నిన్నటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం చెప్పిన రెండు విషయాలను అర్ధం చేస్కున్న వెంటనే ఇది సామాన్యులకు సౌకర్యాలను అమర్చడం కోసం కాదనీ అవినీతి ఆర్జనని చట్టబద్ధం చెయ్యడం కోసం రూపొందించిన వ్యవస్థ అనిపిస్తున్నది నాకు.
మొదటిది దాని పనితీరు:క్రిప్టోకరెన్సీ తొలి లావాదేవీ 2009ల నాడు అమెరికాలో జరిగింది.ప్రపంచ స్థాయి కొంపలు ముంచే యవ్వారాలన్నీ అమేరికాలోనే మొదలవటం యాదృఛ్చికం కాదు,ఇలాంటి యదవ పన్లకి ల్యాబరేటరీ కింద వాడుకోవటానికే అమెరికా ఇప్పుడున్న రూపంలో ఉంది.ఆండ్రూ జాక్సన్ అనే ఉద్దండపిండం బతికున్ననంత కాలం అక్కడ అడుగుపెట్టలేని లండను బ్యాంకర్లు 1907 నుంచి మొదలుపెట్టి యేడేళ్ళలో Federal Reserve Bank ఏర్పాటును పూర్తి చేసి ఇలాంటి యదవ పన్లకి ల్యాబరేటరీ కింద వాడేసుకుంటున్నారు.సరే, ఆ చరిత్ర తర్వాత గానీ క్రమేపీ క్రిప్టో కరెన్సీని కొనేవారి సంఖ్య పెరిగింది.అవును!క్రిప్టో కరెన్సీని వాడాలంటే ముందు కొనుక్కోవాలి.ఇక్కడే దీనిలోని అవినీతి తెలిసిపోతుంది.ఉద్యోగులకి జీతాల రూపంలోనూ వ్యాపారులకి లాభం రూపంలోనూ వచ్చిపడి చేతుల్లో ఫెళఫెళ లాడే కరెన్సీ నోట్లు మన దేశపు ఎపెక్స్ బ్యాంక్ అయిన ఇండియన్ రిజర్వ బ్యాంక్ ముద్రించినవి.వాటి వాడకం సజావుగా ఉంటేనే దేశపు ఆర్ధికం పారదర్శకమైన ఎదుగుదలను చూపిస్తుంది.నల్లధనం అంటేనే అన్ని లెక్కలూ చెప్పి పన్నుకు కట్టడం మానేసి చెలామణీ నుంచి పక్కకి తీసిన సంపద అయితే రిజర్వ బ్యాంక్ ముద్రించని క్రిప్టో కరెన్సీని కొనుక్కుని వాడటం ఆంటే ఎంత ప్రమాదకరమైన వ్యవహారమో ఆలోచించండి!
నైతిక పరమైన కోణం నుంచి చూస్తే అసలు చెయ్యకూడనిది అయినప్పటికీ ఒక్కసారే కుబేరులం అయిపోవచ్చనే దురాశతో కుర్రతనం కొద్దీ చేసినప్పటికీ దేశపు ఆర్ధికం మీద అది చూపించే ప్రభావం చాలా రెట్లు ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.ఈ రకమైన ప్రమాదం గురుంచి తెలియక పోవడం చేతనే మధ్య తరగతి వాళ్ళూ బీదరికంలో మగ్గుతున్నవాళ్ళూ నిరుద్యోగంతో బాధపడుతున్న కుర్రాళ్ళూ ఆక్ర్షితులై అతి వేగంగా పెరిగి ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేసింది.
ప్రతి క్రిప్టో కరెన్సీ ఒకడి చేత తయారై ఒక గ్రూపు కింద విడుదల అవుతుంది - ప్రస్తుతం బిట్ కాయిన్, ఎధెరియం, రిపిల్, లైట్ కాయిన్, బిట్కాయిన్ క్యాష్, బినాన్స్, సోలానా, టెధర్, కార్టానో, పోల్కాడోట్, డోజ్ కాయిన్, మూన్ కాయిన్, మొనెరో, జెడ్ క్యాష్, అవలాంచ్, టెర్రా వంటివి అన్నీ ఒకేలా పనిచేస్తాయి.ప్రతి నాణేనికీ దానికంటూ డూప్లికేట్ తయారు చెయ్యలేని కోడ్ ఉంటుంది గనక దొంగనోట్లు ముద్రించడం లాంటి యవ్వారం కుదరదు. అంత నిక్కచ్చి అయిన సెక్యూరిటీని మెయింటెయిన్ చెయ్యడం అద్భుతమే! కానీ ఈ స్థాయి సెక్యూరిటీ యొక్క అవసరం ఏమిటి?
దీని వాడకం తయారీదారులు ఇచ్చిన నెట్వర్క్ అక్కవుంట్ ఉపయోగించి లాగిన్ అయిన వెంటనే ఆ తయారీదారు తయారు చేసిన ప్రతి కాయిన్ యొక్క అన్ని ట్రాన్సాక్షన్లనీ చూడగలగటంతో మొదలవుతుంది.వాళ్ళు మీకు కూడా కొంత మూలధనం ఇస్తారు.మీకు ఇచ్చే ఈ మూలధనం ఎవరు ముద్రించినదీ కాదు,మైనింగ్ అనే ప్రక్రియతో సృష్టిస్తారు.ఇప్పుడు మీరు తయారీదారు దగ్గిర ఆ కరెన్సీని కొనుక్కున్న ఇతర వాడకందార్లతో పిజ్జాలూ బర్గర్ల వంటి వాటిని అమ్మటం కొనటం చెయ్యవచ్చును. అంటే ఒక పిజ్జా షాపు యజమానికి "టెధర్" ఎక్కవుంటు ఉండి అతని కస్టమర్లకీ "టెధర్" ఎక్కవుంటు ఉన్నప్పుడు సహజంగానే ఆ యజమాని వాళ్ల మధ్యన జరిగిన బదలాయింపును ఆమోదిస్తాడు.
క్రిప్టోకరెన్సీకి ప్రాణమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రతి ట్రాన్సాక్షనల్ రికార్డునూ నమోదు చేసి ఇతర్లకి చూపించే పట్టికని బ్లాక్ చెయిన్ లెడ్జర్ అంటారు.ప్రతి ఒక యూజరూ తను చేసిన ట్రాక్సాక్షన్లతో సహా ఇతరుల అన్ని ట్రాన్సాక్సన్లనీ చూడగలడు, కానీ, ఎవరు ఎవరికి కాయిన్ ఇచ్చారు అనేది మూడో వ్యక్తి తెలుసుకోవడం దాదాపు అసాధ్యం!అయితే, ఒక పిజ్జా కొనుక్కోవడానికి ఇంత పెద్ద వ్యవస్థ అవసరమా?అనవసరం, అందుకే ఇది అక్రమార్జన పరులు తమ నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్న అనైతికమైన ద్రవ్య విధానం అనేది.భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదట నిషేధిస్తూ చట్టం చెయ్యలని అనుకుని లాబీయిస్టుల ఒత్తిడి వల్ల నిషేధించడం గాక నియంత్రించడం గురించి ఆలోచిస్తున్నారన్న నేపధ్యంలో రెండవ అంశం గురించి చూడాలి.
