనుకున్నాను.ఇప్పుడు మనం అనుభవిస్తున్నది పూర్ణ స్వాతంత్య్రం కాదనీ ఇప్పుడు జరుగుతున్న ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకి అమ్మెయ్యటం అనేది కూడా వాళ్ళ ప్రణాళికాబద్ధమైన వ్యూహనిర్మాణ చాతుర్యానికి మెచ్చుతునక అనీ ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు?

200  యేళ్ళ క్రిందట పూర్ణ స్వాతంత్య్రాన్ని అనుభవించి 200 యేళ్ళ పాటు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడి పాడి సగం స్వాతంత్య్రం  వచ్చిన డెబ్భయ్యేళ్ళ తర్వాత కూడా ఎవరికీ మనం అస్వతంత్రులమని తెలియడం లేదు, అవునా?అలాంటిది ఆనాటి రాజులకి ఎలా తెలుస్తుంది లండను బ్యాంకర్ల మోసం!అప్పుడు నడుస్తున్న నాటకం తమ గిడ్డంగుల్ని కాపాడుకోవటం కోసం సొంత సైన్యాన్ని పెట్టుకుని యోరప్ ఖండం మీద చేసిన వాళ్ళకీ వీళ్ళకీ తగువులు పెట్టి సైన్యాన్ని అద్దెకిచ్చీ అప్పులు ఇచ్చీ "అప్పు తీర్చాల్సిన నైతిక బాధ్యత!" పేరున బెదిరించి పెత్తనం చెయ్యటమే తప్ప రాజ్యాలు ఏవీ వీళ్ళకి సామంత రాజ్యాలు ఐపోలేదు.కాబట్టి, ఇప్పుడు మార్క్సిస్టు చారిత్రక విశ్లేషకులు చెప్తున్నట్టు ఇంగ్లీషువాళ్ళ మీద తిరగబడి వాళ్లని దేశం నుంచి వెళ్ళగొట్టి భరతమాత దాస్యశృంఖలాల తెగగొట్టే అవసరం లేదు.

అంతకు ముందు ఆయా రాజులు యుద్ధాలు చేశారు, కానీ అవన్నీ నిలవలో ఉండి తమ ప్రజలు పెంచిన సంపదతోనే సన్యాన్ని తయారు చేసుకుని అదనపు లాభం కోసం ఇతర రాజ్యాలను ఆక్రమించడం తప్ప ఇతర్ల దగ్గిర అప్పులు తీసుకుని యుద్ధాలు చేసి దరిద్రులు కావడం మొదటిసారి ఈస్టిండియా కంపెనీ కొట్టిన దొంగదెబ్బ వల్లనే సాధ్యపడింది.

కార్ల్ మార్క్స్ అనే రష్యన్ జాతీయత గల యూదు మతస్థుణ్ణి దొసో కపిత్యలో అనే లూసిఫర్ మతగ్రంధం వ్రాయించటానికి నెల జీతానికి తీసుకున్న లీగ్ ఆఫ్ జస్ట్ మెన్ అనే సంస్థ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సిద్ధాంతపరమైన బ్లూప్రింట్ తయారు చేసింది. వాళ్ళకున్న అన్ని వలసలలోనూ ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్న భారత ఉపఖండం మీద మరింత పట్టు బిగించడం కోసం కొవ్వు తూటాల వదంతిని ప్రచారం చేసి తిరుగుబాటును సృష్టించి అప్పటికి మొలతాకట్టు వ్యవహారం లాంటి అర్ధబానిసత్వంలో ఇరుక్కున్న స్వతంత్ర రాజ్యాల్ని పూర్ణబానిసత్వంలోకి తెచ్చుకోవడానికి 1848 నాటికే జెరెమీ బెంధాం, పామెర్స్టన్,మూడవ నెపోలియన్ బృందం ప్రణాళిక వేసుకున్నారు.ఇంకా స్పస్టంగా చెప్పాలంటే యాడం వీషాప్ట్, ఆల్బర్ట్ పైక్ లాంటివాళ్ళు వేసుకున్న మూడు మహావిప్లవాలూ మూడు ప్రాపంచ యుద్ధాలూ ఏయే సంవత్సరాలలో ఎక్కడెక్కడ ఎలా రప్పించాలో వ్రాసిపెట్టిన క్యాలెండరులో సిపాయిల తిరుగుబాటు వంటివి ఒక ఉపవిభాగమై జరిగాక మనం తెలుసుకుంటున్న ముఖ్యమైన తేదీలు.

