Wednesday 31 May 2023

వేదం అంటే ఏమిటి?వేదం ఎందుకు చదవాలి?వేదం అపౌరుషేయమా!

హిందువుల పవిత్రగ్రంధమైన వేదాన్ని అపౌరుషేయం అంటారు.అపౌరుషేయం అంటే మనుషులు సృష్టించినది కాదు అని అర్ధం. - దాదాపు ప్రపంచంలోని అన్ని మతాలూ తమ మతానికి ఆధారమైన మూలగ్రంధాన్ని దేవుడు తమకు ఇచ్చిన పవిత్రగ్రంధం అంటున్నాయి - మరి,వేదం ప్రత్యేకత ఏమిటి?

ప్రస్తుతం హిందూమతం కాక ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసినవి - జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం.వీటిలో మతం యొక్క మొత్తం అనుష్ఠానం మతాన్ని స్థాపించిన ఒకే ఒక వ్యక్తి ముఖతః వచ్చినవి.బుద్ధుడు మతాన్ని స్థాపించకముందు వైదిక ధార్మిక సాహిత్యంలో మంచి పాండిత్యం ఉన్నవాడు. దేవుణ్ణి గురించి చెప్పకుండా పూర్తి లౌకిక మరియు భౌతిక విషయాల ప్రాతిపదికన ధర్మచక్రప్రవర్తన పేరుతో ఒక భిక్షు సంఘాన్ని నిర్మించాడు గనక బౌద్ధులకి దేవుడు ఇచ్చిన గ్రంధం అంటూ ఏదీ లేదు.జుదాయిజం మూలపురుషుడైన అబ్రహాం తోరాని నిర్మించబోయేనాటికి చక్కని సంస్కారం ఉన్న నాగరికుడి వలెనూ ఆధ్యాత్మిక విషయాల్లో పండితుడి వలెనూ కనబడతాడు - తాను జిజ్ఞాస కొద్దీ దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకున్నానని ప్రకటించాడు, తోరా నిర్మాణం కూడా ఒక శిష్యుడికీ అతని గురువుకీ మధ్యన జరిగిన ప్రశ్నోత్తరావళి మాదిరి ఉంటుంది.

క్రైస్తవుల పాత నిబంధన అబ్రహాము యొక్క తోరాకు అసలుకీ నకిలీకి మధ్య తేడా తెలియనివ్వని రూపమార్పిడితో అలరారుతూ ఉంటుంది!ఇక సారం తెలిసినవారు మహమ్మదీయుల ఖురానును అరబిక్ భాషలోకి తర్జుమా చెయ్యబడిన తోరాకు జిహాదిక్ హింసని కలిపిన పొడిగింపు అని అంటారు. జిహాదిక్ హింసని ప్రేరేపించే కొత్త చేర్పిడి భాగాల్ని తీసెయ్యడానికి మహమ్మదీయులు పొరపాటున కూడా ఒప్పుకోరు - అది తీసేస్తే తమ మతం జుదాయిస్టు మతానికి నకలు అయిపోతుందని వారికీ తెలుసు.పోనీ జుదాయిజమునే అనుసరించవచ్చు గదా అంటే ఇప్పుడు తమకు దఖలు పడుతున్న ద్రవ్యాకర్షణ తగ్గుతుందని భయం!

అసలు దయనీయమైన విషయం, దేవుడు తమ ప్రవక్తలకి చెప్పిన పరమ సత్యాలతో కూడిన దైవగ్రంధాలు అని చెప్పబడుతున్న బైబిలు,ఖురాను ఎంత అసభ్యకరమైన విషయాలతో నిండి వున్నాయంటే కొన్ని దేశాలలో ముఖ్యంగా టూరిస్టుల ఎద్దడి ఉండే నగరాలలో వీటిని బహిరంగ వేదికల మీద చదవటాన్ని నిషేధిస్తున్నారు - మరి,ఇంత అసభ్యతని తీసుకెళ్ళి దేవుడికి అంటగడుతున్నట్టు లేదూ వారి నిర్వాకం!

 అయితే, హిందువులకు పరమ ప్రమాణమైన వేదం ద్యోతకం కాబోయే ముందు వైదిక ఋషులు వీళ్ళ ప్రవక్తల వలె నిశానీలు కాదు,అప్పటికే గురుశుశ్రూష ద్వారా తగినంత జ్ఞానం సంపాదించి తమకు అర్ధం కాని ఒక విషయం గురించి తపస్సు చేస్తున్నవాళ్ళు!"For every meditation there must be a target" అనేది ఇవ్వాళ రోజువారీ ప్రశాంతత కోసం చేసే మామూలు మెడిటేషన్ ప్రక్రియకి ముఖ్యమైన సూత్రం - అట్లాంటిది లక్ష్యమూ లేకుండా తపస్సు మొదలుపెట్టరు కదా!మరి, అంత శ్రమపడి కనుక్కున్న దాన్ని కూడా "ఇది నా గొప్పే!ఇది నా గొప్పే!నాకు తప్ప ఇంకెవరికీ తెలిసేది కాదోచ్!" అని గొప్పలు చెప్పుకోకుండా "అయ్యా!ఇది నా గొప్ప ఎంత మాత్రం కాదు, దేవుడే నాకు చెప్పాడు.నేను నిమిత్తమాత్రుణ్ణి" అని ఎందుకు వినయం చూపించారు?

సత్యం ద్యోతకం కాబోయే ఒక నిముషం ముందు కూడా మరు నిముషం తమకు సత్యం ద్యోతకం కాబోతున్నదని  వారికే తెలియని విషయం పద్ధతిలో సత్యాల్ని దర్శించిన వైదిక ఋషులందరికీ అనుభవైకవేద్యమే గనుక అలా గొప్పలు చెప్పుకుంటే పరిహాసపాత్రులు కావడం తప్ప ప్రయోజనం ఉండదు!" మతాల ప్రవక్తలకి సాధ్యం కానిది వైదిక ఋషులకి ఎట్లా సాధ్యపడింది?తమ శ్రమతో సాధించిన దాన్ని కూడా ఉన్నాడో లేడో తెలియని దేవుడికి అంటగట్టటం అబద్ధం చెప్పడం కాదా?కొందరికి మాత్రమే ఇట్లాంటివి సాధ్యం కావడం మనుషుల్లో అసమానతలని పెంపొందిస్తుంది కదా!వీటిలో హేతుబద్ధత లేదు.ఇవన్నీ సుర అనగా కల్లు తాగి వాగిన లొల్లాయి పాటలు మాత్రమే." అనేవాళ్ళకి ఒక నమస్కారం పెట్టి వూరుకోవడం తప్ప మనం వాళ్ళ చేత వేదాలు గొప్పవి అని ఒప్పించడం అసాధ్యం!