రెండవది దాని ఆవిష్కర్త: 2009ల నాడు Satoshi Nakamoto పేరుతో ఒక కధనాన్ని శ్వేతపత్రం తరహాలో వదలితే దాన్ని వాడేసుకోవటమూ అతని కధనానికి చట్టబద్ధతని కల్పించేసి గుడ్డెద్దు చేలో పడినట్టు కొనసాగడమే తప్ప ఆవిష్కర్త ఎవరు అనేది ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు - ఆవిష్కర్త గురించి ఎందుకు అంత రహస్యం, గోప్యత, నిగూఢత?మిలిటరీ ఉపయోగించే స్థాయి క్రిప్టోగ్రఫీని,షేర్ మార్కెట్ ఉపయోగించుతున్న స్పెక్యులేషన్ వల్ల డిమాండును బట్టి విలువ మారే తరహా సాంకేతికతనీ రంగరించి ప్రభుత్వాలు చెయ్యాల్సిన కరెన్సీ విడుదలని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించి ఒక పోటీ ఆర్ధిక వ్యవస్థని నిర్మించిన వ్యక్తి ఆ పనిని రహస్యంగా ఉండి చెయ్యటం దేనికి?
డిమాండును పెంచడానికి అవసరమైన కొరతను సృష్టించడానికి "రెండు కోట్ల పది లక్షల" బిట్ కాయిన్లని మాత్రమే సృష్టించగలిగేటట్లు సాఫ్ట్వేర్ లిమిటేషన్ పెట్టడం వెనక అతని ఉద్దేశం ఏంటి?ఇప్పుడు లాభం కనిపిస్తున్నందువల్ల పూర్వాపరాలు ఆలోచించని మూఢత్వం ఎక్కువైన దాని వాడకందార్లకి భవిష్యత్తులో ఈ వ్యవస్థ నిర్మితి వల్లనే అనుకోని సమస్యలు వస్తే పరిష్కరించే జవాబుదారీ తనం ఎక్కడ ఎవరి దగ్గిర ఉంది?
ఒక కారును తయారు చేసిన వ్యక్తి కారుని మార్కెట్టుకు పంపించేసి చేతులు ముడుచుకుని కూర్చోడు.మొదటి సారి కారును అమ్ముతున్నప్పుడు అతను తయారు చేసింది అంతకు ముందు వాడకంలో లేని కొత్త వస్తువు గనక ఆ కారుని ఎలా ఉపయోగించుకోవాలో అతనే నేర్పాలి.ఇగ్నిషన్ కీని తిప్పటం, స్టీరింగ్ వీలుని హ్యాండిల్ చెయ్యటం,బ్రేకుల్ని వెయ్యటం లాంటివి నేర్పనిదే కారు కొన్నవాడు దాన్ని ఎలా నడుపుతాడు?ఇప్పుడు అనేక రకాల కార్లు వచ్చాయి కాబట్టి డ్రైవింగ్ స్కూళ్ళు నడిపేవాళ్ళకి ఆ సమాచారం ఇస్రున్నారు తయారీదార్లు.పాడైపోతే బాగు చెయ్యటానికి మెకానిక్కులు ఉన్నారు.అంటే మనం వాడుతున్న ప్రతి వస్తువుకీ దానికి సంబంధించిన సమాచారం అందించే బాధ్యత ఉన్న వ్యవస్థని కూడా ఆ తయారీదారులే సృష్టించి ఇస్తున్నారు.అలాంటప్పుడు ఈ క్రిప్టో కరెన్సీకి ఆ తయారీదారుడు ఎందుకు బాద్యత తీసుకోవడం లేదు?
అతని పేరుని బట్టి అతను జపానీయుడు అని అనుకుంటే అది చాలా అమాయకత్వంతో కూడిన పొరపాటు.2011 ఏప్రిల్ నెలలో ఆఖరి సంభాషణ నమోదైన తర్వాత తన గురించి ఎంత ఆసక్తి కనిపిస్తున్నప్పటికీ బయటపడని నిగూఢత క్షమించరాని నేరం కాదూ!ఆసక్తి గల పరిశోధకులు మాత్రం అతన్ని బైటికి లాక్కు రావాలని పట్టువదలని విక్రమార్కుల వలె శ్రమిస్తూనే ఉన్నారు - మార్చి 2014ల నాడు Newsweek అనే పత్రికలో కధనాన్ని వ్రాసి Dorian Nakamoto కావచ్చునని అన్నారు గానీ అతను స్వయాన నేను కాదు పొమ్మన్నాడు,డిసెంబర్ 2015ల నాడు Wired Magazine అనే పత్రికలో కధనాన్ని వ్రాసి Craig Wright కావచ్చునని అన్నారు గానీ అతను స్వయాన నేను కాదు పొమ్మన్నాడు,Dominic Frisby అనే రచయిత “Bitcoin: The Future of Money?” అనే పరిశోధనాత్మకమైన గ్రంధంలో Nick Szabo కావచ్చునని అన్నాడు గానీ అతను స్వయాన నేను కాదు పొమ్మన్నాడు.అతను గ్రంధంలో చూపించిన ఆధారాలు మాత్రం బలమైనవే గానీ అసలు వ్యక్తి ఒప్పుకోనప్పుడు ప్రయోజనం ఏమిటి?
Stefan Thomas అనే ఒక ప్రోగ్రామర్ 500 పైన ఉన్న Satoshi Nakamoto పోష్టుల టైం స్టాంపుల్ని పట్టి చూస్తూ వాటిని పరిశీలించి చూస్తే అవి Greenwich Mean Time ప్రకారం 5 a.m. and 11 a.m. అయ్యి Japan Standard Time ప్రకారం 2 p.m. and 8 p.m అయ్యి జపనీయుల నిద్రాసమయాలకు భిన్నమై విచిత్రమైన స్లీపింగ్ ప్యాటర్న్ కనిపిస్తుందని చెప్తూ అతను జపనీయుడు కాకపోవచ్చునని అనుమానిస్తున్నాడు.
అతనితో సంభాషించిన Laszlo Hanyecz అనే ప్రోగ్రామరు ఒకే వ్యక్తి అంత సమగ్రమైన వ్యవస్థను నిర్మించడం అనేది నమ్మలేకపోతున్నానని అన్నాడు.Gavin Andresen ఆనె మరొక ప్రోగ్రామర్ సోర్స్ కోడ్ చూసి “He was a brilliant coder, but it was quirky!” అనేశాడు.Source code comments,forum postings అన్నింటిలోనూ British English వాడకమూ తన మొదటి బిట్ కాయిన్ మైనింగు చేస్తున్నప్పుడు London's Times newspaper ప్రస్వావన కనిపించటమూ చూస్తే అతను లండను బ్యాంకర్ల మనిషై ఉంటాడనే అనుమానం బలపడుతున్నది నాకు.