ఇంత కాలం పాటు మనలో దేశభక్తిని రగిలించటానికి ఉపయోగపడిన 1857 నాటి ప్రధమ స్వాతంత్య్ర పోరాటం యొక్క నిజమైన చరిత్ర అందుకు పూర్తి విరుద్ధమైన ఇంగ్లీషువాళ్ళు తమ స్వలాభం కోసం నడిపించుకున్న వ్యాపార ప్రక్రియ అంటే నమ్మడం కష్టమే!కానీ, 1857 నాడు జరిగింది ఇక్కడి స్వతంత్ర రాజుల్ని అవతంత్రుల కింద మార్చి ఎక్కడో ఉన్న వ్రిటిష్ రాణికి అప్పగించడమేననీ మొత్తం వ్యవహారంలో మనం గర్వించదగిన విషయం ఒక్కటి కూడా లేదనీ నమ్మాలి,నమ్మి తీరాలి.దీన్ని నమ్మకపొతే 2050 నాటికి మనల్ని పూర్ణబానిసత్వంలోకి తీసుకెళ్తున్న మన కళ్ళెదుట నడుస్తున్న దొంగ నాటకాన్ని కనిపెట్టడం కూడా సాధ్యం కాదు.మన ప్రియతమ నాయకులే మనల్ని బానిసత్వంలోకి నెట్టేస్తున్న దొంగ నాటకాన్ని కళ్ళప్పగించుకుని చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేని అసమర్ధులమా మనం?

అవును, మనం అసమర్ధులమే కాదు అజ్ఞానులం కూడా!1947 ఇంగ్లీషువాళ్ళు వాళ్లకి నచ్చేటట్టు విడగొట్టి ఇచ్చిన ముష్టిచిప్పని తీసుకుని దేశం అని పేరు పెట్టుకుని మనం ప్రదర్శిస్తున్న దేశభక్తిని చూసుకుని గొప్పలకి పోతూ భవిష్యత్తులో ఏర్పడబోయే దేశం పట్ల భక్తి అప్పటివారికి లేకపోబట్టే మనకి బానిసత్వం ప్రాప్తించిందనే సూత్రీకరణలు చెయ్యడం ఎంత తెలివితక్కువతనమో ఇప్పటికీ తెలియడం లేదు హిందువులకి.

Rothschilds అనే యూదుజాతికి చెందిన బ్యాంకర్ల కుటుంబం వాళ్ళ ఆడపిల్లల్ని విలాసవంతులైన ప్రభువర్గాలకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆయా రాజవంశాలలోకి చొచ్చుకుపోయి తమ వారసులకి ఆయా రాజ్యాల్ని అప్పనం పప్పనం అప్పగించేసి అందరూ కలిసి అన్ని రాజ్యాల్నీ తమ కుటుంబపు సమిష్టి పెత్తనం కిందకి తెచ్చుకునే సంప్రదాయాన్ని భారతదేశంలో పీష్వాల పేరున పాటించారనేది ఎంతమంది ఒప్పుకోగలరు?మనకు ఆడపిల్ల పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన మరుక్షణం నుంచీ పరాయిది అయిపోతుంది.కానీ యూదులు తమ ఆడపిల్లలకు వేరేవాళ్ళ వల్ల పుట్టిన సంతానాన్ని సైతం స్వజనులైన రక్తసంబధీకుల కింద తీసేసుకుంటారు.పీష్వాల చిత్పవన శాఖ ప్రాచీన వైదిక పరంపరకు ఎలాంటి సంబంధమూ లేని కృత్రిమమైనది - ఎక్కడినుంచో వచ్చిన ఇజ్రాయేలీ యూదులు తమ అస్తిత్వాన్ని మరుగుపరువుకుని ఒక తరం క్రితం వరకు వినని ఒక కొత్త శాఖని పుట్టించినప్పుడు ఇక్కడి స్థానిక బ్రాహ్మణులు కనుక్కోలేకపోవడమే వైదిక ధర్మం యొక్క ఈనాటి దుర్గతికి మొదటి కారణం!

