Monday 1 January 2018

కైలాసాన కార్తీకాన శివరూపం!ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం!!

     సాగరతలానికి 6718 మీటర్ల ఎత్తు గల కైలాస శిఖరం కేవలం హిందువులకే కాక బౌద్ధులకీ జైనులకీ కూడా పరమ పవిత్రమైన ప్రాంతం.దాదాపు హిందువుల ఆలయాలు సమస్తం మూలవిరాట్, గర్భగృహం, విమానశిఖరం, ముఖమండపం, ధ్వజస్తంభం, ఆవరణ, ప్రాకారం, రాజగోపురం అనే అంశాలతో కూడి ఉంటాయి.ఇందులోని ప్రతి అంశానికి సంబంధంచి పొడుగు, వెడల్పు, ఎత్తు, అలంకరణ వంటి విషయాలలో ఎంతో శ్రద్ధని కనబరుస్తారు స్థపతులూ శిల్పులూ.కాని ఇక్కడ అవన్నీ ఒక పర్వతశిఖరంలోనే ఇమిడిపోయాయి!మానససరోవరం అనే పుష్కరిణి కూడా అమిరిపోయింది - పూజారులూ. మంత్రోచ్చాటనలూ, కానుకలూ, ప్రసాదాలూ అనే తంతులు ఏవీ లేని మనలో ఉన్న నిజమైన భక్తిని ప్రదర్శించడమే పూజావిధానమైన ఆలయం ఇది ఒక్కటే!
     హేతువాదులు కూడా నమ్మి తీరాల్సిన హేతువుకి అందని విషయాలు ఎన్నో కైలాసశిఖరం చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి.వాటిలో ఒకటి ఎంత గొప్ప పర్వతారోహకుడైనా శిఖరం వరకు ఎక్కలేకపోవటం.ఇప్పుడు దీని చుట్టూ మూడు మతాల వారిలో ఉన్న నమ్మకాలను గమనించి చైనా ప్రభుత్వం అనుమతి నిషేధించింది గానీ అంతకుముందు ఎక్కాలనుకుని కూడా ఎక్కలేక వెనుదిరిగినవాళ్ళు సామాన్యులు కారు - ఒక పర్వతారోహకుడు పంతం పట్టి శపధాలతో కూడిన ప్రకటనలు కూడా ఇచ్చి మధ్యలోనే విరమించుకుని వచ్చేశాడు!అంత భీకరమైన పట్టుదలతో వెళ్ళినవాడివి ఎందుకు తిరిగొచ్చావయ్యా అంటే నాకే తెలియని ఏదో కారణం నన్ను ముందుకి వెళ్ళనివ్వడం లేదు,భయానికి అతీతమైన వ్యతిరేకత పుట్టింది నా మనస్సులో అని చెప్పాడు.రష్యన్ పర్వతారోహకులు చాలామంది ఈ శిఖరాన్ని ఎక్కడానికి వెళ్ళి తిరిగి రాలేదు - ఇది నమోదైన చారిత్రక యదార్ధం.

     వీటన్నింటి కన్న హేతువాదులు జవాబు చెప్పలేని అసలైన విచిత్రం దేహపు పెరుగుదల వేగం పెరుగుతుంది - సాక్ష్యం ఏమిటంటే అక్కడ పన్నెండు గంటలు గడిపితే బయట రెండు వారాలు గడిపితే పెరిగిన పరిమాణంలో గోళ్ళూ వెంట్రుకలూ పెరిగడాన్ని అక్కడికి వెళ్ళి కొలిచి చూసుకోవచ్చు!ఒక అబిసీనియన్ పర్వతారోహక బృందానికి సంబంధించిన వ్యక్తి మరీ చిత్రమైన విషయాన్ని చెప్పాడు.బృందంలా ఏర్పడి ఎక్కుతూ ఒకానొక ఎత్తుకి చేరగానే ముందు వెళ్తున్న ఇతని బృందంలోని వారికి ఒక్కసారి కొన్ని దశాబ్దాల వయస్సు పెరిగిపోయిందట!అది అంతటితో ఐపోలేదు, అతని కధనం ప్రకారం వారందరూ వెనక్కి తిరిగి వచ్చిన సంవత్సరం లోపు శతవృద్ధులకి వచ్చే వ్యాధులతో అలమటిస్తూ మరణించారు.

     భారతీయ చలనచిత్ర ప్రప్రధమ నాయిక దేవికారాణి భర్త అయిన Nicholas Roerich అనే రష్యన్ పరిశోధకుడు ఈ శిఖరం మీద ఎన్నో పరిశోధనలు చేశాడు.ఇతని విశ్లేషణలలో దోషరహితులైన మానవులు మాత్రమే చూడగలిగిన శంబల నగరం కైలాసశిఖరానికి దాపులనో లోపలనో ఉన్నది.కలియుగాంతంలో ధర్మస్థాపన చెయ్యడానికి అవతరించే కల్కి జన్మస్థానం ఈ శంబలయే అని చెబుతారు.హిందువుల పౌరాణిక సాహిత్యంలోనే కాదు బౌద్ధ,జైన సాహిత్యాలలో కూడా శంబల నగరం గురించిన ప్రస్తావన ఉంది!ఇతని మరొక ముఖ్యమైన విశ్లేషణ ప్రకారం ఈ శిఖరం స్వయంభువు కాదు,మానవ నిర్మితమైనదే!
     రేఖాగణితంలో శంఖువు(pyramid) ఆకారానికి ఒక ప్రత్యేకత ఉంది.నాలుగు ఒకే కొలత గల త్రికోణాలను ఒక్కో త్రికోణం ఒక్కో దిక్కును చూసేటట్టు నిలబెట్టి వాటి మధ్యన ఖాళీలు లేకుండా ఒకదానినొకటి ఆనుకుని ఉండేటట్టు అమర్చితే శంఖువు అవుతుంది.అప్పుడు నాలుగు వైపుల నుంచి ఈ ఫలకాల మీద ప్రసరించే కాంతి,ధ్వని మొదలైన అయస్కాంత తరంగాలు లోపలి వైపున వక్రీభవనం చెందడం వల్ల కేంద్రం దగ్గిర భూమిని తాకేచోట శక్తిపాతం వూహించడానికి శక్యం కాని స్థాయికి పెరుగుతుంది.

     హిందువుల ఆలయపు విమానశిఖరాలు, పగోడాలు అని పిలిచే బౌద్ధుల ప్రార్ధనామందిరాలు, యూదుల సినగాగులూ, క్రస్తవుల చర్చిలూ, మహమ్మదీయుల మసీదులూ అన్నీ ఒకే రకమైన నిర్మాణం కలిగివుండి వాటి నిర్మాణంలో శంఖువు ప్రత్యేకమైన అమరికతో ఇమిడి ఉండటానికి కారణం దీని గురించి తెలిసీనవారు చేసిన తప్పనిసరి ఏర్పాటు తప్ప అనుకోకుండా ఏదో ఒక ఆకారాన్ని ఎంచుకుని కట్టేస్తున్నట్టు జరగడం లేదు - హిందూమతం నుంచి కాపీ కొట్టినట్టు తెలుస్తుందని ఇప్పుడు వాటిని తీసెయ్యడమూ కుదరదు, పంతానికి పోయి తీసెయ్యాలనుకుంటే ఆయా మతాల పునాదులే కదిలిపోతాయి!

     రోరిచ్ అంచనా ప్రకారం ఈ శిఖరాన్ని నిర్మించినవారు చుట్టుపక్కల మరిన్ని,అంటే వంద వరకు చిన్న చిన్న శంఖువులను నిర్మించారు - అన్నింటి యొక్క లబ్ధ ఫలితం ఈ క్షేత్రం నుంచి మొదలుపెట్టి ఇక్కడ అధికమై దూరం జరిగే కొద్దీ బలహీన పడుతూ ఏదో ఒక స్థాయిలో భూమి మీద ఉన్న ప్రతి అడుగునీ కైలాసశిఖరం యొక్క ప్రభావం తాకుతూనే ఉన్నది!
     క్రీ.శ 1999లో geology, physics వంటి అనేక శాఖలలో నిష్ణాతులైన ఒక పరిశోధక బృందానికి నాయకత్వం వహించి ఎన్నో పరిశోధనలు చేసి Where Do We Come From?  గ్రంధాన్ని రచించిన Ernst Muldashev కూడా ఇది మానవనిర్మితమే అంటున్నాడు - కానీ నమ్మడం కష్టంగా ఉంది!అయితే ఇతర స్వయంవ్యక్తమైన అరుణాచలం, కేదారనాధ, తిరుమల గిరుల కన్న విశిష్టమైన కైలాసశిఖరపు నిర్మాణమూ పద్మదళాల వలె చుట్టూ అమరిన ఆరు పర్వత శిఖరాల అమరికా వాటంతటవి భూమినుంచి పొడుచుకొచ్చి ఏర్పడినాయని నమ్మడం కూడా సాధ్యం కావడం లేదు!

     కేదారనాధ క్షేత్రంలో భక్తులు స్వహస్తాలతో స్పృశించి పులకిస్తున్న శిఖరపు కొన ఇక్కడ ప్రదక్షిణ చేసి తరించడానికే తప్ప కాలుమోపి పైకి చేరుకుని దగ్గిర నుంచి చూడడానికి సాధ్యం కాని కైలాసశిఖరాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది.ఇవన్నీ వాటంతట ఏర్పడి ఉంటే వాటి మధ్యన ఉన్నది ప్రకృతిసహజగణితం అయితే ఆ సంబంధాలని కనుక్కోగలిగిన జ్ఞానం కూడా గొప్పదే కదా!

     “In Tibetan texts it is written that Shambhala is a spiritual country that is located in the north-west of Kailash,” Mulsashev wrote. “It is hard for me to discuss this topic from a scientific point of view. But I can quite positively say that Kailash complex is directly related to life on Earth, and when we did a schematic map of the ‘City of the Gods,’ consisting of pyramids and stone mirrors, we were very surprised – the scheme was similar to the spatial structure of DNA molecules.”
     Muldashev believes that the pyramids were built by ancient and advanced people who knew about the laws of subtle energy. He wrote that the mountain is the most important part of a system of ancient monumental structures and is directly connected with the main pyramids of the earth such as the pyramids of Giza and Teotihuacan.

     కైలాసశిఖరం వరకు చేరుకోవడం ఒక యెత్తు,ఆ శిఖరానికి ప్రదక్షిణ చెయ్యడం ఒక యెత్తు!అలవాటు చొప్పున సవ్యదిశలో ప్రదక్షిణ చేసే బౌద్ధులకీ అపసవ్య దిశలో ప్రదక్షిణ చేసే Bon సంప్రదాయస్థులకీ మూడు రోజులు పడుతుంది.కొందరు హఠయోగ సాధకులు ఒక రోజులో పూర్తి చెయ్యగలుగుతున్నారు.కొందరు సాష్టాంగపరిక్రమ కూడా చేస్తారు - వారికి మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది.భక్తులు 108 ప్రదక్షిణలు చెయ్యగలిగితే ఇక  జన్మ అంటూ లేని మోక్షం తధ్యం అని నమ్ముతారు.
     అంతే కాదు - సింద్గు, బ్రహ్మపుత్ర, శతద్రు(Surlej), కమలి అనే నాలుగు పవిత్ర నదులు శివుని జటాజూటం వలె కనిపిస్తున్న ఈ గిరిశిఖరం నుండే తమ జలధారలను స్వీకరిస్తున్నాయి - అభిషేక ప్రియుడైన శివునికి వియద్గంగ చేసిన మస్తకాభిషేక జలమే ఈ నదులు పారినంత మేర జీవధాతువులను వికసింపజేసి వీటికి జీవనదులనే ఉగ్గడింపును తెస్తున్నది!కైలాసశిఖరానికి దగ్గిర్లోనే ఓంకారశిఖరం కూడా ఉంటుంది.మంచుతో కప్పబడిన ఈ శిఖరాన్ని ఆకాశం నుంచి చూస్తే ఓంకారం కనబడుతునంది.ఇక్కడ నిజానికి రెండు సరస్సులు ఉనాయి.అందరికీ తెలిసినది మానస సరోవరమే కానీ రాక్షస సరోవరం కూడా ఉన్నది.రెండింటిలో ఎత్తున ఉన్న మానససరోవరం మంచినీటితో నిండి సూర్యబింబం వలె భాసిస్తూ అమరవిభూతిని ప్రదర్శిస్తుంటే దిగువన ఉన్న రాక్షససరోవరం ఉప్పునీటితో నిండి చంద్రవంక వలె భాసిస్తూ అసురవిభూతిని ప్రదర్శిస్తున్నది. అంటే, అమరాసుర విభూతులు రెండింటినీ సమన్వయించిన ఏకత్వాన్ని ప్రదర్శించడమే గిరియే హరుడై హరియై గౌరియై సాక్షాత్కరించే కైలాసశిఖర సౌందర్యరహస్యం!

     కైలాసశిఖరం గురించి పరిశోధనలు చేసిన చాలామంది శాస్త్రవేత్తలు ఇది మానవనిర్మితం అని చెబుతున్నప్పటికీ నాకు నమ్మాలని అనిపించడం లేదు,అలాగని ఇంత ఖచ్చితమైన అమరికతో చుట్టూ ఆరు పర్వతాల మధ్యన ఈ శిఖరం ఇంతటి అద్భుతమైన సౌందర్యం విలసిల్లుతూ స్వయంవ్యక్తమై ఆవిర్భవించడం అనేది కూడా నమ్మాలని అనిపించడం లేదు - ఇది పూర్తి మనవమేధోశ్రమజనితమే అయినా, ఇది పూర్తి దైవసంకల్పఫలితమే అయినా ఒకటి మాత్రం  నిజం. భూమి మీద దీనిని మించిన అద్బుతమైన సౌందర్యం మరొకటి లేదు!