నిజానికి ఇప్పుడు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో
బలోపేతం అయిన క్రిప్టో కరెన్సీకి అంటగడుతున్న మంచి లక్షణాలు ఒకప్పుడు వాడకంలో ఉండి
కనుమరుగైన లోహపు నాణేల వ్యవస్థకు సహజమైన లక్షణాలే - సృష్ట్యాది నుంచీ భారతీయులు కనుక్కుని
వాడుతున్న నాణేల వ్యవస్థని 17వ శ్సతాబ్దం నుంచీ ప్రపంచాధిపత్యం కోసం కలలు గంటున్న ఇల్యూమినాటీ
బ్యాంక్స్టర్లు(banksters) 1835ల నాడు లోహపు నాణేల వల్ల సమస్యలు వస్తున్నాయని వూదర
గొదుతూ చేసిన చట్టాలతో రద్దు చేసి పేపర్ కరెన్సీని చలామణిలోకి తెచ్చాకనే ఆర్ధిక వ్యవస్థలు
అస్థిరం కావడం మొదలయ్యింది!
ఇవ్వాళ్టి క్రిప్టో కరెన్సీకి చూపిస్తున్న
మొదటి అనుకూలత నకిలీ నాణేలను సృష్టించలేకపోవటం అన్నది ఆనాటి లోహపు నాణేలను అనుకరించడమే
కదా!పేపర్ కరెన్సీ ఆలోచన లండను బ్యాంకర్లకి ఎలా వచ్చిందో చూస్తే పేపర్ కరెన్సీ వాడకంలోని
నీచత్వం ఏమిటో తెలుస్తుంది.హిందూమతాన్ని మూఢనమ్మకాల పుట్ట అని విమర్శించే క్రైస్తవులకి
వాళ్ల మతం గురించి ఓ అంటే ఢం తెలియదు.వాళ్లకీ అనేకమంది దేవుళ్ళు ఉన్నారు,దెయ్యాలూ ఉన్నాయి,ఆ
దెయ్యాల్ని వదలగొట్టే మంత్రగాళ్ళూ ఉన్నారు,అనేక ప్రాంతాలు పుణ్యక్షేత్రాల కింద చెలామణి
అవుతూ భక్తుల నుంచి డబ్బులు పిండుతూ ఉన్నాయి.వీటిలో జెరూసలేం యాత్ర చాలా ఖర్చుతో కూడుకున్నది.అంత
డబ్బుని మోసుకు పోవడమూ చూపు శివుడి మీద చిత్తం చెప్పుల మీదా అన్నట్టు ఆ డబ్బు సంచుల
కాపలా పెద్ద సమస్య అయ్యింది.దానికి పరిష్కారం ఈ లండను బ్యాంకర్లు చూపించారు.యాత్రికులు
తమ స్వస్థలంలో ఉన వీళ్ళ బ్యాంకుల్లో డబ్బూ, లగేజీ అప్పగించి ఒక రశీదు తీసుకుంటే దారి
పొడుగునా ఉన్న వాళ్ళ బ్రాంచీల దగ్గిర తిరిగి తీసుకునే ఏర్పాటు చేశారు.
పోను పోనూ బద్ధకం వల్ల కావచ్చు అవసరం లేక
కావచ్చు కొందరు యాత్ర పూర్తయిపోయినతర్వత కూడా రశీదులు చూపించి తమ డబ్బునీ వస్తువుల్నీ
వెనక్కి తీసుకెళ్ళకపోవటం బ్యాంకర్లకి తలనెప్పి అయ్యింది.ఇక అసలు వ్యక్తి డబ్బు కోసమూ
వస్తువుల కోసమూ రావటం జరగదని రూఢి అయ్యాక బ్యాంకర్లు తమ మదుపుల కోసం వాడుకునేవాళ్ళు.అటువైపున
కస్టమర్లు సైతం ఇతర్లకి డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తమ వద్ద ఉన్న రశీదుల్ని ఇచ్చి
బ్యాంకుల నుంచి తీసుకోమనేవాళ్ళు.అనుకోకుండా మొదలై అప్పుడప్పుడు జరిగిన కొన్ని వినిమయాల
తర్వాత ఈ రెంటినీ కలిపి చూస్తే లండను బ్యాంకర్లకి అసలు తమ అధీనంలో ఒక్క రూపాయి కూడా
లేకుండా కోట్లు మిలియన్లు,ట్రిలియన్ల రేంజిలో గాలిలోనుంచి డబ్బును సృష్టించి కస్టమర్లకి
అప్పులు ఇచ్చి వడ్డీతో కలిపి కష్టమర్ల కష్టార్జితం నుంచి వసూలు చేసుకునే కొత్త దారి
కనిపించింది.
ఇందులో ఉన్న అత్యంత నీచమైన విషయం ఏమిటో
తెలియాలంటే మన దేశపు రిజర్వ బ్యాంక్ యొక్క పనితీరును అర్ధం చేసుకోవాలి.డబ్బుని తయారు
చెయ్యటానికి కూడా చాలా డబ్బు ఖర్చవుతుందండోయ్!కాగితం,సిరా, సాంకేతికత, ముద్రణ సౌకర్యం
- ముఖ్యంగా నకిలీ నోట్లని తయారు చేసే వీలు లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలతో సహా ప్రతి
సంవత్సరం కొత్త కరెన్సీని ప్రజలకి అందుబాటులోకి తేవటానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ
రేంజిలోనే ఉంటుంది - 2016లో అక్షరాలా 3,421 కోట్లు, అంటే 502 మిలియన్ డాలర్లు!ఆ యేడాది
స్థూల జాతీయోత్పత్తి 84 లక్షల కోట్లలో ఇది 0.04% మాత్రమే కావచ్చు, కానీ అంత తక్కువ
శాతం పొదుపైన విషయమే అయినప్పటికీ నిర్వహణ చాలా చాలా కష్టం. మనకన్న అభివృద్ధి చెందిన
దేశాలు కూడా ఈ కరెన్సీ తయారీని out-source చేసేసుకుని హ్యాపీగా ఉంటున్నాయి.ఎక్కువ స్థాయిలో
కరెన్సీ నోట్లని ఉపయోగించేవీ సొంతంగా తయారు చేసుకునేవీ అయిన దేశాల్లో చైనా తర్వాత రెండవ
స్థానంలో ఉంది మన దేశం.ఫెళఫెళలాడే కొత్త నోట్లని మురిపెంగా చూసుకుని పదే పదే తడుముకుని
మురిసిపోయే మనస్తత్వం వల్లనే డెబిట్ కార్డు వాడకం పెరగటంలేదు, అన్ని విషయాల్లోనూ అమెరికన్లని
ఇమిటేట్ చెయ్యటమే ఆధునికత అనుకునేవాళ్ళు కూడా ఈ విషయంలో మాత్రం కార్డు కన్న కరెన్సీనే
ముద్దు చేస్తున్నారు!!