హిందువుల చేత ఈశ్వర అల్లా తేరే నాం పాటని పాడించిన మోహన దాసు జైన మతస్థుడనేది ఎంతమందికి తెలుసు?జైనంలో ఉన్న మన మతం నుంచి కాపీ చేసిన సారాన్ని వల్లెవెయ్యడం తప్ప ఏనాడూ వైదిక ధర్మం గురించి మాట్లాదలేదు - అది స్ఖాలిత్యం కాదు. ప్రపంచ పటం మీద ఇజ్రాయేలు అనే భూతప్రేతపిశాచగనసమవాకారం రూపు దాల్చటానికి జరిగిన రెండు ప్రపంచయుద్ధాలలో ఆంగ్లేయ సామ్రాజ్యవాదులకి గాంధీ ఒక్కడు చేసిన సహాయమే ఎక్కువ.మొదటి ప్రపంచ యుద్ధానికి గాంధీ చొరవ తీసుకుని సాటి కాంగ్రెసువాదుల్నీ సామాన్య భారతీయుల్నీ హడలగొట్టి 13 లక్షల మందిని ఇంగ్లీషువాళ్ళ తరపున పోరాడమని పంపిస్తే ఒక లక్షా పదకొండు వేలమంది చచ్చిపోయారు.రెండవ ప్రపంచ యుద్ధానికి గాంధీ చొరవ తీసుకుని సాటి కాంగ్రెసువాదుల్నీ సామాన్య భారతీయుల్నీ హడలగొట్టి 25 లక్షల మందిని ఇంగ్లీషువాళ్ళ తరపున పోరాడమని పంపిస్తే రెండు లక్షా ఇరవై నాలుగు వేలమంది చచ్చిపోయారు.రెండు సార్లూ రిస్కు లేని చోటకి ఇంగ్లీషు సైనికులు వెళ్ళి రిస్కు ఉన్న చోట్లకి భారతీయ సైనికుల్ని పంపించితే అంతమంది చచ్చిపోయారనేది ఎంతమందికి తెలుసు?యుద్ధానికి పంపించేటప్పుడు అంత హడావిడి చేశారు గానీ వాళ్ళు క్షతగాత్రులై వచ్చి అక్కడ జరిగిన మోసాన్ని చెప్పుకుందామంటే వినడానికి తీరిక లేనంత దుర్మార్గులు అహింసావాది ముసుగు వేసి గాంధీని జాతిపితను చేసిన కాంగ్రెసు నాయకులు.

ఇక్కడి రాజకీయాల్లోకి దొడ్డిదారిన దూరి కుట్ర చేసి చత్రపతి శివాజీ వంశాన్ని అంతరింపజేసి మరాఠీలకు నాయకత్వం వహించి మిగిలిన భారతీయ రాజ్యాలను లండను బ్యాంకర్ల పెట్టుబడితో జయించి 1818లో పైకి విధి లేని ఓటమి పేరున ఆడిన దొంగ నాటకంతో ఇంగ్లీషువాళ్ళకి స్వాధీనం చేసి గౌరవ వేతనం పుచ్చుకున్న పీష్వాలని మరాఠీ శౌర్యానికి ప్రతీకలైన మహావీరమూర్ధన్యులు అని కీర్తించడం అజ్ఞానం కాదూ!వాళ్లకి గాలికొట్టి డబ్బులిచ్చి యుద్ధానికి పంపి గెలిచాక ఇచ్చిన అప్పుల్ని తీర్చాల్సిన నైతిక బాధ్యత చాటున బానిసల్ని చేసుకున్న వడ్డీ వ్యాపారుల కుట్రని గమనించలేని అసమర్ధత ఇప్పటికీ మనల్ని అంటిపెట్టుకునే ఉన్నది కదా!

"మీరు గొప్పోళ్ళు!మీ జాతి గొప్పది!మీ శౌర్యం గొప్పది!వాళ్ళని గెలవండి!వీళ్ళని గెలవండి!" అని లండనులోని మూర్ఖుల్ని మొదట పొగిడారు.వాళ్ళు వాజెమ్మలై వీళ్ళ పెంపుడు కుక్కల మాదిరి వీళ్ళకి ఉపయోగపడి సాగినంతకాలం మా అంతవాళ్ళు లేరని విర్రవీగి వీళ్ళకి వాళ్లతో అవసరం తీరాక పెన్సిలు ముక్కుని చెక్కిన పొట్టుని చెత్తబుట్టలోకి విసిరేసినట్టు అందరితో తిట్లు తినిపించి లండనుకి పారిపోయేలా చేసి మూలన కూర్చోబెట్టారు.పీష్వాలని ముందు పెట్టి మరాఠీల దగ్గిర అదే పాట పాడారు.వాళ్ళు వెర్రెత్తిపోయి అందర్నీ గెలిచి ఆఖర్న వీళ్ళకి ధారపోసి పిచ్చోళ్ళలా పించను అడుక్కు తిన్నారు.శిఖ్ఖులూ అంతే,సింధియాలూ అంతే,ఠాకూరులూ అంతే - అందరి కందరూ లండను బ్యాంకర్లు గాలికొట్టి ఉబ్బేసి అప్పులిస్తున్నప్పుడు మా అంత పోటుగాళ్ళు లేరని విర్రవీగి మందిని కొట్టి జల్సాలు చేసి చేసిన అప్పులు తీర్చలేక లండను బ్యాంకర్లకి పెంపుడు కుక్కలై పోయారు.

