Tuesday 30 October 2018

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర విశేషాలు - ఉపోద్ఘాతం

     మొదటి స్వాతంత్య్ర పోరాటం సఫలమైనట్లే అయి చివర్లో దురదృష్టం కొద్దీ విఫలమై ఏ పోరాటం ఇంగ్లీషువాళ్ళని తరిమికొట్టటానికి ప్రారంభించారో ఆ పోరాటమే ఇంగ్లీషువాళ్ళు మరింత పాతుకుపోవటానికి ఉపయోగపడింది!అప్పటినుంచి రెండవ స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యేలోపు భారతీయ సమాజం ఎట్లా ఉండేది?

     ఆధునిక భారతదేశ చరిత్ర అనే అంశాన్ని తరచిన చరిత్రకారులూ పాత్రికేయులూ మేధావులూ విశ్లేషకులూ  ఈ కాలాన్ని గురించి చెప్పేటప్పుడు కాంగ్రెసు పార్టీ స్థాపనతో మొదలుపెట్టి రాజకీయాలనే స్పృశించారు తప్పితే సమాజం గురించి ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి."మనల్ని విదేశీయులు పరిపాలిస్తున్నారు!","విదేశీయులు పాలించడం వల్లనే మనకి అన్యాయం జరుగుతున్నది!","వీళ్ళని వాళ్ళ దేశానికి తరిమికొట్టి స్వతంత్రం తెచ్చుకోనిదే మనదేశం(?) బాగుపడదు!" అనే రాజకీయ భావనలు రావడానికి పునాదియైన అప్పటి భారతీయ సమాజం గురించి మనకి  వాస్తవాలు తెలియడం లేదు.ఎందుకంటే, అప్పటి సమాజం గురించి చెప్పాలనుకుంటున్న ఇప్పటి మేధావుల్లో ప్రతి ఒక్కరికీ ఒక పొలిటికల్ ఎజెండా ఉంది - తమ ఎజెండాకి వ్యతిరేకమైన విషయాల్ని దాచేసి అనుకూలమైన విషయాల్ని మాత్రమే చెప్పారు!

     ఇలాంటి చిక్కులు ఎదురైనప్పుడే మనుషులకి కాలయంత్రం లాంటి ఫాంటసీల మీదకి మనసు పోతుంది - మనమే వెళ్ళి చూస్తే పోతుంది గదా వాళ్ళూ వీళ్ళూ చెప్పే అబద్ధాలని నమ్మడం దేనికి?అయితే, కాలంలో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహార్మ్,రిజల్టులో కూడా గ్యారెంటీ లేదు!కానీ తక్కువ ఖర్చుతో కాలంలో ప్రయాణాన్ని సాధ్యం చేసే సాధనం ఒకటి ఉంది - అదే, సాహిత్యం!ఒక కాలం గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఆ కాలపు ప్రముఖ వ్యక్తుల జీవితచరిత్రలు గానీ ఆత్మకధలు గానీ అధికారికమైన విషయనిధులు(DATA BANKS) అవుతాయి.అలాంటి వాటిలో సా.శ. 18వ శతాబ్ది నాటి సమాజం గురించి దాని నైసర్గిక వర్ణనతో సహా తెలుసుకోవడానికి ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర అనే ట్రావలాగ్ కన్న విలువైనది మరొకటి లేదు.

     వేరే వ్యక్తి చెప్పినదాన్ని నేను మీకు చెప్తున్నానని అనగానే "ఇతన్ని నమ్మవచ్చునా!అబద్ధాలు చెప్పడం లేదని గ్యారెంటీ ఏమిటి?" అనే సందేహం వస్తుంది.కానీ ఈయన కాశీయాత్ర చరిత్ర రాసింది ఉబుసుపోక కోసం కాదు - అప్పటికే రెండుసార్లు కాశీ వెళ్ళి వచ్చి మూడోసారి వెళ్తున్నప్పుడు ఒక స్నేహితుడు తనకూ ఇతరులకూ సహాయకారిగా ఉంటుందని అడిగితే రాసి ఇచ్చినది,స్నేహితుడికీ ఇకముందు కాశీ వెళ్ళానుకున్నవాళ్ళకీ ఉపయోగపడటం కోసం రాసేదాంట్లో అబద్ధాలు చెప్తే ఉన్న పరువు పోతుంది, కదా!