అన్ని వారసత్వాల లాగే నోట్లని తయారు చేసుకునే
వారసత్వం కూడా తెల్లదొరల నుంచి సంక్రమించినదే. నిన్నమొన్నటివరకు అన్ని ముడిసరుల్నీ
దిగుమతి చేసుకుని వాటితో నోట్లని తయారు చేసుకునేవాళ్ళం - ముఖ్యమైన watermarked
paper జర్మనీకి చెందిన Giesecke & Devrient నుంచీ బ్రిటనుకి చెందిన De La Rue వంటి
కంపెనీల నుంచీ కొనుక్కునేవాళ్ళ్ళం - మొత్తం ఖర్చులో 95% దీనికే సరిపోతుంది.భారత దేశం
ప్రతి సంవత్సరం 22,000 మెట్రిక్ టన్నుల కాగితాన్ని ఉపయోగించుకుంటున్నది.2016 జూన్ ఆఖరుకి
Reserve Bank of India (RBI) తయారు చేసి వదిలిన నోట్ల సంఖ్య 21.2 బిలియన్లు.వాటికి
అయిన ఖర్చే పైన మనం చూసిన 4,321 కోట్ల రూపాయలు.ఈ ఖర్చును తగ్గించి పేపర్ కరెన్సీ వాడకం
వల్ల ఎదురయ్యే సవాళ్ల నుంచి ఆర్ధిక వ్యవస్థని రక్షించటానికే మోదీగారు
De-Monitization అస్త్రాన్ని ప్రయోగించారు.ఏమైతేనేం, 2015 నుంచి out-sourcing ఆగిపోయింది.ప్రస్తుతం
అన్ని 500, 2000 నోట్లూ మైసూరులోనే తయారవుతున్నట్టు తెలుస్తున్నది - రిజర్వ్ బ్యాంక్
పూర్తి వివరాల్ని చెప్పటం లేదు. మన నోట్లని మనమే ముద్రించుకోవటం మొదలుపెట్టిన 90 యేళ్ళకి
పూర్తి స్వదేశీ నోట్లని వాడుకోగలుగుతున్నాం - నిజంగా గొప్ప విషయమే!
డబ్బు ప్రజల మధ్య ఎలా వ్యాపిస్తుంది అనేది
కేవలం పరిచయం మాత్రమే గనక పైపైన తడిమి వదిలేశాను.ఇప్పటినుంచి విషయం క్రమేణ సంక్లిష్టం
అవుతుంది.ఈజీగా తేల్చెయ్యాలంటే రిజర్వ్ బ్యాంక్ ఎలా పని చేస్తుందో చెప్పేస్తే చాలు.కానీ,
ఇది ఇలాగే ఎందుకు జరగాలి అనే సందేహం తీరాలంటే కొంచెం చరిత్రలోకి తొంగి చూడాలి."దేశభక్తి"
ఇవ్వాళ ఆకర్షణీయమైన పదం. కాని, ఒకప్పుడు "దేశం" అనే పదానికి ప్రాంతం ఆని
తప్ప్ప మరొక ప్రత్యేకత లేదు.అప్పుడు "రాజభక్తి" ఆకర్షణీయమైన పదం - ఈ రెంటికీ
తేడా ఏమిటి?దేశం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి, దేశానికీ రాజ్యానికీ మధ్యన తేడాలూ
పోలికలూ ఏమిటి అని సవాలక్ష సందేహాలతో సతమతం అయిపోకుండా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రాజ్యానికి
కావలసిన డబ్బుని రాజ్యం చెప్పుచేతల్లో నడిచే ఖజానా ముద్రిస్తుంది, దేశానికి కావాల్సిన
డబ్బుని ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండని ఒక సెంట్రల్ బ్యాంక్ ముద్రిస్తుంది.ప్రపంచ చరిత్రలోని
అనేక ప్రాచీన కాలపు రాజ్యాలు విచ్చిన్నమై ఆధునిక కాలపు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతనే
వాటిని దేశాలు అని వ్యవహరించటం గమనిస్తే ఇది ఎంత ఖచ్చితమైన నిర్వచనమో అర్ధం అవుతుంది.
మన దేశపు ఆర్ధిక వ్యవస్థకు అతి కీలకమైన
Reserve Bank of India(RBI) ఒక సర్వస్వతంత్రమైన సంస్థ - 1. Issue of Bank Notes,
2. Banker to Government, 3. Custodian of Cash Reserves of Commercial Banks, 4.
Custodian of Country’s Foreign Currency Reserves, 5. Lender of Last Resort, 6.
Central Clearance and Accounts Settlement, 7. Controller of Credit అనే అతి ముఖ్యమైన
విధుల్ని నెరవేరుస్తున్నది కాబట్టి ఆర్ధికశాస్త్రంలో పట్టు లేని వ్యక్తులు దాన్ని ఉపయోగించుకుని
సత్ఫలితాలు పొందాలే తప్ప దర్పాన్ని ప్రదర్శించితే శృంగభంగం తప్పదు - అటువైపున ఉన్న
రిజర్వ్ బ్యాంక్ గవర్నరు కూడా అహంకారి అయితే తన మీద ప్రభుత్వం చేస్తున్న పెత్తనానికి
కినిసి తప్పుడు సలహాలు ఇస్తే ప్రధాని పరువూ పోతుంది ప్రజలూ కల్లోలానికి గురవుతారు!
రిజర్వ్ బ్యాంకు నోట్లని ముద్రించటానికి
ఉన్న సాంకేతికపరమైన మార్గదర్శకాలు చాలా తక్కువ.ఇందుకోసం 1956లో Minimum Reserve
System అనే ఏర్పాటు చేసుకుంది.దీని ప్రకారం రిజర్వ్ బ్యాంకు సర్వకాల సర్వావస్థల్లోనూ
తన అధీనంలో 200 కోట్ల రూపాయలను బంగారం నిల్వల రూపంలోనూ విదేశీమారకద్రవ్యం రూపంలోనూ
ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది.నోట్ల తయారీలో గానీ ఇతర విధుల విషయంలో గానీ ఇది
ఎలాంటి ప్రభావాన్నీ చూపించకపోయినా ఒక కంపెనీ ప్రభుత్వానికి చూపించాల్సిన మూలధనంలా ఉంటుంది.ఇక
ప్రతి సంవత్సరం కొత్త నోట్లని ముద్రించడానికి స్థూల జాతీయోత్పత్తిని కాక growth
rate అనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.కరెన్సీ అనేది చేతులు మారేది అమ్మకం, కొనుగొళ్ళు
అనేవి జరిగే చోటనే కదా - మరి ఇన్ని కొత్త ట్రాన్సాక్షన్లు జరుగుతాయని రిజర్వ్ బ్యాంకు
ఎలా వూహిస్తుంది?
వూహలతోనూ స్వప్నాలతోనూ ఆర్ధికాన్ని నడిపిస్తే
హార్దికం ఫెడేల్ మంటుంది - గ్రోత్ రేట్ 9% ఉంటే 9 x 2 + 4 = 22% అని లెక్క ఉంది.అంటే
రాబోయే సంవత్సరంలో సాధించగలమని అంచనా కట్టిన గ్రోత్ రేటుకి రెండింతల స్థాయిలో కరెన్సీ
కావాలి,ఇక 4 శాతం అనేది నిరంతరం ఎదుగుతున ఆర్ధిక వ్యవస్థలో ఉండే మినిమం ఇన్ఫ్లేషన్
యొక్క శాతం.ఈ 4% ద్రవ్యోల్బణం వాంఛనీయమే!