     ప్రస్తుతానికి కైలాసశిఖరం మానవనిర్మితం అనడానికి తిరుగులేని ఆధారం యేదీ దొరకలేదు గాబట్టి శాస్త్రప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంది గానీ అది రుజువైతే ప్రపంచంలోని అన్ని దేశాల చరిత్రల్నీ తిరగరాయాల్సి వస్తుంది!ఎందుకంటే, భూమి మీద ఈ శిఖరం గనక మానవనిర్మితమైనది అయితే గిజా పిరమిడ్ కన్న యెత్తైనది అవుతుంది మరి!ఇది మానవనిర్మితమా,దైవసృష్టియా అనేదానితో సంబంధం లేకుండానే ప్రపంచంలోని అనేక ప్రాచీన కాలపు నిర్మాణాలకూ ఈ శిఖరానికీ విడదీయరాని సంబంధం ఏర్పడిపోయింది ఇప్పటికే! 
     ప్రస్తుతం భూమి మీద చెల్లా చెదురుగా ఉండి ఏ సంబంధమూ కనిపించని Easter Island, Stonehenge, Egyptian pyramids, Mexican pyramids, Bermuda Triangle వంటివి కైలాసశిఖరం నుంచి వాటి దూరాల్ని కొలిచి చూస్తే అవన్నీ ఒక క్రమ పధతిలో ప్రణాళిక వేసుకుని కట్టిన దృశ్యం కళ్లముందు కనబడి వీటిని యెలా కట్టారో అర్ధమే చేసుకోలేనివాళ్ళు ఆధునికులం అని జబ్బలు చరుచుకోవడం చూస్తుంటే జాలి వేస్తుంది!సనాతన ధార్మిక సాహిత్యం నిర్ధారించి చెప్పిన దాని ప్రకారం అనంతకోటి విశ్వాలలో ఒకటైన మన విశ్వాండం యొక్క అక్షం భూగోళం యొక్క అక్షంతో కలిసి పైకి సాగుతూ వూర్ధ్వలోకాలకు వేసిన నిచ్చెన వలె పొడుచుకుని వచ్చిన ఆకారమే కైలాసశిఖరం!కైలాసశిఖరం ఉన్న చోటు నుంచి కిందకి meridian line గీస్తే భూమికి రెండవ వైపున Easter Island ఉంటుంది.

     అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం అక్కరలేదు,ఈ ప్రాంతాలని గుర్తు పట్టగలిగిన సైజు గ్లోబు గనక మీ దగ్గీర్ ఉంటే ఇపటికిప్పుడు కొలిచి చూసుకోవచ్చు - Munt Kailash నుంచి Egyptian pyramids వరకు ఒక సరళరేకహ్ గీస్తే అది Easter Island వైపు చూస్తుంది,ఆ రెంటినీ కలపండి.ఇప్పుడు కొలిస్తే Mount Kailash నుంచి Egyptian Pyramids మధ్య ఉన్న దూరం Mount Kailash నుంచి Ester Island మధ్య దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంతే కాదు, Easter Island నుంచి Mexican Pyramids వార్కు ఒక సరళరేఖ గీస్తే అది Mount Kailash వైపుకు సాగుతుంది,ఆ రెండింటిని కూడా కలపండి.ఇప్పుడు Ester Island నుంచి Mexican Pyramids మధ్య దూరం కూడా Mount Kailas నుంచి Easter Island మధ్య ఉన్న దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంటే,Egyptian Pyramids నుంచి Mount kailash మధ్య ఉన్న దూరమూ Mexican Pyramids నుంచి Easter Island మధ్య ఉన్న దూరమూ సమానం అన్నమాట!
     ఈ లెక్క ఇంతటితో ఐపోలేదు,Mount Kailsh నుంచి Stonehenge Monument వరకు ఒక సరళరేఖ గీస్తే అది కూడా Easter Island వైపుకే సాగుతుంది.మళ్ళీ Mount Kailash నుంచి Stonehenge వరకు గల దూరం Mount Kailash నుంచి Easter Island వరకు గల భూమి వ్యాసంలో నాలుగోవంతు ఉంటుంది.ఈ Mount Kailash నుంచి Stonehenge మీదుగా Easter Island వరకు సాగుతున్న రేఖ మీద Easter Island వైపునుంచి మూడోవంతు దూరం దగ్గిర చుక్క పేడితే - అక్కడ Bermuda Triangle ఉంది!Bermuda Triangle రహస్యం గురించి పరిశొర్ధనలు చేస్తున్నవారిలో కొందరు అప్పుడే ఈ అమరికను బట్టి కొత్త సూత్రీకరణలు చహెస్తున్నారు.వారి విశ్లేషణల ప్రకారం ఈ వలయంలోని ఆ ప్రాంతంలో ఉన్న ఒక నిర్మాణం భూమిలోనికి కుంచించుకుపోయి ఉండవచ్చు.అది ఈ వలయం/శ్రీచక్రబహుభుజి/సహస్రారచక్రం వంటి నిర్మాణంలో ఉండాల్సిన చోట ఉండకపోవటం వల్ల ఐన్స్టీన్ విశ్వంలో కాంతి వంగుతుందన్నట్టు తన ప్రభావం తీవంగా ఉన్నంతమేర స్థలకాలద్రవ్యశక్తి తత్వాలను వంచంచుతున్నది!

     ఈ దూరాల లెక్కలో ఉన్న అసలైన విశేషాన్ని గమనించండి - MOunt Kailash నుంచి Stonehenge Monument వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Stonehenge Monument నుంచి Bermuda Triangle వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Bermuda Triangle నుంచి Easter Island వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, North Pole  నుంచి Mont Kailash వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు కాగా Mount Kailash ఎత్తు 6714 మీటర్లు!
     ఒక కొలత మాత్రం మీటర్లలో ఉండి మిగిలినవి కిలోమీటర్లలో ఉండడం కూడా గణితశాస్త్రంలోని ఒక శాఖ అయిన fractal mathematics ప్రకారం చూస్తే అది అనుకోని పొరపాటు వల్ల జరిగినట్టు కాక ఈ నిర్మాణాలను ఇంత ప్రణాళికతో నిర్మించినవారు గణితశాస్త్రంలోని ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదనేటందుకు సాక్ష్యంగా నిలుస్తుంది.ప్రస్తుతం ఈ అన్ని నిర్మాణాలను గురించి విడివిడి పరిశోధనలు చేస్తున్న వారిలో కొందరు ఇవి మానవనిర్మితాలనీ కొందరు గ్రహాంతరవాసుల చేత నిర్మించబడినాయనీ రెండుగా చీలిపోయి ఉన్నారు.నాకైతే ఈ రెండూ కాక పరమేశ్వరుడు భూమి మీద తన ఉనికిని సర్వులకూ చాటి చెప్పడానికి దివ్యపురుషులను నియోగించి నిర్మింపజేశాడని అనిపిస్తున్నది!ఇతర దేశాల వారికి అయితే మానవులూ లేకుంటే గ్రహాంతరవాసులూ అనటం తప్ప ఇంకేమీ తెలియదు.మనకు అలా కాదు.ప్రాచీన భారతీయ విజ్ఞానుల విశ్వనిర్మాణ సిద్ధాంతం ప్రకారం భూలోకానికి పైన ఏడు వూర్ధ్వలోకాలూ కింద ఆరు అధోజగత్తులూ ఉన్నాయి.ఈ ప్రతి లోకంలోనూ జీవజాతులు ఉంటాయి,ఉంటారు.మన భూమి ఉన్న లోకానికి ఈ పదమూడు లోకాల వారూ రాకపోకలు సాగించగలరు.అధోజగత్తు అన్నందువల్ల మనకన్న అధములు అనుకోనక్కర లేదు,ఈ పదమూడు లోకాల లోనివారు అందరూ మనకన్న అధికులే = వారిలో ఎవరో ఒక లోకం వారు నిర్మించి ఉండవచ్చు!


     ఆధునిక విజ్ఞానశాస్త్రం సృష్టిలోని అనేకమైన కొలతలలో 10 కొలతలను మాత్రమే నిర్వచించగలిగింది.మనం నాల్గవ కొలతలో ఉన్నాం,అంటే పొడవు,వెడల్పు,ఎత్తు,కాలం అనే ఈ మూడు కొలతలలోనే మన ఇంద్రియాలు పని చేస్తాయి.మనకు కొద్ది దూరంలో ఉన్న వస్తువుని కదల్చాలంటే మనం అక్కడికి వెళ్ళి స్పర్స ద్వారా మాత్రమే కదిలించగలం - అయితే అయిదవ కొలతలోకి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళకుండానే ఆ వస్తువుని కదిలించగలం.అలాంటి దివ్యపురుషులు నిర్మించడం వల్లనే ఎల్లోరా కైలాసనాధ స్వామి ఆలయంలో తొలచిన రాళ్ళ జాడ కనబడటం లేదు, మానవులు తొలిస్తే గనక అన్ని టన్నుల రాళ్ళని ఆనవాళ్ళు లేకుండా మాయం చెయ్యడం కుదరదు. అబ్రహామిక మతాల వారు సిద్ధాంతీకరించిన మానవుడి ఆధిక్యతను సవాలు చేస్తున్న ఈ దివ్య నిర్మాణాలను చూసి కూడా  సనాతన ధర్మమే అన్నిటికన్న ఉన్నతమైనదని ఒప్పుకోలేనివారిని కాలమే సమాధాన పరుస్తుంది - అది ఎంతో దూరం కూడా లేదు!
     ఈ పరిశోధనలు చేస్తున్నవారు గానీ ఈ సూత్రీకరణనలను చేస్తున్నవారు గానీ పొరపాటున హిదువులై ఉంటే  ఈ దేశంలోని వారే వారిని కుళ్ళబొడిచి ఉండేవారు - మన అదృష్టం బాగుండి వాళ్ళు విదేశీయులూ హైందవేతరులూ అయ్యారు!ఇన్నాళ్ళూ వైదిక సంస్కృతికి పుట్టినిల్లు అయిన హరప్పా  పాకిస్తానుకి పోయిందని బాధగా ఉండేది,ఇవ్వాళ కైలాసశిఖరం యొక్క గొప్పదనం తేలిశాక మనస్సు చల్లగాలికి చిన్న చిన్న అలల్ని పుట్టిస్తూ తుళ్ళింతలై నవ్వుతున్న సరస్సులా తయారైంది!

     దేహదారుఢ్యం అవసరమైన కైలాసశిఖరదర్శనయాత్రని రెటైరయ్యాక చూద్దాం లెమ్మనుకోకుండా యాభైకి లోపు ఒక్కసారైనా చూడాలనుకోవడం, వీలు చేసుకుని వెళ్ళడం, చూసి తరించడం ఉత్తమం.కొన్ని చోట్లకి మనం ఒక్కసారి వెళ్ళాలని అనుకోగానే సాధ్యపడకపోవచ్చు, దైవం నడిపిస్తే తప్ప కొన్ని చోట్లకి వెళ్ళలేకపోవడం చాలామందికి అనుభవమే - అయినా మనకంటూ మనసులో కోరిక ఉండాలి కదా!
     రంగులు మారుస్తుంది, ఏ రెండు సార్లు చూసినా ఒక్కలా కనిపించదు, ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు, మాయలు చూపిస్తూ మాయను పోగొడుతుంది - లయకారకుడైన శివుడు తానై వెలిగే ఈ హిమదీపం అహాన్ని చంపేస్తుందనేది తిరుగు లేని పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

83 comments:

  1. గురువు గారూ...! మీకు వేనవేల నమస్కృతులు.ఇంత మంచి సమాచారం అందిస్తున్నందుకు మీకు ఆ శ్రీనివాసుడు ఆయురారొగ్య ఐశ్వర్యాలు అందించాలని ప్రార్థిస్తూ...మరిన్ని విశేషాలు మీ హరిక(కా)లం నుంచి జాలువారితే అవగాహించి తరించాలని ఆశిస్తూ ...మీ అభిమాని.

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషమండీ!
      గురువుగారూ అని పిలిపించుకునేటంత పెద్దవాణ్ణి కాదు - అభిమాని అనే మాట ఇబ్బంది పెడుతున్నది, మితృత్వం చాలు!

      Delete
  2. హిందువులు తమ పండగల్ని త్మ దబ్బులతో అప్టాసులు కొనుక్కుని ఎవరింట్లో వాళ్లు చేసుకుంటున్నా యేడ్చి చచ్చేవాళ్ళు నిన్నా మొన్న జరిగిన తాగుడు భీబత్సాల గురుంచీ జనాన్ని నిద్రలు పోనివ్వని పొలికేకల గురించీ మాట్లాడరేంటి?

    ReplyDelete
    Replies
    1. కదా.... మరి వాల్లల్లో ఒక్కడుకూడా హిందువు లేడాయే... ఇది వుగ్రవాదుల కుట్రే మరి

      Delete
    2. >>అప్పుడు నాలుగు వైపుల నుంచి ఈ ఫలకాల మీద ప్రసరించే కాంతి,ధ్వని మొదలైన అయస్కాంత తరంగాలు లోపలి వైపున వక్రీభవనం చెందడం వల్ల కేంద్రం దగ్గిర భూమిని తాకేచోట శక్తిపాతం వూహించడానికి శక్యం కాని స్థాయికి పెరుగుతుంది

      ఇంకేం! నువ్వు కూడా పిరమిడ్ శక్తి సంస్థ ఒకటీపెట్టీ.. అమ్మయిల్ని కౌగలించుకోవచ్చు.. అబ్బాయిల్ని తన్నుకోవొచ్చు..

      అంత పబ్లిక్గా టివీల్లో నిరూపించినా.. మీకు సిగ్గు రాదయ్యే..అవి ఎవడుచూశాడ్లే అని.. ఇంకా ప్రమోట్ చేసుకుంటానే ఉండండి.

      Delete
    3. @Anonymous2 January 2018 at 05:00
      >>ఇంకేం! నువ్వు కూడా పిరమిడ్ శక్తి సంస్థ

      >>అంత పబ్లిక్గా టివీల్లో నిరూపించినా..

      hari.S.babu
      బౌద్ధులూ క్రైస్తవులూ మహమ్మదీయులూ తమ ప్రార్ధనాస్థలాల్లో ఇముడ్చుకున్న Pyramid Powerకీ అమ్మాయిల్ని కావిలించుకోవడానికీ సంబంధం ఏమిటి?

      దేన్ని తీసుకొచ్చి ఎక్కద కలిపి అఘోరిస్తున్నావో నీకు తెలుస్తుందా?

      ఏమిటట తొక్కలో paid media నిరూపించిన అంత ఘనమైన సత్యాలు?

      సైంటిస్టులు పరిశోధనలు చేసి దూరాల లెక్కలు కొలిచి చూపిస్తున్న నిజాలు చెప్తే నీకు అబద్ధాలతో ప్రమోట్ చేసుకోవడంలా కనిపిస్తుందా?

      ఆధారాలు చూపించకుండా వాగిన సొల్లులో ఇక్కడ నీ సిగ్గులేనితనం కనిపిస్తూనే ఉందిగా!