     మొదటి ముద్రణ సా.శ 1838లో జరిగింది - అంటే ఆయన రాసినది మిత్రుడు చదివి మెచ్చుకుని అందరికీ పనికొస్తుందని అనుకోవడానికీ ప్రచురణ సిద్ధమవటానికీ ఏళ్ళు పట్టదు కదా!సా.శ. 2018లో ఉన్న మనం సా.శ 1820ల నాటి భారతదేశాన్ని చూడబోతున్నాం - కాలంలో ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా?



ఎంతమంది ప్రయాణీకులు ఉన్నారో లెక్క తెలిస్తేనే గానీ ఈ బండి కదలదు.
-----------------------------------------------------------------------------------------

2

15 comments:

  1. Welcome back!

    మీ బ్లాగు మాలికలో మళ్ళీ కనిపించడం సంతోషం.

    ReplyDelete
  2. టిక్కెట్ లేకుండా అయితే మేం రడీ!!

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. http://eemaata.com/em/issues/201706/12031.html

    ReplyDelete
  5. waiting.. excited..!

    ReplyDelete

  6. ఆయ్

    జైకొట్టడానికి కొందరున్ను
    ఛీకొట్టడానికి ఇంకొంతయెక్కువమందిన్నూ
    ఆ పై వెరసి రచ్చ చేసుకోవడానికి మరికొందరున్నూ
    బండి యెక్కేదానికి సిద్ధము గా వున్నారు.

    మీరు వెంఠనే బండిని ట్రాక్ పై ఎక్కించి అప్పుతచ్చులు లేకుండా చదవటానికి ఉస్సూరు మనిపించే పెద్ద నిడివి కాకుండా లాగించండి :)


    ఆయ్

    జిలేబి

    ReplyDelete
  7. memu eduru choostunnamu!
    anjaneyulu bvsr

    ReplyDelete
  8. చిన్ననాటి స్నేహం, పాత బెల్లం, పుట్టిన ఊరు మరియు పూర్వీకుల చరిత్ర అంటే మనలో చాలామందికి ఇష్టం.
    ఇంక హరికాలం మాకు శుభకాలక్షేపం, జ్ఞానమయం.. నిరీక్షణం ప్రారంబం.

    ReplyDelete
  9. SIVA KUMAR
    కే.సి.ఆర్. కే.టి.ఆర్. అండ్ కో కి కొన్ని ప్రశ్నలు :

    1) తెలంగాణ మీ ఒత్తిడి, ఉద్యమం వల్లే వచ్చింది, ఎవరేమన్నా ఇది నిజం. కానీ ఆ విజయం మీ పాలనలో మాత్రం కనబడలేదు, ఎందుకని ?

    2) తెలంగాణ సాధించటానికి మీరు ఎంత శ్రమపడ్డారు ఎన్ని ఉద్యమాలు చేసారు, చివరికి నిరాహార దీక్షకూడా చేసారు. మరి ఆ శ్రమ మీ పరిపాలనలో మాత్రం ఎందుకు కనపడలేదు ?

    3) తెలంగాణ సాధించటానికి మీతోపాటు తెలంగాణ ప్రజలందరూ మీతో ఉన్నారు. చివరికి కాంగ్రెస్, బి.జే.పి. మిగిలిన అన్ని పార్టీలు, అన్ని వర్గాలు మీకు మద్దతు పలికి మీతో కలిసి పోరాడి సాధించుకున్నారు. ఆ ఫలం ఫలితం మాత్రం మీరు, మీ కుటుంబం మాత్రమే అనుభవిస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. ఇలా ఎలా చేస్తున్నారు ?

    4) దేశ రాజేకీయాల్లో స్వార్ధ రాజకీయాలే ఎక్కువ శాతం చాలామని అవుతున్నాయి. అందలం ఎక్కగానే దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు ఎందుకు కనబడటం లేదు? మీరూ ఇప్పుడు ఆకోవలోకే వస్తారుకదా?