మనం ఒక ఉద్యోగం చేస్తే వచ్చే నెల జీతం,మనం
ఒక వస్తువును అమ్మితే వచ్చే లాభం, మనం వేరేవాళ్ళకి అప్పు ఇస్తే వచ్చే వడ్డీ అనే రకరకాల
మార్గాలలో వచ్చే డబ్బు రిజర్వ్ బ్యాంక్ ముద్రించి ఇచ్చినదే అయి వుండాలి - దీన్నే వైట్
మనీ అంటారు.అలా కాక మనం ఒక వస్తువుని లక్ష రూపాయలకి అమ్మి క్రయపత్రంలో పదివేలకే అమ్మినట్టు
రాస్తే ఆ మిగిలిన తొంభై వేలూ బ్లాక్ మనీ అవుతుంది. దీనితో గనక బహిరంగ మార్కెట్టు దగ్గిర
క్రయవిక్రయాల్ని చేస్తే ఠపీమని రిజర్వ్ బ్యాంకు పట్టేసుకోగలుగుతుంది!మరి, నల్ల కుబేరులు
బహిరంగ మార్కెట్టు దగ్గిర దేన్నీ కొనడానికి పనికిరాని పద్ధతిని ఏ లాభమూ లేకుండా ఎందుకు
అనుసరిస్తున్నారు?
నల్ల ధనంలో ఎక్కువ శాతం దేశంలో అరాచకం
సృష్టించే అరాచక మూకలకు ఆయుధాలను కొనుగోలు చేయడానికి పోతుంది,మత సంస్థలకు విరాళాలు
ఇవ్వడం ద్వారా తన నలుపుని తొలగించుకుని కొంత శాతం తెలుపు అయిపోతుంది.దీనికి కేవలం క్రైస్తవ
మత సంస్థలే కాదు హిందూ మత సంస్థలు కూడా సహాయం చేస్తున్నాయి. తర్వాత స్థానం తమకు అనుకూలమైన
నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వంలో ఉన్నవారికి ముడుపుల కింద పోతుంది - జగన్ కావచ్చు,
కేసీయార్ కావచ్చు,చంద్రబాబు కావచ్చు,మోదీ కావచ్చు, అద్వానీ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు,
సుష్మా స్వరాజ్ కావచ్చు - నల్లధనాన్ని సృష్టించేవాళ్ళు గానీ వ్యాపింపజేసేవాళ్ళు గానీ
అందుకునేవాళ్ళు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు నిజమైన అభివృద్ధిని చూపించటానికి
తమ శక్తియుక్తుల్ని ఉపయోగించరు!
మన దేశంలోని పొలిటికల్ అనలిస్టులు చాలామందికి
ఎలెక్షన్ కమిషనులకీ కోర్టులకీ నూటికి నూరు శాతం అటానమీ ఇచ్చేస్తే పొలిటికల్ కరప్షన్ని
మటుమాయం చెయ్యొచ్చుననే మూఢవిశ్వాసాలు ఉన్నాయి.రాజ్యాంగం
ఆయా రంగాలని సృష్టించినది ప్రభుత్వాధినేతల ఉపయోగార్ధం అయితే ఆ రంగాలకి సర్వస్వతంత్రత
ఇవ్వడం సాధ్యం కాదనే కామన్ సెన్సు కూడా ఉండటం లేదు ఆయా వ్యవస్థలకి ఫుల్ అటానమీ కోరుకునేవారికి.జాతీయ
స్థాయి చీఫ్ ఎలెక్షన్ కమిషనుకి ఫుల్ అటానమీ ఇవ్వాలంటే ఇప్పటిలా ప్రధానమంత్రి లేక కేంద్ర
ప్రభుత్వం నామినేట్ చెయ్యటంలా గాక మరెలా చెయ్యాలి?దానికి కూఒడా ఎన్నికలు నిర్వహించాలా?అప్పుడు
ఆ ఎన్నికలోనూ ఈ రొచ్చు కనపడదని గ్యారెంటీ గానీ వ్యారెంటీ గానీ ఉందా!అయితే, వీళ్ళెవరికీ
తెలియని వింత యేమిటంటే రిజర్వబ్యాంకుకి ఆ ఫుల్ అటానమీ ఉంది.కేవలం చైర్మన్ని నియమించటం,
ఆయన జీతభత్యాలనూ ఆయన కింద పనిచేసే
ఉద్యోగుల జీతభత్యాలనూ ఖజానా నుంచి చెల్లించటం మినహా ప్రధానమంత్రి గానీ రాష్ట్రపతి గానీ పనితీరులో
జోక్యం చేసుకోలేని స్థాయిలో సర్వస్వతంత్రతని రిజర్వ బ్యాంకుకి దఖలు పర్చింది రాజ్యాంగం.
అసలైన దుర్మార్గం ఏమిటంటే రిజర్వ బ్యాంకు
యొక్క ఏడు విధులూ రిజర్వ బ్యాంకు భారత ప్రభుత్వం మీద పెత్తనం చెయ్యడానికే తప్ప భారత్
ప్రభుత్వం రిజర్వ బ్యాంకు మీద పెత్తనం చెయ్యడానికి వీల్లేని సుకుమారమైన అమాయకపు సాంకేతికత
చాటున దాక్కుని దేశానికి కావాల్సిన డబ్బుని శాసించే అధికారాన్ని ప్రభుత్వం చెప్పుచేతల్లో
ఉండని ఒక సెంట్రల్ బ్యాంక్ చేతిలో పెట్టాయి. దీనివల్ల ఎవరికీ అనుమానం రాని రీతిలో జరుగుతున్న దొంగ నాటకం
ఏమిటంటే, ఒక రూపాయి నోటు జీతం రూపంలో గానీ లాభం రూపంలో గానీ వడ్డీ రూపంలో గానీ నీ చేతికి వస్తున్నదంటేనే అది రిజర్వ్
బ్యాంక్ నీకు అప్పుగా ఇచ్చినట్టు,నువ్వేదయినా వస్తువుని ఎవరి దగ్గిరయినా కొంటే తిరిగి
రిజర్వ్ బ్యాంకుకి తీసుకున్న అప్పుని చెల్లించేసినట్టు.నమ్మకం లేదా?
రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు వెనక్ ఉన్నది
దోపిడీని చట్టబద్ధం చెయ్యడం అనే విషయంలో అనుమానం ఉంటే మీరు ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని
తిరిగి చెల్లించేటప్పుడు జరిగే తంతుని గమనించండి.Loans rely on the honesty of the
borrower but not the honesty of the lender అనేది ఎంతమందికి తెలుసు?మనం అప్పు కోసం
మనకు తెలిసిన వడ్డీవ్యాపారి దగ్గిరకి వెళ్ళినప్పుడు అతని దగ్గిర ఉన్న డబ్బుని తీసుకునేది
మనం కాబట్టి అతను తన కష్తార్జితాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం అతని డబ్బుని వడ్డీతో
సహా తిరిగి చెల్లించగలమని గ్యారెంటీ ఇవ్వడం సబబే అనిపిస్తుంది.ఒకటో రెండో సార్లు మనం
ఋణగ్రహీతలుగా ఉన్నప్పటికీ ఒకవేళ మనం భవిష్యత్తులో ఋణదాతగా మారితే మనమూ అతనిలానే మన
డబ్బును వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవడం కోసం గ్యారెంటీలు అడుగుతాం కదా అనిపిస్తుంది.