      Delete
    4. @@Anonymous2 January 2018 at 05:00
      అమ్మయిల్ని కౌగలించుకోవచ్చు.. అబ్బాయిల్ని తన్నుకోవొచ్చు..

      hari.S.babu
      అమ్మాయిల్ని కావిలించూకోఅవ్డానికీ అబ్బాయిల్ని తన్నడానికీ మాలాంటివాళ్ళం పెట్టే పీఠాలు ఎందుకు పనికివస్తాయి?కంచె ఐలయ లాంటి తాయిగంద వెధవ్ల పక్కన తిరిగితే బహిరంగ ముద్దుల వేలంపాటలో ముద్దులు కూడా ఫ్రీగానే పెడతారు మీ భావజాలపు నెరజాణలే!ఇక అబ్బాయిల్ని తనండానికి రోహిత్ బుజ్జాయిలా నేను హిందూద్వేషిని అనిటముకేసుకుంటే చాలు ఎదటోణ్ణ్ణి ఎపెండిక్సు బదలయ్యేలా చితక్కొట్టెయ్యొచ్చు - ఎపెండిక్సు బద్దలవ్వటమేగా,చచ్చిపోలేదుగా,ఇంతదానికే గోల చెయ్యాలా అని యెగేసుకుంటూ స్టార్ కమెడియన్లు చాలామందే వస్తారు సపోర్టుకి.నీదే ఆలశ్యం!

      Delete
    5. నేను హిందూద్వేషినని చెప్పుకుంటే చాలు ఎన్ని బూతులైనా మాట్టాడొచ్చు,ఎన్ని లఫంగి పనులైనా చెయ్యొచ్చు - అంతేనా?మళ్ళీ మాకన్నా సంస్కారవంతులు లేరని డబ్బా కొట్టుకుంటూ సుప్రభాతాల్లోనూ పురాణకధల్లోనూ బూతులు ఉన్నాయని హిందువులకి నీతులు చెప్పడం,ఈ బటాచోరు పనుల్తోనే పరువు పోగొట్టుకుని చంకనాకిపోతున్నారు,సిగ్గు లేని మంద!

      Delete
  3. @venuvu

    వస్తువులూ -విలువలూ -మారకాలకు సంబంధించి ఆర్థిక శాస్త్ర అంశాన్ని చెప్పటానికి కార్ల్ మార్క్స్ ‘కాపిటల్’ లో రాబిన్ సన్ క్రూసోను కోట్ చేస్తాడు.

    రాబిన్ సన్ దీవిలో ఒక్కడే వేర్వేరు రకాల శ్రమలు చేశాడు. జంతువుల్ని వేటాడటం, చేపలు పట్టడం, ఇల్లు కట్టుకోవడం, వంట చేసుకోవడం, మేకల్ని పెంచడం...ఇలా. వాటిని ఉపయోగించుకోవటంలో అతడికెలాంటి సమస్యా రాలేదు.

    ఆ దీవిలోకి రాబిన్ సన్ ఒక్కడే కాకుండా పగిలిపోయిన ఓడ నుంచి మరికొంత మంది మనుషులు కూడా వచ్చివుంటే? అందరూ తలో శ్రమా చేసి తయారుచేసుకున్న వస్తువుల్నీ, పదార్థాల్నీ అందరూ సమష్టిగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది.

    అలా కాకుండా ఎవరికి వాళ్ళే తాము తయారుచేసుకున్న వస్తువులకు సొంతదారులుగా ఉండి, వాటిని ఇతరుల వస్తువులతో ‘మారకాలు’ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది?

    వాళ్ళంతా ‘విలువల గందరగోళం’లో పడిపోతారని మార్క్స్ చెపుతాడు.

    ఆ వస్తువుల్లో శ్రమకాలాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వాటికి రకరకాలుగా మారకపు విలువలు ఏర్పడి వాటిని మార్చుకోవడంలో చిక్కులు మొదలయ్యేవి. పోట్లాటలూ, కొట్లాటలూ, నరుక్కోవడాలతో ఆ దీవి లో ప్రశాంతత భగ్నమయ్యేది.

    ఆ వస్తువులన్నిటి సొంతదారు రాబిన్ సన్ ఒక్కడే కాబట్టి .. తన వస్తువులను తన ఇతర వస్తువులతో మారకం చేసుకోనక్కర్లేదు కాబట్టి... ఆ దీవిలో మారకపు విలువల తల నొప్పుల నుంచి తప్పించుకోగలిగాడు రాబిన్ సన్.

    అంటే... మనుషులంతా శ్రమలు చేస్తూ ప్రణాళికతో వస్తువులు ఉత్పత్తి చేసుకుని, వాటిని సమష్టిగా (ఎవరి అవసరం మేరకు వారు) వాడుకోవటం మాత్రమే శాస్త్రీయమైన, ఉన్నతమైన మార్గం... అని చెపుతాడు మార్క్స్.

    hari.S.babu
    ఘనత వహించిన మార్క్సుగారు మిగతావాళ్లు కూడా వస్తే తలనొప్పులు వస్తాయని తనే చెబుతున్నాడు,మారకపు తలనొప్పులు లేకపోవటం వల్లనే క్రూసఓ సంతోషంగా ఉన్నాడని బల్లగుద్ది చెప్తూనే ఉన్నాడు,అయినా క్రూసోలాగ "మనుషులంతా శ్రమలు చేస్తూ ప్రణాళికతో వస్తువులు ఉత్పత్తి చేసుకుని, వాటిని సమష్టిగా (ఎవరి అవసరం మేరకు వారు) వాడుకోవటం మాత్రమే శాస్త్రీయమైన, ఉన్నతమైన మార్గం" అని నొక్కి వక్కాణిస్తున్నాడు - కమ్యూనిజం అంటే ఒక్కోడూ ఒక్కో ద్వీపానికి పోయి క్రూసోలా బతకడమని అర్ధమా?

    తస్సల్రవ్వ!మారకాలు ఉంటే గందరగోళం తప్పదంటాడు,ఒకడి కన్న ఎక్కువ మంది ఉంటే మారకాలు తప్పవని తనే అంటాడు,మళ్ళీ సమిష్ఠిశ్రమ చేసి క్రూసోలా బతకడమే శాస్త్రీయం అంటాడు - బలేగుందీ తలతిక్క యవ్వారం:-)

    ReplyDelete
  4. మీరు కైలాసానికి(మానస సరోవరాని)కి వెళ్ళేటట్లయితే మావారు కూడా మీకు తోడు వస్తారు తీసుకెళ్ళండి...రాబిన్ శర్మ అని ఒకాయన ఆస్థులన్నీ అమ్ముకుని హిమాలయాలకు పోయి మళ్ళీ వచ్చి మూడ నమ్మకాలన్నీ తొలగించుకుని ఏదో సాధించాలనే తపనలో ప్రస్థుతాన్ని దూరం చేసుకోకూడదు అని చెప్పారండీ...పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని జీవితాన్ని వాయిదా వేయకు అని శెలవిచ్చారండీ. జోగీ జోగీ కైలాసానికి పోతే .....మంచి (బ్లాగు)పుస్తకాలు రాల్తాయి.

    ReplyDelete
    Replies
    1. బాబోయ్!మీ ఆయనతోనా?నేను పోనండీ!!

      అప్పుడెప్పుడో నడుం లోతు నీళ్ళల్లో ఆయనా మీరూ ఉన్న చిత్రరాజమును చూసి దడుచుకొంటిని కదండీ!!

      ఆయనగారి ఉదరభాగపు కేశసంపద నాకుంటే మా బంగారం ఎప్పుడో విడాకులు ఇచ్చేసునండీ:-(

      నన్నొదిలేయండీ!ఇంకెవరినన్నా అడగండీ!!

      Delete
    2. మీరు పుష్కర స్నానం మానేయమంటే ఆ ఫోటో పెట్టాను. భక్తితోనే నదీ స్నానం చేయరెవ్వరూ.....
      మీ బంగారంలాగే ధన్ రాజ్ భార్య కూడా వాళ్ళాయనని నాగార్జునే అనుకుంటుంది....
      మీ పుట్టింట్లో అటు ఏడుతరాలూ ఇటు ఏడు తరాల్లో నాలాగా బాహుబలులెవరన్నా ఉన్నారా అని మావారు ఫీలవుతుంటారు...తప్పులేదులెండి ఎవరి perception వారిది.
      అసలు కైలాసం వెళ్ళేదే శ్వాస మీద ధ్యాస కోసం కదా ? మీ ధ్యాస వేరే ఉన్నట్లుంది. మొన్న రాధే .. రుక్మిణి అని అన్నారు. రేపు శూర్పణఖే .. సీత అని కూడా వ్రాస్తారు కాబోలు...మీరు ఏం వ్రాసినా చదివి తలాడించాలి అవునా ?

      Delete
    3. @neehaarika
      మీ ధ్యాస వేరే ఉన్నట్లుంది.

      hari.S.babu

      ఔను!
      మా బంగారం మీద బోరు కొట్తేసింది.తను నన్నసలు మెచ్చుకోదుగా - పొట్టి బుడంకాయ్ అని ఇన్సల్ట్ చేస్తుంది!


      గజల్ శ్రీనివాసులా పేరు తెచ్చుకుని కుర్రపిల్లలకి లైనెయ్యాలని ఉంది - కానీ, దొరికిపోతానేమోనని భయంగానూ ఉంది!దొరక్కుండా ఉండాలన్నా,దొరికి తప్పించుకోవాలన్నా ఎక్కువ డబ్బు,ఎక్కువ అధికారం అనే రెండింటిలో ఒకటి గానీ రెండూ గానీ ఉండాలి.గజల్ శ్రీనీఅసు అక్కదే దెబ్బతిన్నాడు, పాపం!

      అందుకే నేను పాలిటిక్సులోకి వెళ్తానంటున్నది. పాప్యులారిటీ తెచ్చేసుకుని పొడుగు పొట్లకాయలని ఓ పట్టు పడతా.మనుషుల్ని చీల్చడానికి కనుక్కున్న ముస్లిం-కాఫిర్,ప్రొలెటేరియట్-క్యాపిటలిస్ట్ అనేవాటికి పొట్టి-పొడుగు అనే మరో జంటని చేరుస్తా. అహ్మద్ ఖురేషీల అమరో కొత్తమతాన్ని పుట్తంచహ్దమో కారల్ మార్కుసులా కొత్త ఐదియాలజీనో కనుక్కుంటా.పన్లో పని సూపర్ ఫిగర్లు కనబడితే లైనేసి లాగేసి పట్టేస్తా!

      Delete
  5. దేహదారుఢ్యం ఉన్నప్పుడే ఇటువంటి యాత్రలు చెయ్యాలనే సలహాతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను హరిబాబు గారూ. రిటైరయిన తరవాత ప్రయత్నిస్తే ఆయాసమే మిగిలే ఆస్కారమే ఎక్కువ.

    నాకు తెలిసిన డాక్టర్ గారొకరు క్రిందటేడు మానససరోవర యాత్ర (ప్రదక్షిణతో సహా) పూర్తి చేశారు. అక్కడ గాలిలో రకరకాల శబ్దాలు వినిపిస్తుంటాయనీ, తన మటుకు ప్రదక్షిణకాలంలో
    గాయత్రీమంత్రం వినిపించిందనీ చెప్పారు వారు. ఇలా శబ్దాలు వినిపించడం గురించి మీరెక్కడన్నా చదివారా?

    మరో సంగతి. కైలాస శిఖరం ఎక్కలేరు కాబట్టి వాయుమార్గాన శిఖరం మీద దిగటానికెవరన్నా ప్రయత్నించారా (అంటే హెలికాప్టర్ లో)? . ఈ అంశం మీద మీదగ్గరేమన్నా సమాచారం ఉంటే మీ బ్లాగ్ ద్వారా అందిస్తే తెలుసుకుందామని.

    ReplyDelete
    Replies
    1. @విన్నకోట నరసింహా రావు
      అక్కడ గాలిలో రకరకాల శబ్దాలు వినిపిస్తుంటాయనీ, తన మటుకు ప్రదక్షిణకాలంలో
      గాయత్రీమంత్రం వినిపించిందనీ చెప్పారు వారు. ఇలా శబ్దాలు వినిపించడం గురించి మీరెక్కడన్నా చదివారా?

      hari.S.babu
      క్రీ.శ 1999లో geology, physics వంటి అనేక శాఖలలో నిష్ణాతులైన ఒక పరిశోధక బృందానికి నాయకత్వం వహించి ఎన్నో పరిశోధనలు చేసి Where Do We Come From? గ్రంధాన్ని రచించిన Ernst Muldashev బృందం కూడా ఇలాంటి అనుభవాన్ని గురించి చెప్పారు.ఒక రాత్రి అయితే ఏదో ఒక పెద్ద బందరాయి కొండ మీదనుంచి దొర్లుతున్న చప్పుడు చాలా స్పష్తంగా అందరికీ వినిపించింది.అదీ ఆ శబ్దం బయట జరుగుతున్నట్టు కాదు ,కైలాసశిఖరం లోపలి నుంచి వచ్చాయి ఆ శబ్దాలు!దీనిని తమ పరిశోధన గ్రంధంలోకి ఎక్కించారు.

      Delete


  6. 6+7+1+4 ఇజికోల్టు 18



    జిలేబి

    ReplyDelete
  7. హరిబాబు గారు.
    మంచి వ్యాసం రాశారు. ప్రతి వ్యాసం లో మీ పరిశోధన తాలూకు కష్టం కనపడుతుంటుంది. నాకు ఒక చిన్న సందేహం. నాకు కూడా ధ్యానం చేసే అలవాటు వుంది. ధ్యానం చేసిన తరువాత కొంత ఎనర్జి వచ్చినట్లు వుంటుంది. పిరమిడ్ లో ఎప్పుడు చేయలేదు. నిజంగా పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఎనర్జి బాగా పెరుగుతుందా? సందేహ నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. తేడా ఖచ్చితంగా ఉంటుంది!మనం ఇంట్లో పూజ చేసుకోవదానికి ఉపయోగించే పూజామందిరాలని కూదా పైన పిరమిద్ పెట్టి తయారు చేస్తారు కదా!బౌద్ధుల ప్రార్ధనామందిరాలు అన్నీ పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి కదా!

      అసలు హందూ ఆలయాలు పవిత్రమైన వాతావరణంతో ఉండటానికి వాటి జ్యామెట్రీయే కారణం కదా!అయస్కాంత సక్తి కూడా కాంతి,ధ్వనిలా తరంగరూపమే,కాంతికీ ధ్వనికీ ఉన్నట్టే దానికి కూడా వక్రీభవనం,అప్రావర్త్నం లాంతి ధర్మాలు ఉంతాయి - ఇవే కాదు అన్ని రకాల శక్తిరూపాలకేఎ కలిపి ఏకీకృతక్షేత్రసిద్ధాంతం అనేది ఎప్పటినుంచో భౌతికశాస్త్రజ్ఞుల మధ్యన నలుగుతూనే ఉన్నది.

      Delete
    2. కృతజ్ఞతలు.

      Delete
  8. నేను పోష్టు మొత్తాన్ని కైలాసశిఖరం ఇప్పటికీ నిలిచి ఉన్న ప్రాచీన కట్టడాలకు ఎలా కేంద్రం అయ్యింది అనే దానిమీదనే దృష్టి పెట్టడం వల్ల ఇతర కట్టడాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలని కూడా వదిలేశాను.వాటిలో కొన్ని

    1.ఈజిప్టులో పెద్ద పిరమిడ్ స్ఫింక్స్ నందీశ్వర విగ్రహం కావచ్చు - ఎందుకంటే,ఆ ముఖం చూస్తున్న చూపు వెంబడి లైన్ గీస్తే అది కైలాసశిఖరాన్ని తాకుతుంది!వెనక భాగం జంతువులా ఉంటుందంటారు కదూ!

    2.ఈ అన్ని నిర్మాణాలూ అబ్రహామిక్ మతాలు పుట్టకముందు కట్టినవి.ముఖ్యంగా ఈస్టర్ అయిలాంద్ వారు కట్టినది కాదనీ కనుక్కున్నట్టు వారు చెప్పుకున్న కధల్లోనే ఉంటుంది.ఎందుకంటే, అక్కడ వారు కడితే సుతరామూ ఉండకూడని విగ్రహాలు ఉన్నాయి.అది ఎలా ఉనికిలోకి వచ్చిందో వారి సాహిత్యంలో ఉండదు.అది తమకోసం దేవుడు ఇచ్చిన కానుక అని చెప్పేసుకున్నారు.అయితే, దాని ప్రాధాన్యతని గురించి మాత్రం ఈ విశ్వానికి కేంద్రం అని చెబుతారు.అది ఎలా తెలుసుకోగలిగారు అనేదానికి ఆధారం చెప్పరు.మొగతా వాళ్ళు తమ దేవుడు తమకి ఇచ్చిన విశ్వకేంద్రం అని చెప్పుకుంటున్న నిర్మాణాలు కూడా అంతే.కొన్నింటికి వివరాలు పూర్తి సాక్ష్యాధారలతో సహా తెలిసినా అధికారికమైన ప్రకటనగా చెప్పరు.ప్రైవేతు వాదనల్లో ముఖాముఖి వాదనల్లో మాత్రమే ఒప్పుకుంటారు - అవి సనాతన ధార్మికులు నిర్మించినవే అని!

    3.విశ్వానికి కేంద్రం అంటూ ప్రతి ప్రాంతం వారూ ఒక దాన్ని చెబుతూనే ఉన్నారు ప్రాచీన కాలం నుంచీ.కైలాసశిఖరాన్ని ఈ వలయంలో చేర్చకపోతే అసలు వలయానికీ వాటిమధ్యన ఉన్న పరస్పర సంబంధాలు అస్సలు తెలియవు - అలాంటప్పుడు మాత్రమే దేనికదిగా విశ్వానికి కేంద్రం అవుతుంది!

    4.ఈ అన్ని నిర్మాణాలలో భారతీయుల ప్రమేయం ఉండి తీరాలి.ఎందుకంటే,ఇక్కడ కైలాసశిఖార్మ్ మానవనిర్మితంగా అయినా దివ్యపురుషుల వల్ల అయినా ఉనికిలోకి వచ్చిన తర్వాత మొదట తెలిసినది వీరికే!మిగిలినవి ఎక్కద ఉందాఇ అనేది తెలీసె అవకాశం కూడా వీరికే ఎక్కువ.వ్యాపార సంబంధాల ద్వారా ఆయా ప్రాంతాలకు వెళ్ళగలిగే వకాసం ఉండటం వల్ల నిర్మాణాలు ఏ విధంగా జరిగిన భారతీయ మేధావుల ప్రమేయం ఉండే ఉంటుంది - అప్పటి భారతీయ విజ్ఞానులకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవమర్యాదలు దక్కేవి కదా,అక్కడి వారికి ఎక్కద యేది కట్టాలో చెప్పి నిర్మాణాలకి ఒప్పించడమో ప్రోత్సహించి నిర్మాణాలకి సహకారం అందించడమో జరిగి ఉంటుంది!ఇవన్నీ ఎవరు నిరూపించాలి?

    5.అక్కడి పిరమిడ్లలోనూ కైలాసశిఖారంలోనూ కింది వారస్ పెద్దదిగా ఉంది పోనుపోనూ పరిమాణం తగ్గుతూ ఉందటానికి కార్ణం ఏమిటూఎ తెలుసా?భూమి నుణి దూరం వెళ్లేకొద్దీ వస్తుగతప్రపంచం మీద మోహం తగ్గాలి అనే సూచన,ఎత్తుగ ఉన్న దేనినైనా సరే పైకి ఎక్కే కొద్దీ అప్పతివార్కు పెద్దవిగా కనబడినవి చిన్నవవుతూ మనకు ఇదివరకు కనబడనివి కూడా కనాబడటం వల్ల తగ్గుతుంది కూదా!


    6.యూదుల సినగాగ్,క్రైస్తవుల చర్చి,మహమ్మదీయుల మసీదు - అన్ని చోట్లా ఏదో ఒక రూపంలో ధూపం అనేది ఆరాధనలో ఒక భాగం,అవునా?ఇది హిందువుల నుంచి తీసుకున్నదే!అది మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వారిలో ఎవరూ సరయిన కారణాలు చెప్పరు.అన్ని మతాల వారూ సామాన్యంగా వాడేది సాంబ్రాణి లేదా అగరువత్తుల్లు - వీటినుంచి వచ్చే పొగలో మనస్సుకి ప్రశాంతతని కలిగించే లక్షణం ఉంటుంది.ఈ పొగ గాలి వేగం లేకపోతే దట్టమై ఒక స్తంభంలా పైకి లేస్తుంది.ధూపారాధనలో ఇదే అసలైన విషయం - మన ఆత్మ కూడా అలాగే భూమికి అంటిపెట్టుకిని ఇక్కడే తచ్చాడకుండా బంధాలను తెంచుకుని వూర్ధ్వలోకాలను చేరుకోవాలి అనే సూచన ఉంటుంది దానిలో.అర్ధం తెలియకపోయినా చేస్తున్నారు అంటే కాపీ కొట్టినట్టే కదా!

    ధూపం ఆఘ్రాపయామి అని పటాల మీదకి తోలడం కాదు,మనం ఆ వాసన పీల్చాలి!

    ReplyDelete
  9. 7.ఈజిప్షియన్ పిరమిద్ల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు అవి ఇప్పుడు ఉన్నట్టు ఫారోల సమాధులని ఉంచడానికి గాక మరేదో ఇతర అవసరాల కోసం కట్టినట్టు ఉన్నాయని అనిపిస్తున్నది.అంటే ఫారోల కాలానికే ఇవి కట్టేసి ఉండి అవి ఎందుకు పనికొస్తాయో తెలియక డాబుసరికి తమ శవాల్ని పడుకోబెట్టడానికి ఉపయోగించుకున్నారని అనుకోవాలి.

    ReplyDelete
  10. http://www.teluguyogi.net/2018/01/blog-post.html

    ఈ పోస్టు గురించి మీరేమంటారు హరిబాబు గారు. వాస్తవం మాట్లాడినట్లు నాకు అనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. ఆ పోష్టు నేను హదివాను.ఆయన బౌద్ధ మతస్థుదు!వ్యక్తిగతంగా అహంకారం ఎక్కువ అని ఆయన తన పోష్టుల్లో ఊదహరించున్న సంభాషనల్ని బట్టి తెలుస్తున్నది.

      అక్కడెక్కడో చెంఘిజ్ ఖాన్,మహమ్మద్ ఘోరీ లాంటివాళ్ళు పుట్టి వాళ్ళ ఇస్లామిక్ మౌఢ్యంతో ఎప్పుడెప్పుదు భారత్ అనే కాఫిర్ల దేశాన్ని కబళించి అక్కడ మన మతాన్ని రుద్దుదాం అని తహతహలాడుతూ వచ్చారని ముస్లిం చారిత్రకులే సాక్ష్యాలు చూపిస్తున్నారు.ఈయన దానికి కూడా హిందువుల పాపాలే కారణమంటున్నాడు - మెదడు తక్కువా పొగరు ఎక్కువా అయిన మనుషులు అట్లాగే వాగుతారు!

      మళ్ళీ ఈయనే జీసస్ జాతకం మీద అన్ని రకాల విశ్లేషనలు చేసి తప్పులు చెబుతూ 12 పొష్టులు వేశాడు - ఆయ్న విశ్లేషణలకి మూలం ఏమిటి?ఆయన ఆ వాదనలన్నీ చేసింది హిందూ జ్యోతిష శాస్త్రం ఆధారంగానేనా లేక బౌద్ధ జోతిషశాస్త్రం ప్రకారం చేశాడా?బౌద్ధులకి ఈ రాశి చక్రాలనీ జన్మతిధులనీ గణించి చెప్పే శాస్త్రం ఉన్నట్టు నాకయితే తెలియదు.డబ్బు తీసుకుని చేస్తాడో ఉచితంగా చేస్తాడో తెలియదు గానీ జాతకాలు చెప్తాడు,భవిష్యత్తులో జార్గబోయేవి చెప్తాడు,నేను చెప్పినవి జరిగినాయని డబ్బా కొట్టుకుంతాడు - ఆ శాస్త్రం ఎక్కణ్ణించి వచ్చింది ఆయనకి?తనకి పొట్టకూటికీ పేరు ప్రతిష్ఠలకీ పనికొచ్చే హిందూ జ్యోతిషంలో కనబడిన గొప్ప మిగతావాటిల్లో కనబడలేదన్నమాత!

      ఆంకోర్వాట్ హిందూ దేవాలయాన్ని ఆక్రమించినది బౌద్ధ మతస్థులే - ముందర ఉన్న మూలవిరాట్టుని తొలగించి బుద్ధ ప్రతిమని పెట్టి తమ మతానికి దఖలు పరుచుకున్నారు - అక్కడ బౌద్ధ మతస్థులకి అలాంటి దుర్మార్గపు వూహ పుట్టడానికి కూడా హిందువుల పాపాలే కారణమని అంటాడా?

      అందరికె హిందువులే దొరుకుతారు వెక్కిరించదానికి ఎవడి నలుపు వాడికి తెలియదు. కామెంట్లు అవేఅసె అవ్కాసం లేదు.ఏదయిన ఆడిగిన అతిన్నగ అజవాబులు చెప్పడు - శ్యామలీయనికి ఒక అనుబవం అయ్యింది గనక నేను చదివి వూరుకున్నాను.ముఖాముఖి కలిస్తే వదలను!

      Delete
    2. "అక్కడెక్కడో *చెంఘిజ్ ఖాన్*,మహమ్మద్ ఘోరీ లాంటివాళ్ళు పుట్టి వాళ్ళ *ఇస్లామిక్* మౌఢ్యంతో"

      చెంఘిజ్ ఖాన్ ముస్లిం కాదు. Just for info.

      Delete
    3. ఆయన అహంకారం గురించి చర్చ అనవసరం. నాగురించి కూడా చాలామంది అభిప్రాయం అదే ... ఆయన వ్రాసిన పోస్టు గురించి మాత్రమే చర్చించండి. జ్యోతిష్య శాస్త్రానికీ బౌద్ద మతానికీ సంబంధం ఏమిటీ ? నాకూ జ్యోతిష్య శాస్త్రం మరియు బౌద్ధ మతం పై అభిమానం ఉంది. మీకు కూడా బౌద్ధం ఇష్టమే అని చదివినట్లు గుర్తు...
      అసలు హిందూ దేవాలయాలు ఎందుకు ద్వంసం చేయబడ్డాయి ? బాబ్రి మసీదు ఎందుకు ద్వంసం చేయబడ్డది ? మీరు వ్రాసిన పోస్టు ఏదయినా ఉంటే తెలుపగలరు.

      Delete
    4. చెంఘిజ్‌ఖాన్ ముస్లిం కాదండి, మంగోలులది షామానిజం అనబడే మనలాంటి ప్రకృతిని ఆరాధించే మతం. ఇస్లామిక్ సెంటర్స్ ఐన మదీనాలాంటి నగరాలని నేలమట్టం చేసాడంటారు తన దండయాత్రల్లో భాగంగ, ఈయన వారసులు తర్వాత తరంలో ఇస్లాం, బౌద్దంలాంటి మతాలు పుచ్చుకున్నారు.

      Delete
    5. అందులో చర్చించడానికి ఏముంది?ముస్లిముల క్రూరత్వానికి హిందువుల బాధ్యత ఎట్లా ఉంటుంది?లక్షమంది ఢిల్లీ సుల్తాను సైన్యం 12000 మంది బాబరు సైన్యాన్ని ఓడించలేకపోవడానికి హిందువులు చెయ్యగలిగినది ఏమిటి?

      ఇంగ్లీషువాళ్ళ మీద కోపంతో తిరగబడి వాళ్లని వొదిలేసి హిందువుల మీద విరుచుకు పడిన మోప్లా వూచకోతలో ముస్లిములకి అంత క్రూరత్వం పుట్టడానికి కూదా హిందువులే కారణమా?

      The database of ancient documents tells us 548 battles that Islam fought against the classical world.

      The prominent historian of Islam Tabari describes, that the Muslim commander Khalid ibn al-Walid had prayed to Allah that he would flow rivers of blood if he helped him win the battle. After the retreat of the Sassanian army - including the Persians and the Christian Arabs - toward Al-Hirah, Khalid ibn al-Walid went in pursuit and succeeded in capturing nearly 70000 of the retreating masses. To fulfill his pledge, he brought the captured people in groups, and beheaded them one after the other by the river Khaseef, which was actually a canal used to power water mills. After three days of beheading, when he saw the blood was congealing on the soil instead of flowing, on the advice of Qa'qa ibn Amr, one of the commanders of the Muslim army, Khalid ordered the dam on the river to be opened, and the water then flowed in and moved mills, then they made bread with that which fed his troops of 18000 for three days, thus fulfilling his earlier oath about running the river with blood. The river Khaseef as a result became known as the "River of Blood".


      రక్తపుటేర్లు పారించాలని దేవుణ్ణి ప్రార్ధించి శపధాలు పట్టి నెత్తురుతో రొట్టెలు చేసుకు తినేటంత పైశాచిక స్థాయిలో ముస్లిములలో ఉన్న ఈ క్రూరత్వానికి కూడా హిందువులే కారణమా?చంపేవాళ్ళూ కూల్చేవాళ్ళూ "మేము మా మతం బోధించన దాని ప్రకారమే కాఫిర్లని చంపుతున్నాం,మా మతగ్రంధంలో ఉన్నట్టుగానే ఇతరుల దేవళాల్ని కూలుస్తున్నాం - అల్లా హో అక్బర్!" అని కేకలు వేసి చెప్తున్నా అర్ధం కానివాళ్లకి ఎన్ని చర్చల తర్వాత అర్ధం అవుతుంది?

      Delete
    6. @neehaarika
      ఆయన అహంకారం గురించి చర్చ అనవసరం.

      hari.S.babu
      "ఇప్పటి ముస్లింస్ కాదుగా మీ గుళ్ళు ధ్వంసం చేసింది" - అంటున్నాడు,అంటే తను హిందువు కాదని ఒప్పుకుంటున్నాడు కదా! ఆయన పాటించే బౌద్ధమతంలో లేవా గుళ్ళూ కర్మకాండలూ?తన మతంలోనూ అవే ఉన్నప్పుడు తనది తనకి చమ్మగానూ ఇతర్లది మాత్రమే తనకి తప్పుగానూ అనిపిస్తే నోటికి తోచింది వాగ్దమేనా?అటువంటి వాడి మాట శుద్ధమా?

      Delete
    7. Islamic Invasion అంటే తమాషా అనిపిస్తున్నది కొందరు అమాయకులకి!ఘొరీ 18/19 అదందయాత్రలూ ఒక్క సోమనాధ అదేవాలయం మీదనే జరిగాయి,ఒక్కొక్కసారీ 28,000 దీనార్లు కొల్లగొట్టుకుపోయాడు.చేసిన యుద్ధాలలఓ రోజుకి 20,000 మంది నుంచి 50,000 మంది వరకు హిందువులు మరణించారు.highest score ఒక రోజున 90,000 మంది హిందువులు - దాన్ని బట్టి దాడి యెంత క్రూరంగా జరుగుతుందో ఆలోచించుకోండి!

      మొత్తం యుద్ధంలో లక్షమంది చనిపోయినందుకే చండాశోకుడు ధర్మాశోకుడు అయ్యాడు - ఇక్కడి వాళ్ళ మనస్తత్వం అలాంటిది!ఇక్కడి రాజులూ వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చహెశారుగా అనవచ్చు - అయితేం,వీళ్లలో వీళ్లకి మనం ఒకే సంస్క్ర్తికి చెందినవాళ్లమ నే గమనిక ఉండేది.యుద్దాలు కూడా పద్ధతి ప్రకారం జరిగేవి.ముస్లిం దాదుల్ని మనవాళ్ళు తట్టుకోలేకపోవడానికి అవతలివాళ్ళ క్రూరతవానికి భయపడటమే కారణం,అంత క్రూరంగా ఉండలేకపోవటమే తప్పు అనేటట్లయితే ఇకముందు హిందువులు ముస్లిముల పట్ల అంత క్రూరంగా ఉంటే తప్పు పట్టకుండా ఉండగలరా?ఇప్పటికే కమలాహాసన్ హిందూ టెర్రరిజం అని అంటున్నాడు,మరి హిందువులు ఏమి చేయాలి?

      ముస్లిములు తంతే తన్నించుకుంటూ గుళ్ళు కూల్చేస్తుంటే కేవలం ఏడ్చి ముఖం కడుక్కుంటూ ఉంటేనే హీందువులు మంచివాళ్ళు అవుతారా?

      గుళ్లని కూల్చినవాళ్లని ఎందుకు కూల్చారు అని నిలదియ్యకుండా ఎందుకు కూల్పించుకున్నారు అని హిందువుల్ని నిలదియ్యడం భావ్యమా?దొంగతనం చేసినవాళ్ళని జైల్లో పెట్టకుండా దొంగతనం చేయించుకున్నందుకు పర్సుపోయినవాణ్ణి జైల్లో పెట్తే తింగరి లాజిక్కులు ఆపితే బాగుంటుంది!

      పాకిస్తాన్ వెంఠనే ఇవ్వనందుకు ఒక్క రోజులో 5000 మందిని చంపడం లాంటి పనులు హిందువులు ఎప్పుదైనా చేశారా?హిందువుల వైపునుంచి ఏనాడూ ముస్లిముల వైపునుంచి జరిగిన క్రూరమైఅన్ దాడి జరగలేదు - చరిత్ర వెతికి చూడండి!

      Delete
    8. ఆయన బుద్దిజం పాటిస్తున్నానని చెప్పారా? అన్ని మతాల ఆధ్యాత్మిక గ్రంధాలు చదివితే గందరగోళంగా తయారౌతాము. మానవత్వమే పరమ లక్ష్యం ఐతే, దానిని పుస్తకాలు చదివి నేర్చుకోవాలా? మిగతావాటితో పోలిస్తే, హిందూ మతగ్రంథాలు ఇవి చేయ్ అవి చేయ్ అని ఉండవు.హిందూ పురాణాలు కథల రూపంలో నువ్వు ఇలా ప్రవర్తిస్తే అలాంటి ఫలితం ఉంట్టుంది, చిక్కులో పడవచ్చు, జాగ్రత్తగా ఉండు. ముందూగానే చేసే పని ఆలోచించి చేయ్ అనే విధంగా ప్రేరేపిస్తాయి.
      కేస్ స్టాడిస్ లాంటివి.

      Delete
  11. https://www.youtube.com/watch?v=7t0esrYSw2Q

    ReplyDelete
    Replies
    1. అంటే మా ధూపాలు వాల్లు కాపీ కొట్టారంటం కూడా అహంకారమేనా? దేశభక్తి కాదా?

      Delete
    2. గ్రహణాలను గురించి మోద్ట చెప్పినది బాబిలోనియన్లు అంటున్నాడు - అదే అసలైన అజ్ఞానం!ఒకవైపున వాళ్లు భారతీయుల నుంచి నేర్చుకున్నారు అనటం సాంస్కృతిక దురహంకారం అంటూనే వాళ్ళు మనకి నేర్పారు,వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని పొగుడుతున్నాడు!గ్రహణాలని గురించి స్టడీ చెయయ్టానికి కూడా గణితశాస్త్రం కావాలి కదా!వాళ్ళు గ్రహణాలని స్టడీ చెయ్యటానికి కావలసిన గణితాన్ని నేర్పిన వీళ్ళకి గ్రహణాలని గురించి తెలియదని చెప్పటం కాదా మొట్టమొదట వాళ్లే గ్రహణాలని గురించి చెప్పారు అనటం - అతి తెలివి కాకపోతే!

      మాన్ చరిత్రని ఎంత ముందుకి తోసిన అ10,000 అమవత్సరాల కనన్ వెనక్కి వెళ్ళదా?ఎవడాడు ఈడికి సైన్సు గురించి చ్ర్ప్పింది!లక్షన్నర అసంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుటిన మానవజాతి 80,000 నుంచి 60,0000 సమావ్త్సరాల మధ్యన భారత్దేశం చెరుకున్నది,ఇక్కడి నుంచే అన్ని ఖండాలకీ నాగరికత వెళ్ళింది అని 2003 నుంచీ సైంటిస్టులు బల్లగుద్ది చెప్తుంటే ఈ అజ్ఞాని 10,000 సంవత్సరాలకి జుందు భారతీఉ=యులకి చహ్రిత్ర లేదంటున్నాడు - ఎంత అహంకారం!ఆఫ్రికన్ వారసత్వాన్ని భారతీయులు ఎప్పుడు కాదన్నారు వీడు కొత్త పాఠం చెప్పినట్టు చెబుతున్నాడు!

      అసలు తెలుగు మాట్లాడతమే సరిగ్గా రావదం లేదు చిన్నపిల్లాడు తడుముకునీ కూదబలుక్కునీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు - ఎక్కద పుట్టాడు,ఎక్కద పెరిగాడు,ఎక్కద బతుకుతున్నాడు?

      Delete
    3. Mesopotamia had already enjoyed a long history prior to the emergence of Babylon, with Sumerian civilisation emerging in the region c. 3500 BC, and the Akkadian - speaking people appearing by the 30th century BC.
      Whereas Vedic culture flourished at harappa,mohanjedaro and dholavira times back to 5,000 - 3500 BC.Current dates that vedic period flourished between 1500 BC and 500 BC with dwaraka dating back to 7000 back,why because krishna and pandavas were after the age of fully structured vedic culture.
      In that old time periods also Mathematics and cosmology that dealt with eclipses,star constellations,position of polestar were depicted in their works - how silly it is that babylonians taught indians about eclipses?

      Delete
    4. బాబు గోగినేని గురించి.. చుట్టూ బాజంత్రీ గాల్లని పెట్టుకోని పులకేశిలాగా ఫీలయ్యే నువ్వే చెప్పాలి మరి. నీ స్టైల్లో బూతులు మొదలు

      Delete
    5. https://www.youtube.com/watch?v=qaiXBNG5Bkc

      https://www.youtube.com/watch?v=30HwxsvePo0

      https://www.youtube.com/watch?v=1S0JzUvoZwA

      https://www.youtube.com/watch?v=OgG89fI_dEk&t=3s

      Delete
    6. @anon
      చుట్టూ బాజంత్రీ గాల్లని పెట్టుకోని పులకేశిలాగా ఫీలయ్యే నువ్వే చెప్పాలి

      hari.S.babu
      అన్ని మతాల ఆలయాల నిర్మాణంలోనూ ఉన్న పిరమిడ్ పబర్ గురించి నేను చెబుతుంటే అమ్మాయిల్ని కావిలించుకోవడం గురించి వాగి నేను ఇచ్చిన కౌంటరుకి మళ్ళీ మాట్లాదలేక బట్టలు చింపుకున్న మీవాళ్ళ సంగతి కూడా చెప్పు!మావాళ్ళు భజంత్రీ గాళ్ళయితే మీవాళ్ళు ఏమవుతారో?

      నేను ముందే చెప్పాను హిందూద్వేషిని అని బోర్డు పెట్టుకుని ఎన్ని బూతులయినా మాట్లాడొచ్చు,ఎన్ని ఎదవపనులయినా చెయ్యొచ్చుననే సంస్కారం మీదని!అలాంటి కంత్రీతనం కనన్ భజంత్రీ పని వెయ్యి రెట్లు నయం కదా!

      ఎవడో గొట్టాం గాడు కేతినేని బాబు నా బట్టలు వూడబీకటం గురించి కామెంటు పీకుతున్నాడు.ఇంత్కన్న మంచి భాష రాదా మీకు?

      నాలో తప్పు ఉండి నామాతలో తప్పును పట్టి ఎన్ని మాతలు అన్నా నేనూ పడతాను.2003లో ఒక పెద బృందం ఎన్న్నో శాఖల నుంచి ఆధారాలు తీసుకుని "తొలి మాన్వజాతి ఆఫ్రికాలో పుట్టింది.మూడుసార్లు విఫలప్రయత్నం చేసి నాలుగోసారి భారతదేశం చేరుకుంది - అది 80,000 నుంచి 60,000 సంవత్సరాల క్రితం జరిగింది.ఆ తర్వాత ఆఫ్రికా నుంచి మానవసమూహాం కదలిక ఆగిపోయింది.మిగతా న్ని ఖండాలకె ఆఫ్రికా నుంచుఇ భారతదేశం చెరుకున్న జనసమూహమే వ్యాపించింది" అని బల్లగుద్ది చెబిఉతే 10000 యేళ్ళ కిందట ఈ అదెశంలో నాగరికతౌఏ లేదంటున్నాడు - ఎవరి బట్టలు వాళ్ళు వూడదీసుకుంటూ అఘోరించేవాళ్ళు నాలాంటిఉవాడి దగ్గిర నోరు మూసుకుంటేనే పరువు దక్కుతుంది - మెకాలే బానిస కొడకల్లారా!

      అన్నివైపుల నుంచీ ఆధారాలు సరిచూసుకోకుండా నిజానిజాలు తేల్చుకోకుండా ఒక అక్షార్మ్ కూడా రాయను నేను - నాకూ వాడికీ సాపత్యం ఏంటి?

      పాయుంటు లేకుండా లేకిభాషనీ బూతుల్నె నువ్వు మాట్టాడుతూ దాన్ని నాకు అంటగడుతున్నావు - నీ ముడ్ది నలుపు నువ్వు సరిచూసుకో!మీ నేలబారు స్థాయికి నా బట్టలు చింపే దమ్ము లేదు.

      Delete
    7. "ప్రపంచమున మొట్టమొదట ఈ మహావిశ్వము ననుకరించు నగర నిర్మాణము సుమారు 4,500 సంవత్సరముల వెనుక సింధు లోయలో జరిగినది

      హరప్ప నగరపు నిర్మితి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుని ప్రజ్ఞను ఒక నగరనిర్మాణ సాంకేతికుని ప్రజ్ఞను కలిపి క్షేత్రగణితము నుపయోగించి అప్పటి మేధావులు తీర్చిదిద్దిన అగోచరమైన మహావిశ్వమునకు గోచరమగు నకలు వలె తోచుచున్నది. హరప్పన్ శైలి నగర నిర్మాణము అంతకు ముందొక వంద సంవత్సరముల ముందర లేదు - మానవుని మేధస్సు సాధించగలుగు అత్యున్నత స్థాయి సృజనాత్మకత అప్పటివరకు నిద్రాణముగ నుండి ఒక్కసారిగా జలపాత సదృశమై ఎగసిపడి ఇట్టి యధ్భుతములు భువిపైన సాక్షాత్కరించుట సంభవించినది! తొలి యధ్భుతము ఢృవనక్షత్రపు స్థానమును బట్టి ఉత్తర దిక్కును నిర్ణయించగలుగుట,క్షేత్రగణిత రచనకు ఇది చాల ముఖ్యమైనది.

      ఉత్తరగిరి శిఖరపు క్షితిజరేఖ దగ్గిర ఏ ప్రాంతము నుండి చూసినా ఏ కాలము నందు చూసినా కదలక మెదలక కనిపించెడి నక్షత్రము - నేడు మనము Alpha Draconis అని వ్యవహరించెడి నక్షత్రము క్రీ.పూ 2780 వచ్చునప్పటికి తపోనిష్ఠలోనున్న మౌని యొక్క శ్వాసవలె మెల్లమెల్లగ కదలుచు విశ్వభ్రమణాక్షమునకు 0.6 డిగ్రీలకు చేరుకుని స్థిరపడినది.సరిగ నిదే సమయమున భూభ్రమణములోని అతి సూక్ష్మమైన మార్పులు భూమి యొక్క భ్రమణాక్షమునకు చేసిన చేర్పుల వంటివి గడిచి తొలుత మధ్యకు ఉన్నట్టు గోచరించెడిది ఉత్తరదిశకు జరిగి మూడు మిలియన్ సంవత్సరముల వరకు యే నక్షత్రమును దాపులకు రాని ఏకైకత్వము ననుభవించినది.ఇదియే భారత దేశపు జీవన పరంపర కంతటికి కేంద్రబిందువైన ధృవతార!"

      hari.S.babu
      ఇది మెల్విల్లె అనే విదేశీ కాస్మాలజిస్టు భారతీయ మేధావుల కాస్మాలజీ పాండిత్యం గుదించి చెప్పినది.క్రీ.పూ 2780 నాటికి ధృవనక్షత్రం స్థిరమై ఆగిపోకముందు అది కదులుతున్నదని తెలియాలంటే మొదటినుంచీ దాన్ని అబ్సర్వ్ చేస్తూ ఉండాలి కదా!అంత మెల్లగా కదిలినా దానియొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోగలిగారంటే వీళ్ల చూపు ఎంత నిశితమో తెలుస్తున్నది గదా!

      మరీ పెద్ద పరిశోధనకి పోకుండానే బాబిలోనియా చుట్తూ పెరిగిన మెసపొటేమియా నాగరికత కొంచెం ఉధృతమవడమే క్రీ.పూ 2,500 తర్వాతనే అని వికీపీడియా వ్యాసమే చెబుతునది.ఒక రాజు వల్ల కొద్దికాలం ఒక వెలుగు వెలిగి అతను చనిపోగానే చెల్లాచెదరై నశించిపోవడమూ అక్కడే ఉంది.అలాంటిది,వాళ్ళు చెబితే తప్ప వీళ్లకి గ్రహణాల గురించి తెలియదని అతను అనడం ఏమిటి?ఆ అజ్ఞానికి మీరు చేస్తున్నది భజంత్రీతనం కాదా?

      వూరికే సోది మాట్లాడకండి!గట్టి ఆధారాలతో రండి!అతనికీ చెప్పండి రెప్పలు టపటపలాడించుకుటూ కూదబలుక్కుని నాలుగు తెలివైన కబుర్లలా ఆనిపించే నిరాధారపు సుత్తి మాట్లాడినంత మాత్రాన అతను అమాయకుడని ఇవతలీవాళ్ళు నమ్మరని!ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి కార్ల్ సెగన్ వరకు వాళ్ళంతట వాళ్ళు ముగ్ధులైపోయి India is the cradle of all civilizations! అని అంటుంటే అదే ముక్క మన గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గు పడుతూ ఎవరన్నా ఆ ముక్క చెబితే వాళ్ళకి సాంస్కృతిక అహంకారం అంటగట్టడమా?

      మన దేశాన్ని పొగిడితే అహంకారమని అంటూ ఇతర దేశాల్ని పొగుడుతూ పులకించిపోవడం తెలుస్తూనే ఉంది.

      Delete
    8. SAYING THAT ECLIPSES WERE RECORDED AND TAUGHT BY BABYLONIANS TO INDIANS IS FALSE!
      ----------------
      Bharatvarsha, India Timeline.

      . prehistoric
      Human habitation of India.
      c. 5000 BCE – c. 1900 BCE
      The Indus Valley (or Harappan) Civilization.
      c. 4000 BCE
      Indian village of Balathal inhabited.
      c. 3000 BCE – c. 2600 BCE
      The rise of the great Indian cities of Mohenjo Daro and Harappa.
      2000 BCE
      Pepper is widely used in Indian cooking.
      c. 1700 BCE – c. 1500 BCE
      Decline of the Harappan Culture in India.
      c. 1700 BCE – 1100 BCE
      The Rig Veda written, mentioning the god Rudra (Shiva) for the first time.
      c. 1700 BCE – 150 BCE
      The Vedic Period in India.
      **1500 BCE
      The Indus Valley is invaded by Aryans – nomadic northerners from central Asia.
      c. 1000 BCE
      The Aryans expand into the Ganges valley inIndia.
      c. 700 BCE
      Indian scholars codify and reinterpret Aryanbeliefs to create the Upanishads texts forming the basis of Hinduism.
      c. 700 BCE
      India is divided into 16 Aryan states or kingdoms.
      ------------------------------------
      **Now this AIT was discarded,but nobody could trace the cultural gap between the times before and after this period - so It was kept as a memorial reference!
      The known history of Babylon, then, begins with its most famous king: Hammurabi (1792-1750 BCE). This obscure Amorite prince ascended to the throne upon the abdication of his father, King Sin-Muballit, and fairly quickly transformed the city into one of the most powerful and influential in all of Mesopotamia. Hammurabi’s law codes are well known but are only one example of the policies he implemented to maintain peace and encourage prosperity. He enlarged and heightened the walls of the city, engaged in great public works which included opulent temples and canals, and made diplomacy an integral part of his administration. So successful was he in both diplomacy and war that, by 1755 BCE, he had united all of Mesopotamia under the rule of Babylon which, at this time, was the largest city in the world, and named his realm Babylonia.

      Following Hammurabi’s death, his empire fell apart and Babylonia dwindled in size and scope until Babylon was easily sacked by the Hittites in 1595 BCE.

      Although it is generally believed that Herodotus greatly exaggerated the dimensions of the city (and may never have actually visited the place himself) his description echoes the admiration of other writers of the time who recorded the magnificence of Babylon, and especially the great walls, as a wonder of the world.
      -- HOW A LATER TIME BABYLONIAN CIVILIZATION WHICH SPANNED VERY SMALLER TIMESCALE WILL TEACH TO THE INDIAN CIVILIZATION WHICH OCCURRED BEFORE ITS EXISTENCE?

      Delete
    9. Aboriginal Australians are Earth's oldest civilization: DNA study

      http://edition.cnn.com/2016/09/22/asia/indigenous-australians-earths-oldest-civilization/index.html

      10 of the Worlds Oldest Known Civilizations

      http://historylists.org/other/10-of-the-worlds-oldest-known-civilizations.html

      Delete
    10. The news about australian aborigins is a finding - not yet authorized.Authentication will take time.

      The other linka bout 10 oldest civilizations is not new to me.I have alraedy visited twice in my R&D.

      But Bheembetka in india had a strange thing to check

      see the links:
      https://en.wikipedia.org/wiki/Bhimbetka_rock_shelters
      The Bhimbetka rock shelters are an archaeological site in central India that spans the prehistoric paleolithic and mesolithic periods, as well as the historic period.[1][2] It exhibits the earliest traces of human life on the Indian subcontinent and evidence of Stone Age starting at the site in Acheulian times.[3][4][5] It is located in the Raisen District in the Indian state of Madhya Pradesh about 45 kilometres (28 mi) southeast of Bhopal. It is a UNESCO world heritage site that consists of seven hills and over 750 rock shelters distributed over 10 kilometres (6.2 mi).[2][6] At least some of the shelters were inhabited by Homo erectus more than 100,000 years ago.[2][7] The rock shelters and caves provide evidence of, according to Encyclopaedia Britannica, and a "rare glimpse" into human settlement and cultural evolution from hunter-gatherers, to agriculture, and expressions of spirituality.[8]

      http://www.wondermondo.com/Countries/As/India/MadhyaPradesh/Bhimbetka.htm
      At least 290,000 years old petroglyphs, paintings up to 15,000 years old, newest drawings - from the 11th - 14th century AD.

      Currently authorized fact by the community of scintists is african origin of man before 2,00,000 years before is meaningless when you check the carbon dating technique reveals that oldest paintings in these caves are drawn long before that time.

      WE are not scientists.W can't frame our own theories.We are just reading the findings and checking the truths.Let them extend their research - I am not having any ego problems to accept the truth with more evidences If the findings I believe are proved wrong!

      I am believing this african origin and exodus into india and spraeding from india into the other continents because it is accepted by the scientific community.In one of my recent blogs I have provided the animation video depicting this theory.

      Truth always Wins,But needs Time to gather force guided with right justification from neutrals to counter the attack of untruth which is so arrogant to strike First with self justification!

      Delete
    11. Please follow this website for the latest archeological discoveries...

      Indian discoveries...

      https://www.archaeology.org/index.php/search-page?q=india&search=Go

      https://www.archaeology.org/

      Delete
    12. I found this amazing fact:
      The missing chapter of our story that they have uncovered in the state of Andhra Pradesh has no clear beginning, but it has a rare bookmark, a hazy horizon of fine grit that marks what may be the most important event in human history. And there--around 74,000 years ago, well before Homo sapiens are thought to have arrived in India--is where we start

      at
      https://archive.archaeology.org/1001/abstracts/stone_age_india.html

      It means andhra pradesh is more significant in human origin!

      Delete
    13. http://www.opindia.com/2018/01/a-5000-year-old-india-rock-paining-pegged-as-the-oldest-sketch-of-a-supernova/


      Reports
      A 5000 year old Indian rock painting pegged as the oldest sketch of a supernova
      By Hemant Bijapurkar
      Posted on January 8, 2018

      In a bold claim, three Indian astrophysicists associated with the Tata Institute of Fundamental Research, have published a paper [PDF] which analyses possibly the oldest rock carving which records a supernova. This carving was incidentally discovered in the form of a rock carving in Kashmir’s Burzahama region.

      Supernova is basically a massive explosion in a massive star which is on the verge of dying. Dubbed as the biggest explosion ever to be seen by the humans, it usually takes place in big stars, at-least about five times the size of our sun. This phenomenon occurs when the outward force of the gravity exerted on the star overpowers the opposing force of heat and pressure from the star’s core, which is generated via massive nuclear reactions. This imbalance occurs when the star is at the last stages of its life and doesn’t have enough fuel to generate enough heat and pressure:

      A balanced star which turns into a supernova when Gravity > Heat + Pressure ( Image via NASA)

      Usually a supernova results in the residual product of a dense core and a nebula. In case of very big stars these supernova turn into black holes, the densest objects in the universe, whose escape velocity is more than the speed of light.

      This Superonova, as per the trio of Indian scientists named Hrishikesh Joglekar, M N Vahia and Aniket Sule might have been recorded on that rock carving which is believed to date back to a range of 6000 to 2000 BC:

      Image via IGNCA

      This image as per the paper published, depict two extremely bright celestial objects. These as per the logic provided, can’t both be the sun and the moon as both can’t be correspondingly as bright owing to the moon being in a partial phase with the sun, thereby making it less bright.

      With reference to other European paintings of a similar era, the scientists argue, that it may not be a star or planet pair. Also, the hunting activity depicted in the painting might mean that the carving was made in a day-time setting when either stars or planets aren’t visible. Such bright celestial objects can’t be comets or halos, considering their circular nature and same horizontal shape.

      The scientists thus conclude that the object depicted might be a supernova. On further investigation about ancient supernovas occurring during that period, the scientists have zeroed down to the possibly of it being the supernova HB9 which exploded at around 4500 BC.

      Since a single rock painting might not be enough evidence to prove the findings, the the team of Astrophysicist Mayank Vahia is now hoping that more rock art emerges from the region which helps solidify the claim.

      Delete
  12. మీరు మరొక్కసారి ఆ వ్యాసం చదవండి. ఆయన చెప్పిన దానికి భిన్నంగా లాజికల్ గా చెప్పేది ఉంటే చెప్పండి. ఇపుడు కూడా ముస్లిం లు ఉన్నారు. చార్మినార్ మధ్యలో భాగ్య లక్ష్మి టెంపుల్ ఉంది. దానిని కదిల్చే సాహసం ఇప్పటివాళ్ళు చేయగలరా ? మీరు వ్రాసే ముస్లిం వ్యతిరేక వ్యాసాలు ఎవరూ చదవలేదు కానీ చదివి ఉంటే మీ ఇల్లు కూడా కూలి ఉండేది. మీరు ఏమీ వ్రాయకపోతే మీ ఇల్లు కూలుస్తారా ?
    మహిళనని వదిలేసారు కానీ నా మీదకి దాడికి దిగిన హిందువులు ఎందరో...నేను చెప్పేది అర్ధం కాని హిందువులే హిందూ ద్వేషిని అని ముద్రవేసినా ఆశ్చర్యం లేదు.హిందువుల గుళ్ళల్లో జరిగే రాజకీయాలకు నాకు గుళ్ళ మీద కోపం వస్తోంది. మనం మారాల్సిన అవసరం లేదా ?
    ఒక మనిషి కోపిష్టి లేదా అహంకారి అయినంత మాత్రాన అతను చెప్పే మంచి మాటలకు విలువే లేదా ? మంచిగా ఉంటూ ఎంత వెధవ వేషాలు వేసినా పర్వాలేదా? మన ప్రమేయం లేకుండా ఏదీ జరుగదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. జిలేబీ గారు వ్రాసినట్లు

    ధ్యానంబన్నది పిరమి
    డ్లోనన్ హెచ్చగునట వినుడోయమ్మ జిలే
    బీ!నమ్ము మమ్మరో! మన
    మానసమున లేని విభుడు మన్నున్ గలడే !

    ReplyDelete
    Replies
    1. @neehaarika
      మీరు వ్రాసే ముస్లిం వ్యతిరేక వ్యాసాలు ఎవరూ చదవలేదు కానీ చదివి ఉంటే మీ ఇల్లు కూడా కూలి ఉండేది. మీరు ఏమీ వ్రాయకపోతే మీ ఇల్లు కూలుస్తారా ?

      hari.S.babu
      ఏమిటి దీని అర్ధం?

      నేను ఆ వ్యాసాలు ఎవరు చదవాలని రాసానో తెలియదా?వ్యాసాల వరసలోనే రెందు పోష్టులు ఆ వ్యక్తినీ అతని బ్లాగునీ దాని కంటెంటునీ ప్రస్తావించి అతనికి లిను ఇచ్చి చదివి జవాబులు చెప్పమని అడిగాను,అవునా కాదా?

      ఆ వ్యాసాలలో నేను అబద్ధాలు చెప్పానా?నా స్వకపోల కల్పితం ఒక్కటైనా ఉందా?అతన్ని చాలెంజి చేసింది కూడా అదే,"ఇస్లాం గురించీ ఖురాన్ గురించీ నేను ప్రస్తావించిన వాటిలో అబద్ధం ఉంతే నిరూపించండి,లేదా హిందూమతం గురించి అబద్ధాలు చెప్పద మానండి!" అని.

      రెండింటిలో ఏదీ చెయ్యకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయాడు?నేను రాసినవి పచ్చి నిజాలు అని అతనికీ తెలుసు గనకనే కదా!

      నేను ఇస్లాము గురించి నిజాలు రాసినా ముస్లిములు సహించలేక నా ఇల్లు కూలగొదతారని నువ్వు అనటం ద్వారా నీ ప్రశ్నకి నువ్వే జవాబు చెప్ప్పుకున్నావు - అది నీకు తెలుస్తున్నదా,లేదా?

      అదే నా జవాబు కూడా,నీ జవాబె నీకు అర్ధం కాకపోతే నేను చెయ్యగలిగినది ఏమిటి?

      Delete
    2. గుళ్లని కూల్చినవాళ్లని ఎందుకు కూల్చారు అని నిలదియ్యకుండా ఎందుకు కూల్పించుకున్నారు అని హిందువుల్ని నిలదియ్యడం భావ్యమా?దొంగతనం చేసినవాళ్ళని జైల్లో పెట్టకుండా దొంగతనం చేయించుకున్నందుకు పర్సుపోయినవాణ్ణి జైల్లో పెట్తే తింగరి లాజిక్కులు ఆపితే బాగుంటుంది!

      Delete
    3. @neehaarika
      ఇపుడు కూడా ముస్లిం లు ఉన్నారు. చార్మినార్ మధ్యలో భాగ్య లక్ష్మి టెంపుల్ ఉంది. దానిని కదిల్చే సాహసం ఇప్పటివాళ్ళు చేయగలరా ?

      hari.S.babu
      "సాహసం" అని నువ్వు ఎందుకు అన్నావు?ఎవరయిన అఒక అప్నిని సాహసం అనే స్థాయిలో చెప్పుకుని ఎప్పుదు చేస్తారు?తగినంత సంఖ్యాబలం వచ్చాక చేస్తారు!

      వాళ్లు అసలు ప్రయత్నించనే లేదా?వాళ్ళు దాన్ని తొలగించటానికి పూనుకోకపోతే వివాదం ఎందుకు వస్తుంది?హిందువుల్ని రారమ్మని పిలిచి ప్రోత్సహుఇంచారా?నాకు తెలియదులే భాగ్యలక్షి వివాదం గురించి,తెలియని దాన్ని గురించి ఏమి చెప్పను?

      Delete
    4. మన్నున బుట్టిన దేహము
      మన్నున గలియద జిలేబి! మన్నును మేసీ
      మన్నున పండే తెరగున
      మన్నన పిరమిడు పవరది మనకెటు రాదో?

      Delete
    5. @neehaarika
      హిందువుల గుళ్ళల్లో జరిగే రాజకీయాలకు నాకు గుళ్ళ మీద కోపం వస్తోంది. మనం మారాల్సిన అవసరం లేదా ?

      hari.S.babu
      దలై లామా ఎవరు?కేవలం బౌద్ధ సన్యాసి మాత్రమేనా?కాదు,అతను తన రాజ్యానికి రాజు!తన మఠం చుట్టూ ఉండి అతని అధీనంలో ఉన్న భూమి మీద శాసనకర్త,అది తెలుసా?

      చైనాలో ఇతనొక్కదే బౌద్ధ లామానా?కాదు,కమ్యునిష్టులకి అనుకూలంగా ఉన్న ఎంతోమంది బౌద్ధసన్యాసులు క్షేమంగానె ఉన్నారుగా,ఇతన్నే ఎందుకు చైనా వేధిస్తున్నది?

      అతని చుట్టూ రాజకీయం లేదా?చర్చిల చుట్టూ రాజకీయం,వ్యాపారం నడవటం లేదా?వాటికన్ అమాయకమైనదా?ముస్లిములు అస్రేసరి,ఇస్లామిక్ స్టేట్ పేరుతో మతాన్నీ రాజకీయాన్నీ కలిపేశారు!

      తమ భక్తితో తాము ఆలయాలు కట్టుకుని తమ సంతృప్తి కోసం తమ ఆదాయం ఖర్చు చేసుకుంటూ తమ ఇష్టదైవాలకి కానుకలు ఇస్తే ఇతర మతస్థులకి నెప్పి దేనికి?ఇంతకు మించి ఇతర మతాల పట్ల హిందువులు చేస్తున్న దుర్మార్గం ఏమిటి?

      హిందువులు ఏ విషయంలో మారాలి?ఎందుకు మారాలి?మారిన తర్వాత వైభవం గ్యారెంటీ అని చెప్పే ప్రణాళిక ఏదైనా ఉందా?

      Delete
    6. @neehaarika
      ఒక మనిషి కోపిష్టి లేదా అహంకారి అయినంత మాత్రాన అతను చెప్పే మంచి మాటలకు విలువే లేదా ? మంచిగా ఉంటూ ఎంత వెధవ వేషాలు వేసినా పర్వాలేదా?

      hari.S.babau
      అతని కోపిష్ఠితనంతో నాకు సమబంధం లేదు.హిందువులాలయాల ధ్వంసం గురించి చెప్పినదానికో పక్షపాతం ఉంది,వెక్కిరింత ఉంది - అది మాత్రమే నాకు అవసరం.కాకపోతే అవి రెండూ అతని మనస్తత్వంలోని భాగాలే కాబట్తి అతని జద్జిమెంటులో కూదా రెండూ కనబడుతున్నాయి,అంతే!ఒక మనిషి వెలుగులో నిలబడితే వెనకాల నీడ కూడా ఉంటుందిగా! తన నీడ తనకి తెలియదం లేదు - నేను పాటించే బుద్ధిజం వీళ్లు పాటించే హిందూయిజం కన్న గొప్పది అనే అహంకారం వల్ల!అప్పుడూ ఇప్పుడూ నేను బుద్ధిజం గురించి ఏమైనా ఇష్టం లేనట్తు మాట్లాడానా?లేదే!

      @neehaarika
      మన ప్రమేయం లేకుండా ఏదీ జరుగదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

      hari.S.babu
      ఆ అభిప్రాయం తప్పు అని గట్తిగా చెబుతున్నాను.ఉజ్జాయింపుకి మోప్లా వూచకోతలో వార్మ్ రోజుల్లో లక్షమంది మంది హీందువులని చంపగలిగిన క్రూరుల్ని గెలవాలంటే ఏమి చెయాలో తెలుసా?హిందువులు ఒక రోజులో లక్షమందిని చంపేటంత క్రూరులు కావాలి!అందుకే ఒకప్పుదు 12,000 మంది చేతిలో లక్షమంది ఓడిపోయారు.ఒక్క రాణా ప్రతాప్ తపప్ మిగిలిన రాజపుత్రులు అక్బరు పాదుషా సబహ్లో కుర్చీలు వేయించుకుని సామంతుల స్థానంలో ఎందుకు సర్దుకుపోయారు?

      P.S:ఇక్కడ పొంగిపొర్లుతున్న సంపదల్ని చూసి ఎదటివాడికి దోచుకోవాలనే దురద పుట్టటానికీ ఇతర్ల ఆలయాలు కూలగొట్టమని వాళ్ల ధర్మశాస్త్రాలలో ఉండటానికీ మన ప్రమేయం ఎట్లా ఉంటుందన్నది నా ప్రశ్న,అర్ధమైందా!

      Delete
    7. మీరు ఎంత రాసినా ఆమే అలానే వాదిస్తుందనిపిస్తుందండి. ఆమేకి బ్రాహ్మణులంటే పడదు. ఈమేని తొక్కేశారని ఫీలౌతూంట్టుంది. ఈవిడ దగ్గర అంత గొప్ప టాలేంట్ ఎమి ఉందా, తొక్కేయటానికి అని తీవ్రంగా ఆలోచించినా జవాబు దొరకలేదు. ఇంత క్రితం కుడా ఈ దేశ విభజన గొడవ, యుద్దాల గురించి కొంతమంది ఆమేకు వివరించి చెప్పటం జరిగింది. ఎమీ మారలేదు. ఆమే గుడుల రాజకీయాల గురించి రాసింది, మీ మద్దతు కూడ గట్టటం కొరకు. మీరు బ్రాహ్మణులను విమర్సిస్తే కొబ్బరి చిప్పల బాచ్ అంట్టూ ఎగతాళి చేయటానికి మద్దతు లభిస్తుందనే ఆశతో అని గమనించగలరు.

      Delete

    8. @anonymous,

      టాలెంట్ కావాలా నాయనా ?
      వాళ్ళు నన్ను తొక్కడం ఏమిటీ తొక్కలో బ్యాచ్, కొబ్బరి చిప్ప బ్యాచ్ అంటే బ్రాహ్మణులే కాదు, గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చిప్పలే....రాజకీయాల గురించి నేను వ్రాయలేదు....బట్టతల మేధావులు వ్రాస్తే కొండపల్లి బొమ్మలాగా బుర్ర ఊపుతున్నా...మీరు ఏది చెప్తే అదే సరి అయినది.పులకించండి.హరిబాబు గారేమన్నా కరుణానిధా మద్దతు కోరడానికి ?

      Delete
    9. అతను "ముస్లిములు మీ గుళ్ళు కూలగొట్టడం....." అన్న దాన్ని బట్టి అతను తనని తను హైందవేతరుణ్ని అనుకుంటున్నాడని అర్ధం చేసుకోవచ్చు!ఒక హైందవేతరుడు హిందువుల దేవాలయాల్ని "మా మతం ఇతరుల ఆలయాల్ని సహించదు - మా మతవిశ్వాసం ప్రకారమే కూలుస్తున్నాం" అని అల్లా హో అక్బర్ కేకలతో చెప్తున్నముస్లిముల్ని వదిలి మీ గుళ్ళు కూలిపోవటానికి మీదే తప్పు,మీ దేవుడికి మహత్యం లేదని తేలిపోయింది కదా, అసలు మీకు గుళ్లు ఎందుకు అని వెక్కిరించడం అహంభావం కాదా?తమ దేవతామూర్తులకి బహిరంగ స్థలాల్లో ఎత్తైన విగ్రహాలు పెట్టే సంప్రదాయం బౌద్ధమతంలో లేదా?ముస్లిములు బమియన్ బౌద్ధ విగ్రహాలని కూలగొట్టటానికి బౌద్దులే కారనమా?

      బౌద్దుల ఆలయాల్లో విగ్రహారాధన లేదా?అక్కడ అగరు వొత్తులు వెలిగించదం లేదా?పాళీ మంత్రాలూ సంస్కృత మంత్రాలూ కలిపి చదవదం లేదా?హిందువుల ఆలయాల్లో మూలవిరాట్టు ఎక్కడో తప్ప ఏడు ఎనిమిది అడుగులకి మించదు,మరి బుద్ధుడి విగ్రహాలు అంత పెద్దవి ఉంటున్నాయి,దానికి కారనం ఏమిటి?పరిమాణంతో వచ్చే వైభవం కోసం కాదా?

      ఇవన్నీ చెప్పినంత మాత్రాన నేను బౌద్ధమతాన్ని తిట్టినట్టు కాదు.నేను చెబుతున్నదల్లా ప్రతి మతానికీ దానికంటూ ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి.తమ మతం యొక్క ప్రత్యేకత ఏమిటో ప్రతి అమతం వారికీ తెలుసు - ఇతరులు ఎన్ని విమర్శలు చేసినా వాటిని వదులుకోరు,అన్ని మతాలూ ఏదో ఒక స్థాయిలో విగ్రహారాధన చేస్తూ హిందువులని మాత్రమే రాళ్లని కొలుస్తున్నారని తిట్టి ప్రయోజనం లేదు!నా మతం కళ్లతోనే ఇతర మతాల్నీ చూస్తాను,నా మతంలో లేనిది ఇంకో మతంలో ఉంటే తిట్టి పోస్తాను అని ఏ హిందువూ అనడం లేదు - ఆ పిచ్చి హైందవేతరులకే ఉంది,ఈ బౌద్ధమతస్థుడితో సహా!

      ఇస్లాం గురించి నేను 18 వ్యాసాలు రాశాను.అవన్నీ ఇస్లాములో ఉన్న తప్పుల్ని యెత్తి చూపించేవే.అయినా సరే అంతర్జాతీయంగా తారేఖ్ ఫతే సాబ్,అల్ బులేహీ సాబ్ లాంటి మంచి ముస్లిముల్ని నేను అభిమానిస్తాను.నా ఇంటి పక్కన ఉన్న దర్జీ సాయిబునో మరొకరినో మీదబడి చంపెయ్యమనీ అనటం లేదు.

      ఇస్లామిక్ తీవ్రవాదం అనేది దానంతటది పుట్టటంలేదు,వ్యాపించటం లేదు.ఒక కుర్రాడిని ఉగ్రవాదంలోకి లాగారనుకోండి,అదీ అంతటితో అయిపోదు - కధ అక్కణ్న్నించే మొదలవుతుంది.వాడికి ఆయుధాలు ఇవ్వాలి.వాటిని ఉపయోగించహ్తానికి ట్రైనింగు ఇవ్వాలి,వీళ్ళు యెక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలో ప్లానులు వెయ్యాలి - ఇదంతా భారీ పెట్టుబడితో 13 అరబ్ దేశాల ప్రభుత్వాధినేతల అండదండలతో నడుస్తున్న బహిరంగ వవహారం - మొదట్లో రహస్యంగా జరిగేది,ఇప్పుడు ముసుగులు విప్పేశారు!కారణం సంఖ్య పెరగడమే.ఈ తీవ్రవాదులకి ఆయుధాలు యెక్కణ్నించి వస్తున్నాయి అన్ కామన్సెన్సుతో ఆలోచించినా ఇవన్నీ తెలుస్తాయి.పాకిస్తాన్ ఏర్పాటు వెనక కూదా ఇదే వ్యూహం పని చేసింది.లాభం లేకుండా అంత పెద్ద యెత్తున ఆందోళనల్ని యెవడూ ఎగదొయ్యడు - గుర్తంచుకోండి,విధ్వంసం కూదా వ్యాపారమే కొందరికి!


      క్రీ.శ 1920 వరకు మతభేదాలు అంటే ఏమిటో తెలియదు భారతదేశంలోని హిందూ ముస్లిములకి!అలాంటిది కేవలం ,ఇరవయ్యేళ్లలో పరిస్థితిని యెలా మార్చారో,దాని పర్యవసానం ఏమిటో ఇవ్వాళ తెలియనిది ఎవరికి?


      ముంచుకొస్తున్న ప్రమాదం ఎంత భీబత్సాన్ని తెస్తుందో ఎవరికీ తెలియటం లేదు మధ్యయుగాల దాడి నుంచీ పాకిస్తాన్ యేర్పాటు వరకూ జరిగిన భీబత్సం ప్రపంచ స్థాయిలో ముస్లిం జనాభా చాలా తక్కువ ఉన్నప్పుడు జరిగినది - మరి 2050 నాటికి క్రైస్తవాన్ని వెనక్కి తోసి ప్రపంచంలోనే అతి పెద్ద మతం అయ్యాక మాంచి హుషారులో ఉన్నవాళ్ల నుంచి వచ్చే దాడిని మనం తట్టుకోగలమా?

      అప్పుడు వాళ్ల దృష్టిలో శ్యామలీయమూ,హరిబాబూ,గోగినేనీ అంతా ఒక్కలాగే కనబడతారు.వాళ్లకి కావలసింది అక్కడ ఉన్నది శ్యామలీయమా,హరిబాబా,గోగినేనా అన్నది కాదు - ఈ దేశాన్ని కొల్లగొట్టటం,దీన్ని ఇస్లామిక్ స్టేట్ లాగ మార్చి చెప్పు కింద తేలులా నొక్కెయ్యటం.భవిష్యత్తును చూసి హెచ్చరిస్తుంటే అవి మీకు బూతుల్లా అనిపించి నన్ను బూతులు తిడుతున్నారు - ఏమి సంస్కారం మీది?దేశం నాశనమయ్యాక నేనే కాదు నువ్వూ మిగలవు!

      మన దేశాన్ని మనం పొగుడుకోవటానికి సిగ్గు దేనికి?హిందువులు ఇతరుల గొప్పని వొప్పుకోవటం లేదా?వాళ్లు మన దగ్గిర్నుంచి నేర్చుకోవటమూ నేర్చుకుని వాళ్ళు సాధించిన విజయాలూ - రెంటినీ హిందువులు ఒప్పుకుంటున్నారు కదా!మరి మీకు హిందువులతో సమస్య ఏమిటి?

      Delete
  13. No other way to stop modi tirade in india but to again divide hindus on acste lines I hope.ArwindKejriwal & OfficeOfRd working on it.
    - Syed Tariq Pirzada


    hari.S.babu
    why he used "again" in that tweet?That is accepting Once they did it,what do you say?

    ReplyDelete
  14. మద్రాసు నగరం తెలుగువారిదే.

    https://www.facebook.com/ravisankar.vipparla/posts/422729204542963

    ReplyDelete
  15. Who is Mr.Bean,Indian version?
    https://www.youtube.com/watch?v=XR1sbzFiywQ
    Mr.Rahul Gandhi!

    ReplyDelete
  16. ఎంతో కష్టపడి పరిశోదించి మంచి విషయాలని చెప్పారండి హరిబాబు గారు.. మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇక విమర్శకుల విషయం అంటారా.. హిందువులని తిట్టడమే పనిగా పెట్టుకున్నవాళ్ళకి మనం ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. కళ్ళుండీ చూడలేని గుడ్డివాళ్ళకి మనం ఎమి చెప్పి నమ్మించగలం? వాళ్ళు విదేశీయులుకి పుట్టి ఉంటారని సరిపెట్టుకోవడం తప్ప... తమ మూలాల్ని మరచిపోయిన జాతి ఇలాగే తయారవుతుంది.. మీ కృషిని ఇలాగే కొనసాగించడి.. మరింత మందికి మార్గదర్శకులు కండి.. విజయోస్తు...

    ReplyDelete
    Replies
    1. >>వాళ్ళు విదేశీయులుకి పుట్టి ఉంటారని సరిపెట్టుకోవడం తప్ప

      ఎక్కువ తక్కువ మాట్లాడితే.. నీ వూర్లనే బొక్కలిరగతన్ని , బొందల పండబెడతా బిడ్డా..

      Delete
    2. >>తమ మూలాల్ని మరచిపోయిన జాతి

      గా మూలాలు మర్సింది ఎవడ్రా? ఈ జాతి కదూ? ఏడ చూసినా.. గాల్రెడ్డి, దూల్రెడ్డి, సన్నాస్రెడ్డి.. వాడెమ్మరెడ్డి.. గీ జాతిగాల్లే.. చర్చిల సంక నాకుతూ బిషప్పులు, అయ్యోర్లు(గీ ఎధవల్ని పాస్టర్లనొద్దంట).. డబ్బులు దొబ్బి తెగ బలిసి కొట్టుకుంటుండ్రు.. గా రాజ్యాంగం అడ్డుపడకపోయుంటే.. గీ రెడ్ల బాచ్చి ఎప్పుడో దేశాన్ని కిరస్తానోల్లకి అమ్మిపడేసేది.. మల్లీ గీడకొచ్చి సమ్మగా కబుర్లు చెప్పుడు.

      Delete
    3. @Anonymous7 January 2018 at 00:47
      గా మూలాలు మర్సింది ఎవడ్రా? ఈ జాతి కదూ?

      hari.S.babu
      మీ ఆక్రోశంలో నిజాయితీ ఉంది గాబట్టి మధ్యలో భాష కొంచెం అతి అయినా కామెంట్ పబ్లిష్ చేస్తున్నాను.మీరు రెడ్డి కులంలో ఉన చెడ్డవాళ్ళ లిస్టునే ఇచ్చారు.మంచివాళ్ళూ ఉన్నారుగా!

      నేను ఒక వ్యాసంలో అంబేద్కర్ నా కెప్టెన్లు నను మోసం చేశారు అని కన్నీళ్ళు పెట్టుకోవడం గురించి రాశాను.దళీత్ మేధావుల్లో కులద్రోహులు లేరా?అసలు అంబేద్కర్ రిజర్వేషన్ల ఉద్దేశం వాటి ద్వారా పైకొచ్చీన్ వాళ్ళు మరి కొంతమందిని పైకి తీసుకొస్తారనే ఆశతోనే!అంబేద్కర్ రిజర్వేషన్ల ద్వారా పైకొచ్చినవాళ్ళకి పైకి తీసుకురమ్మని చెప్పింది వేరే కులాల వాళ్ళని కాదు,తమ సొంత కులంవాళ్ళనే ఉద్ధరించమన్నాడు,మరి 70 యేళ్ళుగా రిజర్వేషన్ల ద్వారా ముందుకు వెళ్ళీన్ దళీత్ మేధావుల్లో ఎంతమంది తమ సొంత కులాని పైకి తీసుకురావడానికి ప్రయత్నించారు?ఇది ఇప్పుడు మిమ్మల్ని అడగటం లేదు,ఆల్రెడీ అడగాల్సిన వాళ్ళని అడిగాను.జవాబు చెప్పకుండా నిశ్శబ్దం అయిపోయారు!

      మరి మీరు ఆన్ని దుర్మార్గాలూ రెడ్లే చెస్తున్నట్టు ఎందుకు ఆవేశపడుతున్నారు?

      Delete
    4. మీకు ఇంత బాధ ఎందుకొచ్చిందో నాకు అర్ధం అయ్యింది.. తమ మూలాల్ని మరిచిపోయిన జాతి అన్నానని కదా... ఇక్కడ జాతి అంటే భారతీయులందరూ... ఇంకా చెప్పాలంటే హిందువులందరూ కలిపి ఒక జాతి. ఇప్పటి రాజకీయ నాయకులు వక్ర భాష్యం చెపుతున్నట్లుగా కులం ఎప్పటికీ జాతి కాదు... నేను చెప్పిన జాతిలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. నా పేరు చివర రెడ్డి ఉంది కాబట్టి రెడ్లని టర్గెట్ చెయ్యడం ఎందుకు? మీదే కులమో తెలియదు గాని, మీ కులంలో మతం మారిన వాళ్ళు లేరా? ఒక సంస్కృతి నాశనం అయిపోయే పరిస్తితులలో దాన్ని కాపాడుకోవడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాలు మీకు కడుపు మంట ఎందుకు కలిగిస్తున్నాయి? ముందు ఆత్మ విమర్శ చేసుకోండి... మిగిలిన వాళ్ళు తప్పుడు తోవలో వెళుతున్నారని నేను సిగ్గుపడుతూ కూర్చోను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చేసే వారికి నా సహకారం అందిస్తాను.

      Delete
  17. The Great Suicide by PV Narasimha Rao

    Saturday 31 January 2015
    The following article was published precisely twentyfive years ago in the Mainstream Republic Day Special (January 27, 1990) after the Congress’ defeat in the 1989 Lok Sabha poll and created a stir in political circles. It is being reproduced in full now when the Congress is facing a much deeper crisis in the wake of its rout in the 2014 Lok Sabha election.

    by Congressman

    http://www.mainstreamweekly.net/article5438.html

    ReplyDelete
  18. హిందువుగా గర్విస్తున్నా... ధన్యవాదాలు.

    ReplyDelete
  19. కత్తి మహేష్ పోయి పోయి పవన్ కళ్యాణ్ మీద పడ్డాడేమిటి?
    కత్తి విరగ్గొట్టుకుని మూలన కూర్చునే కాలం వచ్చినట్టుంది!

    ReplyDelete
    Replies
    1. కత్తి మహేష్ పోరాటం నిజంగా అభినందనీయం. మూర్ఖపు మూకని కంట్రోల్ చెయ్యలేని ఒక పనికిమాలిన నాయకుడిపై సైనికుడులా పోరాడుతున్నాడు.

      Delete
  20. https://www.youtube.com/watch?v=Z9kJMoGbxNU

    ReplyDelete
    Replies
    1. I respect him in fighting spiritual corruption!But his references of science are not authentic.He has to take care in that aspect.Rest of that I agree with him about fake astrologers and other cheap fellows!

      Delete
  21. https://www.quora.com/Would-Bhagat-Singh-have-been-saved-if-Gandhiji-had-disagreed-to-sign-the-Gandhi-Irwin-Pact

    ReplyDelete
    Replies
    1. మంచి లింకిచ్చారు హరిబాబు గారూ, థాంక్స్. గాంధీ గారిని తప్పుపడుతుండేవారు తెలుసుకోవలసిన విషయం.

      Delete
    2. చేసిన తప్పుల్ని విమర్శించవచ్చు - నేను కాంగ్రెసుని ద్వేషించడం నా జన్మహక్కు వ్యాసాల్లో గాంధీని క్రూరంగానే విమర్శించాను,ఎందుకంటే,ఆ తప్పుల వల్ల దేశం నష్టపోయింది.మరోసారి అలాంటి తప్పులు ఎవరూ చెయ్యకుండా ఉండాలంటే విమర్శ గట్టిగానే ఉండాలని అనుకున్నాను.కానీ అలా ఎందుకు చెయ్యలేదు,ఇలా ఎందుకు చెయ్యలేదు అని విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమిటి?

      Delete
  22. https://www.quora.com/What-is-Jawaharlal-Nehrus-thoughts-about-army
    The bastards who ruled after independence.

    ReplyDelete
  23. జకీర్ నాయక్‌పై ఈడీ చేస్తున్న దర్యాప్తును జ్యుడిషియల్ ట్రిబ్యునల్‌ మంగళవారం నిలదీసింది. జకీర్ ఆస్తులను అటాచ్ చేస్తున్న ఈడీ దూకుడుకు అడ్డుకట్టవేస్తూ వేంటనే వాటిని ఆపేయాలని పీఎంఎల్ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు సారధ్యం వహిస్తున్న జస్టిస్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. నాయక్‌కూ, వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాంకు తేడా ఎందుకు చూపిస్తున్నారని ఈడీ తరఫు న్యాయవాదిని జస్టిస్ మన్మోహన్ సింగ్ ప్రశ్నించారు.

    'క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న పది మంది బాబాల పేర్లు నేను చెప్పగలను. వీరు ఒక్కొక్కరూ రూ.10,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నవారే. వారిలో కనీసం ఒక్కరి పైనైనా చర్యలు తీసుకున్నారా? ఆశారాం విషయంలో మీరేం చేశారు' అని జస్టిస్ ప్రశ్నించారు. ప్రత్యేక కోర్టుకు అప్పగించదగని నేరాలను చార్జిషీటులో లేకుండా ఎలా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని ఈడీ తరఫు న్యాయవాదిని నిలదీశారు. దీనికి ఈడీ లాయర్ సమాధానమిస్తూ, నాయక్ తన ప్రసంగాల ద్వారా యువతను రెచ్చగొట్టారని అన్నారు. వెంటనే స్పందించిన జస్టిస్ సింగ్....అలా తప్పుదారి పట్టిన యువత ఎవరైనా ఉంటే వారి స్టేట్‌మెంట్లు కానీ, ప్రాథమిక సాక్ష్యాలను కానీ ఎందుకు సమర్పించలేకపోయారని తిరిగి ప్రశ్నించారు. 'ప్రసంగాల ద్వారా తప్పుదారి పట్టిన వారి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారా? 2015 ఢాకా పేలుళ్ల వెనుక జకీర్ నాయక్ ప్రసంగాలు ఎలా కారణమయ్యాయో కూడా మీరు చార్జిషీటులో ఎందుకు పొందుపరచలేదు' అని జస్టిస్ సింగ్ నిలదీశారు. '99 శాతం ప్రసంగాలను పక్కనపెట్టి, ఒక శాతం ప్రసంగాలనే పరిగణనలోకి తీసుకుని ఈడీ సొంతంగానే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది' అంటూఈడీని మందలించారు.

    ReplyDelete
  24. https://bharatabharati.wordpress.com/2018/01/10/modi-led-government-is-in-office-but-not-in-power-minhaz-merchant/

    ReplyDelete
  25. Sir, read this link

    http://ajitvadakayil.blogspot.in/2015/09/ethics-of-human-cloning-decided-6000.html

    ReplyDelete
  26. http://alkarhode.blogspot.in/2015/08/people-said-it-is-her-karma-fiction.html

    ReplyDelete

  27. https://www.youtube.com/watch?v=eX47sf6Xpbo

    ReplyDelete
  28. https://www.quora.com/What-is-the-genesis-of-the-polarizing-opinions-about-Tipu-Sultan-and-why-does-the-Congress-and-BJP-view-him-as-a-hero-and-a-bigot-respectively.

    See what is Islam

    ReplyDelete
  29. మంచి వ్యక్తి అన్నా మీరు, నమస్తే

    ReplyDelete
    Replies
    1. సంతోషం!
      నమస్కారం!
      ధన్యోస్మి!!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...