తనకు వచ్చిన అతి మామూలు వ్యాధికి ఇంగ్లీషు వైద్యం కోసం ఆశపడిన ఛత్రపతి శివాజీకి ఆంథాక్స్ యాంటిడోట్ ఇచ్చి చంపేశారు.అలా 1680 నాటి ఏప్రిల్ మాసపు హనుమజ్జయంతి రోజున చనిపోయేనాటికి శివాజీకి కేవలం 52 యేళ్ళు మాత్రమే. చావుని బ్రిటిష్ చరిత్రకారులు Amin of Shival మీదకి తోసేస్తే మారాఠీ చరిత్రకారులు శివాజీ రెందవ భార్య అయిన soyarabhai మీదకి తోసేశారు.అసలు వారసుడు శంభాజీ రాజధానికి దూరంగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని Rajaram అనే soyarabhai కొడుకుని రాజుని చేశారు.ఇది తెలుసుకుని మొఘలులలో తనకున్న రహస్య మిత్రుల సాయంతో రాజధానికి వచ్చిపడి శంభాజీ రాజయ్యాడు.రాజారాం శంభాజీకి తోడ బుట్టిన వాడే. అయితే శంభాజీని కూడా చంపేశాక రాజారాం మళ్ళీ రాజయ్యాడు.కానీ రాజారాం ఒక చిత్పవన్ యూదు డాక్టరు చేతుల్లో విషప్రయోగానికి గురై చచ్చిపోయాడు.చివరికి ఖాళీని పూరించడానికి అప్పటికి మొఘలుల వద్ద యుద్ధ ఖైదీగా ఉన్న శంభాజీ కొడుకు షాహు రాజయ్యేటప్పటికి అతను లండను బ్యాంకర్ల ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ స్వజనుల్ని పీష్వాల పేరున తెర ముందుకు తీసుకు రావలసిన పరిస్థితి దాపరించింది.

మొదటి బాజీరావు పీష్వా నుంచి గాంధీని ట్రయనింగు ఇచ్చి దేశం మీదకి వదిలిన గోపాల కృష్ణ గోఖలే దాక మనం వీరాధివీరులనీ దేశభక్తులనీ త్యాగధనులనీ కీర్తిస్తున్న వారిలో చాలామంది ప్రాచీన వైదిక ధర్మ వారసత్వం లేని బ్రాహ్మణ వేషధారులైన చిత్పవన యూదులే.మనం పంజాబ్ కేసరి అని కీర్తిస్తున్న బాల గంగాధర తిలక్ సైతం చిత్పవన్ బ్రాహ్మణుడే, గాంధీ మన దేశస్థుల్ని ప్రపంచ యుద్ధాలకి పంపిస్తున్న సమయంలో ప్రవర్తించిన తీరు అతను కూదా తానులో ముక్క అని చూపిస్తున్నట్టు ఉంది.కాంగ్రెసు అధ్వర్యాన జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి అతి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చిన బిర్లా కుటుంబం ఇంగ్లీషువాళ్ళు చైనాతో చేసిన గంజాయి వ్యాపారంలో ప్రజల ముందు కనబడిన ఈస్టిండియా కంపెనీ యొక్క బీనామీలు. ఘనశ్యాం దాస్ బిర్లా పెట్టిన UNITED COMMERCIAL BANK (UCO) అతని సొంత బ్యాంకు కాదు లండను బ్యాంకర్ల బ్రాంచి మాత్రమే.గాంధీకి శిక్షణ ఇచ్చిన గోఖలే చిత్పవన యూదు.మళ్ళీ గోఖలేని తీర్చిదిద్దిన మహదేవ గోవింద రనడే కూడా చిత్పవన యూదు. ఇక ఘియాజుద్దీన్ గాజీ పేరున మొఘల్ రికార్డుల సాక్ష్యం ఉన్న గంగాధర్ మనవడైన జవహర్ లాల్ నెహ్రూ, అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ అధికారికమైన సభ్యత్వం ఉన్న ఫ్రీమ్యాసన్లు. ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ముస్లిములకి ఇవ్వరు,అక్కడ మతం పట్ల వ్యతిరేకతా నిషేధమూ ఉన్నాయి. కానీ వీళ్ళు హిందూ ముసుగు అవెసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేశారు, వీళ్ళు పుచ్చుకున్నారు.

ఎప్పటి 1680!ఎప్పటి 2021!ఒక తరం క్రితం లేని పేరుతో తమలోకి దూరిన కొత్తవాళ్లు ఎవరు అనే జిజ్ఞాస లేని మొన్నటి వైదిక పండితుల మందకొడితనమూ ఇన్ని శతాబ్దాల పాటు బ్రాహ్మణులు చెయ్యకూడని అన్ని నీచమైన పనుల్నీ చేసి వాళ్ళ అపకీర్తిలో తమకి వాటా ఇస్తున్నప్పుడు సైతం అనుమానించని నిన్నటి వైదిక పండితుల బౌధ్ధిక అలసత్వమూ తాము చెయ్యని దుర్మార్గాలకి తమని బాధ్యుల్ని చేసిన చిత్పవన్ బ్రాహ్మణుల్నిఎవరు మీరు,ఎక్కణించి వచ్చారు,వైదిక ధర్మానికీ మీకూ ఏమిటి సంబంధం?” అని నిలదియ్యలేని ఇప్పటి వైదిక పండితుల మొహమాటమూ కలిసి మనకు సంస్కృతీపరమైన ఆత్మన్యూనత ప్రాప్తించింది.