అయితే హిందువులు అందుకు ఎంతమాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు.యూరుల తోరా యూదుల్ని మాత్రమే తరింపజేస్తుంది,క్రైస్తవుల బైబిల్ క్రైస్తవుల్ని మాత్రమే తరింపజేస్తుంది,ముస్లిముల ఖురాన్ ముస్లిముల్ని మాత్రమే తరింపజేస్తుంది - కానీ వేదం సకల మానవాళినీ తరంపజేస్తుంది.

వేదం అనే పదానికి మూల ధాతు రూపం "విద్" - దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం "to know".అంటే,మానవుడు తెలుసుకోగలిగిన, తెలుసుకోవలసిన, తెలుసుకోదగిన జ్ఞానం అని అర్ధం!వేదం ఒక మతగ్రంధం కానే కాదు, సార్వకాలిక సత్యాల సమాహారమైన విజ్ఞానసర్వస్వం.వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే Branch of Study అని అర్ధం.వేదములు నాలుగు - 01.ఋగ్వేదం,02.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు,03.సామవేదం,04.అధర్వ వేదం. ఇక వేదాంగములు ఆరు - 05.శిక్ష,అంటే Phonetics,06.కల్పం,అంటే Study of Rituals,07.వ్యాకరణం,అంటే Grammer,08.నిరుక్తం,అంటే Etymology,09.ఛందం,అంటే Prosody,10.జ్యోతిషం,అంటే Astronomy. ఇవి కాక ఉపాంగములు నాలుగు - 11.మీమాంస, 12.న్యాయశాస్త్రం, 13.పురాణములు, 14.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి తీసుకుంటే - 15.ఆయుర్వేదం,అంటే Medical Science:ఇది ఋగ్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,16.అర్ధశాస్త్రం,అంటే Economic Science:ఇది అధర్వవేదం నుంచి పెరిగిన శాస్త్రం,17.ధనుర్వేదం,అంటే Military Science:ఇది యజుర్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,18.గాంధర్వవేదం,అంటే Musical Science:ఇది సామవేదం నుంచి పెరిగిన శాస్త్రం.

వీటిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనే వాటిని శృతి అంటే Revealed లేక Perceived అనీ మిగిలినవాటిని స్మృతి అంటే Memorizes లేక Created అనీ అంటారు.ఋగ్వేదం అనేది ఒక Collection of Prayers లాంటిది.యజుర్వేదం అంటే యజ్ఞాలకు సంబంధించిన Sacrificial Manual వలె ఉంటుంది.సామవేదం అనేది Rigvedic hymns in musical form అనేటట్లు ఉంటుంది.ఇక అధర్వవేదంలో మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తమైన Magical Charms ఉంటాయి.

ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాల కింద ఏర్పరచబడి ఉంది:1).మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు. ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక ఇంగ్లీషులో “A compilation of all realized hymns: This section should be the best focus for who is in Brahmacharya-ashrama, that is during the stage of education” అని చెప్తున్నాను. 2).బ్రాహ్మణములు->సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం.ఇంగ్లీషులో “Explanations of how to put them to practical use: This section should be the best focus for who is in Grihastha-ashrama, that is during the stage of householder” అని చెప్తున్నాను.వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి బోధిస్తారు.3).అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం.ఇంగ్లీషులో “Various internal observations to follow: This section should be the best focus for who is in Vaanaprastha-ashrama, that is during the stage of renounceation” అని చెప్తున్నాను.నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని  ఇష్టపడినవారికి బోధిస్తారు.4).ఉపనిషత్తులు-> ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అని చెప్తున్నాను.

వేదం ఒక మతగ్రంధం కానట్లే వేదం పునాదుల మీద నిలబడిన మన జీవన విధానం మతం ఎప్పటికీ కాదు.మనది సనాతన ధర్మం అనీ మనం సనాతన ధార్మికులం అనీ చెప్పుకోవడం ఉత్తమోత్తమం - హిందూమతం అనే పదాన్ని ఇతరులకు అర్ధం కావడం కోసం మాత్రమే వాడాలి. భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో సహా ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న వాటిని కూడా కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యం అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!

వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది. గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చును.

భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ, భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు.అయినప్పటికీ ఏదో ఒక మొదటి తేదీని చెప్పాలని ఉత్సాహపడి చాలామంది ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తారు కూడా.స్వయాన Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1,200BCE నుంచి 1,500BCE మధ్యన అని నిర్ధారించాడు.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,000BCE నుంచి 2,500BCE మధ్యన అని నిర్ధారించాడు.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6,000BCE నుంచి 10,000BCE మధ్యన అని నిర్ధారించాడు.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25,000BCE నుంచి 50,000BCE మధ్యన అని నిర్ధారించాడు. Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.అయితే, వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసిన Prof. Keith గారు మాత్రం "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు.కాబట్టి, ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్పినట్టు వేదం సృష్ట్యాది నుంచీ ఉందని అనుకోవాలి.