    5) ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ముందు ఎలా జరుగుతుందో ముందే ఊహించి ప్రస్తుత ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. అలా ప్రజలని చాలా సులభంగా మోసం చేస్తున్నారు. కానీ ఇది చివరి వరకు కొనసాగాదని ఎందుకు గ్రహించలేకపోతున్నారు?

    6) వకసారి అధికారంలోకి వస్తే తన కుటుంబానికి జీవితకాలం కావలసిన ఆదాయాన్ని కూడబెడుతున్నారు. మరి మీరు మీ మంతులు ఎంత వెనకేశారు? వేరే ప్రభుత్వం వస్తేకానీ అవ్వి బయటపడవు అనుకుంటా, కదా?

    7) రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ద్దీమా మీకు ఉందా?

    8) ఈ నాలుగున్నర సంవస్చరాల్లో మీరు ఎన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసారు? ఎంతమంది ప్రజలు దానివల్ల లాభపడ్డారు? రాష్ట్రానికి సమాజానికి అవి ఏవిధంగా మేలు చేసాయి?

    9) మీ రాజకీయ, పార్టీ, పాలనా, పరంగా ఎన్నికలు వస్తుంటే మీ గురించి మీరు మళ్ళీ ఊళ్ళోకెళ్ళి ప్రచారం చేస్తూ మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటారు? కానీ మీరు పనిచేసి ఉంటె ఆ గొప్పలు ప్రజలే చెప్తారు కదా? మీకెందుకు శ్రమ?

    10) రాజకీయ, పాలనా విధానం పక్కనపెడితే, ప్రవేటు సంస్థలు మాత్రం ప్రభుత్వ బలహీనతను అడ్డం పెట్టుకుని అవి ఎంతో లాభపడుతున్నాయి. మరి ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళలా పనిచేయలేకపోతున్నాయి?

    11) వేల కోట్లు ఆర్జించే వ్యాపార వ్యవహారాలూ నడిపించే సంస్థలు ఎప్పుడో ఏదైనా కొత్త వస్తువును ప్రజలకు పరిచయం చేయాలంటే కాసేపు కనిపిస్తారు. కానీ ప్రతినిధులు మాత్రం ప్రతినిత్యం చానళ్ళలో తిరుగుతూనే ఉంటారు. ఇంక పనిమీద ఏం శ్రద్ద పెడతారు? ఏం పనిచేస్తారు? అసలు వక పద్ధతి ప్రణాళిక ఏమైనా ఉందా, మీ దగ్గర?

    12) ప్రజలచే ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారంలో అన్ని ప్రమాణాలు చేసి అవి ఎలా గాలికి వదిలేసి స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారు? కొంచమైనా నీతి, న్యాయం ఉండాలి కదా?

    13) మీరు మీరున్న రాష్ట్రంలోనే పనులు చేయక మద్ధతులేక చతికిల పడుతున్నారు. మళ్ళీ మహాకూటమి, ఆ పొత్తులు ఈ పొత్తులు అంటున్నారు. ఇవేమన్నా కాశీ మజలీ కధలు అనుకుంటున్నారా?

    14) పూర్వ కాలంలో రాజ్యాన్ని యువరాజులకు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పటికీ మీరే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్నారు. బలహీనమైన రాజు రాజ్యానికి ప్రమాదం అని మీకు తెలియదా?

    15) వీటన్నిటినీ చూస్తుంటే మీరు మీ స్వార్ధ ప్రయోజనాలకోసం మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్టున్నారు, అవునా? లేకపోతే అన్ని లక్షల మంది మీకు తోడుగా వచ్చి యువత బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణలో మీరు మరియు మీ కుటుంబ సభ్యుల పేరు తప్ప వేరే పేరు వినబడదే?

    (ఏదైనా తెలంగాణ ప్రజలు, యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, నేను చెప్పే వాడ్ని మాత్రమే)

    ReplyDelete
    Replies
    1. ఏంటిసార్ ఇది. కాశీయాత్ర అని చెప్పి బస్సుని హైదరాబాద్వైపు తీసుకెళ్తున్నారే!

      Delete
  10. Praveen abouf Cougar Relation at praja:ఈ టాపిక్కు యొక్క ఉద్దేశం ఏమిటో ఇతని వాదన ఏమిటో ఇక్కడ ఎవరికైనా అర్ధం అవుతున్నదా?భూమి మీద అనేక రకాల ప్రాంహలు బతుకుతున్నాయి. ఒక పక్షి తన గూడు నుంచి బైటికొస్తే ఆ రోజుకి తన ఆకలి తీర్చుకుని మళ్ళీ రాత్రికి గూడు చేరటం అనేది తప్ప నిన్న జరిగినదే గుర్తుండదు.దాదాపు మానవ జాతి తప్ప జంతు సమూహం ఇట్లాగే బతుకుతున్నది. మనిషిని ప్రత్యేకం చేసినది అతని జ్ఞాపక శక్తి. అయితే ఈ ప్రవీణ్ అనే పశువుకి అది ఉన్నట్టు కనబడటం లేదు. నేను ఉదహరించిన అతని ఏడుపులు రెండూ ఆడవాళ్లకేదో అన్యాయం జరుగుతున్నదని ఏడుస్తున్నట్టు కాక వాళ్ళు ఏ పని చేసినా ఇలాగే ఏడుస్తాడేమో అన్నట్టు ఉన్నాయి. అక్కడ వాళ్ళ భర్తలు కష్టమైనవీ ఇబ్బందికరమైనవీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కూడా హాయిగానే ఉన్నారు - మధ్యలో ఇతనికి ఏడుపు దేనికి? ఇక్కడ మనం దొరికామని ఏడుస్తున్న ఈ ఏడుపు ఆ ఇప్పసారా కాస్తున్న జంట దగ్గిర ఏడుస్తే ఆడదే పెడుతుంది గడ్డి వీడి నోట్లో - దూ!

    ReplyDelete
    Replies
    1. మొత్తం సమాజంలో నూటికో కోటికో ఒకరికి తమ అచసరం కొద్దీ చేసుకునే ఏర్పాట్లయిన కోగర్ రిలేషన్లనీ గే మ్యారెజీల్నీ సమాజం మొత్తం ఆమోదించాలని అంటున్నాడు ఈ నీతీ జాతీ లేని వూరకుక్క!

      అసలు వీడు బతకడానికి ఏమి పని చేస్తున్నాడు?అందులో దోపిడీ లేదా?ఈ మధ్యనే తండ్రి ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళి పోరాడి తెచ్చుకున్నాడు - అది గొప్పపని అయినట్టు చెప్పుకుంటున్న ఈ గాడిద నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,అశుద్ధమా?తనకి ఇష్టమైన మార్క్సిజం సొంత ఆస్తిని రద్దు చేసుకోమంటుంది కదా!అదీ గాక తన కష్టార్జితం కాని తండ్రి ఆస్తిని తన న్యాయమైన సంపాదనలా తినడం దోపిడీ కాదా?మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారమే దోపిడీ అంటే "తను శ్రమ చెయ్యకుండా సోమరిలా కూర్చుని ఇతరుల కష్టార్జితాన్ని తనకు హక్కుగా దఖలు పర్చుకోవటం!" అయినప్పుడు ఈ ముండమోపి తండ్రి కష్టార్జితాన్ని అనుభవించడం దోపిడీ కాదా?

      ఇంకొకటి నిన్నటి వరకు "మా నాన్న నన్ను తిట్టాడు,కొట్టాడు - తమ్ముణ్ణి గారాబం చేశాడు!" అని ప్రజలోనే తండ్రిని తిట్టాడు - ఇవ్వాళ కులుక్కుంటూ తండ్రి ఆస్తి మీద హక్కు కోసం బాబాయిల తోనూ మామయ్యలతోనూ పోట్లాడేటప్పుడు తండ్రి తనని కొట్టిన దెబ్బలూ తండ్రిని తను తిట్టిన తిట్లూ గుర్తుకు రాలేదా - ఈ సిగ్గు లేని బజారు వెధవకి?

      ప్రజ కొండల రావుకి వ్యాసాలు రాయించి ప్రోత్సహించడానికి ఇంతకన్న బజారు కుక్కలు దొరకలేదా - ధూ!

      Delete
  11. నేను కూడా మీతో కాల ప్రయాణానికి సిద్ధం హరిబాబు గారు..

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...