వ్యక్తిగా అతను మంచివాడో చెడ్డవాడో అనవసరం,అతను
మనకిచ్చే డబ్బు ఎక్కణ్ణించన్నా కొట్టుకొచ్చినా మనకు తెలిసే అవకాశం లేదు - అతని చేతినుంచి
విచ్చు రూపాయలు మన చేతికి వస్తున్నాయి కాబట్టి అతని కష్టార్జితాన్ని గురించి మనం ఎదవ
డౌట్లు వేస్తే ఏమవుతుంది, అతను అప్పు ఇవ్వడు.మరి, ఆ అప్పు చెయ్యక తప్పనిసరి పరిస్థితిలో
ఉన్న మన గతి యేంటి? ప్రపంచం మొత్తం మీద వ్యక్తులుగా చేసే వడ్డీ వ్యాపారమూ సంస్థలుగా
చేసే బ్యాంకింగ్ వ్యాపారమూ నష్టం లేని లాభాన్ని పిండుకోగలుగుతున్నది ఋణగ్రహీతల యొక్క
అనేకానేకమైన దురాశావ్యామోహాలనుంచి పుట్టిన బలహీనతల వల్లనే!కొట్టుకొచ్చినదే కావచ్చు,
తన అధీనంలో ఉన్న డబ్బునే అప్పుగా ఇస్తే అది నూటికి నూరు శాతం న్యాయమే అనుకోవచ్చు!
కానీ తన అధీనంలో లేని డబ్బుని అది తన అధీనంలో
ఉన్నదేనని బొంకి తనే మనకి ఇచ్చినట్టు ఒప్పందపత్రం రాసుకుని 100 మనకిచ్చి తను మన దగ్గిర్నుంచి
150 తీసుకున్నాడని తెలిస్తే ఒప్పందపత్రం మీద సంతకం చేసిన మన విశ్వసనీయత దెబ్బ తింటుంది
కాబట్టి ఇచ్చేస్తాం గానీ అతను మనకి 0 రూపాయలు ఇచ్చి మననుంచి 150 రూపాయలు తీసుకోవడం
మోసమని తెలిసి మనసు ఉసూరుమంటుంది, అవునా?కానీ మీరు ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి అప్పు
తీసుకునేటప్పుడు మీకు అప్పురూపంలో ఇస్తున్న నోట్ల కట్టలు అతని అధీనంలో ఉన్న న్యాయమైన
ఆర్జన నుంచి ఇస్తున్నవి కాదు.బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఒక బ్యాంకు తన అప్పటి నికర
ఆస్తుల విలువను మించిన అప్పును ఇవ్వవచ్చును.అయితే ఈ బ్యాంకింగ్ చట్టాలు ప్రజల పట్ల
నిబద్ధత గల నాయకులు చట్టసభలలో చర్చించి రూపొందించినవి కాదు.యదవ పన్లకి ల్యాబరేటరీ కింద
వాడేసుకుంటున్న అమేరికాలో బ్యాంకర్లు వాళ్ల కోసం తయారు చేసుకున్న చట్టాల్ని చట్టసభలో
ఉన్న వాళ్ళ పెంపుడు కుక్కల చేత ఆమోదింపజేసుకున్నారు.
మరొకసారి టూకీగా చెప్తాను.మీరు ఒక బ్యాంకునుంచి
1000 రూపాయలు అప్పు తీసుకున్నారు.మీకు ఆ వెయ్యి రూపాయల నోట్లకట్టల్ని రిజర్వ్ బ్యాంకునుంచి
తీసుకుని మీకు ఇస్తున్నట్టు తన ఖాతా పుస్తకంలో ఎక్కించేటప్పుడు అతని మొత్తం ఆస్తుల
విలువ వంద రూపాయలే ఉంటుంది - అనుకోండి!మీవైపునుంచి మీరు తను ఇచ్చిన 1000 రూపాయలకీ వడ్డీతో
కలిపి ఇవ్వగలరనే గ్యారెంటీ ఇచ్చే పత్రాలు ఇస్తారు, దురదృష్టం వల్ల గానీ మరే ప్రతికూలత
వల్ల గానీ అలా తిరిగి ఇవ్వలేకపోతే మహారాజశ్రీ కోర్టు వారు కలగజేసుకుని మిమ్మల్ని ఖైదు
చేసీ మీ ఆస్తుల్ని జప్తు చేసీ అతనికి 1000 రూపాయలకు తగ్గకుండా జమ చేయించే నిబంధనలకు
మీరు చచ్చినట్టు ఒప్పుకుంటారు.సరే, అలాంటి దురదృష్టాలు ఏవీ ఎదురు కాలేదు, సంవత్సరం తర్వాత 1500 అయిన మొత్తాన్ని
అతనికి ఇచ్చేశారు - అనుకోండి!అతని దగ్గిర 100 రూపాయలు ఉన్నప్పుడు మీకు 1000 రూపాయలు
ఇచ్చాడు,అందులో 1000-100=900 ఎక్కడి నుంచి వచ్చాయి?ఇదివరకు అయితే తెలియదు అనిపించేది,
కానీ అది శూన్యం నుంచి సృష్టించిన మాయ డబ్బు ఆనెది ఇప్పుడు తెలుస్తుంది,కదూ!ఇప్పుడు
మీరు ఇచ్చిన 1500 నుంచి 100 తీసి పక్కన పెడితే 1400 ఎక్కడినుంచి వచ్చాయి?సంవత్సరం క్రీతం
అయినా ఇప్పుడయినా అది మీకు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే వస్తుంది, అవునా?అంటే, ఇప్పుడు
మీరు భవిష్యత్తులో 1500 సంపాదించగలను అనే ధీమాతో 1000 రూపాయలు తీసుకున్న సంవత్సరం తర్వాత అతనికి మీరు తిరిగి ఇచ్చిన
1500 రూపాయల నుంచే అతను సంవత్సరం క్రితం మీకు ఇచ్చిన 1000 రూపాయలూ ఉన్నాయి - అతను మీకిచ్చిన
వెయ్యి రూపాయలకి అదనం కలిపి అతనికి ఇచ్చిన 1500 మొత్తంలో 100 రూపాయలు మాతమే బ్యాంకు
యజమాని కష్టార్జితం అయినప్పుడు మీరు అతనినుంచి తీసుకున్న 1000 కూడా మీ కష్టార్జితమే
కదా!మన డబ్బునే మనం బ్యాంకు యజమానినుంచి తీసుకుని దానికి వడ్డీ కలిపి బ్యాంకుయజమానికి
తిరిగి ఇవ్వటం న్యాయమా!
ఇంత సుకుమారమైన దోపిడీని న్యాయం అనిపిస్తున్న
అతి ముఖ్యమైన ఆర్ధిక చట్రాన్ని శాసించే రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన అన్ని మార్గదర్శకాల్నీ
రూపొందించింది సాక్షాత్తూ అంబేద్కర్ మహానుభావుడే.రిజర్వ్ బ్యాంక్ మన దేశపు ప్రభుత్వం కన్న అంతర్జాతీయ ద్రవ్యనిధికే ఎక్కువ
అనుసంధానించబడి వుంటుంది!కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్ లోటుని ఎక్కడి
నుంచి తీసుకుంటున్నాయి - రిజర్వ్ బ్యాంకు నుంచే కదా!ఆ రిజర్వ్ బ్యాంకు ఎక్కడి నుంచి తీసుకుంటున్నది?అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తను
అప్పు చేసి తెచ్చి మన ప్రభుత్వాలకి అప్పు ఇస్తున్నది.కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాలలో
గానీ మేధావుల బడ్జెట్ విశ్లేషణలలో గానీ రాబడి పోబడి లెక్కలనే చూపిస్తారు, డెఫిసిట్
వస్తే అంకెల్ని మాత్రం చెప్పేసి వూరుకుంటారు గానీ ఆ డెఫిసిట్ స్థానంలోకి తెచ్చే అప్పు
స్వతంత్రం వచ్చినప్పటినుంచి తీరకుండా ఉన్న అప్పుకి ఇంకెంత పెంచుతుంది అనేది మాత్రం
చెప్పరు - అసలు ఆ ప్రస్తావననే దాటవేస్తారు.