వేదంలోని ప్రతి సూక్తానికీ ఒక ఋషి ఉంటాడు.అయితే ఋషికి సూక్తం యొక్క రచయిత హోదాని ఇవ్వరు - ద్రష్ట అని అంటారు, తను చేసిన తపస్సు ఫలించి సర్వేశ్వరుడి కృప చేత సత్యాన్ని దర్శించి ఇతర్లకి చెప్పగలిగిన అనువాదకుడు మాత్రమే.ప్రతి సూక్తానికీ మొదట వినియోగ గద్య ఉంటుంది.ఇందులో సూక్తంలోని విషయం దేనికి సంబంధించినది,ద్రష్ట ఎవరు, సూక్తం యొక ఉపయోగం ఏమిటి అనే విషయాలు ఉంటాయి."జపే వినియోగః" అని ఉంటే అవి దైవ స్తుతులు,వాటిని ప్రతి ఒక్కరూ నిత్య పూజలో వాడుకోవచ్చు.శాస్త్ర సంబంధమైన సూక్తులకి వినియోగం వేరుగా ఉంటుంది.వేదంలోని ఏఒక్క మంత్రమూ చెప్పదల్చుకున్న విషయం గురించి విస్తరించి చెప్పదు.బీజ రూపంలో చెబుతుంది.ఒక చెట్టుని పుట్టించగలిగిన విత్తనాల్ని గుప్పెడు అలాగే తినేస్తే విత్తనం యొక్క ప్రయోజనం అంతటితో ముగిసిపోతుంది.కానీ గుప్పెడు విత్తనాల్ని నేలలో నాటి నీటినీ ఆహారాన్నీ ఇచ్చి పోషించితే ఒక్కో విత్తనం పెరిగి పెద్దదై ఎంతోమంది ఆకలిని తీరుస్తుంది.

బృహదారణ్యకోపనిషత్తు(02.03.01) "ద్వే వావ బ్రహ్మనో రూపే మూర్తంచై వామూర్తం " అని చెప్తున్నది.ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక వాక్యం యొక్క అర్ధం ఇంగ్లీషులో చెప్తాను.God has two modes – formless that is niraakaara and formfull that is saakaara.

దృశ్యమాన ప్రపంచంలో మనకు తెలిసి చలనానికి కారణమైన యాంత్రిక శక్తులు రెండు - స్థితిశక్తి, గతిశక్తి.వాటికి సంకల్పం ఉండదు - ఎవరు ఎక్కడ ఉపయోగించితే అక్కడ తమ విధిని నిర్వర్తించే పనిముట్లు అవి.కాని దైవశక్తికి సంకల్పం ఉంటుంది.వ్యక్తావ్యక్త స్థితుల కతీతమైన అనంతాత్మను ఒక సగం వైష్ణవులు ప్రియమారగ కొలిచే బృందావన రాసలీలా విహారి శ్రీకృష్ణ పరంధాముడూ ఒక సగం శైవులు ఉత్సాహంతో కొలిచే ఆదినర్తన నాయకమణి చిదంబర నటేశ్వరుడూ ఆవరించుకుని ఉంటారు.

వ్యక్తమాన ప్రపంచంలో ఉన్నట్టే అనంతాత్మకు కూడా సత్వరజస్తమస్సులు ఉంటాయి.అయితే, దృశ్యమాన ప్రపంచంలోని స్థావర జంగమాలన్నిటికీ త్రిగుణాలలో ఒకటి ఎక్కువగా ఉండటం సంభవించి అవి అసంపూర్ణసమతాస్థితిలో ఉంటాయి.అసంపూర్ణసమతాస్థితిని thermodynamics పరిభాషలో steady state అంటారు.కొందరు దీనిని incomplete equlibriuam అని కూడా అంటారు.అవ్యక్తం వ్యక్తం కంటె భిన్నమై సత్వరజస్తమస్సులు సమనిష్పత్తిలో పరుచుకుని ఉండి నిరంతరం సంపూర్ణసమతాస్థితిని ప్రదర్శిస్తూ ఉంటుంది.సంపూర్ణసమతాస్థితిని thermodynamics పరిభాషలో complete equlibriuam అని అంటారు.అవ్యక్తం వ్యక్తమయ్యేది equlibriuam చెదరడం వల్ల - అది చెదరడం నటరాజ మూర్తి చేతిలోని ఢమరుకం ప్రకంపించడం వల్లనే అనేది పూర్వఋషుల ప్రాక్కల్పన!

సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న జలం వేడెక్కినప్పుడు వాయురూపం దాల్చడమూ చల్లబడినప్పుడు ఘనరూపం దాల్చడమూ ఎంత సహజమో అవ్యక్తం,వ్యక్తం అనేవి సృష్టికర్తకు అంత సహజమై ఉంటాయి.అవ్యక్తం గురించి మనకే కాదు మన పూర్వఋషులకు కూడా ఎక్కువ తెలియదు.కానీ, వ్యక్తంలోని హేతుబద్ధతను చూసి అదే హేతుబద్ధతను బట్టి అవ్యక్తం గురించి కొన్ని ప్రాక్కల్పనలను చేశారు, అంతే!

అలా అవ్యక్తంలోని equlibriuam చెదరడం వల్ల ప్రకంపన మొదలై ఆదిప్రణవనాదం ఉద్భవించగానే దృశ్యమాన ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన ఇటుకల వంటి పంచభూతాలు ఆవిర్భవిస్తాయి.వీటినే పంచతన్మాత్రలు అని కూడా అంటారు. ’తన్మాత్రఅంటేఅది మాత్రమే అయి ఉన్నదిఅని అర్ధం. తన్మాత్రలు ఏర్పడే సమయం నుంచే ప్రాచీన భారతీయ విజ్ఞానులు సృష్టిని గణితశాస్త్రం యొక్క మౌలికాంశాలతో నిర్వచించడం ప్రారంభించారు. తన్మాత్ర ఆవిర్భవిస్తున్నదో దాని సూక్ష్మాంశం సగమై మిగతా సగంలో ఇతర తన్మాత్రల సూక్ష్మాంశాలు ఎనిమిదో వంతు కలిసి ఒక నూతన తన్మాత్ర ప్రభవిస్తుంది.తొలుదొల్త ఆకాశం ప్రభవిస్తుంది.ఇది అన్నిటికన్న అత్యంత సూక్ష్మమైనదీ,అన్నింటిలోనూ భాగమైనదీ అయిన ఆది తన్మాత్ర - శబ్దం దీని లక్షణం!ఆకాశం నుండి రెండవదైన వాయువు ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ దీని లక్షణాలు!వాయువు నుండి మూడవదైన అగ్ని ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ, రూపం దీని లక్షణాలు!అగ్ని నుండి నాల్గవదైన జలం ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ, రూపం,రసం దీని లక్షణాలు!జలం నుండి ఐదవదైన పృధ్వి ప్రభవిస్తుంది - శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం దీని లక్షణాలు!వ్యక్తమాన ప్రపంచంలోని అనంతకోటి విశ్వాలూ విశ్వధాతువులైన కృష్ణబిలాలూ అరుణతారలూ పాలపుంతలూ గ్రహతారకలూ మొదలైన పదార్ధతత్వాలు అన్నీ పంచతన్మాత్రలతోనే నిర్మించబడి ఉన్నాయి.అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి కారణమైన అవిద్యాయుత అహంకారం తర్వాత రూపాంతరం చెంది "ద్రవ్యశక్తి" అయిన తామసం,"క్రియాశక్తి" అయిన రాజసం,"జ్ఞానశక్తి" అయిన సాత్వికం అని మూడు గుణాలు ఏర్పడినాయి.

అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి శ్రీకృష్ణ పరంధాముడి చేత ఉంచబడిన బీజం అయిన అవిద్యాయుత అహంకారం అనే మాయ వల్ల ప్రతి ఒక్కరికీ తనలోకి చూసుకున్నప్పుడు "ఇది నేను!" అనీ ఇతరాల్ని చూసినప్పుడు "ఇది నాది!ఇది నాది కాదు!" అనీ అనిపిస్తుంది. అయితే, ఇన్నిన్ని వైవిధ్యాలతో కూడిన ఇంతటి సంక్లిష్టమైన సృష్టివిలాసం జరిగినప్పటికీ ఒక తన్మాత్ర కలవకపోతే వ్యక్తమాన ప్రపంచం వ్యక్తం అయిన తొలిక్షణంలో ఎలా ఉందో అలాగే నిశ్చలమై ఉండిపోతుంది - అదే కాల తన్మాత్ర!వ్యక్తమాన ప్రపంచంలోని అన్ని పదార్ధతత్వాలూ కాలం విషయమై - 1). ఒక్క పదార్ధతత్వమూ ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేదు,2). రెండు పదార్ధతత్వాలూ ఒకే సమయంలో ఒకే స్థలంలో ఉండలేవు అన్న రెండు నియమాలను పాటించి తీరాలి. కాలోహి దురతిక్రమం అని పెద్దలు అన్నది అందుకే!

సత్యం,ధర్మం,ఇంద్రియనిగ్రహం,క్షమ వంటివాటి గురించి కొంచెం కష్టపడితే మీరూ నేనూ కూడా తెలుసుకోవచ్చు.తప్పులు చేసీ చేసీ, నాలుగైదు గట్టి దెబ్బలు తిన్నాక, తలమీద కట్టిన బొప్పెల్ని తడుముకుని ఇతర్లకి జాగ్రత్తలు చెప్పొచ్చు.అది పెద్ద కష్టం కాదు.అందులో గొప్ప ప్రజ్ఞ కూడా లేదు.కానీ కాలం అనే ఒక తన్మాత్రను గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్తున్నది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటికీ కాలం గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్పిన దానికి మించి ఎవరూ చెప్పలేకపోయారు, చెప్పలేకపోతున్నారు, చెప్పలేరు కూడా!తనలో ఎప్పుడూ అనేకానేకమైన పదార్ధతత్వాలు నిరంతరం కదులుతూ ఉన్నప్పటికీ కదలికల వల్ల అది ప్రభావితం కాదు.నిన్న,నేడు,రేపు అనేవి కాలంలో మనం ఉన్న స్థితిని గురించి అర్ధం చేసుకోవడానికి మనం ఏర్పరచుకున్న వర్ణనాత్మకమైన పదాలు తప్ప అవి కాలానికి లక్షణాలు కావు.అందుకే కాలాన్ని భగవత్స్వరూపం అనీ భగవంతుణ్ణి కాలస్వరూపుడు అనీ అన్నారు.వైధిక ధర్మం యొక్క ఆధారభూతమైన దైవం శివుడో విష్ణువో దేవియో అగ్నియో వరుణుడో ఇంద్రుడో రాముడో కృష్ణుడో మరొకరో కాదు, ఆదీ అంతూ లేని కాలమే మనకు దైవం అని నేను బల్ల గుద్ది చెప్తున్నాను.దీన్ని కాదనగలిగిన సాహసం ఎంతటి వేదపడితుడూ చెయ్యడని కూడా నమ్ముతున్నాను.

ఆదీ అంతూ లేని కాలం ఒక్కటే శాశ్వతం అయి అవ్యక్తం, వ్యక్తం అనేవి దైవం తనకు తను ఆపాదించుకుని ప్రదర్శిస్తున్న రెండు స్థితులు అయినప్పుడు వాటిని గురించి వేదం ఏమి చెప్తున్నదో చూస్తే మన మొదటి చిక్కుముడి వీడుతుంది. శుక్లయజుర్వేదం మధ్యాంధీన శాఖ లోని 40.09 సంఖ్య వద్ద ఉన్న "అంధం తమః ప్రవిశన్తి యే అసంభూతిం ఉపాసతే, తతో భూయ ఇవ తే తమో సంభూత్యాం రతా" అనే మంత్రం యొక్క అర్ధం "Into the blinding darkness, pass those, who devote in the unmanifest.And into still greater darkness, pass those, who delight in the manifest" అని. అదే యజుర్వేదం కాణ్వ శాఖ లోని 40.09 సంఖ్య వద్ద ఉన్న "అంధం తమః ప్రవిశన్తి యే అవిద్యాం ఉపాసతే, తతో భూయ ఇవ తే తమో విద్యాయాం రతా" అనే మంత్రం యొక్క అర్ధం "Into the blinding darkness, pass those, who devote in the Avidya.And into still greater darkness, pass those, who delight in the Vidyaa" అని.

ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం అనే కాదు అన్ని భాషల్లోనూ ప్రతి పదానికీ antonyms, synonyms ఉన్నాయి.వీటిలో contextual priority అనేది ఒకటి ఉంటుంది.ఒక పదానికి గానీ రెండు పదాల్ని పోల్చడానికి గానీ synonyms తీసుకునేటప్పుడు అందరూ contextual priorityని పట్టించుకోవడం లేదు.చాలామంది వేదసంహితలకి వేర్వేరు అర్ధాలు చెప్పడానికీ వాటిని పట్టుకుని ఇతర్లు గ్రూపుల కింద విడిపోయి తన్నుకోవడానికీ ఇలాంటి దూరాన్వయాలే కారణం అనేది నా తీర్పు.ఇక్కడ చూడండి, activities of destruction అనేది క్రియని సూచిస్తుంది. సంభూతి, అసంభూతి గానీ విద్య, అవిద్య గానీ క్రియలు కావు, అవి nouns. ఇది చిన్న గందరగోళం అయితే దీనివల్ల activities of destruction అనేది అక్కడున్న నాల్గింటిలో దేనికి వర్తిస్తుందో తెలియని పెద్ద గందరగోళం ఆరడుగుల బుల్లెట్టులా దూసుకొచ్చి మతిపోయింది నాకు.ఇక lust of material gatherings అయితే activities of destructionకి అసలు పొసగనే పొసగదు - అది మరో పెద్ద గందరగోళం.

అసంభూతి అనే పదానికి virtual existennce/conceptual existence అనీ సంభూతి అనే పదానికి visual existence అనీ అర్ధాలు చెప్పుకుంటే చాలు.ఇప్పుడు మన గొడవకి పరిష్కారం దొరికేసింది.ఎలాగంటే,"సంభూతి అనేది కంటికి కనబడే మూర్తి అయి, అసంభూతి అనేది కంటికి కనబడని తత్వం అయితే - మూర్తిని చూస్తూ తత్వాన్ని గ్రహించడమే సర్వులకూ ఉభయతారకమైన మార్గం" అనేది నా తీర్పు.అసలు దోషం మూర్తి పూజ చెయ్యటం కాదు. పరిధిని దాటిమూర్తియే సమస్తం, మూర్తి లేనిదే పూజ లేదుఅనీమూర్తియే ఉండకూడదు, మూర్తిని ప్రతిపాదించడమే దోషంమౌనధ్యానమే ప్రశస్తంఅనీ ఎవరికి వారు వితండవాదం చెయ్యటం.మూర్తిపూజకు సంబంధించి వేదం తెలిసిన పెద్దలు కూడా అతి చెయ్యొద్దని చెప్పారు గానీ అసలు చెయ్యొద్దని చెప్పలేదు.అట్లాగే, "అవిద్య అనేది లౌకికశాస్త్రపాండిత్యం అయి, విద్య అనేది బ్రహ్మతత్వజ్ఞానం అయితే - లోకవిద్యలతో అర్ధాన్ని సాధిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మోక్షప్రాప్తి వైపుకు నడవటమే సర్వులకూ ఉభయతారకమైన మార్గం" అనేది నా తీర్పు.

ఒకసారి అర్చామూర్తిని చూసి తత్వం గ్రహించడం సాధించాక ప్రజ్ఞని విశ్వంలోని ప్రతి అంశం యొక్క తత్వాన్ని గ్రహించడానికీ వినియోగించాలి - విష్ణు సాహస్రం "విశ్వం విష్ణుః" అంటూ లలితా సాహస్రం "శ్రీమాతా" అంటూ మొదలైంది అందుకే!జలం అనే తన్మాత్రతో అభిషేకించి, అగ్ని అనే తన్మాత్రతో హారతి ఇచ్చి, వాయుతన్మాత్రకు సంబంధించిన ధూపాన్ని ఆశ్వాసింపజేసి, పృధ్వీతన్మాత్రకు సంబంధించిన పుష్పాలతో పరిషేచన చేసి,ఆకాశ తన్మాత్ర స్వరూపమైన మనస్సును లీనం చేసి మీరు పూజిస్తున్న పాంచభౌతికమైన అర్చామూర్తిలో ఉన్న తత్వమే సృష్టిలోని ప్రతి పాంచభౌతికమైన రూపధారిలోనూ ఉందని మీరు గ్రహించాలి, భావించాలి, బోధించాలి!అలాంటి నిజమైన భక్తి భావన లేనప్పుడు చూపు శివుడి మీదా చిత్తం చెప్పుల మీదా అనే వెక్కిరింతకి మీరు నిలువెత్తు రూపం అవుతారు.

ఇతరులకి అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాల్ని నిజాలని నమ్మి చెప్పటం లేదు,ఎదటివాళ్ళని నమ్మించటం కోసమే ప్రయత్నిస్తూ  అవసరమైతే తాము నమ్ముతున్నట్టు నటిస్తారే తప్ప వాళ్ళు అవి నిజాలని నమ్మడం లేదు!మనం గనక నిజానిజాలు నిర్ధారించుకోకుండా అబద్ధాల్ని నమ్మితే మనకే నష్టం అనేది రెండు మూడు సార్లు అనుభవంలోకి వచ్చాక తప్పకుండా తెలుస్తుంది.అది తెలిశాక మనకి అబద్ధాలు చెప్పినవాళ్ళ నిజస్వరూపం తెలియడం వల్ల మనం వాళ్ళకన్న బలవంతులమైతే నాలుగు తన్ని దూరానికి తరిమి కొట్టడమో వాళ్ళు మనకన్న బలవంతులైతే వాళ్ళనుంచి దూరంగా పారిపోవటమో చేస్తాం, అవునా?ఇతరులు చెప్తున్నవి మనకు హాని చేసే అబద్ధాలని తెలిశాక కూడా వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే పిచ్చివాళ్ళు ఎవరైనా ఉన్నారా మనలో! విధమైన వాస్తవిక జ్ఞానం  పుష్కలంగా ఉండటం చేతనే ప్రాచీన భారతీయ సనాతనధార్మికసాహిత్యసృష్టికర్తలు తాము సత్యానికి కట్టుబడి నడిచారు, సత్యవాక్పరిపాలనని అన్నింటికన్న సర్వోత్కృష్టమైన స్థానంలో నిలబెట్టి మనల్ని కూడా సత్యం వైపుకే నడవమని చెబుతున్నారు!

 

శ్లో. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్,

బ్రూయాత్ సత్య మప్రియం,

ప్రియంచ నానృతం బ్రూయాత్

 - ఏష ధర్మః సనాతనః

(మనుస్మృతి వీ-138)

 

"సత్యమునే పలుకుము.ప్రియమునే పలుకుము.సత్యమైనను అప్రియము పలుకకుము.ప్రియమైనను అసత్యమును పలుకకుము." - ఇంతకన్న మంచి మాట, అందరికీ నచ్చే చక్కని మాట ఎవరైనా చెప్పగలరా? దీన్ని ఇంతకన్న కొంచెం సాగదీసి చెప్పినా సుత్తిలా ఉండదూ!

వేదం విగ్రహారాధనని సమర్ధించిందా వ్యతిరేకించిందా, రాముడూ కృష్ణుడూ మనుషులా దేవుళ్ళా అనే గొడవలు ఇప్పటివి కావు. చాలా కాలం నుంచీ విగ్రహారాధకులు శంకరాచార్యుల వార్నీ, మూర్త్యార్చన ద్వేషులు దయానంద సరస్వతి గార్నీ తమ చర్చల్లోకి లాక్కొచ్చి వీళ్ళతో పాటు వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేలా బజార్న పడి తన్నుకునేలా చేస్తున్నారు.గొడవలు మాత్రం వాళ్ళూ వీళ్ళూ లాగేకొద్దీ తెగుతూ తెంచేకొద్దీ అతుక్కుంటూ జీడిపాకంలా సాగుతూ వస్తున్నాయి.

వేదం దేన్నీ అకారణం నిషేధించదు,సమర్ధించదు.వేదం తను చెయ్యమని చెప్పిన పని ఎలా చేస్తే ఫలితం వస్తుందో వివరించి చెప్తుంది.అయితే,మనవాళ్ళలో పాండిత్యం ఎక్కువయ్యి వేదం పనిని అలాగే ఎందుకు చెయ్యమని చెప్పిందో అర్ధం కాక ఎలా చేసినా అదే ఫలితం వస్తుందని ఫిరాయించేసి అతి చేస్తున్నారు.నిజానికి పూజ, ఆరాధన, అర్చన, ఉపాసన, కీర్తన, స్తుతి,ప్రస్తుతి, శరణాగతి, భక్తి, శ్రధ్ధ అనేవి వేదం నిర్వచనాలతో సహా ప్రజలను ఆచరించమని ఇచ్చిన ప్రక్రియలు.ఆలయ నిర్మాణమూ మూర్తికల్పనా వేదశాస్త్రాల ప్రకారమే జరుగుతున్నది.అలాంటప్పుడు వేదం మూర్తిపూజని నిషేధించింది అనటం ఎలా పొసగుతుంది?శంకరుల వారి పేరున ఇప్పుడు ప్రచారంలో ఉన్న మాయావాదంలోని కొన్ని అంశాలు వేదం చెప్పిన సత్యాలతో విభేదిస్తున్నాయి.ఉదాహరణకి "బ్రహ్మ సత్యం జగన్మిధ్య" అనే వాక్యానికి బ్రహ్మ ఒక్కడే సత్యం అనీ జగత్తు అసత్యం అనే అర్ధం చెప్తున్నారు.జగత్తు అబధ్ధం అయితే, అబధ్ధం గురించి వేదం పేరున అంత జ్ఞానాన్ని ఇవ్వటం అర్ధం లేని పని కదా!అదీ గాక, జగత్తు అబధ్ధం అయితే సృష్టికి ఒక కర్త ఉన్నాడనటం తప్పు.అబధ్దానికి కర్త అబధ్ధీకుడూ మోసగాడూ అవుతాడే తప్ప సత్యవాది కాడు.రామానుజుల వారి విశిష్టాద్వైతం అయితే మరీ విచిత్రం.జీవుడు,దేవుడు ఒక్కరు కాదు - జీవుడు తిరుమంత్ర జపం వల్లనే దేవుడు అవుతాడు అని చెప్పటం ద్వైతం తప్ప అద్వైతం కాదు.పైన మాది updated version of shankaras advaitam అనటం కామన్ సెన్సుతో ఆలోచించినా నవ్వొచ్చేలా లేదూ!భీముడి అవతారం అని అంటున్న మధ్వాచార్యులు చెప్తున్నదీ ఇలానే ఉంటుంది.ఇవన్నీ వాదాలు,"వదంతి" అనే మాటకీ వీటికీ బాదరాయణ సంబంధం కూడా లేదు.

మన గురువులలో కొందరు కల్ల గురువులు ఉన్నారు.వారు వేదమంత్రాలకు తప్పుడు అర్ధాలు చెప్పి మనల్ని వైదికధర్మమార్గం నుంచి పక్కకు మళ్ళించేశారు.వేదమంత్రాలకు అర్ధం చెప్పడానికి పాణినీయం పనికిరాదు.కానీ, కొందరు పాణినీయాన్ని కూడా వాడేస్తున్నారు.ప్రతి వేదమంత్రమూ ఒక సూక్తంలో భాగమై ఉంటుంది.అగ్ని సూక్తం యొక్క పరిచయ గద్యలో "ఋషిః-మధుచ్ఛందా వైశ్వామిత్రః,దేవతా : అగ్నిః,ఛన్దః  గాయత్రీ" అని ఉన్న వివరాల్ని బట్టి అర్ధం చెప్పాలి.అసలు సృష్టికర్తయే వేదంలో నిక్షిప్తం చేసిన నిరుక్తం,ఛందస్సు,వైశేషిక,న్యాయ, మీమాంసాది తర్కశాస్త్ర పరిచయం లేనివాడు వేదమంత్రాలకి అర్ధం చెప్పే సాహసం చెయ్యకూడదు.

"ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అనే సూక్తిని తీసుకుంటే ఇది సత్యం ఒక్కటే అయినప్పటికీ విప్రులు దాన్ని అనేక రకాల వాదనలతో విశ్లేషించి చెప్తారు అని చెప్తూ అది పెద్ద తప్పు కాదని సమర్ధిస్తున్నట్టు అనిపిస్తుంది,కదూ!దీన్ని ఎక్కువ ద్వైత,అద్వైత,విశిష్టాద్వైత,శుధ్ధాద్వైత వాదులు వాడుతూ ఉంటారు.కానీ,ఇది దీనికి వ్యతిరేకమైన అర్ధం వచ్చే ద్విపంక్తి మంత్రంలోని ఒక పదవిభాగం మాత్రమే.

 

ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్యః సుపర్ణో గరుత్మాన్ |

ఏకం సద్విప్రా బహుధా వదంత్యగ్నిం యమం మాతరిశ్వానమాహుః ||. (Rigveda 1-164-46)

Sanskrit text [Accents, Plain, Transliterated]:

इन्द्रं॑ मि॒त्रं वरु॑णम॒ग्निमा॑हु॒रथो॑ दि॒व्यः सु॑प॒र्णो ग॒रुत्मा॑न् एकं॒ सद्विप्रा॑ बहु॒धा व॑दन्त्य॒ग्निं य॒मं मा॑त॒रिश्वा॑नमाहुः

इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः सुपर्णो गरुत्मान् एकं सद्विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहुः

indram mitraṃ varuṇam agnim āhur atho divyaḥ sa suparṇo garutmān | ekaṃ sad viprā bahudhā vadanty agniṃ yamam mātariśvānam āhuḥ ||

English translation:

They have styled (him, the Sun), Indra, Mitra, Varuṇa, Agni, and he is the celestial, well-winged Garutmat, for learned priests call one by many names as they speak of Agni, Yama, Mātariśvan.”

తెలుగు అనువాదం:

(ఇంద్రం) పరమైశ్వర్య వంతుడు (మిత్రం) అందరికీ మిత్రుడు (వరుణం) శ్రేష్ఠుడు (అగ్నిం) విద్యుదాది గుణములు కలిగిన అగ్ని (ఆహుః) పరమాత్ముడు (అథో) పిదప (దివ్యః) ప్రసిద్ధ ప్రకాశమయుడు (సుపర్ణో) పాలనము మొదలగు కర్మలు గల (గరుత్మాన్) మహాన్ ఆత్మ (ఏకం) ఒకటి (సత్) నాశనం లేని వాడు, అని (విప్రా) బుద్ధిశాలురు (వదంతి) చెప్పుదురు (అగ్నిం) సర్వవ్యాపి (యమం) సర్వ నియంత (మాతరిశ్వానం) వాయు గుణాలు కలిగిన వాడు (ఆహుః) పరమాత్ముడు.

 

ఇప్పుడు,పూర్తి అర్ధాన్ని చూడండి!"దేవుడొక్కడే అయినప్పటికీ దివ్యజ్ఞానం కలవారు ఆయనను ఎన్నో పేర్లతో పిలిచారు.అనేక రూపాలలో దర్శించి మనకు చెప్పారు.కొందరాయనను ఇంద్రుడనీ కొందరాయనను వరుణుడనీ ఇంకొందరు అగ్నియనీ మరికొందరు వాయు,యమాది పేర్లతోనూ పిలిచారు." - పండితులు ఎన్ని రూపాలతో చూసి ఎన్ని పేర్లతో పిల్చినప్పటికీ రూపాలూ పేర్లూ అన్నీ వేరు కాదు,వాళ్ళు చూస్తున్నదీ పిలుస్తున్నదీ ఒకే ఒక సృష్టికర్తను అని బల్లగుద్ది చెప్తున్న దాన్ని తీసుకెళ్ళి ఒకే సత్యాన్ని తీసుకుని పండితులు అనేక రకాల వాదనలు చెయ్యొచ్చును అనే అర్ధం ఎలా వస్తుంది?

ఆఖరికి నీకు చదువు చెప్తున్న గురువు చెప్పిన విషయాన్ని సైతం సృష్టికర్తయే వేదంలో నిక్షిప్తం చేసిన నిరుక్తం,ఛందస్సు,వైశేషిక,న్యాయ, మీమాంసాది తర్కశాస్త్రంలో నిష్ణాతుడివై అది సత్యం అని నిర్ధారణ చేసుకున్నాకనే నమ్మాలి.సత్యాన్ని మాత్రమే నమ్మాలి.అసత్యాన్ని నువ్వు నమ్మకూడదు, ఇతర్లకి చెప్పకూడదు.అప్పుడే నువ్వు హిందువు లేక వైదిక ధర్మానుయాయివి అవుతావు.సత్యం పట్ల నిబధ్ధత లేనివాడు నిజమైన హిందువు కాడు,కాలేడు,కాబోడు.

మనలో చాలామందికి వేదం గురించి చాలా అపోహలూ ఆపార్ధాలూ తప్పుడు అభిప్రాయాలూ ఉన్నాయి.ఋగ్వేద సారం అంతా "అహం బ్రహ్మాస్మి" అనే వాక్యంలో ఉందనీ,యజుర్వేద సారం అంతా "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహావాక్యంలో ఉందనీ నాలుగు మహావాక్యాలకీ అర్ధం తెలిస్తే చాలు నాలుగు వేదాల అర్ధమూ తెలిసినట్టే అనీ చాలామంది చెప్తారు.ఇది చాలా తప్పు.ఎందుకంటే,నాలుగు వేదాలలోని ప్రతి మంత్రమూ తనకంటూ ఒక ప్రత్యేకమైన విశిష్టతని నింపుకున్నదే!ఉదాహరణకి వ్యాసులవారు విభజించాక ఋగ్వేదంలోని ప్రధమ మంత్రం అయిన "అగ్నిమీళే పురోహితం,యజ్ఞస్య దేవమృత్విజం - హోతారం రత్నధాతమం!" అనే మూడు వాక్యాలలోని ప్రతి పదానికీ నిరుక్తం ప్రకారం సామాన్యార్ధక పదాల(Synonyms)ను మార్చడం వల్ల 50,000 పైన అర్ధాలు వస్తాయి."అగ్నిని; పురోహితుడిని; (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానిని; ఋత్విక్కును; హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మ, జ్ఞానరత్నాలతో పోషించేవానిని; నేను ప్రస్తుతిస్తాను, మనసా ప్రార్థిస్తాను." అనే అగ్ని సూక్తం లోని అగ్నిమీళే మంత్రం వైదిక జీవన విధానంలో యజ్ఞం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

ఇవ్వాళ వేద పాఠశాలల్లో కూడా అర్ధపాఠం వరకు వెళ్ళడం లేదు,స్వరపాఠం చెప్పేసి సరిపెట్టేస్తున్నారు.అర్ధం తెలిస్తే కదా వేదం ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం సాధ్యపడేది - మరి,అర్ధం చెప్పకపోతే ఎట్లా?అర్ధం తెలిసిన ఒక కవి మంత్రాన్ని ఆటవెలదిలో చెప్పారు,చూడండి.

 

. అగ్నిని, పురహితుని, యజ్ఞప్రకాశకు,

నసమ ఋత్విజుని విలసిత హోత

నఖిల ధర్మ జ్ఞాన మమరించి పోషించు

యనిలసఖుని గొలుతు ననుపమగతి.

 

ఎంత బావుంది!మరి, కొన్ని వందల వేల సంవత్సారాల వెనకటి నుంచి అర్ధం చెప్పకపోవటం అనే తప్పును వేదపండితులైన గురువులు ఎందుకు చేశారు?బధ్ధకం వల్లనా,నిర్లక్ష్యం వల్లనా అనేది మనకి అనవసరం! కారణంతో చేసినప్పటికీ  "వేదంలో సాపాసాలు తప్ప ఇంకేం లేదు కాబట్టి వేదం చదవకపోయినా పర్లేదు!" అనే పిచ్చిమాటలు మాట్లాడే ఆస్కారం ఎవరికీ ఇవ్వకూడదు వేదపండితులు.హిందువు అయిన ప్రతి వ్యక్తీ వేదం అనేదాన్ని పరమ ప్రమాణం కింద తీసుకోవాలి అన్నప్పుడు వేదంలో ఏముందో తెలియనిదే వేదం చెప్పినట్టు ఎలా బతకగలడు?వేదంలో ఏముందో తెలియక పోవటం వల్లనే వేదం విగ్రహారాధనని వ్యతిరేకించింది అనే ఒక విచిత్రమైన వాదన ఇవ్వాళ వినబడుతున్నది.మరి, వేదం వ్యతిరేకించిన విగ్రహారాధనని ఇవ్వాళ మనం ఎందుకు చేస్తున్నాము?వేదం వ్యతిరేకించిన పనుల్ని చేస్తూ మనం వైదిక ధర్మానుయాయులం అని చెప్పుకోవటం తప్పు కదా!

నిత్యము, సత్యము అయిన వేదం శబ్దరాశి మంత్రద్రష్ట లయిన మహర్షులకు దృగ్గోచరమయినది మాత్రమే కాని వారు మంత్ర రచయితలుగా ఉండి రచించినది మాత్రము కాదు.అలాంటి విశిష్టత ఉన్న వేదమంత్రాల్ని గురించి "కొన్నింటి అర్ధం తెలిస్తే చాలు!" అని చెప్పడం సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని తక్కువ చేసి మాట్లాడటమే అవుతుంది.కానీ, శైవమతస్థులు "నమఃశివాయ" అనే పంచాక్షరి గురించీ వైష్ణవులు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరి  గురించి గానీ అది సకల వేదమంత్రాల కన్న ఒక మెట్టు పైన ఉన్నట్టు ఎందుకు చెప్తున్నారు?

ఒక దుర్మార్గం చూడండి,మాయావాదంతో మోసం చేస్తున్న అద్వైతులు గానీ భక్తివాదంతో మోసం చేస్తున్న వైష్ణవ విశిష్టులు గానీ తమ మతసూత్రాలకు వేదం నుంచి ప్రమాణం చెప్పడం లేదు."ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అనే సూక్తిని మనముందు పెట్టి కేవలం ఉపనిషత్తుల నుంచి కొన్ని మంత్రాల్ని తీసుకుని వాటికి విపరీతపు వ్యాఖ్యలు చేసి చెలాయించుకు వస్తున్నారు.ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అని చెప్తున్న ఉపనిషత్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతఃప్రమాణం కాదు.

"ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోపి అలౌకికం యో గ్రంధః వేదయతి  వేదః" అని సాయనుల వారు చెప్పిన విశేషార్ధం ప్రకారం సనాతన ధర్మం ప్రతి నైష్ఠికుడికీ చెప్పేది మరణానంతరం పొందబోయే స్వర్గనరకాదులను గురించి కాదు.జీవంతో ఉన్న ఇప్పుడే ఇక్కడే భగవంతుణ్ణి చూసి, విని, స్పర్శించి, ఆనందించి అతనిలో ఐక్యం కావడం గురించి నొక్కి చెప్తుంది!సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే ప్రతి మానవుడూ  మొదట ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి.పిదప పరమాత్మ సాక్షాత్కారాన్ని అనుభవించాలి!అప్పుడు, మరణ సమయానికి  పాపరాశి మిగిలి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఉత్తమజన్మనీ పాపరాశి శూన్యస్థితికి చేరుకుంటే మరొకజన్మ లేని మోక్షస్థితినీ అందుకుంటాడు.మోక్షం అంటే చనిపోయాక ఆత్మ ఇక్కడినుంచి ఇంకెక్కడికో వెళ్ళటం కాదు.మన చుట్టు పరివేష్ఠించి వుండి నిరంతరం మన శరీర ధాతువులకు జననాన్నీ పోషణనీ మృత్యువునీ కలిగిస్తున్న విశ్వంలోని యే అవ్యక్తుడైన భగవంతుడి నుండి విడివడి జన్మపరంపరలోకి వచ్చాడో జన్మమృత్యుజరారుజల సర్పిలం నుండి విడివడి తిరిగి వ్యక్తావ్యక్త స్థితుల కతీతమైన అనంతాత్మలో విలీనమైపోవటం.ఇంతకుమించి మోక్షం గురించీ హిందూమతం గురించీ ఎవరు ఏమి చెప్పినప్పటికీ అది అబద్ధమే అవుతుంది!

వైదిక సూత్రాల ప్రకారం మానవుడు ఎప్పటి వరకు తన జీవిత లక్ష్యమును నిశ్చయించుకొనడో అప్పటి వరకు అతని జీవిత కాలం వ్యర్ధం.ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మానవుడు ప్రతి క్షణం లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి.నిరంతరం లక్ష్యం వైపుకు ప్రయాణిస్తూనే ఉండాలి.

జై శ్రీ రాం!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...