"నాడు మొఘల్ దర్బారు నుంచి అనుమతి పొంది శాశ్వత వ్యాపార స్థావరం ఏర్పాటు చేసుకుని మొదటి అడుగు వెయ్యడం,1750 నాడు ప్లాసీ యుద్ధంతో భారతదేశపు రంగస్థలం మీద రెండవ దశ విస్తరణకు చేరుకోవటం,1850 నాడు భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ మీద సాధించిన విషపట్టును లండనులోని రాజకీయ వ్యవస్థకు బదలాయించడం,1950 నాటికి భారతదేశానికి రాజకీయ స్వాతంత్య్రం మాత్రం ఇచ్చి వాళ్ళు చేసిన అప్పుల్ని తీర్చాల్సిన ఆర్ధికబానిసత్వంలోకి నెట్టెయ్యడం అనేవి భారతదేశపు చరిత్రని తమకు అనుకూలమైన దిశలోకి నడిపించుకోవటంలో వాళ్ళ ప్రణాళికాబద్ధమైన వ్యూహనిర్మాణ చాతుర్యానికి అద్భుతమైన సాక్ష్యాలు!" అని చెప్పినది నమ్మితే 2050 నాటికి ఏం జరుగుతుందనే సందేహం రావాలి కదా!అప్పుడు ప్రపంచ స్థాయిలో బ్రిటిష్ సామ్రాజ్యం కోసం పోరాడిన బ్రిటిష్ సైన్యంలో 90 శాతం మంది బ్రిటిష్ జాతీయత ఉన్నవాళ్ళు కాదు, rotschild కుటుంబం యొక్క బీరకాయ పీచు బంధుత్వాలు ఉన్న ఇజ్రాయేలీ యూదులే - మనకే కాదు మనలాంటి మనస్తత్వమే ఉన్న బ్రిటిషర్లకి కూడా ఎవరి వల్ల వాళ్ళు అపఖ్యాతి పాలయ్యారో ఇప్పటికీ తెలియడం లేదు. వరసలో వచ్చే తర్వాతి అంకె 2050 నాటికి అసలు తిరగబడటానికి వీల్లేని పూర్ణ బానిసత్వంలోకి వెళ్ళిపోవడమే మిగిలిందనీ ఎక్కడ బడితే అక్కడ దేశభక్తీ జాతీయతా ఆర్యావర్తమూ అఖండ భారతమూ సనాతన ధర్మమూ అని పొలికేకలు వేస్తూ వేదవిజ్ఞానం పేరున ఆవు కార్బన్ దయాక్సైడును పీల్చి ఆక్సిజను వదుల్తుందని గావుకేకలు వేస్తున్న ఇంతమంది మేధావుల్లో ఒక్కడికయినా తెలుస్తున్నదా!

నేను ఇదివరకు ఒకసారి చెప్పాను కదా, లాక్ డౌన్ అసలు లక్ష్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కాదు, దేశపు ఆర్ధిక ప్రగత్ని ఛిన్నాభిన్నం చెయ్యడం కోసమని - నమ్మనివాళ్ళు కరోనా ఎప్పుడు ఎక్కడ పుట్టి ఎలా మన దేశానికి వచ్చిందో తెలుసుకుని ఇంతవరకు జరిగిన కరోనా వ్యతిరేక పోరాటపు నాటకాన్ని కూడా పరిశీలించి భవిష్యత్తులోకి ఒకసారి తొంగి చూడండి.ఇది హఠాత్తుగా చైనాలో పుట్టీన కొత్త క్రిమి అంటూనే కరోనా వచ్చిన మరుక్షణమే WHO కరోనా గ్రుంచి అన్ని విషయాలు ఎలా చెప్పగలిగింది?ఆనందయ్య మందు పని చేస్తున్నదనీ వాడినవాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ లేవనీ తెలిశాక కూడా దాన్ని ఎందుకు ఆపేశారు?నేను అతను తెదెపా అనుకూలుడు కాబట్టి పేరు ప్రతిపక్షానికి పోతుందని అడ్డుకుంటున్నారని అనుకున్నాను.తీరా చూస్తే అతను పేరురూఢికాని అధికార పార్టీకి చెందిన వాడే!అయినప్పటికీ అతని వల్ల కరోనా వ్యాధిని జయుంచగలిగితే తమ పార్టీకి పేరొస్తుందనేది కూడా తెలియనట్టు పార్టీ మరియూ రాష్ట్ర ప్రభుత్వమూ మందుని అదరికీ అందుబాటులోకి రానివ్వకపోవడానికి కారణం ఏమిటి?కరోనా హఠాత్తుగా పుట్టినదంటూనే తనకి దాని గురించి ఏమీ తెలియదంటూనే ఇప్పటికీ నూరుశాతం సమర్ధత గల వ్యాక్సిన్ సిద్ధం కాలేదంటూనే కరోనా నియంత్రణకు సంబంధించిన సమస్తమైన కార్యక్రమాలూ WHO చెప్పినట్టే నడిపించడానికి కారణం ఏమిటి?

World Health Oganaization అనేది ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మానవత్వం పరిమళించే మహనీయులు ఏర్పరచిన సేవా సంస్థ కాదు, world health market మీద గుత్తాధిపత్యం కోసం రాక్ ఫెల్లర్ లాంటి నరరూపరాక్షసులు ఏర్పాటు చేసుకున్న జేబు సంస్థ.వాళ్లకి లాభం వచ్చేవాటిని మాత్రమే ఆమోదించి వాళ్ళ పోటీదారుల్ని చంపేసి నవ్వుకోగలిగిన దుర్మార్గుల ముందు భారతదేశపు ప్రధానియే "నీ బాంచను కాల్మొక్త!నువ్వు కాల్తో జెప్తే నేను ఏల్తో జేస్త!" అంటున్న దృశ్యం కళ్ళముందు కనబడుతుంటే ఎవరికీ చీమ కుట్టినంత కోపం రావడం లేదు - ఏమిటీ క్షాత్రలేమి రోగం?

Adam Weishaupt నుంచి Albert Pike వరకు గల లూసిఫర్ మతస్థులు వేసుకున్న మొత్తం ప్లాను మూడు ప్రపంచ యుద్ధాలతోనూ మూడు మహా విప్లవాలతోనూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి 2050 నాటికి ప్రపంచ జనాభాని ఒక మిలియన్ స్థాయికి తగ్గించి బానిస గొర్రెలకి అబ్రహాము యొక్క 13 మంది కొడుకుల వంశీయులను కాపర్లని చెయ్యటం.మొదటి ప్రపంచ యుద్ధమూ రష్యన్ విప్లవమూ కలిసే వచ్చాయి.ఫ్రెంచి విప్లవం అన్నిటికన్న ముందే వచ్చేసింది.చైనా విప్లవం కూడా వచ్చేసింది.రెండవ ప్రపంచ యుద్ధమూ వచ్చింది - ఇక మిగిలింది ఆఖరి ఘట్టం, మూడవ ప్రపంచ యుద్ధం!

అందులోని ఒక అంశం అయిన “The war must be conducted in such a way that Islam (the Moslem Arabic World) and political Zionism (the State of Israel) mutually destroy each other” అనే భాగాన్ని నెరవేర్చడం కోసమే అమెరికా ఆఫ్ఘనిస్థాన్ నుంచి పక్కకి తప్పుకుని తాలిబన్లకి గాలికొట్టి వదలడం చూస్తూనే ఉన్నారు కదా!అన్నట్టు 1857 నాటి అసలు చరిత్రని కొవ్వు తూటాల తిరుగుబాటుకి ఎందుకు మార్చి రాశారో తెలుసా - ఎవరికీ హాని చెయ్యని మామూలు కుక్కని కాల్చితే తప్పు, చంపాలనుకున్న కుక్కకి పిచ్చికుక్క అని ముద్ర కొడితే గొప్ప అన్నట్టు ఉంటాయి Rothschild బ్యాంకర్ల ఎత్తుగడలు.”Burn your Backyard, Blame yiour neighber, Fight for justuce and Snatch his house!” అనేది వాళ్ళకి అత్యంత ఇష్టమైన దోపిడీ వ్యవహారం.అప్పుడు జరిగిన నిజమైన చరిత్రని మార్చడం వల్ల ఆయా రాజ్యాల్ని వశపర్చుకోవడం అనే దుర్మార్గం తమమీద జరిగిన తిరుగుబాటును అణిచెయ్యడంలో జరిగిన అనుకోని సంఘటన కింద మారిపోలేదూ!ఇవ్వాళ అమెరికా తప్పుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్ చేరిన ఇస్లామిక్ మూర్ఖులు ఇజ్రాయేలులో ఉన్న మూర్ఖులతో తమకున్న మతపరమైన పాతపగల్ని తీర్చుకోవాలని చూడరా! "మేము న్యాయంగానే ఉంటాం, ఆడవాళ్లని అవమానించం!" అని పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వేశ్యల లిస్టు తయారుచెయ్యమని లోపాయకారీ ఆర్డర్లు జారీ చేసిన వాళ్ళు సాధు సజ్జనులూ సత్యసంధులూ అని పిచ్చ్గోళ్ళు మాత్రమే నమ్ముతారు.

ఇక వాళ్ళ ప్లానులో ఉన్న అతి ముఖ్యమైన “Meanwhile the other nations, once more divided on this issue will be constrained to fight to the point of complete physical, moral, spiritual and economical exhaustion” అన్న ప్రపంచంలోని అన్ని దేశాల్నీ ఒకేసారి ఆర్ధిక విధ్వంసానికి గురి చెయ్యదం కోసమే కరోనాకి లాక్ డౌన్ అనే పరిష్కారాన్ని సూచించింది వాళ్ళ జేబు సంస్థ అయిన WHO - బయటికి వెళ్తే చస్తామని భయపడుతూ రెండేళ్ళ నుంచి జనం ఇళ్ళలో కూర్చోవడం వల్ల ఒక్క energy sector లాంటి కీలకమైన రంగాలు తప్ప మిగిలిన అన్ని పరిశ్రమలూ ఉత్పత్తిని ఆపేశాయి.ఉత్పత్తులు ఆగిపోవడంతో వ్యాపారరంగం కూడా ఆగిపోయింది.వీటన్నిటి వల్ల నూటికి తొంభై శాతం మంది ప్రజలకి ఉపాధులు పోవడం,ఆదాయాలు తగ్గడం జరిగి ప్రభుత్వాలకి పన్నులు ఆదాయం తగ్గింది.ఇప్పటికీ మూడో వేవ్ నాలుగో వేవ్ అని భయపెడుతున్నారంటే దేశపు ఆర్ధిక వ్యవస్థని భ్రష్తు పట్టించటానికి వాళ్ళు పెట్టిన టార్గెట్ దగ్గిరికి దేశం వెళ్ళలేదని అర్ధం చేసుకోవాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చూస్తుంటే వ్యాక్సిన్ కనుక్కోవడం పేరుతో అది జరిగే వరకు ఏళ్ళ తరబడి జనాన్ని ఇళ్ళలోనే కూర్చోబెట్టేలా ఉన్నారు.వాళ్ళు బడ్జెట్లు వేసేది వాళ్ళ కష్టార్జితం నుంచి కాదు, మన పేరు మీద IMF దగ్గిర అప్పు తెచ్చి ఘనకార్యం చేస్తున్నట్టు పోజులు కొడతారు.మరి, మనకి అట్లా కాదే - వ్యవసాయం అయినా ఉద్యోగం అయినా వ్యాపారం అయినా మన కండల్ని కరిగించి వస్తువుల్ని తయారు చేసి వాటిని మార్కెట్టు దగ్గిర అమ్మితే కదా డబ్బు చేతికి వచ్చేది.

ప్రస్తుతం మాస్కులు తొడుక్కుంటూ శానిటైజర్లు పూసుకుంటూ బతికేస్తున్న లాక్ డౌన్ విషవలయం నుంచి బయటపడి హడిలి పోకుండా ఇదివరకటి నిర్భయ జీవితాన్ని కొనసాగించడానికి బ్రహ్మాస్త్రం లాంటి ఉపాయం ఒకే ఒక్కటి ఉంది, వినండి.అది వేదం మీద సత్యం మీద మీకు ఎంత భక్తి ఉంటే ఆంత గొప్ప స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది.ఒక వారం రోజుల పాటు నిరంతరం చాగంటి వెంకట రమణ గారు అమెరికాలో చేసిన కరోనా నిగ్రహ యజ్ఞం ఆంధ్ర లోని ప్రతి హిందువూ పూనుకుని చేస్తే ఎనిమిదవ రోజుకి కరోనా అంతం కావడం మీరు చూస్తారు.ఆయన అమెరికాలో అయిదు రోజులు చేసింది చాలా తక్కువ స్థాయిలో, అదీ అనుమానంతోనే చేశారు సాక్ష్యం కోసం - మంచి ఫలితాన్ని ఇచ్చింది!ఇక నిన్న గాక మొన్న విశాఖలో L.G వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి విడుదలయిన విషవాయువుల్ని వాతావరణం నుంచి తొలగించడానికి ముగ్గురు వేద పండితులు పది రోజుల పాటు చేసిన యజ్ఞం అయితే ఆశించిన ఫలితాన్ని అద్భుతమైన స్థాయిలో ఇవ్వటంతో పాటు ఆశించని ఒక అదనపు కానుకని కూడా ఇచ్చింది.

ఇంకొక టుమ్రీ వార్త - అప్పుడెప్పుడో ట్రంపు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో భూమి మీద పడే సూర్యకాంతిని ఆస్వాదించి మన దేహాలకి అంటిస్తే కరోనా తగ్గుముఖం అప్డుతుందని సైంటిస్టులు చెప్తే మరి కాంతిని శరీరం లోపలికి పంపిస్తే ఎట్లా వుంటుంది అంటే మన దేశంలో కొందరు రెటమతం గాళ్ళు నవ్వారు గానీ అక్కడి సైంటిస్టులు మాత్రం అది మంచి సూచనే గానీ ప్రస్తుతం అలాంటి టెక్నాలజీ లేదన్నారు గుర్తుందా!ఇప్పుడు మీరు నన్ను నమ్మి యజ్ఞం చేసినట్లయితే యజ్ఞ వీచికలు పని కూడా చేస్తాయి - అవి గాలిలో తేలియాడుతూ వెళ్ళి క్వారంటైనులో ఉన్నవాళ్ళకి కూడా కరోనా నెగటివ్ వచ్చేటట్టు చేస్తాయి!

నాకు తెలిసిన మిత్రులు వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నారు,మంచి ఫలితాన్ని పొందుతున్నారు.కానీ ఇప్పటి అవసరం ప్రకారం ఎక్కడ బడితే అక్కడ ప్రతి ఒక్కరూ గానీ ఎక్కువమంది గానీ కలిసి చెయ్యాలి,అది  రాజకీయ పార్టీలు చొరవ చూపిస్తే తప్ప సాధ్యం కాదు.ఎందుకంటే,దేశానికి దేశం ఒకేసారి కరోనా నుంచి విముక్తం కావాలంటే ప్రతీచోటా కనీసం పదిహేను రోజుల పాటు యజ్ఞవేదికలు ఏర్పాటు చెయ్యడానికీ వేదపండితుల్ని తీసుకు రావడానికీ సంఘటితం అయ్యి ఎవరు చెయ్యాల్సిన పనులు వారు పంచుకుని చకచకా చెయ్యడంలో అనుభవం ఉన్న వ్యక్తులు చాలా అవసరం.దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అటూవంటి కార్యకర్తల వల్లనే ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటుంది.అలా సంపాదించిన అనుభవాన్ని దీనికోసం ఉపయోగిస్తే కార్యక్రమం జయప్రదం అవుతుందనే గ్యారెంటీ ఉంటుంది.అదే,కేవలం ఆవేశం మాత్రమే ఉన్న వ్యక్తులు అలవాటు లేని పనులకి దిగితే మనం తేలిక అనుకుంటున్న చిన్న చిన్న పనులు కూడా అపజయం పాలవుతాయి.

1950 నాటి చరిత్ర మరోసారి నడుస్తూ ఉంటే గుడ్లప్పగించుకుని చూడటం తప్ప పూనుకుని ఏమీ చెయ్యలేని అసమర్ధులైపోయారు హిందువులు.ఇవ్వాళ వేదవిజ్ఞానం యొక్క సమర్ధతను చూపించి కరోనాను నిర్జించి ప్రపంచానికి దారి చూపగలిగిన గొప్ప అవకాశం వస్తే ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక రాజకీయ వైజ్ఞానిక నైతిక మార్గదర్శకత్వాన్ని వదిలేసుకుని అస్మదీయులకీ తమ యజమానులకీ దేశసంపదని దోచిపెట్టడమే తక్షణ కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తున్న అసమర్ధులు ఒకప్పుడు మా వెనకటి వాళ్ళు విశ్వగురువులని బొబ్బలు పెడితే ఎవడు వింటాడు,ఎవడు వినాలి,ఎందుకు వినాలి?

ఆవు కొవ్వు కలిసిందని ఎవరో అబద్ధం చెప్తే హిందూ సైనికులూ పంది కొవ్వు కలిసిందని ఎవరో అబద్ధం చెప్తే చెప్తే ముస్లిం సైనికులూ కొవ్వు తూటాల వాడకాన్ని వ్యతిరేకించి తిరగబడ్డారని వ్రాసింది మనమీద గౌరవభావంతోర్ కాదనీ అది మనల్ని వెర్రివెధవల కింద జమకట్టేసిన వెకిలితనం అనీ తెలుసుకోలేక జరగని తిరుగుబాటుని జరిగినట్టు వ్రాసిన అబద్ధపు చరిత్రని నమ్మి మనమీద జరిగిన కుట్రని మన వెనకటి తరం నాయకుల వీరత్వం,త్యాగం వంటి ఉన్నత గుణాలకి ప్రతీక అనుకుని దేశభక్తితో పులకించిపోతున్న భారతీయులు స్వాతంత్య్రం అనే ఉన్నత లక్ష్యానికి అనర్హులు అనేది వ్యాస పరాశరాది చతుర్యుగపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన ఆచార్యపరంపర వారసత్వానికి చెందిన నేను మూడు కాలలనూ ముడివేసి చూసి చెప్తున్న కఠిన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది.

సత్యం శివం సుందరం!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...