ఈ మొత్తం కనిపిస్తున్న ఆర్ధిక చట్రం సంప్రదాయకమైన
ఆర్ధిక శాస్త్రం ఆమోదించినది కాదు,లూసిఫర్ మతస్థులైన ఇల్యూమినాటీలు వండివార్చిన
Rothschilds Banking System అనే విషవృక్షానికి పుట్టిన కొమ్మల్లో ఒకటి - Debt
based Economy అంటారు దీన్ని.దీన్ని రుద్దడమే ఒక కుట్ర అయితే ఇప్పుడు దీనిమీదకి క్రిప్టో
కరెన్సీని కూడా ఎక్కిస్తున్నారు.
ప్రాచీన మధ్య యుగాల నాటి భారత దేశపు చరిత్రను
కమ్యూనిష్టు చరిత్రకారులూ కాంగ్రెసు మేధావులూ కలిసి వండివార్చిన గ్రంధాలను బట్టి చూసినప్పటికీ
ఆ రెండు యుగాల నాడు జీవించిన మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ ఈనాడు జీవిస్తున్న మానవ
సమూహం యొక్క సంస్కృతిలోనూ పూర్తి తేడా కనిపిస్తుంది.చాలా వెనక్కి వెళ్ళనక్కరలేదు,
CE 1960ల నాడు పుట్టిన మా తరానికి మా పెద్దలు ఒకప్పుడు బాధతోనూ ఒకప్పుడు నవ్వుతూనూ
చెప్పుకున్న తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోగలగడం ఎట్లా సాధ్యపడిందో తెలుసా
- ఆనాడు జీవించిన మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ ఈనాడు జీవిస్తున్న మానవ సమూహం యొక్క
సంస్కృతిలోనూ పూర్తి తేడా కనిపించడం ఇటీవలనే జరిగిన ఒక కుట్ర ఫలితం గనక!
నాణెపు వ్యవస్థను తీసేసి పేపర్ కరెన్సీకి
జనాన్ని అలవాటు చెయ్యడం వల్లనే మన దేశంలోని సాంస్కృతిక పరమైన విధ్వంసం జరిగందనేది నేను
బల్లగుద్ది చెప్పగలను!ఎందుకంటే, చరిత్ర కందని పూర్వ కాలం నుంచీ వీళ్ళు ధ్వంసం చెయ్యక
ముందు వరకు ప్రజల శ్రమకు నాణెం ఒక భౌతికరూపం.అది ఎలాగంటే, ఒక రాజు ఒక నాణెం ముద్రించలంటే
అంతకు ముందర పన్నుల రూపంలో ఖజానాకు చేరిన లోహం నుంచే తీసుకునేవాడు.ఒకవేళ వ్యాపారస్థులు
తమ వ్యాపారం కోసం అదనపు నాణేలు కావాలంటే లోహాన్ని తనే టంకశాలకు ఇచ్చి తయారు చేయించుకునే
వాళ్ళు.చాలా సహజంగా నాణేనికి వాడే లోహం అన్నిటికంటే విలువైనది కాబట్టి ఇతర వస్తువుల
దరల్ని నిర్ణయించడం కూడా ఎంతో సరళంగా వుండేది.భూమినుంచి పుట్టే ప్రతి వస్తువుకీ ధరను
నిర్ణయించాల్సిన అవసరం కూడా వుండేది కాదు.అవసరం,లభ్యత, లాభం వంటి అంశాలని బట్టి వస్తువులకి
ధరలను నిర్ణయిస్తే సరిపోయేది.ఉదహరణకి అప్పట్లో అన్నాన్ని అమ్మడం శిరఛ్చేదం విధించదగిన
భయంకరమైన నేరం,ఇవ్వాళ హోటల్ లేని నగరాలే కాదు, పల్లెటూళ్ళు కూడా లేవు!
మానవులకే కాదు మానవులు తయారు చేసిన వస్తువులకి
కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి,తమని వాడుతున్న మనుషులకి తమ సవ్భావాలను అంటుంచే శక్తి
కూడా ఆ వస్తువులకి ఉంటుంది.లోహపు నానేఅలు వాడుతునన్ కాలంలో నైతికపరమైన విశృంఖలత చాలా
తక్కువగా ఉండటమూ పేపర్ కరెన్సీని వాడుతున్నప్పుడు నైతికపరమైన విశృంఖలత చాలా ఎక్కువగా
ఉండటమూ కాకతాళీయం కాదు.ఒక రాజ్యంలోని అత్యంత విలువైన లోహం నుంచి నాణెం తయారు చేసి కొత్తగా
విఉవను నిర్ణయించాల్సిన వస్తువుకూ ఆ నాణేనికీ సంబంధం కలుపుతున్నప్పుడు జరిగేది ఆ వస్తువుకు
అంతకు ముందర లేని విలువ/మర్యాద/గౌరవం హెచ్చుతున్నట్లు ఆ నాణేన్ని వాడుతున్న వ్యక్తుల
స్వభావంలో ఉన్నతమైనవీ తమకు గౌరవాన్ని పెంచేవీ అయిన అంశాల పట్ల ప్రీతి కలుగుతుంది.
ఒక దేశంలోని అత్యంత చవకైన కాగితం
నుంచి నాణెం తయారు చేసి కొత్తగా విలువను నిర్ణయించాల్సిన వస్తువుకూ ఆ నాణేనికీ సంబంధం
కలుపుతున్నప్పుడు జరిగేది ఆ వస్తువుకు అంతకు ముందర ఉన్న విలువ/మర్యాద/గౌరవం తగ్గుతున్నట్లు
ఆ నాణేన్ని వాడుతున్న వ్యక్తుల స్వభావంలో చవకబారువీ తమకు న్యూనతను తెచ్చిపెట్టేవీ అయిన
అంశాల పట్ల ప్రీతి కలుగుతుంది.
క్రిప్టో కరెన్సీ నిర్మితి వెనక ఉన్న మరొక
విచిత్రమైన లక్షణం షేర్ మార్కెట్ల మాదిరి స్పెక్యులేషన్ని బట్టి షేరు విలువ మారినట్టు
డిమాండును బట్టి నాణెం విలువ మారడం - నాణెం అనేది స్థిరమైన విలువతో ఉండి దానితో సంబంధం
కలుపుతున్న వస్తువుల ధరలను మార్పు చేర్పులకు గురిచెయ్యడం న్యాయం అయితే ఇక్కడ నాణేనికే
విలువ మారడం ఎలా జరుగుతున్నది?గుడ్డెద్దు చేలో పడినట్టు వూరూ పేరూ లేనివాడెవడో కనిపెట్టాడు,మనకి
లాభం వస్తున్నది గాబట్టి వాడేసుకుందాం అనుకోవటమే తప్ప వాడుతున్నవాళ్ళలో ఎవరికీ భవిష్యత్తులో
తమకే బ్యాండు పడితే లాభం సంగతి అట్లా ఉంచి చిప్పకూడు తినాల్సి వస్తుందేమో అనే అనుమానం
కూడా రావటం లేదు - పోగాలము దాపరించినవాడు అని చెప్పి పెద్దలు ఏయే పనులను గురించి హెచ్చరించారో
ఆయా పనుల్ని జంకూ గొంకూ లేకుండా చేసేస్తున్నారు.
ఇప్పుడు వేలాంవెర్రి కింద తయారిన షేర్
మార్కెట్ ఇన్వెస్టర్లూ ఆ ఇన్వెస్టర్ల సలహాలు విని షేర్లు కొంటున్న కస్టమర్లూ తమ ఒక్కొక్కరి
ట్రాన్సాక్షన్లలో కొన్ని సార్లు నష్టపోయినా మళ్ళీ లాభం రావడంతో సంతృప్తి పడిపోయి కొనసాగుతున్నారు
గానీ మొత్తం అందర్నీ కలిపి లెక్కలు వేస్తే ఆ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఎవరి వల్ల
మారుతున్నాయో ఆ ఇన్సైడర్లకి అస్మదీయులైన కొందరికే అనియతమైన లాభలు వస్తున్నాయనేది తెలుస్తుంది.మహాకవి
శ్రీశ్రీ లాంటూవాళ్ళు తమ జీవితాల్లో అనుభవించి పలవరించిన బ్లాక్ మండే ఇన్సైడర్ల మాయాజాలమే.ఒక్క
అమేరికాలో చంకనాకిపోయి ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లలో ఇన్వెస్టర్లే అక్షరాల 10,000 మంది
అయితే మామూలు కష్టమర్లు లక్షల్లో నమోదు అయ్యారు.
గత యాభయ్యేళ్ళలో మనం వార్తాపత్రికల్లో
చూసి గుండెలు బాదుకున్న ప్రతై కుంభకోణం వెనుకా ఉన్నది బ్యాంకులే!ద్రవ్యోల్బణం(inflation)
అనేది దానంతటది రాదు - రిజర్వ బ్యాంకు ప్రమేయం లేనిదే inflation గానీ దాని బాబు లాంటి
deflation గానీ ఉనికి లోకి రావు.ఇప్పటి ఆర్ధిక వ్యవస్థయే సంప్రదాయకమైన ఆర్ధిక శాస్త్రం
ఆమోదించని Debt based economy అనే వికృతమైనది అయితే దీనినుంచి బయట పడాల్సింది పోయి
దీనిమీదకి క్రిప్టో కరెన్సీ అనే మరొక దరిద్రాన్ని తెచ్చి పెట్టటం అమానుషం.
ఇది నూతన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పేరున
చెలరేగిపోతున్న ఇల్యూమినాటీల వ్యూహమే అని చెప్పటానికి కనబడుతున్న ప్రముఖమైన సాక్ష్యం
Satoshi Nakamoto గురించిన నిగూఢతయే.వాళ్ళ గురించి ఈ మధ్యనే రెండు విచిత్రమైన విషయాలు
తెలుసుకున్నాను.ఒకటి Rothschilds అనేవాళ్ళు ఒకప్పుడు ఆ స్థాయిలో రాజ్యాల మీద పెత్తనం
చేసి ఆయా దుర్మార్గాలు చేసినప్పటికీ తర్వాత కాలంలో వాళ్ళ పట్ల వ్యతిరేకత పెరిగీ వాళ్ళ
వ్యాపారాలలోకి ఇతరులు చొరబడీ వాళ్ళ ప్రాభవం నశించిపోయి కనుమరుగైపోయారనే వార్తా కధనాలు
ఎక్కువయ్యాయి.రెండవది వాళ్ళు తమ 2050 నాటికి నూతన ప్రపంచ రాజ్యపు ఏర్పాటు అనే లక్ష్యం గురించి ఒక పరిశోధకుడికి రిపోర్టు ఇమ్మని పురమాయిస్తే
అతను ఇంటర్నెట్ వల్ల వాళ్ళు దాచెయ్యాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్లని గురించిన
సమస్త సమాచారమూ అందరికీ తెలిసిపోవడం వల్ల 2050 నాటికి నూతన ప్రపంచ రాజ్యం ఏర్పడటం దాదాపు
అసాధ్యం అని తేల్చి చెప్పాడనే ఒక వార్తా కధనం ఒకటి కనబడి అదృశ్యమైపోయింది. బహుశః అందువల్లనే
Satoshi Nakamoto అనే తమ అంతరంగికుడిని అనామక స్థాయిలో ఉంచేశారు కాబోలు!
అక్రమార్జనపరులు తమ నల్లధనాన్ని తెల్లధనం
చేసుకోవడానికీ దురాశాపరులు కన్నుమూసితెరిచేలోపు కోట్లకి పడగలెత్తడానికీ తప్ప దేశపు
ఆర్ధిక స్వావలంబనకు ఎటువంటి ప్రయోజనమూ లేని క్రిప్టో కరెన్సీని నిషేధించడమే ఉత్తమం.ఈ
నూతన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పట్ల హైందవేతర సమూహాలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు,ఉండదు.నిన్న
గాక మొన్న 43 నెలల నూతన ప్రపంచ రాజ్యం వస్తున్నది,మనం ఎదురేగి స్వాగతించుదాం అని ఒక
పాష్టరు వేసిన పోష్టరు చూశాను.అంటే, వాళ్లకి లూసిఫర్ మతస్థులు చేస్తున్న దరిద్రాలు
అన్నీ తెలుసు,వాళ్ళు కూడా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు అనే కదా దీని అర్ధం - కాకపోతే
నరంలేని నాలికని మడతపెట్టి వాళ్ళు వేసే మెలిక ఏంటంటే అది తెస్తున్నది సాతాను భక్తులే,
అయినప్పటికీ 43 నెలల తర్వాత మా ఏసు వస్తాడు అని,వాళ్ళని తుదముట్టిస్తూ దేవుడి రాజ్యం
ఏర్పాటు చేస్తాడు అని!
ఒక్క హిందువులకి తప్ప కమ్యూనిష్టులతో సహా
ప్రతి ఒక్కడికీ 2050 నాటికి లూసిఫర్ మతస్థులు ఏర్పరచబోతున్న నూతన రాజ్య వ్యవస్థ ఎట్లా
ఉంటుందో తెలుసు.వాళ్ళు దాన్ని ఆమోదిస్తున్నారు కూడా.హిందువులకే తమ చుట్టు ఎంత భయంకరమైన
కుట్ర నడుస్తున్నదో తెలియడం లేదు.గతంలో మనం చూపించిన అజ్ఞానమే మనల్ని ఇప్పుడు కష్టపెడుతునదనేది
తెలుసుకోవాలి తప్ప వాళ్ళనీ వీళ్ళనీ నిందించి ప్రయోజనం లేదు.ప్రస్తుతం ప్రతి హిందువూ
క్రిప్టో కరెన్సీని వాడకూడదనే సంకల్పం తీసుకోవాలి.భారతీయ జనతా పార్టీ అభిమానులూ కార్యకర్తలూ
నాయకులూ తమ జాతీయ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేసి క్రిప్టిఎ కరెన్సీని నిషేధించేలా
చెయ్యాలి.
జై శ్రీ రాం!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు