Monday 26 June 2017

బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా?హిందూమతానంతర భారతదేశం ఎప్పటికైనా ఆవిర్భవిస్తుందా!

     పశువధ నియంత్రణకి సంబంధించిన వివాదాలలో ఒక కేసుకు తీర్పునిస్తూ న్యాయమూర్తి ఆవు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుందని చెప్పారు.ఆంధ్రాలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనే సంస్థలో ప్రభుత్వం నియమించిన అధికారి సొంత పెత్తనం చేస్తూ పదవి వూడగొట్టుకుని రాజకీయాలు మాట్లాడుతూ మొండికేస్తున్నాడే తప్ప చేస్తున్నది తప్పు అనుకోవడం లేదు.ఆ న్యాయమూర్తి బ్రాహ్మణుడో కాదో తెలియదు గానీ బ్రాహ్మణ కార్పొరేషన్ అనే సంస్థకి అటాచ్ చెయ్యడం ఇతరుల్ని చెయరు గాబట్టి ఇతను బ్రాహ్మణుడే అయి ఉంటాడు!

     దేశంలో భాజపా బలపడుతున్న కొద్దీ పుట్టు బ్రాహ్మణులకి మళ్ళీ కొవ్వు పెరుగుతున్నదా?హిందువులు రాజకీయంగా కొంత ఐక్యం కాగానే దాన్ని తమ తపశ్శక్తికి అంటుగట్టేసుకుని ఒకనాటి ఔద్ధత్యాన్ని మళ్ళీ చూపించడానికి వాళ్ళలోని బ్రహ్మరాక్షసత్వం జడలు విప్పుకుంటున్నదా?ఎందుకంటే, యే మనిషికైనా మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అడిగేవాడు ఉండడనే ధీమా ఉన్నప్పుడే అంత దూకుడుగా ప్రవర్తిస్తాడు.బయటపడి కనపడుతున్న వీళ్ళిద్దరికీ బయటపకుండా అవకాశం కోసం ఎదురుచూస్తున్న మిగతావాళ్ళకీ మోదీ గెలుపు అంటే బ్రాహ్మణుల గెలుపు అన్నట్టు అర్ధం అవుతున్నది కాబోలు!

     గతంలో ఇట్లా ప్రవర్తించి కొన్ని తరాల పాటు చీ కొట్టించుకున్నది వీళ్ళకి అప్పుడే పరగడుపైనట్టుంది.గతంలో బ్రాహ్మణాధిక్యత అనేది ఉన్నది - అది అమానుషమైనది కూడా!వ్యతిరేకత పెరిగి ఇతర కులాల వాళ్ళు రాజకీయ ఉద్యమాలు నడిపి వీళ్ళని అధికా పీఠానికీ రాజవైభవాలకీ దూరం చెయ్యడం కూడా చారిత్రక సత్యమే!ఇప్పుడిప్పుడే, కొన్ని తరాల నుంచి ఆలయాల్లో పూజారులు గానో ఇళ్ళల్లో కర్మకాంలు జరిపించే పురోహితులుగానో కనబడటం వల్ల ఇతర కులాల్లోనివారిలో బ్రాహ్మణద్వేషం నుంచి పుట్టిన వ్యతిరేకత తగ్గి ప్రభుత్వాలు కూడా వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు ఎవ్వరూ తప్పు పట్టడం లేదు.కానీ ఇలాంటి పుట్టు బ్రాహ్మణూల సంఖ్య పెరిగితే మాత్రం పరిస్థితి మళ్ళీ మొదటి కొస్తుంది - చరిత్ర వెనక్కి నడుస్తుంది.

     మిగతా కులాలలో ఆ కులసంస్కృతి అందరికీ సమానంగానే ఉంటుంది.కానీ బ్రాహ్మణ కులంలో వైదికులు,నియోగులు అనే రెండు శాఖల వారు ఉన్నారు.స్వభావంలో గానీ వ్యవహారశైలిలో గానీ ఒకరికొకరికి ఏమాత్రం పోలిక ఉండదు - అయినా బైటినుంచి చూసేవారికి అందరూ ఒకరకం బ్రాహ్మణులే అనిపిస్తారు!వైదికులు ప్రాచీన కాలం నుంచీ అధ్యయనానికీ, నిష్ఠకీ, సంప్రదాయాలకీ అంకితమైపోయారు.ఋగ్వేదం 2వ మండలం,3వ సూక్తం,6వ ఋక్కు:బట్టలు నేయు విద్య,ఋగ్వేదం 3వ మండలం,53వ సూక్తం,19వ ఋక్కు:బండ్లు,రధములు మరియు లోహపు పనులు చేయుట,ఋగ్వేదం 1వ మండలం,140వ సూక్తం,10వ ఋక్కు:బంగారు పని చేయుట,ఋగ్వేదం 2వ మండలం,34వ సూక్తం,6వ ఋక్కు:బంగారమును త్రవ్వి యెత్తెడి విధానం,ఋగ్వేదం 4వ మండలం,57వ సూక్తం,1 మరియు 8వ ఋక్కులు:కృషి విద్య,ఋగ్వేదం 10వ మండలం,101వ సూక్తం,3 మరియు 7వ ఋక్కులు:బావులను త్రవ్వి నగలిని చేసి విత్తులు చల్లదం వంటి విషయాలు,ఋగ్వేదం 10వ మండలం,93వ సూక్తం,13వ ఋక్కు:బావుల నుండి నీరు తోడి పైరులకు పారించు విధానం,ఋగ్వేదం 1వ మండలం,23వ సూక్తం,2వ ఋక్కు:సముద్రంపైన ఓడలు నడిపే విధానం - ఇవన్నీ బ్రాహ్మణేతరుల కులవృత్తులకి సంబంధించిన విషయాలే కదా!బ్రహ్మణులు చెప్పకుండా ఈ విద్యలు కులవృతుల వాళ్ళకి ఎలా తెలిశాయి?

     పోనీ వాళ్ళ దగ్గిరే పెట్టుకున్నారు,నేర్పటం మాత్రమే చేశారు, మమ్మల్ని పైకి ఎదగనివ్వలేదు అని అనటానికీ వీల్లేదు.ఎందుకంటే, క్రీ.శ 1000వ సంవత్సరంలోని కురవాడ శాసనంలో "అనే చ్చిమూరువాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః భ్రద్వాజాన్వయః కమ్మకులజఆహ్ కులవర్ధనః తస్యాం భవత్సూత్ శ్రీమాన్ గోవిందో గురునందనః శ్రౌతస్మారత్క్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని స్పష్టంగా ఉంది.ఈ శాసనం వేయించినది రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు.ఇలాంటి అనేక శాసనాలను పరిశోధించిన చిలుకూరి వీరభద్రరావు గారు విశ్లేషించి చెప్పిన దాని ప్రకారం కమ్మకులజుడైన దేవనయ్య వేదం నేర్చుకుని శుద్ధవైదికబ్రాహ్మణుడిగా జీచించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.అబ్బెబ్బే, వీళ్ళు పెద్ద కులాల వాళ్ళు, బాగా డబ్బు సంపాదించి కొనుక్కున్నారు, మా కులాలకి మాత్రం ఆ చాన్సు రాలేదు అనటానికి వీల్లేకుండా ఎపిగ్రాఫికా ఇండికా సం.6 పే.236 ప్రకారం క్రీ.శ 973లో కమ్మకులస్థుల్లో షట్కర్మ నిరతులు ఉండేవారనీ, కౌండిన్య గోత్రులైన వంగ్ర బోయ,కొళ్ళిపుర బోయ,కురియెద బోయ అను బోయ కులాల నుండి కూడా వేదం నేర్చుకుని బ్రాహ్మణులుగా జీవించినవారు ఉన్నారని దృష్టాంతాలు ఉన్నాయి.నేను పైన చెప్పిన ఋగ్వేదంలోని విషయాలు 17వ శతాబ్దానికి చెందిన ఒక బ్రాహ్మణేతరుడు రాసిన వేదార్ధ ప్రకాశిక అనే గ్రంధం లోనివి.మరి, బ్రాహ్మణులు ఇతర కులాల వాళ్ళని వేదం చదవనివ్వకుండా చేసి దాచుకుని దోచుకున్నది ఎక్కద?మెకాలే విద్యావిధానం ఈ దేశంలోకి రాకముందు ఉన్న ఓరియెంటల్ ఎడ్యుకేషన్ సిస్టం ఉన్నప్పుడు కూడా స్టూడెంట్లుగా బ్రహ్మణేతరులే ఎక్కువగా ఉండేవాళ్ళు - కట్టుకధలు కాదు ఖచ్చితమైన లెక్కలే ఉన్నాయి వీటికి!

     భారతీయ సమాజంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు తెరయెత్తినవారిలో జ్యోతిబా పూలే ప్రధముడు కాదు గదా, అంతకుముందు ప్రాణహానికి కూడా వెరవకుండా సంస్కరణల కోసం పోరాడిన బ్రాహ్మణోత్తములూ ఉన్నారు!ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటివి తెలిస్తే ఈర్ష్యతో కూడిన నిష్కారణ బ్రాహ్మణద్వేషం పోయినప్పుడు మాత్రమే అసలైన బ్రాహణాధిక్యత యొక్క స్వరూపం అర్ధమవుతుంది!కరణాలు, మంత్రులు, సైన్యాధ్యక్షులు, రాజులుగా ప్రభుత్వాలను నడిపిన వారు తమ ఆధిక్యతని సాగించుకోవటానికి ఎక్కువ బ్రాహ్మణాధిక్యతని ప్రదర్శించారు.వీరు చేసిన సూత్రీకరణల్ని గ్రంధస్థం చెయ్యడానికి కొందరు వైదికులు చేతివాటపు సహాయాలు చేసినది కూడా వాస్తవమే!

     బ్రాహ్మణాధిక్యతకి సంబంధించిన ప్రముఖమైన సాక్ష్యం పరశురాముడు 21 సార్లు అప్పటి క్షత్రియ ప్రభువుల్ని సంహరించి తను జయించిన భూమి నంతట్నీ బ్రాహ్మణులకి దానం చేశాడని చెప్పే కధ. దీనిలోని కొసమెరుపు బూతు యేమియేమిటంటే,ఆ బ్రాహ్మణులకీ విధవలయిన రాజపత్నులకీ పుట్టిన సంకరజాతి రాజవంశాలే కలియుగంలోని రాజవంశాలు అనేది!నిజానికి భారతదేశంలో రాజ్యం అనేది ఏర్పడిన తొలిదశలో బ్రాహ్మణులే రాజులు,తర్వాతి కాలంలో బ్రాహ్మణేతరులు కూడా ప్రభువు లయ్యారు.పరశురాముడు ఈ రాజవంశనిర్మూలన ఎప్పుడు చేశాడు?రామాయణ కాలానికి ముందు అయితే దశరధుడూ జనకుడూ సంకరులు కావాలి,రామాయణ కాలానికి తర్వాతా మహాభారత కాలానికి ముందూ అయితే కురువంశం సంకరమైనది కావాలి - యుద్ధం జరిగిన కొద్ది కాలానికే కలియుగం వచ్చేసింది కదా!ఈ కధని కల్పించి మధ్యలో ఇరికించిన వాళ్లలో ఉన్నది మామూలు స్థాయి అహంకారం కాదు కలియుగంలోని రాజులంతా మేము వాళ్ళ పూర్వీకుల భార్యలకి కడుపు చేస్తే పుటినవాళ్లే అని చెప్పుకునే పైత్యకారిబూతుతెలివి కూడా ఉంది!తన ఆశ్రమంలో చేసిన భీబత్సానికి ఆగ్రహించిన పరశురాముడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చెయ్యటం వరకూ ఆ కధ ఎన్ని పురాణాల్లో చెప్పినా వైరుధ్యాలు ఉండటం లేదు. కానీ ఏ రాజవంశం యొక్క రాజవంశావళిలోనూ ఫలానా రాజు కాలంలో పరశురాముడు ఈ వంశపు రాజుని చంపేశాడు అనే సాక్ష్యం కనబడటం లేదు - ప్రతి రాజవంశం సూర్యుడి నుంచో చంద్రుడి నుంచో అగ్ని నుంచో పుట్టి అవిచ్చిన్నంగా సాగి వచ్చినట్టే ఉంటుంది!


సీ.పరశురాముండు భీకరనిజకోపాగ్ని
      నుగ్రుఁడై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్రంబు సేసినఁ
      దత్క్షత్రసతులు సంతానకాంక్ష
నెలయంగ ఋతుకాలముల మహావిప్రుల
      దయఁజేసి ధర్మువు తప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల
      నిప్పాటఁ దత్క్షత్ర మెసగి యుర్వి
తే.గీ.బర్వి రాజధర్మపధనీతి విడువక 
        జారచోరదుష్టజనుల బాధఁ
        బొరయకుండ నిఖిలభూ ప్రజాపాలనఁ
        జేయుచుండె శిష్టసేవ్య మగుచు.

     కలియుగంలో సుక్షత్రియులు లేరు అని చెప్తున్న పద్యం ఉన్న భారతాన్ని అనువదించిన నన్నయభట్టు కృతిపతి వంశావళిని చెప్తూ రాజరాజనరేంద్రుణ్ణీ సుక్షత్రియుడని సంబోధిస్తాడు - వారి వంశంలోని ఏ రాజూ పరశురాముని చేతిలో హతుడైన  సాక్ష్యం కనపడదు!అంకితం పుచ్చుకున్న రాజరాజుకు తెలియదా అని అడగవచ్చు,కానీ ఇవ్వాళ్టి ప్రచురణకర్తలలో మాత్రం పుస్తకం మొత్తం చదివి సారం చూసి పబ్లిష్ చేసేవాళ్ళు ఎంతమంది?కొన్ని ప్రిడిక్షన్లు,కొన్ని మొహమాటాలు,కొన్ని అవసరాలు - ఇవే అప్పుడూ ఇప్పుడూ పుస్తకం గొప్పదనానికి ప్రచురణకర్తల గీటురాళ్ళు, యే సాహిత్యరూపం ఎక్కువ అమ్ముడుపోతుందని అనిపిస్తుందో దాన్ని చూసీ చూడకుండా తోసెయ్యడమే - ఆ హడావిడిలో ఇలాంటి ప్రమాదకరమైన విషయాల్ని అసలువాడి దృష్టికి రాకుండా దాచేస్తారు.

శ్లో.బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రావర్ణాస్త్రయోద్విజాః
    యుగేయుగే స్థితా స్సర్వే కలా నాద్యంతయో స్థితాః

     ఇది శూద్రకమలాకరం అనే గ్రంధంలోని శ్లోకం.ఇది రాసింది బ్రాహ్మణుడు.అంకితం పుచ్చుకున్నది విజయనగరం సంస్థానానికి చెందిన ప్రభువు.ప్రతి యుగంలోనూ బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు ఉంటారు,కానీ కలియుగంలో క్షత్రియులూ వైశ్యులూ ఉండరు, ఉన్నా సంకరులే అని బల్లగుద్ది చెప్పేశాడు రచయిత.దీన్ని తీసుకెళ్ళి ఒక రాజుగారి ముందర పెట్టాడు.ఆయన మెచ్చుకుని ప్రచారంలోకి తెస్తానన్నాడు.దాంతో కవిగారు తన పుస్తకాన్ని రాజుగారికే అంకితమిచ్చి ఆయన వంశనామావళిని వర్ణించి ఆ రాజుగార్ని సుక్షత్రియుడని పొగిడేశాడు.అంకితం ఇచ్చినవాడి ధైర్యం గొప్పదా?అంకితం పుచ్చుకున్నవాడి అజ్ఞానం గొప్పదా!

     ఇవన్నీ ఒక్కచోట చేర్చి రాస్తే మొదట్లోనే వీళ్ళ దుర్మార్గం మిగతావాళ్ళకీ తెలిసేది అప్పుడే వీళ్ళని ఉతికి ఆరెసి చిలక్కొయకి తగిలించేవాళ్ళు - అందుకే అక్కడక్కడా ఇరికించారు!ఒక తొమ్మిది కడుచక్కని సుభాషితాలు రాసి పదోదిగా దీన్ని ఇరికించేవాళ్ళు.దీన్ని విడమర్చి చెప్పే పౌరాణికులూ వ్యాఖ్యాతలూ ప్రేక్షకుల్ని బట్టి దీన్ని వదిలేసి మిగతావి చెప్పేవాళ్ళు - అంతా ఒక తానులో ముక్కలే కదా.

శ్లోకం:తంహి స్వయంభూ స్స్వా దాస్యత్తపస్తప్త్వాధితోసృజత్
          హవ్యక న్యాభినాహ్యాయ సర్వ స్యాస్య గుప్తయే.
మనుస్మృతి 1వ అధ్యాయం 94వ శ్లోకం
భావం:ఈ బ్రాహ్మణుని బ్రహ్మ తపంబొనర్చి తన ముఖము నుండి హవ్యకవ్యములను నడుపుటకు మరియు నీ సకల జగత్తు యొక్క రక్షణ కొరకు ముందుగ సృజించెను.
శ్లోకం:బ్రాహ్మణో జాయమానోహి పృధివ్యా మధిజాయతే
          ఈశ్వర స్సర్వభూతానాం ధర్మకోశస్య గుప్తయే.
మనుస్మృతి 1వ అధ్యాయం 99వ శ్లోకం.
భావం:సర్వభూతముల యొక్క ధర్మమను ధనరాశిని రక్షించుటకు భూమియందు బ్రాహ్మణుడై ఈశ్వరుడు జన్మించుచున్నాడు
శ్లోకం:సర్చస్వం బ్రాహ్మనస్యేదం యతింవ్జి జ్జగతీగతం
          శ్రేష్ఠ్య నాభిజనే వేదం సర్వం వై బ్రాహ్మణోర్హతి.
మనుస్మృతి 1వ అధ్యాయం 10వ శ్లోకం.
భావం:భూమి యందేమి ధనము గలదో అది యంతయు బ్రాహ్మణూనికి స్వయమని చెప్పబడినది.
శ్లోకం:తాడయిత్వా తృణేనాపి సంఅరంభా న్మతిపూర్వకం
          ఏకవింశతి మాజాతీః పాపయోనిషు జాయతే.
మనుస్మృతి 4వ అధ్యాయం 166వ శ్లోకం:
భావం:గడ్డిపరక చేతనైన బుద్ధిపూర్వకముగ బ్రాహ్మణుని గొట్టిన యెదల యిరువదియొక్క జన్మమూల దనుక శునకాది పాపయోనుల యందు బుట్టును.

     ఇంత నొక్కి చెప్తున్నది సత్త్వగుణం చేత బ్రాహ్మణులైన వారి గురించి కదా,అందులో తప్పేమిటి అని అనుకోవడానికి వీల్లేదు.గుణాన్ని బట్టి గౌరవించడానికి ఇంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు కదా - కంటి ముందు కనిపించే శిఖాయజ్ఞోపవీతసమన్వితులైన బ్రాహ్మణులకు అవసరమైనదాని కన్న ఎక్కువ గౌరవాల్ని కట్టబెట్టడానికే ఇవన్నీ చెప్పినది!అసలు కులసాంకర్యం విషయానికి వస్తే జరిగినది వీరు చెప్తున్న దానికి భిన్నంగా జరిగింది.ఇవ్వాళ మనం బ్రాహ్మణులు అని ఎవరిని అంటున్నామో ఆ కులం మిగతా అన్ని కులాలూ ఏర్పడిన తర్వాత అన్ని కులాల నుంచీ సాత్వికులు ఆధ్యాత్మికంగా ఎదిగి బ్రాహ్మణులై సకలజనసాంకర్యం చేత ఏర్పడినదే!

వచనం:గరూశుండను మానవునివలనఁ గొందఱు గారూశులను క్షత్రియులు గల్గి  ధర్మము తోడి ప్రియంబున బ్రాహ్మణులై  యుత్తరాపధమునకు రక్షకు లయిరి.దృష్టుని వలన దార్ష్ట్యం బను వంశంబు గల్గి భూతలంబున బ్రహ్మభావంబు నొంది నెగడె......దేవదత్తుఁ డా పండితునకు నగ్నివేశుండు సుతుఁడై జనించి యా యగ్నివేశుండు గానీనుండన నెడి జాతకర్ణుండను మహర్షియై వెలసె,అతని వలన నాగ్నివేశ్యా యనంబడు బ్రహ్మకులంబు గలిగె
భాగవతము 9వ స్కంధము
వచనం:....శినికి గార్గ్యుఁడు గలిగె,నాతని నుండి బ్రాహ్మణ కులంబయ్యె,మహావీర్యునకు సురుక్షయుండును,సురుక్షయునకు ద్రయ్యారుణియు,గవియు,బుష్కరారుణియు నను మువ్వురు సంభవించిరి.వారును బ్రాహ్మణులై చనిరి....అండజామీరుని వంశంబునఁ బ్రియమేధాదులు పుట్టి బ్రాహ్మణూలై చనిరి.
భాగవతము 9వ స్కంధము,రంతిదేవుని చరిత్ర

     దీనికి భిన్నంగా మిగిలిన కులాలు వృత్తులకు అనుబంధమైనవి కాబట్టి సాంకర్యానికి ఆస్కారమే లేదు!పాండిత్యం చేతనో,యోధత్వం చేతనో,సంస్కారం చేతనో మేము ఇతరుల కన్న గొప్పవాళ్ళం అని అనుకోవడం వరకు సహించవచ్చును - నిలదీసి అడిగినప్పుడు సాక్ష్యం చూపించితే వెనక్కి తగ్గడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు!కానీ,మేము మాత్రమే అనంతకాలం నుంచీ కులసాంకర్యం లేకుండా స్వచ్చంగా ఉన్నాము,ఇతర కులాలు అన్నీ సంకరమైపోయినాయి అని చెప్పడాన్ని కూడా ఇతర కులాల వారు సహించుతారని వీరెట్లా అనుకున్నారు?అదీగాక దాదాపు ప్రతి కులమూ బ్రాహ్మణ పురుషుడి ద్వారానో బ్రాహ్మణ స్రీ ద్వారానో పుట్టింది అని తీర్మానించడం దేన్ని సూచిస్తుంది?

శోకం:నిషాదో మార్గవం సూతే దాసం నౌకర్మజీవనం
కైవర్తమితి యం ప్రాహు రార్యావర్తనివాసినః
మనుధర్మశాస్త్రం 4వ శ్లోకం
భావం:బ్రాహ్మణునకు శూద్రభార్య యందు బుటినవాడైన నిషాదుఁ డాయోగవస్త్రీయందు నావ నడుపుటయే వృత్తిగా గలిగిన మార్గవుని గలుగఁజేయుచున్నాడు.వాని నార్యావర్త దేశవాసులు కైవర్తుడు(బెస్తవాడు) అని పిలుచుచున్నారు.
శ్కోకం:క్షత్రియా ద్విప్రకన్యాయాం సూతో భవతి జాతితః
వైశ్యా న్మాగధ వైదేహౌ రాజవిప్రాంగనాసుతౌ.
భావం:క్షత్రియునకు బ్రాహ్మణస్త్రీయందుఁ బుటినవాడు సూతుఁడనియు,వైశ్యునకు క్షత్రియ స్త్రీయందుఁ బుట్టినవాడు మాగధుఁడనియు,వానికే బ్రాహ్మణస్త్రీయందుఁ బుట్టినవాడు వైదేహుఁడనియు జెప్పబడును.

     చారిత్రకంగా ప్రతి కులానికీ ఒక వృత్తి మూలమై ఉండటమూ ఆ వృత్తికి ఉన్న ప్రాధాన్యతని బట్టి కొన్ని తరాల పాటు ఆ వృత్తిని ఆదాయమార్గంగా చేసుకోవడం ద్వారానే స్థిరమై నిలిచాయనేది కళ్ళకి కట్టినట్టు గోచరిస్తుంటే ఇట్లా X అనే బ్రాహ్మణుడు Y అనే కులానికి చెందిన Z అనే స్త్రీకి కడుపు చేస్తే A అనే కులం పుట్టిందని రాయడం ఎంత నీచత్వం?లేదని బుకాయిమంచడానికి వీల్లేకుండా బ్రాహ్మణాధిక్యత అనేది ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది కదా!ఇది తెలియాల్సిన వాళ్ళకి తెలియడంతో బ్రాహ్మణ వ్యతిరేకతా ఉద్యమం పుట్టింది.ఈ పేరు చెప్పగానే తమిళనాడులోని పెరియార్ గుర్తుకు రావటం సహజం,కానీ ఈయన 19వ శతాబ్దం వాడు, ఆంధ్ర ప్రాంతంలో వీరేశలింగం పంతులు కన్నా ముందుగానే తెలుగునాట ఒక చిచ్చరపిడుగు పుట్టాడు - అతని పేరు స్వామినేని ముద్దునరసింహం(జననం:క్రీ.శ.1792, మరణం:క్రీ.శ.1856)!ఈ చిచ్చరపిడుగు లాగే ఆ చిచ్చరపిడుగు కూడా వెలమవాడే - చిచ్చరపిడుగు లంతా వెలమకులంలోనే పుడుతున్నారు, హార్నీ!అతను పేల్చిన బాంబు పేరు హితసూచని అనే గ్రంధరాజం!తర్వాత కాలంలో ఆత్మూరి నరసింహం(1845-1901), కందుకూరి వీరేశలింగం(1848-1919), గురజాడ అప్పారావు(1862-1915) లాంటివాళ్ళు ఎత్తుకున్న పరస్పర విభిన్నమైన సంస్కరణా ప్రణాళిక లన్నిటికీ programmatic background ఇచ్చింది హితసూచనియే - పేలింది ఆటంబాంబు కాబట్టి దానివల్ల జరగాల్సిన పని కూడా చాలా నిక్కచ్చిగా జరిగింది!

     హితసూచనిలో ముద్దునరసింహం ఇచ్చిన కార్యక్రమం తెలుగునాట 20వ శతాబ్దం ప్రారంభానికే ఒక స్పష్టమైన రూపు తీసుకున్నది.కుల సంఘాలు ఏర్పడి తమ కులాన్ని అభివృద్ధి చెసుకోవడానికి కార్యక్రమాలు మొదలుపెట్టాయి.క్రీ.శ.1903లో పుట్టిన విశ్వబ్రాహ్మణ కుల సంఘం నుండి క్రీ.శ.1926లో పుటిన క్షత్రియ కుల సంఘం వరకు అందరిదీ ఒకటే ప్రణాళిక:1).స్వకుల విద్యాభివృద్ధిని గుర్తించి వారి కులానికి చెందిన విద్యార్ధుల కొరకు ప్రత్యేక హాస్టళ్లను నిర్మించడం,వీలయితే బీద విద్యార్ధులకు ధనసహాయం చేసి విదేశాలకు పంపించడం.2).విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలలో తమ స్థానం కోసం పోరాడటం.3).బాల్యవివాహాలను వ్యతిరేకించడం,వితంతు పునర్వివాహం లాంటివాటిని ప్రోత్సహించడం - ఇదంతా హితసూచని వేసిన రాజమార్గమే!

     మద్రాసు ప్రెసిడెన్సీలో క్రీ.శ.1916 డిసెంబరులో బ్రాహ్మణేతర ఉద్యమ ప్రణాళిక ప్రకటించే నాటికి ముందుగానే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా,గుంటూరు జిల్లాలు కేంద్రంగా బ్రాహ్మణేతర ఉద్యమం ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. స్మృతి, పురాణ, ఇతిహాసాలను హేతువాద దృష్టితో అధయయనం చెయ్యడం తెలుగునాట త్రిపురనేని రామస్వామి చౌదరి(క్రీ.శ,1887-క్రీ.శ.1943)తో ఉధృతమైంది. ఆయన సూతాశ్రమాన్ని స్థాపించి చాలామంది శిష్యులను తయారు చేసుకున్నాడు.కమ్మ, కాపు, వెలమ, రెడ్డి, బలిజ తదితర వ్యవసాయ శూద్ర కులాలు క్షత్రియులేననీ వారు వేదవిద్యార్హులేననీ వాదిస్తూ నాటి గుంటూరు జిల్లాలోని ఒంగోలు తాలూకాకు చెందిన కొప్పోలు గ్రామ నివాసి సింగమనేని రామయ్య తాను స్వయంగా యజ్ఞయాగాలు నిర్వహించడం ద్వారా రామయాజి ఆనె పేరు తెచ్చుకోవడమే కాకుండా క్రీ.శ.1908 నాటికే తన వాదనను నిరూపిస్తూ మహేంద్రోపన్యాసమనే గ్రంధాన్ని రాశారు.అయితే, వీరందరూ వ్యక్తిగత స్థాయి కార్యక్రమాలలో మంచిపేరు తెచ్చుకున్నప్పటికీ విస్తృత పరిధిలో ప్రజలను ఐక్యం చెయ్యగలిగిన ఒక తాత్విక బూమిక, కలిసిన ప్రజలను ఏకోన్ముఖంగా నడిపించే రాజకీయ కార్యాచరణ ప్రణాళిక(political ideology) లేదు. ఆ లోటును తీర్చినవాడు సూర్యదేవర రాఘవయ్య చౌదరి(జననం:?,మరణం:1937) అనే ఒక సామాన్య వ్యక్తి, కేవలం formal educationతో సరిపెట్టుకున్న వాడు, తను అతి సామాన్యుడననీ తనను మించిన పెద్దలు ఎందరో ఉన్నారని తెలిసినా  హిందూమతం యొక్క అభ్యున్నతి కోసమే తను చొరవ తీసుకోవలసి వచ్చిందనీ తన గురించి చెప్పుకున్నాడు.

     ముద్దునరసింహం నుంచి రాఘవయ్య చౌదరి వరకు గల బ్రాహ్మణేతర మేధావులలో ఎవ్వరికీ హిందూమతద్వేషం లేదు - కేవలం కల్పిత విప్రాధిక్యత వల్ల తేజస్సు కోల్పోయిన సనాతన ధర్మాన్ని పూర్వరూపంలో నిలబెట్టడానికి వారు చేసిన కృషిలో నిజాయితీ ఉంది,కనుకనే సత్యానికి కటుబడిన బ్రాహ్మణులు కూడా వీరిని అనుసరించారు!అయితే,తిరిగి సనాతన ధర్మాన్ని పూర్వరూపంలో నిలబెట్టడం అసాధ్యం అని వీరు తెలుసుకోలేకపోయారు.అందుకే ఉద్యమం చల్లబడిపోయింది.మాయమైపోయింది.కాలానికి ఒక చిత్రమైన లక్షణం ఉంది - ఎంతమంది ఎంత మొండికి తిరిగి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది పొరపాటున కూడా వెనక్కి నడవదు, ఎప్పుడూ ముందుకే నడుస్తుంది!తిరిగి సాధించలేని చేజారిన గతం,ఎప్పటికీ చేరుకోలేక వూరించే భావి - ఈ రెంటి మధ్యన అర్ధం చేసుకోవడానికీ ఆలోచించడానికీ దిశను మార్చుకోవడానికీ చాలినంత సమయం ఇవ్వకుండా హఠాత్తుగా మనమీదకి దూకే అత్యంత కీలకమైన ఈ వర్తమానం అనే బిందువు యొక్క పరిమాణం ఎంత?సంవత్సరమా, ఆయనమా, మాసమా, వారమా, దినమా, క్షణమా - బ్రాహ్మణులు తమకు లేని గొప్పను ఆపాదించుకుని ఇతర కులాల్ని అణిచివెయ్యడం అనేది నిజంగా జరిగిందా!జరిగితే ఎప్పుడు మొదలైంది?

     సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి పరిశీలన ప్రకారం క్రీ.శ 1000వ సంవత్సరంలోని కురవాడ శాసనంలో "అనే చ్చిమూరువాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః భ్రద్వాజాన్వయః కమ్మకులజః కులవర్ధనః తస్యాం భవత్సూత్ శ్రీమాన్ గోవిందో గురునందనః శ్రౌతస్మారత్క్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని స్పష్టంగా ఉంది.ఈ శాసనం వేయించినది రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు.ఇలాంటి అనేక శాసనాలను పరిశోధించిన చిలుకూరి వీరభద్రరావు గారు విశ్లేషించి చెప్పిన దాని ప్రకారం కమ్మకులజుడైన దేవనయ్య వేదం నేర్చుకుని శుద్ధవైదికబ్రాహ్మణుడిగా జీచించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.అబ్బెబ్బే,వీళ్ళు పెద్ద్ద కులాల వాళ్ళు,బాగా డబ్బు సంపాదించి కొనుక్కున్నారు,మా కులాలకి మాత్రం ఆ చాన్సు రాలేదు అనటానికి వీల్లేకుండా ఎపిగ్రాఫికా ఇండికా సం.6 పే.236 ప్రకారం క్రీ.శ 973లో కమ్మకులస్థుల్లో షట్కర్మ నిరతులు ఉండేవారనీ, కౌండిన్య గోత్రులైన వంగ్ర బోయ,కొళ్ళిపుర బోయ,కురియెద బోయ అను బోయ కులాల నుండి కూడా వేదం నేర్చుకుని బ్రాహ్మణులుగా జీవించినవారు ఉన్నారని దృష్టాంతాలు ఉన్నాయి.కాబట్టి కల్పిత విప్రాధిక్యం, బ్రాహ్మణేతర కులసాంకర్యం లాంటివి ప్రతిపాదించబడటం, గ్రంధస్థం కావడం, ఆమోదించబడటం 1వ శతాబ్దం తర్వాతి కాలంలో జరిగి ఉండవచ్చును.ఇది ఈ కాలంలోనే జరిగిందనటానికి నాకు కూడా ఒక ఆధారం దొరుకుతున్నది.దేశంలోని ఇతర ప్రాంతాల సంగతి నాకు తెలియదు గానీ క్రీ.శ 1వ శతాబ్దం అంటే ఆంధ్రప్రాంతానికి సంబంధించి శాతవాహనులు పరిపాలించిన కాలం అని తెలుసు.ఇప్పుడు కమ్యూనిష్టు భావజాలం ఉన్నవాళ్ళు విమర్శించే నిచ్చెనమెట్ల సాంఘిక నిర్మాణం వీరి పరిపాలనలోనే ఏర్పడింది.

     క్రీ.పూ 1వ శతాబ్దిలో ఉత్తర దక్షిణ భారతాలను రెంటినీ యేకం చేసి పరిపాలించిన మౌర్యసామ్రాజ్యం కాలవశాన బలహీన పడగా స్వతంత్రించి రాజ్యాలను యేర్పరచుకున్న వారిలో "యేకరాట్" అనే బిరుదునామం కలిగిన శ్రీముఖుడి ద్వారా స్థాపించబడిన శాతవాహన సామ్రాజ్యంలో ఇప్పటి నవ్యాంధ్ర తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలను హృదయస్థానంలో వుంచుకుని అమరావతి ఒక రాజధానిగా తొలి తెలుగు సామ్రాజ్యం అవతరించింది!తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే గొప్ప బిరుదు సంపాదించాడు.ఖారవేలుణ్ణి జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని శాంతియుతంగా నిలబెట్టాడు.రెండు అశ్వమేధాలూ ఒక రాజసూయం చేసిన ఘనుడు!మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు. బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసినా తను బ్రాహ్మణుడు కావటం వల్లనో యేమో "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!దొరికిన ఆధారాలను బట్టి శాతవాహనుల కాలం నాటి సమాజం ఇలా ఉండేది:రాజు దైవాంశ సంభూతుడనే మూఢనమ్మకాలు లేకుండా ధర్మశాస్త్రాల కనుగుణంగా సామాజిక సాంప్రదాయాలకు విలువనిచ్చి కడుచక్కని పరిపాలన సాగించారు శాతవాహన ప్రభువులు.రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉండేది,రాజ్యం పెద్దది కావడంతో భాగాలుగా విభజించి ప్రాంతాలకు "రాజ", "మహాబోజ", "మహారధి" నామాలతో అధిపతుల్ని నియమించారు.సమాజం లోని ప్రజానీకం నాలుగు తరగతులుగా వర్గీకరించబడి ఉంది - పైన చెప్పుకున్న అదిపతులు పైస్థాయిలోని ప్రభు వర్గం,దానికి కింది అంతరువుగా అమాత్యులూ మహామాత్రులూ వంటి ఉద్యోగశ్రేణులూ తమ వ్యాపారకౌశలంతో రాజ్యపు సంపద పెంచే ప్రజ్ఞ వుండి సమాజంలో మంచి పరపతి గల్గిన వణిక్ప్రముఖులూ,మూడవ అంతరువులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలతో పోల్చదగిన వైద్యులూ కవిగాయక శిఖామణులూ రైతులూ కుమ్మర్లూ కమ్మర్లూ,అన్నిటికన్నా కింది అంతరువుల్లో ప్రధాన వృత్తులకి అనుబంధమైన వృత్తి పనివాళ్ళయిన వడ్రంగులూ జాలర్లూ వంటివాళ్ళు వుండేవాళ్ళు. గ్రామస్థాయిలో ప్రతి కులానికీ ఒక కులపెద్ద ఉండేవాడు,అన్ని గ్రామాలలోని కులపెద్దలూ కలిసి ప్రభుత్వానికీ తమ తమ కులసమూహాకీ వారధులుగా ఉండేవాళ్ళు. తొలిదశలోని ఈ యేర్పాటుని ఏ కులం వారూ వ్యతిరేకించలేదు - వారి ఉత్పత్తుల మీద వారికి ఎకనమిక్ మోనోపలీని తెచ్చిపెట్టింది కదా!

     చరిత్రను ఎంత నిశితంగా పరిశీలించినా ఈనాడు కొందరు అక్కసు వెళ్ళగక్కుతున్నట్టు కులవ్యవస్థ బ్రాహ్మణులు పైనుంచి రుద్దడం వల్ల ఏర్పడలేదు - అది కూడా ఆర్యద్రవిడసిద్ధాంతం లాగే కమ్యునిష్టులు కల్పించిన ఆబద్ధం!మిగిలిన కులాలు రాజ్యానికి కావలసిన ఉత్పత్తికి సంబంధించిన లౌకికపరమైన ఏర్పాటు వల్ల పుట్టినవి కాగా ఇవ్వాళ మనం చూస్తున్న బ్రాహ్మణకులం అన్ని కులాలకు సంబంధించిన ఆధ్యాత్మిక అవసరాల కోసం చేసుకున్న ఏర్పాటు!బ్రాహ్మణకులం కూడా కులవ్యవస్థలోని ఒక భాగమే - చాతుర్వర్ణంలోని బ్రాహ్మణ పదం వీరి కులానికి పర్యాయం కావడం వల్ల ఈ అబద్ధపు వాదన నిజమేనని అందరూ భ్రమపడటం జరిగింది.బ్రాహ్మణులలోని కొందరు తమ పాండిత్యం యొక్క ఔద్ధత్యాన్ని చూపిస్తూ వ్యాస మహర్షి వంటి గొప్పవారి కావ్యాలలో కూడా వారి ఆదర్సవంతమైన భావాలకు విరుద్ధమైన ప్రక్షిప్తాలను చేర్చి కల్పిత విప్రాధిక్యతని ప్రచారం చేశారు.అది కమ్యునిష్టులకి బ్రాహ్మణులే కులవ్యవస్థని పైనుంచి రుద్దారనే సూత్రీకరణ చెయ్యడానికి దారి చూపించింది.వ్యాసప్రోక్తాలుగా నిర్ధారించబడిన బాగాల్లో కనిపించే శరీధర్మశాస్త్రం, యోగశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన విషయాలను పరిశీలిస్తే  అతడు సత్యానికి కట్టుబడిన నిజమైన జ్ఞాని అని తెలుస్తుంది.అటువంటి వాడు సమజాన్ని సంస్కరించాలనే సదుద్దేశంతో  రచన చేస్తూ మళ్ళీ తద్విరుద్ధమైన ప్రస్తావనల్ని ఎందుకు చేస్తాడు?కల్పితమైన ఆధిక్యత కోసం పాకులాడిన పండిత ప్రకాండులు తమకి ఏ విషయం గురించి ఎలాంటి సమర్ధన అవసరం అవుతుందో దాని ప్రకారం  వ్యాసుడి శైలిలో ఒక ఉపాఖ్యానం రాసేసి ఇరికించేసే వాళ్ళు!

     ఆంధ్రసత్యార్ధప్రకాశము అనే గ్రంధంలో ఉదహరించబడిన ప్రకారం భోజరాజు రాజ్యంలో ఎవరో వ్యాసుడి పేరుతో మార్కండేయ శివపురాణాల్ని రాసేశారు.ఈ  విషయం రాజుకు తెలిసి వాళ్ళని కఠినంగా శిక్షించి "ఇక మీదట ఎవరైనా కావ్యాది గ్రంధములను రచించినట్లయితే సొంతపేర్లతో వెలయించవలెను తప్ప తమ రచనలను ప్రాచీన ఋషుల పేరిట వ్యక్తం చేయకూడదు" అని శాసనం చేశాడు.ఈ విషయం భోజరాజకృతమైన "సంజీవని" అనే గ్రంధంలో ఉంది.ఈ గ్రంధం గ్వాలియర్ రాజ్యంలోని ఖాంద్ నగరవాసియైన ఒక తివాడీ బ్రాహ్మణుని ఇంటిలో ఉన్నట్టు లఘునోరావు సాహెబు గారునూ వారి లేకరియైన రామదయాళ్ కౌబేగారునూ చూసినట్లు గట్టి సాక్ష్యం ఉంది.దీనిలో వ్యాసమహర్షి యొక్క మహాభారతం గురించి ఆయన నాలుగు వేల నాలుగు వందల శ్లోకాలూ ఆయన శిష్యులు అయిదు వేల ఆరు వందల శ్లోకాలూ రాసినట్టు లెక్క కూడా చెప్పారు.విక్రమాదిత్యుని కాలానికి ఇరవై వేల శ్లోకాలు అయినట్టు చెప్పడాన్ని బట్టి ఇప్పటి లక్షశ్లోకవిస్తారం తర్వాతి పండితుల చేతివాటం వల్ల దక్కిన ఖ్యాతి అన్నమాట!

     ఈ కల్పితవిప్రాధిక్యత మొత్తం ఉదరపోషణ నిమిత్తమే జరిగిందనేది వాస్తవం.కానీ సాహిత్యంలో ఇంత విస్తారంగా ఉన్నప్పటికీ సమాజంలో ఈ కల్పితవిప్రాధిక్యత పని చేసిందని చెప్పడానికి దాఖలాలు లేవు.ఇవ్వాళ తమ ఇళ్ళలో దైవకార్యం,పితృకార్యం నిర్వహించిన బ్రాహ్మణులకి సంభావన ఇచ్చేటపుడు మనుస్మృతిలో చెప్పారని ఇవ్వడం లేదు కదా!ఏనాడూ మనుస్మృతి చదవని వాళ్ళని అసలు తెలియనే తెలియని విషయం ఎట్లా ప్రభావితం చేస్తుంది?ఎక్కువ అడిగితే ఇవ్వను పొమ్మని గృహస్థు అంటే సరిపెట్టుకుని వెళ్ళేవాళ్లని పట్టుకుని వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని ఆరోపించడం అన్యాయమే!ఈ బ్రాహ్మణేతర ఉద్యమం వల్ల బ్రాహ్మణులు రాజకీయరంగంలో కనపడకపోయినా విద్యార్జనలోని చురుకుదనం ద్వారా ప్రభుత్వాధికారులలో చాలామంది బ్రాహ్మణులే ఎప్పటినుంచో ఉన్నారు, ఇప్పటికీ ఉంటున్నారు, ఇకముందు కూడా ఉంటారు!మరి, బ్రాహ్మణేతర ఉద్యమం సాధించినది ఏమిటి?కొన్ని బ్రాహ్మణేతర కులాలు రాజకీయపు రంకు నేర్వడం తప్ప సాధించింది ఏమీ లేదు!బ్రాహ్మణకులాన్ని బజారు కీడ్వడం తప్ప సమాజంలో జరిగిన మంచి మార్పు ఏమీ లేదు!ఇవ్వాళ నందమూరి తారక రామారావు అనే ఒక నటుడి చుట్టూ జరుగుతున్న ప్రచారం చూడండి, అతని కుటుంబంలోని ఇతర నటులు "చరిత్ర సృష్టించినా తీరగరాసినా మేమే, మేమే, మేమే!" అని గొప్పలు చెప్పుకుంటూ తొడలు గొట్టడం మీద పేటెంటు తీసుకున్న వికృతత్వం చూడండి,అన్ని కులాల వాళ్ళూ అతనిలోని కళను మెచ్చి అతనికి ఆ స్థానాన్ని కల్పిస్తే అతని కులంవాళ్ళు అతన్ని తమ కులానికి అంటుగట్టుకుని పులకించిపోవటం చూడండి!అప్పుడు బ్రాహ్మణులు కల్పిత విప్రాధిక్యతతో రెచ్చిపోతే ఇప్పుడు కల్పిత కమ్మకులాధిక్యతతో కమ్మ కులస్థులూ కల్పిత కాపుకులాధిక్యతతో కాపు కులస్థులూ రెచ్చిపోతున్నారు - దేన్ని ఆపగలం?ఎడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టినట్టు ఒక కులాన్ని కుర్చీ నుంచి లాగిపారేసి మరొక కులాన్ని కుర్చీ మీదకి ఎక్కించటం పరిష్కారం కాదు, అవునా!

     స్వార్ధపరులైన కొందరు బ్రాహ్మణ పండితుల వల్ల కల్పిత విప్రాధిక్యత ఉదరపోషణార్ధం జరిగితే ఎంతో గంబీరంగా మొదలైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం చివరి దశకి వచ్చేసరికి గందరగోళానికి గురై స్వసంఘ పౌరోహిత్యం లాంటి ప్రతిపాదనలతో కర్మకాందలకి జరిగే ఖర్చును తగ్గించే పిసినారి వ్యవహారం స్థాయికి దిగజారిపోయింది.దీనికి తోడు అక్కడి పెరియార్ ఉద్యమంలోనూ ఇక్కడి ఆంధ్రుల ఉద్యమంలోనూ ఉన్న ఒక మూర్ఖత్వం వల్ల బ్రాహ్మణుల్ని రాజకీయ పదవులకు దూరం చేసి కొన్ని శూద్రకులాల ప్రముఖులకి రాజకీయ వైభవాలు కట్టబెట్టడం వరకు మాత్రమే తన లక్ష్యాన్ని సాధించి సగంలోనే అంతర్ధానం అయిపోయింది.బ్రాహ్మణేతరోద్యమం అతి తక్కువ కాలంలోనే అంతరించిపోవడానికి ఆ సిద్ధాంతంలోని అంతర్గత వైరుధ్యాలకి తోడు ముఖ్యమైన లోపం తన చుట్టూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్వాతంత్ర సమరాన్ని వ్యతిరేకించడం - ముందు సంస్కరణ తర్వాత స్వతంత్రం అనే వీరి మొండివాదన వల్ల దేశభక్తిలేనివారు అనే ముద్రపడి అభాసుపాలై ఉద్యమం పలచబడిపోయింది.

     ఉద్యమం పలచబడిపోవటం వల్ల మరుగున పడినప్పటికీ వారు సంద్గించిన ప్రశ్నలు మాత్రం బ్రాహ్మణులు తప్పనిసరిగా జవాబు చెప్పి తీరాల్సినవే.ఇవ్వాళ కమ్మ, కాపు, రెడ్డి, వెలమ కులాల వారు ప్రదర్శిస్తున్న కులాధిక్యతకి తొలినాటి కల్పిత విప్రాధిక్యతయే కారణం గనుక దీనిని రూపుమాపే బాధ్యతని వారే తీసుకోఎవాలి!మొదట సనాతన ధార్మిక సాహిత్యం నుంచి కల్పిత విప్రాధిక్యతకి సంబంధించిన ఆనవాళ్లని వారు చెరిపివేయాలి.దీనివల్ల వారు బ్రాహ్మణేతరుల విశ్వాసాన్ని పొందగలుగుతారు.తర్వాత బ్రాహ్మణేతరులకి కూడా పుట్టుకని బట్టి గాక ఆసక్తిని బట్టి వేదం మీద అధికారాన్ని ఇవ్వాలి.దీనివల్ల సనాతన ధర్మం కేవలం బ్రాహ్మణులకే సొంతం అనే అపప్రధ పోతుంది.కల్పిత విప్రాధిక్యత వల్ల వారికి జరిగిన మేలూ లేదు, దేవనయ్య వారి లాంటి వల్ల వారికి జరిగిన కీడూ లేదు.మెకాలే విద్యావిధానం వల్ల  తమకు కొత్తగా వచ్చిపడిన సామాజిక స్థాయి నుంచి పుట్టిన అహంకారాన్ని వదులుకుని బ్రాహ్మణేతరులు కూడా చరిత్రని నిష్పాక్షిక దృష్టితో చూసి వాస్తవాల్ని తెలుసుకోవాలి.పొట్టకూటి కోసం తప్పుడుపనులు చేసి అపఖ్యాతి పాలైన కొద్దిమంది పుట్టు బ్రాహ్మణులను మినహాయిస్తే వ్యాసుని వంటి సాత్వికులైన బుద్ధి బ్రాహ్మణులు సృష్టించిన జ్ఞానసంపద చాలా గొప్పది.

     హిందూ మతానికి చెందిన పురాణకధలలో స్థల దేవతలు.జలదేవతలు అంటూ ఇచ్చిన వర్ణనల ఆధారంతో క్రీ.శ.1801లో లెఫ్టినెంట్ ఫ్రాన్సిస్ గిల్బర్ట్ అనే వ్యక్తి ఒక దేశపటాన్ని తయారుచేసి, "హిందువుల ప్రాచీన గ్రంధాల నుంచి కాలీ లేక నైలు నది పక్కనే ఉన్న ఈజిప్టు తదితర దేశాలను గురించిన సమాచారం" అనే వ్యాసం రాస్తే దానికి 60 యేళ్ళ తర్వాత జె.హెచ్.స్పెకే అనే పరిశోధకుడు ఆ వివరాల సాయంతో నైలునది పుట్టుకను గుర్తించాడు!ఇతరులకు తమ ప్రక్కన ఉన్నవాటి గురించే తెలియని కాలంలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టివచ్చి అందర్నీ మెప్పించిన గొప్ప వారసత్వాన్ని సృష్టించడం ద్వారా కలిగిన మంచికీ అంతర్గతంగా కులాధిక్యతలకు కారణం కావడం ద్వారా కలిగిన చెడుకీ - ఈ దేశానికి సంబంధించి చరిత్ర మనకి చూపిస్తున్న విభిన్న కోణాలు రెంటికీ బ్రాహ్మణులే కారణం అయ్యారు అనేది నిజమే. మంచికి మాత్రమే బాధ్యత తీసుకుని చెడుకి బాధ్యత వహించడంలో బ్రాహ్మణులు తప్పుకోకూడదు.అలాగే, చెడుని మాత్రమే చూసి దూషిస్తూ బ్రాహ్మణుల వల్ల జరిగిన మంచిని బ్రాహ్మణేతరులు తక్కువ చేసి మాట్లాడకూడదు.ఇవ్వాళ నడుస్తున్న ఆధ్యాత్మికతతో పనిలేని లౌకిక జీవితంలో బ్రాహ్మణులకి ప్రాధాన్యత లేదు కాబట్టి బ్రాహణులకి ప్రాధాన్యత లేకపోయినా హిందూమతం కొనసాగుతుందని కొందరికి అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మికత లేని హిందువుల జీవనవిధానం ఎట్లా ఉంటుంది?వూహించటం కూడా కష్తమే!కాబట్టి గత డెబ్భయ్యేళ్ళుగా క్రైస్తవ, ముస్లిం, కమ్యునిస్ట్ భావజాలాల తాకిడికి పెరిగిన అంతరాల్ని తగ్గించుకుని బ్రాహ్మణులూ బ్రాహ్మణతరులూ కలిసికట్టుగా నిలబడితేనే హిందూమతం ఉనికిలో ఉంటుంది.లేని పక్షంలో క్రీ.శ 2050 నాటికి హిందూమతానంతర భారతదేశం ఆవిర్భవించడం తధ్యం!

     క్రీ.శ 7వ శతాబ్దిలో మక్కా మదీనాల వద్ద మక్కావాసుల తిరస్కారం, వెలివేత, బహిష్కారం, హత్యాయత్నం, అణచివేత, ఓటమి, ప్రతీకారం, క్రూరత్వం వంటి ప్రతికూలతానుకూలతల మధ్య నిలబడిన ఒక మొండిమనిషి కీచుగొంతు నుండి వెలువడిన "అల్లా హో అక్బర్!" అనే చిరుకేక గత 1400 సంవత్సరాలలో పెరిగి పెరిగి సుమారు 0.7 బిలియను(700,000,000)ల నుండి 1.9 బిలియను{1,900,000,000}ల మందిని,అంటే ప్రపంచ జనాభాలో 25% మందిని సమ్మోహితుల్ని చేసి పెనుకేకగా మారింది!పదుగురాడు మాట పాడియై ధరజెల్లు నన్నట్టు అంతమందిని ఆకర్షించిన భావజాలం ఎంత గొప్పదై ఉండాలి?తమను అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకి నడిపించి స్వేచాసమానత్వాల కాంతిపధం వైపుకి నడిపించే స్వభావం లేకపోతే అంతమంది ఆ భావజాలాన్ని ఎందుకు ఆదరిస్తారు?గంబీరమైన భావపరంపరతో అద్భుతమైన చారిత్రక విశ్లేషణలతో వర్గరహితసమాజమనే మరో ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి ప్రపంచ మేధావులని ఉర్రూత లూగించిన కమ్యూనిష్టు సిద్ధాంతమే పూర్తిగా శతాబ్దం కూడా గడవకముందే హతశేషమైపోయింది - అంతకన్న గొప్పదనం ఇస్లాములో ఏమి ఉంది?

     According to the Carnegie Endowment for International Peace, the World Christian Database as of 2007 estimated the six fastest-growing religions of the world to be Islam (1.8%), the Bahá'í Faith (1.7%), Sikhism (1.6%), Jainism (1.6%), Hinduism (1.5%), and Christianity (1.3%). High birth rates were cited as the reason for the growth. However, according to others, including the Guinness World Records, Islam is the world's fastest-growing religion by number of conversions each year. Islam is the fastest-growing religion in India. Growth rate of Muslims has been consistently higher than the growth rate of Hindus, even since the census data of independent India has been available. For example, during the 1991-2001 decade, Muslim growth rate was 29.52% (vs 19.92% for Hindus) However, Muslims population growth rate declined to 24.6% during 2001-2011 decade, in keeping with the similar decline in most religious groups of India.if the current trend continued, by the end of the 21st century India's Muslim population would reach about 340 million people (19% or 20% of India's total projected population), despite the fact that Hindus would still remain the predominant religious community of the country. Islam is the second-largest religion in India, making up 14.9% of the country's population with about 180 million adherents (2011 census).AS the propagating nethod of islam irrespective of their location 25% of muslims will fight openly for islamic state,while another 25% of remaining peace loving muslims will unconditionally give full support for jehadis,and other 25% of muslims wil give a cover for their activities with their well articulated condemnation of islamic terorist for pacifying the anger in non-muslims who were majority in numbers at that location until muslims wil get majority over the location.

     తిరిగి సాధించలేని చేజారిన గతం,ఎప్పటికీ చేరుకోలేక వూరించే భావి - ఈ రెంటి మధ్యన అర్ధం చేసుకోవడానికీ ఆలోచించడానికీ దిశను మార్చుకోవడానికీ చాలినంత సమయం ఇవ్వకుండా హఠాత్తుగా మనమీదకి దూకే అత్యంత కీలకమైన ఈ వర్తమానం అనే బిందువు యొక్క పరిమాణం ఎంత?శతాబ్దమా, దశాబ్దమా, సంవత్సరమా, ఆయనమా, మాసమా, వారమా, దినమా, క్షణమా - సనాతన ధర్మం తన పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి పట్టే సమయం ఎంత?కులబ్రాహ్మణుల సంఖ్య తగ్గి నిజబ్రాహ్మణుల సంఖ్య పెరగడం వల్లనే సనాతన ధర్మం నిలబడుతుందనేది ఒక అందమైన కలలాంటి స్వాప్నికసత్యం.యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది.యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది.


సత్యం శివం సుందరం!!! 
--------------------------------------------------------------------------------------------------------
1     2     3     4     5     6     7     8     9     10    11    12    13    14    15    16    17    18

77 comments:

  1. చివరికొచ్చేసేవు, ఒకే ఒక్క అడుగు ముందుకేసెయ్

    ReplyDelete
    Replies
    1. ఏ చివరికి వచ్చానో మీరు చెప్పందే నాకెలా తెలుస్తుందండి?
      నేనైతే ఇప్పుడే అసలు పని మొదలు పెట్టానని అనుకుంటున్నాను మరి!

      Delete
  2. పోస్ట్ లన్నీ బుక్ వేయించండి

    ReplyDelete
  3. ఇపుడున్నది బ్రాహ్మణులకు పాధాన్యత లేని సమాజమే కదా ? ఇపుడు రాజ్యమేలబోతుంది శూద్రులేగా ?

    ReplyDelete
  4. కాపుల ఫేస్బుక్ పోష్టులు చూస్తే నవ్వొస్తుంది - మేము క్షత్రియ కాపు వీరవరేణ్యులం అని డప్పాలు కొట్టుకోవటం!కృష్ణదేవరాయలు,చిరంజీవి,పవన్,బెజవాడ కాపు రౌడీ ఫొటోల మీద పూలు జల్లుతున్న పోస్టర్లు!కృష్ణదేవరాయలు వీళ్ళ కులం వాడు ఎప్పుడయ్యాడు?మొదట రాయలు కాదేమో అని కన్‌ఫ్యూజ్ అయ్యాను.అయితే అదే గెటప్పుతో మరొకాయన కూడా ఉన్నాడు.బహుశా వీరత్వానికి గుర్తుగా బొమ్మలోకి రాయల్ని లాక్కొచ్చి ఉంటారు - బహుశా own చేసుకున్నట్టున్నారు:-)

    మళ్ళీ రిజర్వేషన్లు లేనిదే బతకలేమని వీరముష్టి యేడుపులు.ఒక కులానికి రిజర్వేషన్లు తెచ్చుకోవటం అనేది ఆ కులంలో ఎంతమంది యెదవలు ఉన్నారో లెక్క తేల్చుకోవటానికి పనికొచ్చే స్థితికి దిగజారింది - నా ఉద్దేశం ప్రకారం రిజర్వేషన్లని రద్దు చేసి యెత్తెయ్యడం బెస్ట్!

    ReplyDelete
    Replies
    1. ఆస్సలు కులాల్నే ఎత్తేస్తే పోలా.......

      Delete
    2. @Chiranjeevi Y
      ఆస్సలు కులాల్నే ఎత్తేస్తే పోలా.......

      hari.S.babu
      కులవృత్తులు పోయినప్పుడే కులాలు సగం పోయినాయి.దిగువ,మధ్య తరగతి వాళ్ళకే కులం పట్ల సెంటిమెంట్లు ఉన్నాయి ఇవ్వాళ.డబ్బున్నవాళ్ళు కులం పట్టించుకోకుండా వెసులుబాటును బట్టి పెళ్ళి చేసుకుంటున్నారు!ఇద్దరు బెజవాడ రౌడీల్లో కమ్మ రౌడీ భార్య కాపు,కాపు రౌడీ భార్య కమ్మ అని విన్నాను, నిజమేనా?రాం చరణ్ భార్య సంగతేమిటి?

      ఆవసరం లేదనిపిస్తే యెవడూ పట్టించుకోవటం లేదు - రాజకెయాలో వోటుబ్యాంకుగా తప్ప ఇవ్వాళ కులానికి పునాది లేదు.

      Delete
    3. ఆ దిగువ, మధ్యతరగతివాళ్ళనే, పైతరగతులవాల్లు తమ పబ్బం గడుపుకోడానికి వాడుకుంటున్నారు. మీరు చెప్పిన హీరోలనే చెప్పమనండి ఈ కులాలు ట్రాష్ అని? ఎప్పుడైన పైన కూర్చున్నవాడు చెబితేనే కిందవాళ్ళకి ఎక్కుతుంది. పూజారులు, పాస్టర్లు, ముల్లాలు, బాబాలు కులనిర్మూలనకి ముందుకొస్తే అది తొందరగా కూకటివేళ్ళతో పెకిలించబడుతుంది. కానీ వాళ్ళకి ఫుడ్డు, గౌరవం రెండూ కులాలే కాబట్టి, చచ్చినా ముందుకు రారు

      Delete
  5. ప్రభుత్వ స్కూల్లల్లో చదివే వాళ్ళకి ఉన్నతచదువులు, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్లలో చదివితే ఉన్న రిజర్వేషన్ పీకెయ్యాలి.

    ReplyDelete

  6. https://m.facebook.com/story.php?story_fbid=10155627257002125&id=681047124

    ReplyDelete
  7. నాకు పద్యాలు చూస్తే మైండ్ ఆగిపోతుంది. చదవటానికి కళ్ళు ఆసక్తి చూపవు. మీరేమో డివి సుబ్బా రావు లా ఉన్నారు. పద్యాలు రాస్తే గాని ప్రామాణికత/టపాకు బరువు వచ్చినట్లు ఉండదనుకొంట్టున్నట్లున్నారు. బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా? అని రాశారు కదా! నేడు రాజకీయ రంగం లో బ్రాహ్మణులకి ప్రాధాన్యత లేదు కదా! వాళ్ళ ప్రాధాన్యత ఉన్నప్పుడు లేనప్పుదు గల తేడాలను రాయండి.

    మీరు భైరప్ప రాసిన "దాటు" నవలనుదివారో లేదో తెలియదు చదివకపోతే వెంటనే చదవండి. స్వాతంత్రం వచ్చిన తరువాత బ్రాహ్మణుల కు,భూస్వామ్య వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు గౌడతో ఉండే సంబంధాలు, సమస్యలు చాలా విసృతంగా రాస్తాడు.


    గత పది రోజులుగా ఊర్లో లేను. కాష్మీర్ కు వెళ్ళాను. పవిత్ర రంజాబ్ మాసం లో హజ్రత్ బాల్ దర్గాలో ప్రార్ధనలు చేసి, అటు పై 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచ్యార్య పర్యటించిన కొండమీది శివాలయం చూసొచ్చాను.

    ReplyDelete
  8. @UG
    బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా? అని రాశారు కదా! నేడు రాజకీయ రంగం లో బ్రాహ్మణులకి ప్రాధాన్యత లేదు కదా! వాళ్ళ ప్రాధాన్యత ఉన్నప్పుడు లేనప్పుదు గల తేడాలను రాయండి.

    hari.S.babu
    పైన అనామక వ్యాఖ్యాత కూడా ఇదే సందేహం లేవనెత్తారు!నేను సమాజం/రాజకీయరంగం గురించి కాదు గదా ఈ టపాని రాసింది,ప్రత్యేకించి 'బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని "హిందూమతం" నిలబడుతుందా?' అని రాసినా ఎలా కన్‌ఫ్యూజ్ అయ్యారు?ఒకరు సమాజం అని అర్ధం చేసుకున్నా మరొకరు రాజకీయరంగం అని అర్ధం చేసుకున్నా అక్కడ హిందివులు,క్రైస్తవులు,మహమ్మదీయులు - అనేక రకాలు ఉంటారు,కదా!కానీ నేను ఆ సమూహాలను గురించి యేమాత్రం ప్రస్తావించకుండా "హిందువులు" అనే ఒక అంతంలోని పరిస్థితి గురించి మాత్రమే కదా ఇక్కడ ప్రస్తావిస్తున్నది?
    ఇవ్వాళ అందరూ హిందూమతం మీద దాడి జరుగుతున్నది,హిందువులు ఐక్యం కావాలి అని అంటున్నారు కదా!కొందరు హిందువులు వూరికే బీజేపీ అనే పార్టీకి వోటు వేసి ఆ పార్టీని అధికారంలో ఉంచితే చాలు హిందుఇవులు గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోవచ్చు అని కూడా అంటున్నారు,అది శాశ్వత పరిష్కారమా?కాదు!నిజమైన పరిష్కారం హిందువులలోని అన్ని కులాల వాళ్ళూ అరమరికలు లేకుండా కలిసిపోవాలి, అవునా?మరి బ్రాహ్మణులు అధికారికంగా రాసిన మతధర్మశాస్త్రాలలో బ్రాహ్మణేతర కులాల్ని అవమానించిన దాఖలాలు ఉన్న్నంతకాలం బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుల్ని అభిమానించటం ఎట్లా సాధ్యం?అదీ యేదో మాకు దానం చేస్తే పుణ్యం వస్తుంది అనే మామూలు రకం ఆధిపత్యం అయితే క్షమించవచ్చు - ఇతర కులాలన్నీ మా వీర్యం నుంచే పుట్టాయి అనే బూతుని కూడా భరించాలా?ఇక అస్పృశ్యతకి సంబంధించి బ్రాహ్మణులకి కర్తృత్వం అంటగడుతున్నది 20వ శతాబ్దంలోని వాళ్ళు కాదు మూడుసార్లు కాశీయాత్ర చేసి ఆత్మయోగ సాధన చేసి కపాలమోక్షం లాంటి యోగప్రక్రియతో జీవన్ముక్తులైన ఏనుగుల వీరాస్వామయ్య గారు 18వ శతాబ్దం నాటి వాడు!

    ఇంత సూటిగా డిగాను!బ్రాహ్మణుల వల్ల జరిగిన మంచినీ చెప్పాను!మంచికి పొగడ్తలు నదుకోవటం తప్ప చెదుకి బాధ్యత వహించరా?religious demography గురించి నేను కట్టుకధలు చెప్పడం లేదు.వాటికన్ పని యేమిటో తెలుసా!నెలకీ మూణ్ణెల్లకీ యేడాదికీ ఆ మతస్థుల statistics తెప్పించుకుని మతం పేరుగుదలని అంచనా వేసుకోవటం,మతం యెదుగుదలకి తగిన చర్యలు తీసుకోవటం.ఆ వాటికన్ అధికారికంగా చేతులెత్తేసింది,"బాస్!మనం వెనకబడిపోయాం,ఇస్లాం ముందుకెళ్తున్నది!" అని.

    పద్యాలు అర్ధం కాకపోయినా ఫరవాలేదు,హిందూమతం ప్రమాదం నుంచి బయటపడాలంటే చొరవ చూపించాల్సింది బ్రాహ్మణులే అన్న వాస్తవం అర్ధమయితే చాలు!

    ReplyDelete
    Replies
    1. డివి సుబ్బారావు, పద్యాల విషయం దగ్గర నేను స్మైలి పెట్టటం మరచిపోయాను. అది సరదాగా రాసింది.

      ఇక బ్రాహ్మణుల పై మీరుచేసిన విమర్శ/సూటిగా అడిగిన ప్రశ్నలకు నా సమాధనం ఎమిటంటే, మీరు చదివినన్ని పుస్తకాలు నేను చదవలేదు. మీ ఇంపుట్స్ తెలుగు పుస్తకాలు ఆధారం చేసుకొని ఉన్నాయి. తమిళ్,కన్నడ ఇతర భాషలలో కూడా ఇంకా ఉంటే ఉండవచ్చు. వీటినన్నిటిని క్రోడికరించి ఎదైనా ఒక శంకరాచ్యార్యనో / ఇతర మఠాల / సమకాలిన సమాజం తో పాటు హిందూ మతం,గ్రంథాలపై అవగాహన ఉన్న రాజీవ్ మళొత్ర.Dr. Swamy,Gurumurti లేక ఇంకెవరైనా హిందూ మతాభిమానం గల (రాణి శివశంకర శర్మ వంటివాడు కాకుండా:)) మంచి స్కాలర్ లను అడిగి అభిప్రాయం తీసుకొంటే దానికి అథేంటిసిటి ఉంట్టుందని నా అభిప్రాయం.
      నా అభిప్రాయం మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు.

      Delete
  9. పరశురాముడి క్షత్రియసంహారం తర్వాతి రాజుల వంశాల గురించి తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రాసారు వారి "అందరూ ఒకప్పుడు బ్రాహ్మణులే" అనే పుస్తకంలో. మీకు ఆసక్తి ఉంటే కింది లింక్‍లో వారి అభిప్రాయం చదవండి.

    https://archive.org/details/AllWereBrahminsOnceUponATimetelugu

    ReplyDelete
    Replies
    1. Thanks for sharing this link Chaitanya gaaru. While searching in google, found very useful information written by తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు

      పదనిష్పాదన కళ - The Joy of Coining New Words

      http://patrika.kinige.com/?tag=tadepalli-lalitha-bala-subrahmanyam

      Delete
    2. మత, సాహిత్య, తర్కాది సైద్ధాంతిక విద్య సంస్కార సాధనకూ, మేధాక్రీడలకే తప్ప సంపదసృష్టికి ఉపకరించదు. అయినా ప్రాచీన బ్రాహ్మణులు అవే నేర్చుకొని రాజుల్నీ, జమీందార్లనీ మెప్పించి వాటితో వారికి రసవంతమైన కాలక్షేపాన్ని కలిగిస్తూ జీవితాన్ని గడుపుకునేవారు. ఇలాంటి రాజాశ్రయం బ్రాహ్మణులందఱికీ లభించేది కాదు. ఎందుకంటే రాజులూ, జమీందార్లూ కేవలం విద్యనే కాక అనేక ఇతరేతర విషయాల్ని కూడా పరీక్షించేవారు. ఉదాహరణకి - స్త్రీల పట్ల వారి ప్రవర్తన, విశ్వాసపాత్రత ఇత్యాది. రాజధానులు ప్రజలకు సుదూరంగా ఉన్నప్పటికీ, సామంత రాజ్యాలవంటి జమీందారీలు మాత్రం ప్రతిజిల్లాలోనూ 5 -10 - 20 చొప్పున ఉండేవి. కనుక వాటిల్లో పండితోద్యోగాల కోసం బ్రాహ్మణులు వెళుతూండేవారు. రాజులూ, జమీందార్లూ పోషించాల్సినవాళ్ళ జనాభా రకరకాలుగా ఉండేది. కేవలం సైద్ధాంతిక విద్యలవాళ్ళనే కాక, కళాకారుల్నీ, వివిధ వృత్తికారుల్నీ కూడా పోషిస్తూండేవారు. ఒక రాజుకు ఒకఱిద్దఱు కవుల కంటే అవసరం లేదు. అలాగే అతనికి ఒకఱిద్దఱు జ్యోతిష్కుల కంటే ఎక్కువ అవసరం లేదు. కనుక, తమ జనాభాతో పోల్చుకున్నప్పుడు ఈ సైద్ధాంతికవిద్య మార్గంలో బ్రాహ్మణులకు దక్కగల ఉద్యోగాలు అత్యంత స్వల్పంగా ఉండేవి.

      కానీ ఆచరణలో ఏం జఱిగేదంటే - ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒకఱికి ఒక రాజు దగ్గఱ ఉద్యోగం లభించి అతనికి అక్కడ జీతమూ, ఇల్లూ, వాహనమూ ఇత్యాది వసతులు ఏర్పడితే అది ఆ చుట్టుపక్కల కనీసం ఒక వంద బ్రాహ్మణ కుటుంబాల మనసుల్లో ఆశాజ్యోతుల్ని వెలిగించేది. వారంతా ఆ "జమీందారీ శాస్త్రి" ని ఆదర్శంగా చూపించి అతనిలా "బాఘా" చదువుకుని రాజాశ్రయాన్ని పొందాల్సిందిగా తమ తమ మగబిడ్డల్ని తొందఱపెట్టేవారు. అలా ఒకఱి స్ఫూర్తితో డజన్ల కొద్దీ పండితులు తయారయ్యేవారు. కానీ వారందఱికీ రాజాశ్రయం లభించేది కాదు. వారిలో ఎక్కువమంది స్థానికంగా తమ ఊళ్ళోనే పురోహితులుగా, పూజారులుగా, జ్యోతిష్కులుగా, బడిపంతుళ్ళుగా, సన్నకాఱు రైతులుగా మిగిలిపోయేవారు. దానిక్కూడా గతిలేనివారు దుర్భర దారిద్ర్యంతో అలమటిస్తూండేవారు. సైద్ధాంతిక విద్య సంపదను సృష్టించడానికి ఉపయోగపడదనే వాస్తవాన్ని గ్రహించలేక, "లక్ష్మీసరస్వతులకు పడదనీ, అత్తా-కోడళ్ళ వైరం" అనీ తమ మనోభావనా ప్రపంచానికి అనుగుణమైన ఊహలు చేసుకుని సమాధానపడేవారు. "దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ" అని స్తోత్రాలు చదువుకుని శాంతించేవారు.

      "మన సైద్ధాంతిక విద్యని చూసి ఎవఱో భాగ్యవంతుడు తబ్బిబ్బయిపోవాలి. అలా ఎవఱో మనల్ని ఆదరించి చేఱదీసి మెచ్చుకుని పోషించాలి" అనే ఈ భావన బ్రాహ్మణుల్లో ఎంత బలంగా, ఎంత విస్తారంగా నాటుకు పోయిందంటే, ఇప్పటికీ బ్రాహ్మణులంతా అదే భావనలో బ్రతుకుతున్నారు. ఈ ఫిలాసఫీ విషయంలో వెయ్యేళ్ళనాటి అగ్రహారీక పిలకబ్రాహ్మణుడికీ, 21 వ శతాబ్దపు గేటెడ్ కమ్యూనిటీ car-owner cum softwarist బ్రాహ్మణుడికీ ఒక్కపిసరు కూడా తేడా లేదు, మీరు జాగ్రత్తగా గమనిస్తే ! ఎటొచ్చీ జ్యోతిష్యం, వ్యాకరణం, అలంకారశాస్త్రం, తర్కం స్థానంలో MBA, software, Engineering వచ్చాయంతే ! రాజులూ, జమీందార్ల బదులు MNC లు వచ్చాయి. అప్పుడు కావ్యాల్ని అంకితమిస్తే ఇప్పుడు జీవితాల్నే అంకితమిస్తున్నారు. అప్పుడు సంస్కృతమైతే ఇప్పుడు ఇంగ్లీషు. ఆ రోజుల్లో వలసలు పక్కరాజ్యానికైతే ఈ రోజులో సప్తసముద్రాల అవతలికి ! ఏతావతా బ్రాహ్మణ జీవన విధానం, జీవన వేదాంతం, సమాజంలో వాళ్ళ పాత్ర మటుకూ ర్యాడికల్ గా ఏమీ మారలేదు. ప్రాథమికంగా ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక్క తేడా మాత్రం ఉంది. ఆ రోజుల్లో సైద్ధాంతిక విద్య కోసం బ్రాహ్మణులు మాత్రమే ఎగబడేవారు. ఇప్పుడు అందఱూ ఎగబడుతున్నారు

      https://www.facebook.com/Taadepalli/posts/10151351195464131

      Narasimha Murthy కాల చక్రం ఒకప్పుడు ఒకడు సాధించుకు తిన్నాడు..... ఇప్పుడు వాన్ని వీడు సాధిస్తున్నాడు.

      January 17, 2013 at 3:01pm ·

      బ్రాహ్మణాధిపత్యం అని జఱుగుతున్న ప్రచారం : దాని అసలుస్వరూపం

      https://www.facebook.com/Taadepalli/posts/503235213060415

      తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం అది వాస్తవం కాదు. బ్రాహ్మణులెవఱైనా ఎక్కడైనా, ఎప్పుడైనా శాంతులూ, సౌమ్యులూ, అహింసాపరులూ, ఒకఱి జోలికీ, శొంఠికీ పోనివాళ్ళూ. నా పరిశీలనలో ఈ బ్రాహ్మణుల పేదఱికం అనాదిగా వస్తోంది. ఇది కొత్త పరిణామం కాదు. కానీ వారి మీద దుష్ప్రచారమే కొత్త పరిణామం.

      Delete
    3. @UG SriRam30 June 2017 at 02:44
      మత, సాహిత్య, తర్కాది సైద్ధాంతిక విద్య సంస్కార సాధనకూ, మేధాక్రీడలకే తప్ప.........

      hari.S.babu
      very good anlysis!But I differ with spiritual knowledge is unproductive.see waht modern psychiatry is doing!Mostly psychiatry is just like councelling.One person might hada a guilt.That guilt is making him sick.If the psychiatrist can put the word "You are not guilty. Don't kill yourself" into the mind of the patient,then only the patient will be cured - religion and Its practices like prayer in normal times,making a parihaara pooja at times of conflict are also effective in the same way of psychiatric solutions!

      Delete
    4. UG SriRam,

      తెలుగు బ్లాగుల్లో తాడేపల్లి గారి గురించి, వారి రచనలు గురించి తెలియనివారు తక్కువమంది. తెలుగు బ్లాగ్లోకంలో మీరు ప్రవేశించేనాటికి వారు నిష్క్రమించారనుకుంటాను. వారి పదనిష్పాదన కళ కినిగె పత్రికలో వచ్చింది. అంతక ముందే తెలుగుపదం గూగుల్ గుంపులో ఆయన చాలా పదాలు ప్రతిపాదించారు.

      Delete
    5. Pls read this article also.

      Disagreeing with Gurazada fanatics

      https://ia600304.us.archive.org/7/items/GurazadaDoesNotDeserveOurRespect/DisagreeingWithGurazadaFanatics-10.pdf

      Delete
    6. Oh!! copy pasting again.... ufffff......

      Delete
    7. Pandit exodus deprived Kashmir of quality education: Mehbooba

      Srinagar, Feb 18: Chief Minister Mehbooba Mufti on Saturday said the quality of education in Kashmir was severely affected due to the exodus of the Pandit community from the valley.

      Mehbooba said since Pandits have been great teachers, following their exodus from the Valley, Jammu region get benefitted. “This is the reason that today we are witnessing quality education in Jammu region flourishing while it is a Herculean task to put it back on track here in Kashmir,” the Chief Minister said.

      “I have been taught by a Pandit teacher like most of the people of our generation. I can tell you with certainty that Pandits are really great teachers and it is their contribution to the state that it has renowned medicos, academicians and people who have proved their mettle in their respective fields,” Chief Minister stated


      http://dailykashmirimages.com/Details/132026/pandit-exodus-deprived-kashmir-of-quality-education-mehbooba

      Delete
    8. Temple priest beaten to death because he couldn't officiate wedding of a feudal family as he was overbooked. Brahmins often among the poorest in most villages & yet projected as being exploitative elite.

      Last week, The News Minute was apprised of an incident of the brutal death of a Brahmin priest in Thanjavur in June. Caste-based violence against Dalits is a regular occurrence in Tamil Nadu, but as this incident illustrates, economically weaker sections of ‘upper-castes’ like Brahmins are also not safe from the violent outbursts of the powerful intermediate-castes, whatever the reason for the outbursts may be.

      Most political parties, including DMK, Tamil Manila Congress, ADMK and PMK have united in their appeal for the bail for the accused. On the other hand, there was no one to take care of the victim. The aged father had to pay for the medical expenses, post mortem and cremation.

      http://www.thenewsminute.com/article/temple-priest-bludgeoned-death-tamil-nadu-allegedly-refusing-conduct-wedding-ceremony-31920

      Delete
    9. Brahmins will be thrown out of UP like Kashmiri Pandits: Samajwadi Party leader

      http://zeenews.india.com/news/uttar-pradesh/up-belongs-to-yadavs-muslims-brahmins-should-go-to-modis-ahmedabad-samajwadi-party-leader_1916738.html

      Brahmins under attack in UP by SP goons(Yadavs) ,dragged out of house, misbehaved with women

      http://rightactions.in/2016/08/06/brahmins-under-attack-in-up-by-sp-goonsyadavs-dragged-out-of-house-misbehaved-with-women/
      They are all from the same caste. They are all Yadavs and they control everything here," said his wife, Annadevi, 40. "They have left me with nothing and my children with no father. We are just poor people."

      Villagers say the gruesome attack was a "warning" not to challenge the Yadav caste, the local land-owning elite.

      "Suresh had argued with some Yadavs before a wedding in our village. That is why they killed him," said Pandey's elder brother, Ashwani. "We are being told not to fight back."

      Pandey was a Brahmin, traditionally placed at the top of India's society and revered as priests and teachers. His alleged killers are Yadavs, once cow farmers, whose land holdings and cohesive ethnic identity have today made them politically powerful.

      https://www.theguardian.com/world/2005/jun/14/india.randeepramesh1

      Delete
    10. ముసలి పూజారిని మొహం వాచేటట్లు చేయి విరిగేటట్లు కొట్టారు

      Six held for attacks on Brahmins in Chennai

      https://www.youtube.com/watch?v=xe476GyvIS0

      Recent attacks on Brahmins senseless and rooted in Periyar’s iconoclasm

      Today, Tamil Brahmins are politically non-existent, and far less socially powerful than the OBCs who dominate politics and industry. There are some rich Brahmin businessmen, but the community at large remains toothless. Why do Dravidian parties still indulge in this pointless rhetoric and violence against the Brahmins then? As Ganapathy, the journalist who was attacked by DK members 25 years back told me, these are cheap stunts to gain publicity. This is the Draviadian ideologue’s default defence on a weak wicket. What the fringe elements are indulging in today is rooted in Periyar’s legacy, but is pointless and a sign of an ideology gasping for breath on its deathbed.

      http://www.thenewsminute.com/article/recent-attacks-brahmins-senseless-and-rooted-periyar%25E2%2580%2599s-iconoclasm

      Delete
    11. భావి హిందూ మతవ్యవస్థ : ఒక ప్రతిపాదన

      http://dharmasthalam.blogspot.in/2012/02/blog-post_18.html

      Delete
    12. కుల వ్యవస్థ వందల సంవత్సరాలుగా ఉన్నా బ్రాహ్మణులపై గత వందేళ్ళుగా తీవ్రమైన వ్యతిరేకతకు ప్రధాన కారణం దేశ స్వాతంత్రపోరాటంలో ప్రధాన పాత్ర వహించటమే.సమాజం లో మొదటి నుంచి గురువులుగా ఉండటం వలన వాళ్ళి చురుకైన పాత్ర పోషించారు. తెల్లవారి పాలనలో ప్రజలు చస్తూంటే, గురువులు గా ఉంట్టూ ఉపన్యాసాలు ఇస్తే, అది మేధోపతనం. బ్రిటిస్ తలారులు ఉరితీసిన 148 మందిలో సగం మంది బ్రాహ్మణులే. అండమాన్ జైల్లో నరకయాతన అనుభవించిన 500 మంది స్వాతంత్ర పోరాటయోధుల్లో సగానికి సగంవారే. అయితే వాళ్లపై ఇంత దుష్ప్రచారానికి ఒక కారణం అప్పటివరకు బ్రిటిషోడికి సేవ చేసిన జమీందార్లు, భూస్వామ్యులు, చిన్న సైజు రాజులు సౌత్ లో జస్టిస్ పార్టి (ద్రవిడ ఉద్యమం), నార్త్ లో ముస్లీం లీగ్ వీళ్ల కందరికి ఒకవేళ దేశ స్వాతంత్రం వస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంట్టుందో అని తెలియక , స్వాతంత్రం వచ్చినతరువాత వాళ్ళ ప్రాముఖ్యతని కొనసాగించటానికి వాళ్ళ ఎత్తులు వారు వేసుకొన్నారు. భుస్వామ్య వర్గాల దగ్గర, జమీందార్ల చేతిలో డబ్బులున్నాయి కనుక స్కూల్స్, కాలేజిలు పెట్టి, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం సాకుతో ప్రొగ్రెసివ్ అయినట్లు ప్రొజెక్ట్ చేసుకొన్నారు. పాపం, వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఈ భుస్వామ్య వర్గాల వారికి స్వాతం త్రోద్యమ సమయంలోనే కుల వ్యవస్థ లో లోపాలు, దళితులు పడే కష్టాలు, బ్రాహ్మణ ఆధిక్యత కనిపించింది :) మరి దళితులపై,పేదలపై అంత ప్రేమే ఉంటే భూసంస్కరణలకు మద్దతు తెలుపలేదే?

      Delete

    13. http://naprapamcham.blogspot.in/2008/07/blog-post_09.html

      July 9, 2008 at 12:58 PM

      innaiah said...

      Justice Party was started in Madras by Zamindars and anti brahmin movement leaders in 1916. Andhra was under composite Madras. Several zamindars and land lords joined the party like: Bobbila Raja, Challapalli raja, Muktyala Raja, Nuzvid Zamindar, Panagal Rara,Pithapuram raja etc. Persons like kuppuswami choudary, kattamanchi Ramalingareddi, Tripuraneni Ramaswami joined.
      The party was not founded by the Britishers but the party supported the British rule in India. They opposed Congress.
      Only people who pay tax are voters and they are very limited in those days.
      Justice Party was in power for 20 years. They started several schools in Andhra and Madras. They also founded Andhra University with Kattamanchi Ramalinga reddi as first vice chancellor.
      Mr K V Reddi Naidu, Mr K V Gopalaswami, Bezwada Ramachandra reddi were in the party.
      They did lot of literary service and published first Telugu encyclopedia dictionary from Pithapuram as surya raya andhra nighantuvu in 6 volumes.
      Justice party was routed in elections held in 1937 and the party ended. Several persons later defected to Congress party.
      Periyar Ramaswami Naikar in Madras played vital role in the party.

      Delete
    14. Having tread the road to economic power, the Kammas very soon use their new-found clout to dominate the statea™s polity.

      The Congress could not be their vehicle for political power as it was dominated by the Reddys and Brahmins, who were traditionally hostile to the Kammas.

      సంపన్న కమ్మ వాళ్ళు స్వాతంత్ర పోరాటం లో పాల్గొనలేదు.

      While the poor Kammas took part in the freedom struggle, the rich members stayed away. Their first experiment was the formation of Justice Party. When this failed to click, they floated the Swatantra Party. As these parti As these parties did not help them in securing enough space in the political arena, they started infiltrating the Communist Parties. The cream of the Left parties comprises the Kammas. Former Prime Minister, late Indira Gandhia™s move to implement land reforms in the state annoyed the Kammas. The richer members of the community felt particularly threatened as they had to part with their land holdings. It was at this point that N T Rama Rao emerged at the scene in the eighties by floating the Telugu Desam Party. He successfully tapped the resentment among the OBCs and SCs at their perceived neglect by the Congress. The rest, as they say, is history

      Read more at:
      http://economictimes.indiatimes.com/articleshow/538323.cms

      Delete
    15. Let us not forget that Nampoodripad had once called M Gandhi a ‘Hindu fundamentalist’ and his (Gandhi’s) position on caste and Dalits were truly of a Hindu fundamentalist (his Ram Rajya vision was nothing different from any other Hindu fundamentalist).

      Delete
    16. పెరియార్ గురించి ఈ మూడు భాగాలు చదవండి. కొత్త విషయాలు తెలుస్తాయి.

      http://telugu.greatandhra.com/mbs/june2011/tamil_part1.php

      http://telugu.greatandhra.com/mbs/june2011/tamil_part2.php

      http://telugu.greatandhra.com/mbs/june2011/tamil_part3.php

      Delete
    17. తమిళుల కల్పనాచాతుర్యం చాలా ఘొప్పది:-)
      పెరియార్ నాస్తికుడైనందుకు చెప్పిన పిట్టకధని ఈయన భలే యేకేశాడు.శివాజీ గణేశన్ గురించి చెప్పినది మరీ అద్భుతః

      తమిళం అసంస్కృతం కన్న ప్రాచీనభాసహ అట!క్రినద్టి తరం తెలుగు జర్నలిష్టు భలే జోకు లేస్తాడు ఈ తమిళుల ప్రాచీన భాష క్లెయిం మీద.మచ్చుకి ఒకటి,"జననె సంస్కృత భాసహ అన్నారు కాని,జననేఎ తమిళ భాష అని యెవరూ అనలేదు!" అనేది చదువుతుంటే నాకు రావు గోపాల్రావు గుర్తొచ్చాడు.తమిళంలో కూసిన్ని అచ్చరాలే ఉన్నాయేంట్రా అని హాచ్చెర్యం పోయేవాణ్ణి,అది పెరియార్ పుణ్యం అన్నమాట - ఉన్నవే పీకేసారు!

      Delete
    18. Meeting Of EVR, Ambedkar and Jinnah on January 8, 1940
      The historic meeting of the three leaders took place at Bombay on January 8, 1940. The leaders must have either corresponded with each other directly or indirectly or their friends arranged such meeting as explained above. On January 5th morning, EVR left for Bombay along with the following at the invitation of the non-Brahmin citizens of Bombay:

      Justice T. A. V. Nathan,

      P. Balasubramaniam – Editor of Sunday observer, the mouth piece of Justice Party,
      C. A. Annadurai, the General Secretary of Justice Party and

      T. P. S. Ponnappan. C. Panjatcharam

      He was sent off by Kumararaja Muthaiah Chettiar, General Kalifullah and others

      They discussed about the working of anti-Congress parties.

      It is said that they had also discussed about –

      1. The possibility of creating a non-Brahmin opposition group within Congress.

      2. Urging Muslims, Scheduled Caste and non-Brahmins to leave Congress and join non-Congress parties.
      3. Joint action by parties opposed to Congress.
      4. Anti-Hindi agitation.
      5. Embarrassing Congress and Congress leaders by all means.
      6. Muslims, non-Brahmins and depressed classes working together.
      7. Demand of separate states for Mahars, Muslims and Dravidians.
      8. Representing to British Government accordingly.

      Accordingly, they agreed for the following:

      1. Jinnah and Ambedkar would tour Tamil districts for a month in April or May 1940 and support the demand for Dravidanad (as announced by A. Ponnambalam).

      2. EVR was again invited to visit Bombay.
      3. EVR and his followers support for the Muslim cause and work together.

      4. Ambedkar also would support the Muslim cause.
      5. All would create more problems for Congress.
      6. Make representations to the British to that effect that power should not be vested with Congress alone.

      it is evident that their meeting has played a crucial role in the Indian politics. It may be noted that within three months, the resolution for the demand of Pakistan (see Appendix.I) was passed by Jinnah on March 25, 1940 at Lahore session of AIML and within seven months Dravidastan by EVR on August, 1940 at Thiruvarur.

      After the passing of Lahore resolution, the relationship between the Justice Party and Muslim League became more intimate. At a joint meeting of Justice Party and Muslim League at Madurai in March 1940, a proposal was made to seek the help of Jinnah for the creation of Dravidastan and Jinnah assured EVR to that effect. In fact, both continued to have good relations.

      Jinnah propounded three nations – Hindustan, Pakistan and Dravidastan for Hindus, Muslims and Dravidians, as if Hindus and Dravidians are different forgetting or ignoring Mahars and other scheduled castes who supported him. In fact, he only argued and worked for Muslims in his attempts with the British based on his two-nation theory. He never popularized the three-nation theory (as mentioned above) or four-nation theory (the fourth one for Scheduled castes)!

      Delete
    19. Sudden Change Noticed in the Attitude of Jinnah Towards EVR: Though EVR had been moving with Muslim League and Muslims very closely showing benevolent gestures, there was sudden somersault in Jinnah’s response towards EVR. He wrote to Jinnah to take up the issue of Dravidastan along with Pakistan on August 9, 1944 (see Appendix. II). But, Jinnah categorically replied on August 17, 1944 that he always desired that the non-Brahmins of Madras to establish their Dravidastan, but as EVR’s activities were indecisive, he could not speak for non-Muslims.

      Annadurai used to assert that both Dravidians and Muslims belong to the same race different from that of Hindus / Aryans. As he was also present during the historical meeting of the three, his assertions are quoted appropriately

      They are Aryans – we Dravidians. The same research only proved that Muslims are Dravidians with Islamic path. Therefore, the Dravida-Islamic confederation has arisen”.

      “English and Aryans belong to the same race! Race joins with race! Dravidians and Muslims belong to the same race, thus, the same race joins with the same race! “

      “Periyar has categorically declared during Coimbatore Conference that Dravidians may live (under the rule of Muslims) in Pakistan, but not with Aryans! Yes, it is fact! Periyar has told like that only, (because) he has brought out the fact that the same race joins with the same race!”.

      Delete


    20. తమిళుల చతురుత మంకుత
      నము మన కెట్లొచ్చునమ్మ నాస్తికు లనుచున్
      తమ తమ యిండ్లన దేవు
      ళ్ళ ముదముగ నిలిపి డియెంకె లవలవ యనెనౌ :)

      జిలేబి

      Delete
    21. Similarities Noted Among the Three: The three different personalities from three different parts of India representing their respective ideologies had some common qualities and characters, which perhaps brought them together to forge a common alliance. They are identified and discussed as follows:

      1. Highly Ambitious
      2. Projecting to be a Saviour of a Particular Community
      3. Pro-Communist Ideology: Definitely, all the three were influenced by the Communist ideology. While EVR had gone to the extent of becoming a citizen of Russia, Jinnah used it for his “two nation theory” and Ambedkar for separate electorates. All three were believers of nations forming based on race, religion, language, and so on
      4. Congressmen: Surprisingly, all started their political career with congress. Though they tried their best to beat Gandhi with communal and casteist sticks, they could not overtake him. They used to dub Congress as “Brahmanical Party”, Hindu Party” and so on.

      5. Pro-minority (later changed to pro-Muslim): Expecting support from the Muslims, both EVR and Ambedkar tried to strike deal with them. Both supported the “Day of Deliverance”. However, Ambedkar understood their communal gameplan and wrote against them, though supported for the creation of separate state for Muslims. EVR simply supported Muslims without making any analysis of their psyche like Ambedkar. He celebrated Muslim festivals condemning and blaspheming Hindu festivals. He compared Brahmins with Jews to exploit the feelings of Muslims tactfully

      6. Opposition to Congress and Gandhi

      Anti-Hindu Ideology and Writings: Their writings exhibit totally anti-Hindu. Though, Jinnah was a Muslim, he had some restriction, but Ambedkar and EVR were virulent in their writings against Hinduism. The small difference between them is that the former excelled in writings and the latter in his speeches, which inturn were published as his works.
      . Opposition Within Their Groups / Community / Religion: As Jinnah was a Shia and that too exhibiting secular traits ulema dubbed him as a kafir. Mufti Kifayatullah considered him as a kafir, though later included him in the Muslim quam. Perhaps, the opposition of ulema to him and AIUML made him more persistent to achieve Pakistan proving himself a true Muslim! EVR, though legally was a Hindu, advocated anti-Hinduism. Even the leaders of Justice Party did care his atheism, as their sessions started with singing of Tevaram etc. Ambedkar had to face opposition, when he married a Brahmin lady second time when he was 56, just like, when EVR married Maniammai. Though, Ambedkar was an anti-Hindu ideologist, when his first wife Ramabai, died, he performed last rites with a Hindu priest tonsuring his head! Thus, the critiques point out their contradictions

      https://indianhistoriography.wordpress.com/2009/07/27/the-historic-meeting-of-ambedkar-jinnah-and-periyar/

      Delete
  10. శ్రీరామ్ గారు "నాకు పద్యాలు చూస్తే మైండ్ ఆగిపోతుంది. చదవటానికి కళ్ళు ఆసక్తి చూపవు." అన్నారు. మైండ్ చెదరగొట్టే పద్యాలతో కొన్నాళ్ళుగా మాలిక రణరంగంలా మారిందనటంలో అతిశయోక్తి లేదు. కాని పద్యాలంటే వాటంతట అవి భూతాలవంటివి కావండి. అందమైన పద్యాలకు తెలుగుసాహిత్యం పుట్టినిల్లే. కనీసం అవైనా మీకు ఆహ్లాదాన్నిస్తాయని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies


    1. మైండు "చెదల" గొట్టె పదపు
      సౌండుల పంచదశలోక సామ్రాజ్ఞిగదా !
      బెండులు తీయగ భయపడి
      గుండులు తడిమిరి జనులట గురువుల పలుకుల్ :)

      జిలేబి

      Delete
  11. అసలు కమ్మ వెలెమ మద్య పోలిక ఏదో వున్నట్టు వుంది ... సూరినేని చాలా ంఅంది కమ్మ వాడి ఇంటిపేరు

    ReplyDelete
    Replies
    1. మీరు పొరపడుతున్నారు."సూరపనేని" అనే ఇంటిపేరు కమ్మవారిలో ఉన్నట్టు చూచాయగా తెలుసు.నా ఇంటిపేరు "సూరానేని" అండీ!

      Delete
  12. From Dr. babasaheb ambedkar writings and speeches VOl9
    PAGE NO 167

    “Fight for Freedom” has been carried on mostly by the Hindus. It is only once that the Musalmans took part in it and that was during the shortlived Khilafat agitation. They soon got out of it. The other communities, particularly the Untouchables, never took part in it. A few stray individuals may have joined it for personal gain. But the community as such has stood out. This was particularly noticeable in the last campaign of the “Fight for Freedom,” which followed the ‘Quit India’ resolution passed by the Congress in August 1942

    ReplyDelete
    Replies

    1. దేశ స్వాతంత్ర పోరాటంలో సిపాయీల తిరుగుబాటు తరువాత పోరాటంలో పాల్గొనకుండా, చివరి నిముషంలో వచ్చి (బ్రిటిషోడు స్వాతంత్రం ఇవ్వబోతున్నాడని తెలిసిన తరువాత)మేము చాలా త్యాగాలు చేశాము అని ప్రాపగండా చేసుకొని పాకిస్థాన్ తీసుకొన్నారని హసన్ నిసార్ కూడా చెప్తున్నాడు.

      1. Hassan Nisar On Partition (3 min)

      https://www.youtube.com/watch?v=J9ZQrnSsoiM

      2. History of Pakistan Hassan Nisar
      (17:00- 20:00 min00)
      https://www.youtube.com/watch?v=mq-CIGxkcNM&t=1182s

      https://www.youtube.com/watch?v=OICjB9bNasU

      Delete
    2. 1857 rebellion was not a failure.... It was a big success. British Army was kicked out of India and they were afraid of coming back due to wide-spread rebelion in British Indian Army. But, after kicking the Brits out, big question started to haunt: who will fill the vacuum of power? Big old Kings, Rajpoots, nababs, landlords were favouring Mughal King Bahadurshah and old feudal system of governance. But, the real fighters in that war were Hindu Brahmins upper caste, who were sepoy in British Army. They wanted a french revolution kind of democratic system. After announcement of Mughal King as ruler, these real fighters refused to accept it. When these discussions were going on, mughals spread the rumor that emperor has written a letter to King of Iran for help and Irani Army has been dispatched towards Delhi.. This was a very big rumor and spread very quickly in whole of Delhi. This rumor refreshed the atrocities commuted by "Nadirshah" and "Abdali". (However, it was not possible coz Persia became very weak in 1857 due to Anglo-Persian war). Later, to frighten n silence his opponents, Mughal officials confirmed this rumor as true in a big assembly of common people held in Chandni Chowk, Delhi. It created the major panic among commoners specially among hindus. Trust of people on muslim mughal leadership was borken. Hindus Brahmin army sepoy thought that living under the rule of British is far better than these illitrate religious bigots.... Immediately some Hindus went to kolkatta and persued British Army to return from Singapore/Hongkong. Brtishers got new opportunity and support. By that time Bahadur Shah was announced as King and all the muslim Nawabs kept on supporting him in their religious zeal. Hindus separated themselves from all of this fanfare and started supporting British directly/indirectly (these were the same hindus, Who fought and kicked Brits a couple of months back). Brits came back and first task they did was to finish Mughal blood line, so that no mughal could claim Delhi again ever. After reestablishing Brit rule, first census was done and it was confirmed that Hindus are in majority and they wanted democratic system of governance, while muslims wanted autocratic feudal security state. Both got what they wanted after 1947. "This sequence of events of 1857" has been discretely mentioned by Jawahar Lal Nehru in his book "Discovery of India" but, hidden by later historians in their zeal to maintain hindu-muslim unity.

      At that time it was decided that British will leave India after installing an effective system of governance. But, the fundamental differences between hindus and muslims couldn't be sorted out. Muslims were adamant to feudal system of governance, while hindus wanted democratic system. This delayed the Indian independence by 90 long years. Britishers took full advantage of these differences and even encouraged it further. Many people think that Congress suddenly agreed to partition of India for power in 1946. It was not true. In fact Nehru/Patel/Gandhi knew this history very well. They thought if they didn't accept it now(when Brits were very weak after WW-II) , Brits may stay here and consolidated their control after gaining the strength and support from other European/US. Decision was taken to make a model state with democratic system, so that common Indian muslims may find the merit in it and agree to merge after few years.

      Delete
    3. తెలుగు ప్రింట్ మీడీయా లోని మేధావులు రాసే వ్యాసాలలో బ్రాహ్మణిజం విమర్సిస్తూ, శత్రువుగా చూస్తూ లెక్క లేనన్ని వ్యాసాలు రాసేవారు. యస్.సి,యస్.టి,దళిత,క్రైస్తవ, ముస్లీం మైనారిటిలు ఒకతాటి పైకి వచ్చి బహుజనులు అధికారాన్ని చేపట్టాలని ప్రచారం చేసుకొంట్టుంటారు. చిన్నప్పటి నుంచి సోషల్ మీడీయా వచ్చే వరకు వీళ్ళ ట్రేండ్ అప్రహతిగతంగా కొనసాగింది. అసలికి ఈ బ్రాహ్మణిజం/బ్రాహ్మణులు ముస్లిం లకు,క్రైస్తవులకు చేసిన అన్యాయమేమిటి? అవి వేరే మతాలు కదా? వందల ఏళ్ళు రాజ్యాలను పాలించాయి. లక్షల కోట్ల ఆస్థులు ఉన్నాయి. వాళ్ళ మత వ్యవహారాలలో బ్రాహ్మణులు ఎప్పుడైనా జోక్యం చేసుకొన్నారా? (నేడు బిజెపి కి ఎలా హిందుత్వ వాద పార్టి అని పేరుందో, దేశ స్వాతంత్ర సమయం లో గాంధికి, కాంగ్రెస్ పార్టి కి హిందువుల పార్టి అని పేరుండేది. ఆ స్థానాన్ని ఇప్పుడు బిజెపి పార్టి ఆక్రమించింది)

      నాటి హిందూ కాంగ్రెస్ పార్టి నాయకులు, గాంధి, సి.ఆర్.దాస్, రవీంద్రనాథ్ టాగోర్ వంటి ఇతర బ్రాహ్మణ మేధావులు ముస్లీంల తో సఖ్యతకు చేయని ప్రయత్నమంటూ లేదు. గాంధి ముస్లిం ల తో జరిపే చర్చలను వాళ్ళ సమ్మతి కోసం వాళ్ళ మత నిబందనల కనుగుణంగా ఖురాన్ ఆధారం చేసుకొని చర్చించేవారు. అంతేకాని ముస్లీంలలో ఉండే కులాల,రాజవంశాల ఆధారంగా కాదు. చాలా మంది ఈ విషయం ఎక్కడ ప్రస్థావించరు.హిందువులకు ముస్లింలకు సయోధ్య కుదరని అంశం, దేవుడి విషయం లో, రోజు నమాజు చేసుకొనే విషయంలో కాదు. దేశ విభజన నివారించలేక పోవటానికి ప్రధాన కారణాలను అంబేద్కర్‌ - వాల్యూం - 8 (భారత దేశ విభజన)లో, జాతీయ నిస్పృహ అన్న వ్యాసంలో విశదంగా రాశాడు.


      1)శ్రీమతి అనిబిసెంట్‌ ముస్లిం సమస్యపై ఇలా అంటున్నారు
      2) లాలాలజపతిరాయ్‌ సి.ఆర్‌.దాస్‌కు రాసిన లేఖలోని అంశాలు

      3)1924లో రవీంద్రనాధ్‌ ఠాగూర్‌తో జరిపిన ఇంటర్వ్యూలో...

      హిందూ ముస్లిం ఐక్యత అసంభవం అని కవిగారి అభిప్రాయం. మహమ్మదీయులు ఏ ఒక్క దేశానికీ తమ దేశభక్తిని పరిమితం చేయలేరు అన్నదే ఠాగూర్‌ బలమైన అభిప్రాయం.

      ఏ మహమ్మదీయ రాజ్యమైనా భారతదేశంపై దండయాత్ర చేస్తే, ఆ సందర్భంలో తమ ఉమ్మిడి భూమిని రక్షించుకునేందుకు మహమ్మదీయులు హిందువులకు తోడుగా నిలుస్తారా? అని నిర్మొగమాటంగా అడిగాడు... ఓ మహమ్మదీయుడి దేశం ఏదైనా కానీ, అతడు మరో మహమ్మదీయునికి వ్యతిరేకంగా పోరాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ముహమ్మద్‌ ఆలీ లాటివారే చాటారు.''

      http://vivekapatham.blogspot.in/2017/03/blog-post_9.html

      Delete
    4. ఈ వ్యాసం రాసిన అతను చరిత్రను ఎంతో వక్రీకరించినా, భవిషత్ లో ముస్లీంలు,దళితులతో పొలిటికల్ అలైయన్స్ విషయం వచ్చేటప్పటికి వాళ్ళ మతస్థులను ఏకం చేయటానికి ఖురాన్ సూత్రాలను కోట్ చేశాడు. చూడబోతే గాంధీ కాలం నుంచి ఇదే పద్దతి అమలులో ఉన్నట్లుంది.

      Muslim-Dalit Unity: Dalits need to think beyond Ambedkar

      If Dalits have not yet developed a strong bonding with Muslims, Muslims will have to share the blame. Muslims need to realise that Islam stands for equality, and if there is any criterion of differentiation in Islam, it is based on the quality of performance. This quality of performance however makes one privileged in the eyes of God and not in terms of any social privileges in this world.

      The Qur’an speaks of the equality of the whole mankind by stating that all men and women had the same father and mother, Adam and Eve. The holy book shuns supremacy of man on any basis other than the superiority of deeds. Islam knows no races and castes; in religious matters, social obligations and also in the eyes of law all are equal. If discrimination has to be there, it has to be only between the right and the wrong, and between the evil and the virtuous

      దళితులతో రాజకీయ అలియన్స్ రావాలనుకొంట్టున్నారంటే అతని మాటలలోనే వినండి

      The conditions have changed since Partition. Dalits of today are vastly more confident and vocal than they used to be in Ambedkar’s days. A large number of them are highly educated and many are or have been in high administrative or academic positions. Muslims too have come out of the fear psychosis, partially if not wholly, which they used to be in at the time of Partition.

      The new generation of both, Dalits as well as Muslims, are more eager to play a role in the functioning of the country. Both want to enjoy the fruits as well of the progress. Both feel they have not yet got what they deserve, and have reasons to believe that they can achieve more if they combine rather than if they fight alone. Demography is on their side.

      http://www.ummid.com/news/2016/May/07.05.2016/dalit-muslim-unity-beoynd-ambedkar.html

      Delete
    5. ఈ వ్యాసం చదివితే, అంబేడ్కర్ చెప్పినట్లు ఖిలాఫత్ మువ్ మెంట్ తప్పించి స్వాతంత్ర పొరాటం లో పాల్గొనలేదు. చివరివరకు బ్రిటిష్ వారికి అండగా నిలచారు. వేరేదేశం తీసుకొని వెళ్ళారు.

      It was clear to the British after the mutiny of 1857 that unity amongst Indians was against the interests of the Empire. Sir Syed Ahmed Khan realized that the British could not be removed from India soon and advised the Muslims not to wage conflicts against them. His loyalty was rewarded by a largesse to establish Muslim Anglo Oriental [MAO] College at Aligarh. It later became the Aligarh Muslim University. He believed that the Muslims should restore their political identity in India and did not support the Khilafat movement. Nor did he support the Indian National Congress.

      A section of the Muslims considered the British rule as a loss of self-esteem and identified themselves with the Caliphate in Turkey

      Khilafat became irrelevant when Turkey gave up the idea and the Ali brothers started losing their hold over the Muslims. In order to salvage their image, in a speech in 1924, they declared that “an adulterous Mussalman was better than Gandhi”. The Congress leaders were not amused. The non-cooperation movement had also failed.
      https://freedomfirst1952.wordpress.com/2015/08/25/gandhi-and-the-ali-brothers/

      Delete
    6. "There is only one Nationalist Muslim In India. His name is Jawaharlal Nehru"- Sardar Vallabhbhai Patel

      https://twitter.com/TrueIndology/status/761785174384193536

      Dr. Shyama Prasad Mukherjee's letter to Nehru on the latter's Indo-Pak policy. April 1950

      Back in 1950, majority of congress was in favour of population transfer of religious minorities from Pakistan to India and vice versa

      But Nehru told congressmen his scheduled "peace tours" to Pakistan and erstwhile Bangladesh would put an end to minority persecution in Pak

      A proposal for population transfer in the executive was solely overturned by Nehru without consulting anyone

      Of course those proposed "peace tours" of Nehru to riot prone areas of Pakistan were never realized

      Shyama Prasad's Mukherjee's aforementioned letter to Nehru was in light of this controversy. He urged Nehru to reconsider his decision

      https://twitter.com/TrueIndology/status/761158768453259264

      Delete
    7. No Muslim ldr or DK [parent of DMK] were in Indian freedom struggle or went to jail.

      Dr Swamy39 is right when he said Periyar opposed the Indian Independence. The proof is here... Thanks to @parasaran for sharing this.

      https://twitter.com/Bhaskarg77G/status/896419971026243584

      Delete
    8. History of Pakistan - Friday Night with Barrister Hamid Bashani Ep113 (18:00 -21:00)

      https://www.youtube.com/watch?v=ftWj06_IMY0&t=2s



      Delete
  13. Role of Christians in Pakistan Movement

    All India Christian Association assured unconditional and full cooperation to the founder of Pakistan

    In the very beginning of freedom movement, when maximum support of minorities i.e., Hindus, Sikhs, Parsis and Christians was required, Quaid-e-Azam and other Muslim leaders promised them freedom and equal rights in the forthcoming newly established state. Therefore, all the minorities especially the Christians responded to their call and fully supported the idea of a separate Muslim state. History witnessed that they strongly supported Quaid-e-Azam and Muslim League at every critical moment and stood by the cause of Pakistan. It was despite the fact that the idea of a separate Muslim state was severely resisted by the Hindus who were in vast majority in sub-continent.

    In the last days of the United India Mr. Jinnah visited Lahore as a part of his campaign to fetch the support of the minority community for Pakistan. He met the
    Christian leader Ch. Chandu Lal and sikh leader Giani kartar Singh. The sikh leader turned down his offer while Chandu Lal declared unconditional support of the Christians
    for Pakistan. When the resolution to join Pakistan or

    India was moved and voted upon in the Punjab Legislative Assembly, the three Christian members voted in favour of
    Pakistan and saved the situation. 88 and 91 votes were casted in favour of India and Pakistan respectively.

    In this way the three Christian votes decided the fate of the province.

    http://www.bzu.edu.pk/PJSS/Vol32No22012/Final_PJSS-32-2-12.pdf

    ReplyDelete
    Replies

    1. Make Bhagavad Gita the national '˜dharma shastra': Allahabad HC PTI | Updated: Sep 11, 2007, 02.55 AM IST

      Allahabad: In a judgement that may ruffle many feathers, the Allahabad High Court has said that the Bhagavad Gita should be made the national ‘dharma shastra’ of the country and it should be considered a fundamental duty of all

      Judge Srivastava said the Bhagavad Gita had greatly inspired those involved in the freedom struggle and continues to inspire people from all walks of life
      citizens to follow the ‘dharma’ as propounded by it.

      “As India has recognised its national flag, national anthem, national bird, national animal and national flower, Bhagavad Gita may be considered as national (rashtriya) dharma shastra,” Justice S N Srivastava has observed.

      Judge Srivastava said the Bhagavad Gita had greatly inspired those involved in the freedom struggle and continues to inspire people from all walks of life.


      http://mumbaimirror.indiatimes.com/news/india//articleshow/15740368.cms?

      Delete
  14. హరి బాబు, జోగేందర్నాథ్ మండల్ రాజీనామా లేఖను వికి లో నుంచి తొలగించారు. చాలా సేపు వెతకంగా,వెతకంగా ఒక చోట కనిపించింది. మీరు బాకప్ తీసుకొని పెట్టుకోండి.

    http://bengalvoice.blogspot.in/2008/05/appendix-1-jogendra-nath-mandals.html

    ReplyDelete
  15. https://www.facebook.com/harathi.srinivasa.dikshit/posts/887335551415003

    నాయనా దాశరథీ ! (ముదలియాణ్డాన్) ఒకవేళ అందరు బ్రాహ్మలు దీని అంతరార్థాన్ని తెలుసుకొని ప్రతిరోజు పాటిస్తే వాళ్లు భగవంతుని భక్తులయిన శూద్రుల పట్ల అపచారం చెయ్యరు. అట్లా శూద్రుల పట్ల అపచారం చెయ్యకపోవడం వల్లనే ( condition applies ) బ్రాహ్మలు విష్ణువు పాదాలను చేరుతారు ( మోక్షాన్ని పొందుతారు). భగవద్రామానుజుల చివరి ఉపదేశం
    -----------------------------------------------------------------------
    బాపన్లను తిట్టాలంటే బాపని సాహిత్యమే కావాలె. తెల్ల సాహిత్యం ఉల్లిగడ్డ మీద పొట్టు సరిపోదు.మీకు ఇంకొక ఆయుధం. ఇంటలెక్చువల్ ఇంటెగ్రిటీ ఉంటే చదివి అర్థం చేసుకోండి.

    రామానుజా చార్యుల సహస్రాబ్ది సందర్బంగా మీకొక ఆయుధం .......

    రామానుజా చార్యుల కు దాశరథి అని మేనల్లుడు (ముదలియాణ్డాన్ అంటారు తమిళం లో- మొదటి సేవకుడు ) ఆయనకు రామానుజ చార్యులు బ్రాహ్మలను శూద్రులను సమానం గా చేరదీయటం నచ్చదు. రామానుజుల చివరి రోజులల్లో అయన గురువును ఒక సందేహం అడుగుతాడు.

    మనకు వాళ్లకు ఏమి తేడా లేదా ? (బ్రాహ్మలకు-షూధ్రులకు అని ఆయన అర్థం )
    రామానుజుల జవాబు.
    ఉంది, పది తేడాలు ఉన్నాయి. అని కింది పది తేడాలు చెపుతాడు.

    1 - గురువుకు -శిష్యుడికి ఉన్న తేడా.
    మనము గురువులము కాబట్టి ఇతరులకు జ్ఞాన బోధ చెయ్యడానికి దేశాలు పట్టుకు తిరగాలి. వాళ్లకు అటువంటి బాధ్యత లేదు కాబట్టి ఒక్క చోటనే ఉండి, ప్రపంచ బాధ్యతలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు.

    2 - ఒక పుణ్య క్షేత్రానికి ఇతర క్షేత్రాలకు ఉన్న తేడా.
    వాళ్లు ఒక్క చోట ఉండి ఒక క్షేత్రం లో దేవుడ్ని పట్టుకొని నిశ్చిత గా ఉంటారు. మనం దేశాలు తిరుగుతూ చాలా మందిని ప్రార్థిస్తూ ఉంటాము. చివరకు మనకు మిగిలేయిది సంశయమే నిశ్చింత కాదు.

    3 - ఇతర ఆళ్వార్లకు భక్తులకు - విష్ణు చిత్తులకు (పెరియ ఆళ్వార్) కు ఉన్న తేడా.
    మనం ఇతర ఆళ్వార్ల లాగా కొన్ని సార్లు దేవుణ్ణి దూషిస్తుంటాము కూడా. వాళ్లు (పెరియాల్వార్లు) "విష్ణు చిత్తుల" లాగా ఎప్పుడు దేవున్ను సంశయ బుద్ధి తో చూడరు .

    4 - సముద్రము- తీరానికి ఉన్న తేడా.
    మనము సంసారం అనే సముద్రం లో ఉన్న నావ లాగా ఒడిదుడుకులు లోనవుతుంటాము. . వాళ్ళు తీరంలో ఉన్న నావ లాగ దేవుణ్ణి పట్టుకొని నిశ్చిత గాఉంటారు

    5 -అణువు - పర్వతం లాంటి తేడా
    మనం మన కులం, గోత్రం, జాతి లాంటి వాటి లో ఇరుక్కు పోయి ఉంటాము. వాళ్ళు భగవంతుని పట్ల భక్తి వల్ల తమకు భగవంతునికి ఉన్నా సంబంధం , భక్తి యొక్క ఆచరణ నే తమ జాతి, కులం అని అనుకుంటారు.

    6 -చెరుకు - చక్కర లాంటిది
    మనం వేదాలనే చెరుకును నమలడం లో ఇరుక్కు పోయి ఉంటాము. వాళ్ళు భగవంతుని పట్ల శరణాగతి అనే చక్కెరను సులువుగా ఆస్వాదిస్తూ ఉంటారు.

    7 -భూమి- ఆకాశం లాంటి తేడా
    మనం భూమిమీద ఉన్న జంతువుల లాగ అన్నిటికీ భయపడుతూ , అయోమయం లో ఉంటాము. వాళ్ళు ఆకాశం లోని పక్షులలాగా నిర్భయంగా నిశ్చింతగా ఉంటారు.

    8 -రాత్రి -పగలు లాంటి తేడా
    మనం వేదములు అనే రాత్రి లో దారి తెలియక తడుము కుంటూ ఉంటాము. వాళ్ళు భగవత్గీత లో కృష్ణుడు చెప్పినట్టు అయన శరణాగతి వల్ల భగవత్భక్తి అనే పగటిపూట వెలుగు లో సరిఅయిన దారి లో సంచరిస్తుంటారు.

    9 -సామాన్యమయిన రాయి - రత్నానికి ఉన్న తేడా
    మనము రోజుకు మూడు సార్లు గాయత్రీ మంత్రాన్నిజపం చేస్తుంటాము. వాళ్ళు రత్నం లాంటి శరణాగతి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు.

    10 - జార లక్షణం ఉన్న స్త్రీకి -మంచి స్త్రీకి ఉన్న తేడా
    మనం ఒక జార లక్షణం ఉన్న స్త్రీ లాగా రకరకాల దేవుళ్లను ప్రార్థిస్తుంటాము. వాళ్లు మంచి స్త్రీలాగా పరమాత్ముడిని తప్ప వేరే ఎవ్వరిని లెక్క చేయరు.

    బ్రాహ్మలను భక్తిలో శూద్రుల కంటే తక్కువ దర్జాకు చెందిన వారిగా చూపిస్తాడు.

    రామానుజులు ఇది చెప్పిన తరువాత కింది మాట చెపుతారు.
    నాయనా దాశరథీ ! (ముదలియాణ్డాన్)
    రాముడికి మునుల కంటే , వానరులు, విభీషణుడు , గుహుడు లాంటి వాళ్ల మీద ఎక్కువ ప్రేమ.
    శ్రీరంగం లోని రంగనాయకులకు ఆయన నిత్య పూజారి అయిన "లోకసారంగ ముని" కంటే , గుడి లోకి రానియ్యని "మునివాహనుల " మీద ప్రేమ ఎక్కువ.
    తిరుపతి శ్రీనివాసునికి గుడికట్టించిన తొండ మానుడి కంటే కురువ నంబి మీద ప్రేమ ఎక్కువ.
    నాయనా దాశరథీ ! (ముదలియాణ్డాన్) ఒకవేళ అందరు బ్రాహ్మలు దీని అంతరార్థాన్ని తెలుసుకొని ప్రతిరోజు పాటిస్తే వాళ్లు భగవంతుని భక్తులయిన శూద్రుల పట్ల అపచారం చెయ్యరు. అట్లా శూద్రుల పట్ల అపచారం చెయ్యకపోవడం వల్లనే ( condition applies ) బ్రాహ్మలు విష్ణువు పాదాలను చేరుతారు ( మోక్షాన్ని పొందుతారు).

    ReplyDelete
  16. ఉరేసుకొన్న పూజారి

    https://www.facebook.com/konakanchi.lnrao/posts/2002256133134260

    అర్చకుడికి 5వేలు, అటేండర్కి 12వేలు ,EO కి 40వేలు ,అర్చకుడు స్వామికి అర్చన చెయ్యాలి ప్రసాదం తయారు చెయ్యాలి కాని గ్యాస్ ఖర్చుకూడా కానుక వెయ్యరు ,ఇంటికి బంధువులు వస్తే మనచేత ప్రసాదం చేయించి ఇంటికి తీసుకెళ్తారు, చెయ్యమూ అంటే eo కి చెప్తారు సంజాయిషి అంటారు ,హిందూ మతంపై ప్రభుత్వ పెత్తనం రాజకీయనాయకుల దౌర్జ్యన్యం హుండీల దోపిడి -శఠారి పళ్ళెంలోవి కూడా హుండీలో వెయ్యాలి లేకపోతే భక్తుల ముందే తిడతారు ,దేవాదాయశాఖ నాశనమయ్యేదెప్పుడు ?మనమంతా కలిసి పోరాడినప్పుడు ,అర్చకులారా మనమంతా ఒకటిగా పోరాడదాం,మనంకూడా సమ్మెలు చేద్దాం రండి రండి ,మనసమస్యలు ఎవరికి పట్టవు

    ReplyDelete
  17. Another hilarious and full of facts post by Ram Karnam
    3 hrs ·

    ====== సుబ్బారావు సున్నిత హృదయం – 2 =======

    “పోస్ట్ పెట్టడం” అనే ప్రక్రియ ద్వారా నేరనిరోధక ఉద్యమానికి అంకురార్పణ చేసిన సున్నిత హృదయ సంపన్నుడు సుబ్బారావు ఇల్లు దాటి బయటకి రాడు గనుక పెద్దగా కష్టపడడు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. పీత కష్టాలు పీతవి అన్నట్టు అతనికి ఎదురయ్యే ఇబ్బందులు, కలిగే విసుగు, చిరాకు వేరే విధంగా ఉంటాయి.

    సందు దొరికితే ప్రపంచవ్యాప్త నేరాల మీద దృష్టి సారించాలని సుబ్బారావు అభిమతం. కాని సందు దొరక్కపోవడం వలన ఇతర దేశాల నేరాలపై స్వయంపాకం లేకుండా ఇతరుల పోస్టులు షేర్ చెయ్యడం మాత్రమే చేస్తుంటాడు. అందుకే కొందరు అతన్ని ‘షేర్ ఖాన్’ అంటారు. ఇండియా నేరాలు మాత్రమే సుబ్బారావు చాలా సీరియస్ గా టేకప్ చేస్తాడు. అతడి కార్యాచరణ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎలా అంటే –

    ఇండియాలో జరిగిన ప్రతి నేరానికి రెండు అంచెల ఏరివేత కార్యక్రమం చేపడతాడు. మొదటి అంచెలో బాధితుడు ఏ కులమో విచారిస్తాడు. తన కులం అయితే షార్ట్ లిస్టు చేస్తాడు, రెండో అంచెలో అనుమానితులు ఏ కులమో విచారించి తన కులం కాకపోతేనే షార్ట్ లిస్టు చేసి అ నేరాన్ని తను PP ఉద్యమం (పోస్ట్ పెట్టే ఉద్యమం) ద్వారా పరిష్కరించదగినదిగా స్వీకరిస్తాడు.

    మొదటిగా ఆ నేరంలో బాధితుల ఫోటోల కోసం ఇంటర్నెట్ లో వెదుకుతాడు. వాటిలో తనకి నచ్చిన ఫోటో ఉందో లేదో చూస్తాడు. నచ్చడం అంటే? మృతుల విషయంలో నయితే - శరీరం చిధ్రమయి రక్తమాంసాలు బయటికి వచ్చి ఉండడమో, బట్టలు చిరిగిపోయి జననాంగం (కనీసం సగభాగమైనా ) బయటికి కనిపిస్తూ ఉండడమో లాంటివి. జీవించి ఉన్న బాధితుల విషయంలోనయితే - కనీసం బట్టలూడదీసి కట్టేసి పలువురిచే కొట్టబడుతూ ఉండడమో, నగ్నంగా గాడిద మీద ఊరేగించడబడుతూ ఉండడమో లాంటివి. దొరికితే శోకాత్మక తన్మయం చెందుతాడు. దొరక్కపోతే తన డేటాబేస్ లో ఉన్న వందలాది పాత ఫేక్ ఫోటోలలోనుంచి ప్రస్తుత నేరానికి ముడిపెట్టి నమ్మించదగిన ఫోటో ఏదైనా ఉందేమో వెదుకుతాడు. అది కూడా దొరక్కపోతే తనకున్న software నైపుణ్యంతో ఒక కొత్త ఫేక్ ఫోటో తయారు చేస్తాడు. లేదా youtube లో వెదికి ఒకటి పట్టేస్తాడు. ఇక్కడ సుబ్బారావు ఆత్రం ఏమిటంటే ఆ ఫోటో హృదయ విదారకంగా ఉంటూ ఓపెన్ చేసిన ప్రతి కంప్యూటర్ కన్నీరు కార్చాలి, అది చూసి యూజర్ ఆగ్రహంగా స్పందిస్తూ సుబ్బారావుతో కోరస్ గా తను డిసైడ్ చేసిన కులాలు, మతాలపై తిట్ల దాడి చెయ్యాలి.

    పైన వివరించిన ఆత్రం ఫలించి మంచి ఫోటో దొరికితే దాన్ని తన ఆకాంక్షలకి తగ్గట్టుగా డీటెయిల్ చేసి, enlarge చేసి, కవర్ పేజిగా పెడతాడు ముందు. తరువాత తనని చిన్నప్పుడు తొడపాశం పెట్టిన పంతులు కులాన్నో, గోడకుర్చీ వేయించిన పంతులమ్మ మతాన్నో ఆ నేరానికి కారణంగా నామినేట్ చేసి, ఆ కులాన్నీ, మతాన్నీ బీభత్సంగా తిడుతూ నాలుగు లైన్లతో ఒక పేరా రాస్తాడు. ఆ నాలుగు లైన్లలో 8 అచ్చు తప్పులు ఉంటే ఉండొచ్చు. కాని సమస్య పట్ల సుబ్బారావుకున్న అంకితభావాన్నీ, అలివిగాని జిలనీ శంకించలేం. ఆ నాలుగు లైన్లూ, ఆ ఫోటోకలిపి పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ గా పెడతాడు.

    పైన చెప్పిన విధంగా పోస్ట్ పెట్టేసి, మమ లేదా ఆమెన్ అనెయ్యకుండా భిన్నమార్గాల ద్వారా (ట్యాగ్, చాట్, ఫోన్) అనేకమంది బూతు కూలీలని ఆహ్వానించి తను సూచించిన కుల మతాలని బూతులు తిట్టమని ప్రాధేయపడతాడు. వాళ్ళు తృప్తిగా తిట్టగానే ఎక్కడో ఉన్న బాధితులు హాయిగా నిట్టూర్చుతున్నట్టు నమ్ముతూ ఇతను కూడా నిట్టూర్చి నిద్రపోతాడు.

    ReplyDelete
  18. ఒక వేళ ఆశించినన్ని తిట్లు సాధించకపోతే సుబ్బారావుకి చిరాకు కలుగుతుంది – తనొక్కడే దుష్టశిక్షణ శిష్టరక్షణ కార్యాన్ని నెత్తిన వేసుకుని మోస్తున్న గర్వంతో వచ్చిన ఆగ్రహం ప్రదర్శిస్తూ మరి కొంతమందిని ఈ విషయం మీద పోస్ట్ పెట్టమని ఆదేశిస్తాడు. కొందరు ఆ ఆదేశాన్ని శిరసావహించి పోస్టులు పెడతారు. కొందరు మాత్రం “ ఈ అంతర్జాతీయ కామెడీ గాడు మాకు చెప్పేదేంటి .. డొక్కలో కుమ్మేవాళ్ళు లేక ” అనుకుంటూ లైట్ తీసుకుంటారు. ఇలా లైట్ తీసుకున్న వాళ్ళ మీద స్ట్రాంగ్ గా విరుచుకుపడుతూ మళ్ళీ ఒక పోస్ట్ తో పాటు, ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చిన కొటేషన్ లు పెట్టి వాళ్ళని ట్యాగ్ చేస్తాడు. వాళ్ళు “ఏంట్రా బాబూ ఈ మెంటలోడు ..ఊరికే ట్యాగ్ చేస్తాడు” అనుకుని untag చేసుకుంటే అగ్గిమీద గుగ్గిలమై మళ్ళీ ఒక పోస్ట్ పెట్టి ఈ సారి మళ్ళీ బూతు కూలీలను ట్యాగ్ చేస్తాడు. ఆ బూతుకూలీలలో కొందరు గతంలో అంతో ఇంతో సుబ్బారావు నుంచి సహాయాన్ని పొంది ఉంటారు కాబట్టి ‘అన్న కళ్ళలో ఆనందం చూడడం’ కోసం కొన్ని తిట్లు చిలకరించి వెళతారు. దాంతో సమస్య పరిష్కారమైనట్టు భావిస్తూ, బాధితులు చిరుదరహాసం చిందుతున్నట్టు ఊహిస్తూ, సుబ్బారావు రెడ్ వైన్ సిప్ చేస్తూ మరో నేర సంఘటన కోసం అన్వేషణ మొదలు పెడతాడు.

    రెడ్ వైన్ అంటే గుర్తొచ్చింది. రోజూ రెడ్ వైన్ తాగడం, తాగాక పోలీసులు పట్టుకుంటారన్న బిత్తరతో చాలా గంటలు డ్రైవ్ చెయ్యలేకపోవడం వల్ల సుబ్బారావు ఆపరేషన్స్ అన్నీ ఇంటినుంచే జరిగేలా చూసుకుంటాడు. బయట ఎక్కడా కనిపించడు. ఇంటికి పరిమితమైనందుకు ఎప్పుడైనా డల్ గా అనిపిస్తే లోపల గడియ పెట్టుకుని “దమ్ముంటే వచ్చి అరెస్ట్ చెయ్యండిరా”, “తిరుగుబాటు తప్పదు”, “భౌతిక దాడులు చేస్తాం”, “రోడ్లమీదికొచ్చి ఉద్యమం చేస్తాం”, “ఏం పీక్కుంటారో పీక్కోండి”, “లక్ష మంది కూడా నన్నేమీ చెయ్యలేరు” అనే పదాలు వచ్చేలా పోస్టులు పెట్టి అద్దంలో తనని తాను ఆరాధనగా చూసుకుని పునరుత్తేజితమవుతుంటాడు. అలాగని అస్సలు బయట కనిపించడని కాదు. ఈ మధ్య ఒకసారి బయట కనిపించాడు. తన ఇంటికి ఆనుకుని వెనక భాగాన ఉన్న కొండ మీద సాహసోపేతంగా నాలుగైదు అడుగులు పైకి ఎక్కి ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టాడు. అక్కడికి కూడా వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళడమన్నది తన ఆరోగ్యాన్ని జనం కోసం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడన్న విషయాన్ని ఎత్తెత్తి చూపిస్తుంది.

    ఒక నేరం తరువాత మరొకటి క్రమ పద్దతిలో టేక్ అప్ చెయ్యగలిగినంతవరకు సుబ్బారావు పని కొంతవరకు ఒకే. కాని ఒకే సారి చాలా నేరాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడూ. అప్పుడు సుబ్బారావు తీవ్ర వత్తిడికి లోనవుతాడు. అన్నిటికీ న్యాయం చెయ్యడంలో రాత్రిబవళ్ళు పనిచేసి అలసి పోవడమే గాక “అన్నీ నేనొక్కడినే చూసుకుంటుంటే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దేవుడు, ధర్మం, మతం , తొక్కా , తోలూ దేశంలో ఇవన్నీ ఎందుకు .. నాలుక గీక్కోడానికా “ అని తీవ్ర అసహనానికి గురయ్యి .. “హిందూమతం ఒక అరాచక మతం, భారత దేశంలో చట్టం, న్యాయం అంతా డ్రామా, అసలు దేశ చరిత్ర, సంస్కృతి అంతా వరస్ట్” అని డిక్లేర్ చేస్తూ కొన్ని పోస్టులు పెడతాడు. ఆ పోస్ట్ లు గమనించిన కొందరు దేశ భక్తులు తీవ్ర పదజాలంతో సుబ్బారావుపై ఆయన వాల్ మీదనే విరుచుకుపడతారు. అందరినీ నింపాదిగా బ్లాక్ చేసుకుంటూ పోతాడు. అయినా కొత్త కొత్త ID లతో వస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఎలా హేండిల్ చెయ్యాలో తెలియక ... “నేను నాస్తికుడిని .. హిందూ మతమొక్కటే కాదు .. అన్నీ మతాలూ, అన్ని ధర్మాలూ, దేవుళ్ళు ట్రాష్” అంటూ మతాల విషయంలో తర తమ భేదాలు లేకుండా .అందరినీ అవహేళన చేస్తూ కొన్ని పోస్టులు పెడతాడు. హిందూ భక్తుల తాకిడి కొంత తగ్గినా అపుడప్పుడు ఇతర మతస్థులు వచ్చి దాడి చేస్తుంటారు.

    ఈ మతస్తుల దాడుల వల్ల తన అసలు డ్రీం మిషన్ కి ఇబ్బంది అవుతుందని భావించిన సుబ్బారావు ఈ మత, దైవ పరమైన విషయాలకి ఒక ప్రత్యేక ఫేస్బుక్ గ్రూపు పెట్టి కొందరు అమాయకులని అడ్మిన్ లుగా పెట్టి ఈ తాకిడికి వాళ్ళని బలిచెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ గ్రూపుకి “ఆస్తిక నాస్తిక కుమ్ములాటల వేదిక” అని నామకరణం చేశాడు.

    ఈ గ్రూపు పని విధానం, ఫలితాలు గురించి తరువాతి భాగంలో చర్చించుకుందాం.

    ******

    నోట్ :- సుబ్బారావు అనేది ఒక కల్పిత పాత్ర. ఏ తలకి మాసిన వాడో, గడ్డం పెంచిన వాడో ఇదే లక్షణాలతో మీకు తటస్థపడితే అది కేవలం యాధృచ్చిక నిజం.

    ReplyDelete
  19. @ ketan

    ఊరు పేరు లేని అజ్ణాతంగా వ్యాఖ్యలు రాసే కుంకలతో సైన్స్ గురించి చర్చలా? నువ్వు సైన్స్ లో యెల్లాప్రగడ సుబ్బారావు, నోబుల్ గ్రహీత సి.వి. రామన్, గణితంలో రామానుజం అంతర్జాతీయ స్థాయినీది. ఓలప్ప, నీతో సైన్స్ చర్చించలేక చేతులెత్తేశారు బాబు. నీతో సైన్ గురించి చర్చించటం అంటే ముష్టోడోచ్చి, బిల్ గేట్స్ కు డబ్బులు సంపాదించటం ఎలా? అని చర్చించినట్లుఉంట్టుంది.

    నువ్వే ఇర్రెలవెంట్ నాన్సెన్స్ వి. నీమొహానికి అంతర్జాతీయ వ్యవహారాలు, హిందూమతం గురించి మాట్లాడటం. ఒకసారి నిహారిక, నువ్వు కలసి మీ సిద్దాంతాలను ప్రచారాం చేయండి. మీ ప్రజాదరణ మీకే అర్థమౌతుంది. ఇంట్లో వాళ్ళు కూడా అటేండ్ గారు.

    http://ramyamgakutirana.blogspot.in/2017/08/blog-post_9.html

    ReplyDelete
  20. డిబేట్లు, చర్చల విషయమై సత్యాన్వేషణ మండలి బహిరంగ ప్రకటన - చర్చలకు ఆహ్వానం - పుట్టా సురేంద్ర బాబు

    https://www.youtube.com/watch?v=fL0pyCK0TBg

    ReplyDelete

  21. https://www.facebook.com/groups/1643357689319107/permalink/1838604983127709/

    ReplyDelete
  22. https://www.facebook.com/photo.php?fbid=1419315704804424

    Ranjith Vadiyala

    బ్రిటష్ వాడు మన దేశాన్ని ఐఖ్యం చేసాడా?

    స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చూసిన కొన్ని పోస్ట్లు నాకు చాలా బాధ కలిగించాయి. చాల మంది ఇప్పటికీ బ్రిటిష్ వాడు మనల్నేదో ఉద్దరించేసాడు, దేశాన్ని కలిపాడు అనే బ్రమ లోనే ఉన్నారు. వాళ్ళని తప్పుబట్టలేము. మన చరిత్ర పుస్తకాలు అలా ఉన్నాయి.
    ఇలా మన వాళ్ళు అనుకోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ముఘలుల నుండి మన దేశం బ్రిటిష్ వాడి చేతుల్లోకి వెళ్ళింది అనుకోవడం, బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని వందల ముక్కలు చెయ్యడానికి చేసిన ప్రయత్నం చాలా మందికి తెలియకపోవడం.

    చాలా మంది అనుకుంటున్నట్లుగా ముఘలుల నుండి మన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళలేదు. శివాజీ మహారాజ్/మరాఠాలూ మోఘలులని దాదాపు తుడిచిపెట్టేసారు. మరాఠాల ధాటికి ముఘలులు కేవలం ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాలకి మాత్రమె పరిమితం అయ్యారు. భారతదేశం లో చాలా భాగం మరాఠా పాలనలోకి వచ్చింది. అయితే అది హిందూ విజయం కనుక మన ఎర్ర సోదరులు ఆ విషయాన్ని పాఠ్యపుస్తకాలలో పెట్టలేదు.

    ఇప్పుడు రెండో అంశం చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కలపలేదు సరి కదా, మన దేశాన్ని కొన్ని వందల ముక్కలు చెయ్యడానికి చెయ్యగలిగిందంతా చేసారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో మన దేశంలో 800 పైగా చిన్న చిన్న రాజ్యాలు వారికి సామంత రాజులుగా ఉండేవారు. వాళ్ళు పేరుకు మాత్రమె రాజులు, అధికారాలన్నీ బ్రిటిష్ వారివే. బ్రిటష్ వాడు వెళ్ళే ముందు భారతదేశంలో విలీనం అవ్వడం, పాకిస్తాన్ తో విలీనం అవ్వడం, స్వతంత్ర రాజ్యంగా ఉండటం అనే మూడు అవకాశాలు ఈ సామంతులకి ఇచ్చాడు. మన దేశం కొన్ని వందల చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది అని వారు దృడంగా నమ్మరు, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళారు. సర్దార్ పటేల్ గారు సామ, దాన, బేధ, దండోపాయాలతో ఈ రాజ్యాలని దేశంలో కలిపేసారు. అంటే బ్రిటిష్ దేశాన్ని ముక్కలు చెయ్యడానికి చివరి వరకూ ప్రయత్నించి విఫలం అయ్యాడు.

    బ్రిటిష్ వాళ్ళు రాక ముందు మరి మనం చిన్న చిన్న రాజ్యాలుగానే ఉన్నాం కదా అనవచ్చు. అది నిజమే. భారతదేశం అసలు ఎప్పుడైనా ఒక దేశంగా ఉందా? అశోకుడి కాలంలో కొంత కాలం తప్ప నాకు తెలిసి ఎప్పుడూ లేదు. మరి అలాంటప్పుడు అసలు భారతదేశం అని పేరు ఎలా వచ్చింది? మనం అసలు దేశంలా ఎప్పుడూ లేనప్పుడు భారతదేశం అనే పేరు ఎక్కడ నుండి వచ్చింది? ఏ ప్రాంతాన్ని భారత దేశం అని పిలిచారు? ఎందుకు పిలిచారు? వీటికి సమాధానాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయంగా మనం ఒక పరిపాలన క్రింద ఉన్నది చాలా తక్కువే, అయితే భారతదేశం ఎప్పుడూ సాంస్కృతికంగా ఒక్కటే. అంతర్గతంగా ఎన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉన్న, సాంస్కృతికంగా ఇదంతా ఒకటే దేశం అనే భావాన ఎప్పుడూ ఉంది. పురాణాలలో, వేదంలో కూడా హిందూ మహాసముద్రం, హిమాలయాలకి మధ్య ఉన్న భూభాగమే భారతదేశం అని నిర్వచించారు. “ఆసేతు హిమాచలం” అని మనం తరచూ వినే మాటకి ఇదే అర్ధం. ఒకే రాజు పరిపాలన క్రింద ఉంటేనే దేశం అనేది పాశ్చాత్య సిద్ధాంతం. రాజులు, రాజ్యాలు మారవచ్చు సంస్కృతి స్థిరంగా ఉంటుంది. మనది సాంస్కృతిక ఐఖ్యత. దానికి కారణం హిందూ ధర్మం. ఇంత బిన్నత్వం ఉన్నా మనం ఒక దేశంగా, ఇప్పుడు కాదు వందల చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు కూడా, ఉండగలగడానికి ఏకైక కారణం హిందూ ధర్మం. అది అర్ధం కాని వాడికి భారతదేశం గురించి ఏమీ తెలియనట్లే. ఈ కారణం వల్లనే పటేల్ గారైనా మనల్స్ని ఏకం చెయ్యగలిగారు. పాకిస్తాన్ విడిపోవడానికి కారణం అక్కడ హిందూ ధర్మం పోవడం.

    ReplyDelete
  23. ఇవన్నీ సరే మరి రాజకీయ ఐఖ్యతకి ఒక విధంగా కారణం బ్రిటీష్ వారే కదా అనవచ్చు. దానిని పూర్తిగా కాదనలేము. వాళ్ళు ముక్కలు చెయ్యాలి అని అన్ని ప్రయత్నాలూ చేసినా సర్దార్ పటేల్ గారికి అన్నిటినీ ఒక్కటి చెయ్యడానికి ఒక విధంగా అవకాసం కల్పించింది బ్రిటిష్ వారే. అయితే వాళ్ళు రాకపోయి ఉంటె ఇది జరిగేది కాదా? ముమ్మాటికీ జరిగేది, బహుసా చాలా ముందే జరిగేది.

    విదేశి దాడులని ఎదుర్కోవాలి అంటే దేశం అంతా ఒకే పరిపాలన క్రిందకి రావాలి అని ప్రతిపాదించి, సాధించిన చాణుక్యుడు. చాణుక్యుడి ఈ వ్యూహం అశోకుడి కాలం వరకూ కొనసాగింది. అశోకుడి సమయంలో దాదాపు ఆఫ్గనిస్తాన్ వరకూ ఆయన పాలనలోకి వచ్చింది. అశోకుడు బౌద్ధ మత అహింసా సిద్ధాంతానికి ప్రభావితం అవ్వడం బహుశా మన దేశానికి జరిగిన అతి పెద్ద నష్టం. కళింగ యుద్ధం వల్ల జరిగిన జన నష్టం బాధాకరమైనదే అయినా, పూర్తి అహింస ఎప్పుడూ ప్రమాధకరమే. దానికి మన దేశమే ఉదాహరణ. వ్యక్తిగత స్థాయిలో అహింసా సిద్ధాంతం ఫలితాలని ఇవ్వవచ్చేమో, ఒక దేశం స్థాయిలో మాత్రం అహింసా సిద్ధాంతం నిస్సందేహంగా తప్పే. అయితే అసలు అహింస అంటే ఏమిటి అనే దాన్ని కూడా మనం అర్ధం చేసుకోవాలి. అహింస అంటే హింస అసలు చెయ్యకపోవడం (Non – Violence) అని చాలా మంది భావన. నేను తప్పు అంటున్నది కూడా దీనినే. అయితే నిజానికి అహింస అంటే అర్ధం అసలు హింసే చెయ్యకపోవడం అని కాదు, వీలైనంత తక్కువ హింస చెయ్యడం అని. రెంటికీ చాలా తేడా ఉంది. అశోకుడు తప్పుడు అహింసా మార్గంలోకి వెళ్ళాడు. దానికి కారణం బౌద్ధం. దాని ప్రభావమే దేశం ఒక చక్రవర్తి పరిపాలనలోకి రాకపోవడం, ఆర్ధికంగా ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండి కూడా అనాగరిక, ఆటవిక జాతుల చేతుల్లో యుద్ధాలు ఓడిపోవడం. ఫలితం దాదాపు 800 సంవత్సరాలు దేశంలో చాలా భాగం పారాయి పాలనలో ఉండడం. దానినుండి మనం ఇప్పుడిప్పుడే కోలుకున్తున్నాం.

    బౌద్ధం ప్రభావం వలన కొంత కాలం పక్కనబడ్డ రాజకీయ ఐఖ్యత బహుశా కొంత కాలం తరువాత మళ్ళీ తేర మీదకి వచ్చి ఉండింది. ఎవరో ఒకరు దానిని సాధించే వారు. కాబట్టి బ్రిటిష్ వాడేదో మన దేశాన్ని కలిపేసి మనల్ని ఉద్దరించాడు అనే బ్రమ నుండి ఇప్పటికైనా మనం బయటకి రావాలి. వారు కలపలేదు సరికదా ముక్కలు ముక్కలు చెయ్యడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. వాళ్ళు రాకపోయి ఉండి ఉంటే బహుశా ఈపని ఎప్పుడో జరిగేది.

    ReplyDelete
    Replies
    1. @Anonymous16 August 2017 at 06:24
      అశోకుడు తప్పుడు అహింసా మార్గంలోకి వెళ్ళాడు. దానికి కారణం బౌద్ధం. దాని ప్రభావమే దేశం ఒక చక్రవర్తి పరిపాలనలోకి రాకపోవడం, ఆర్ధికంగా ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండి కూడా అనాగరిక, ఆటవిక జాతుల చేతుల్లో యుద్ధాలు ఓడిపోవడం.

      hari.S.babu
      బౌద్ధం వల్ల అశోకుడు అహింసావాది అయ్యాడనటం,రాజ్యాలు కూలిపోవటానికి బౌద్ధమే కారణం అనటం తప్పేమో!అశోకుడి శిలాసాసనాలలఓ ప్రస్తావించిన అహింసాసూత్రాలు అన్నీ జైనమతం ప్రభావంతో ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.అశోకుడి తాతల కాలం నుండి వారు జైనమతస్థులు.అశోకుని తర్వాత అతని మనుమడు రాజయ్యేతప్పుడు ఒక చిత్రమైన సన్నివేసం జరిగింది.అశోకుడు ఒక జైనమఠం దగ్గీర్ కొంత అప్పు తీసుకున్నాడట.సరిగ్గా పట్తాభిషేకం తైముకి వాళ్ళు వచ్చి మా అప్పు తీర్చందే పట్టాభిషేకం జరగనివ్వమని కూర్చున్నారు.రాజు కాబోయే వారసుడు తన సొంత ఆస్తినుంచి వారికి చెల్లింపు చేశాకే పట్తాభిషేకం సజావుగా జరిగింది!ఇలాంటివాటి వల్ల అక్కడ బౌద్ధం గాక జైనం ఎక్కువ ప్రాబల్యంలో ఉన్నట్టు తెలుస్తుంది.

      బౌద్ధమతాన్ని అనుసరించని రాజవంశాలూ అంతరించిపోయినప్పుడు దీనిని మాత్రం బౌద్ధానికి అంటగట్తడం ఏమి న్యాయం?గుప్తుల కాలం స్వర్ణయుగం అని చెప్తారే,అది ఎంత కాలం నడిచింది?మౌర్యవంశం ఎంతకాలం నడిచింది? వాటి పతనానికి కారణాలు ఏమిటి?ఒక రాజు అసమర్ధుదైతే యుద్ధాల్లో వోడిపోయి వేరే రాజ్యంలో కలిసిపోవడం గానీ లేదా మంత్రి లేక సైన్యాధిపతి అతన్ని చంపేసి తన పేరుతో కొత్త రాజవంశాన్ని స్థాపించుకోవదం ఎన్నోసార్లు జరిగింది కదా!

      ప్రపంచంలోని అన్ని మతాలలోనూ బౌద్ధమే ఎక్కువ ప్రాక్టికల్!అలాంటప్పుడు ఏ బౌద్ధ సన్యాసీ రాజుని సైన్యాన్ని తగ్గించుకోమని చచ్చు సలహాలు ఇవ్వడు.తెలివైన రాజు సన్యాసులు చెప్పారని సైన్యాన్ని తగ్గించుకోడు - బౌద్ధం వల్ల దేశం బలహీనపడిందంటే నేను ఒప్పుకోను.

      Delete
  24. http://indianexpress.com/article/india/meet-the-members-of-up-shia-board-that-wants-mosque-at-a-distance-from-where-babri-stood-4801749/

    ReplyDelete
    Replies
    1. Great!ఈ మార్పు మంచిదే!ఎవరూ అడ్డు పడకుండా ఉంటే తొందర్లో రామాలయ నిర్మాణం ఖాయమే!

      Delete
  25. http://www.republicworld.com/s/5067/in-a-major-setback-for-rahul-gandhi-his-election-manager-ashish-kulkarni-resigns

    ReplyDelete
  26. http://epaper.andhrajyothy.com/c/21788274

    ఆత్మాభిమానం లేని మనుషులు

    ముఖ్యమంత్రులు చంద్ర శేఖర రావు ,చంద్ర బాబు నాయుడులకు ఆత్మాభిమానం లేదు.
    నిజమే కానీ తనకి కూడా లేనిది ఆత్మాభిమానం లేదు అని కంచ ఐలయ్య అనే గురివింద గుర్తించనేలేదు.అవకాశవాదం ప్రధానమైనచోట ఆత్మాభిమానం అసాధ్యం.
    కర్ణాటకలో ఆత్మాభిమానవుద్యమాలు జరుగుతున్నాయి . తెలుగు సూద్రులలో అవి లేవు అని ఐలయ్య తెగబాధ పడిపోతున్నారు. లింగాయతులు తాము హిందువులం కాదని ,తమది ప్రత్యేకమతమని చాటుకోవడంలో ఆత్మాభిమానం ఉంది. నిజమే. మన కేసీఆర్ బ్రాహ్మలు కాళ్ళు మొక్కుతూ కూర్చొన్నారు.అది నిజమే.
    చంద్రబాబునాయుడు లాంటి సూద్రులు అవసరాన్నిబట్టి బ్రాహ్మల కాళ్ళో జుట్టో పెట్టుకొంటున్నారు. అంత తెలివి అబ్బడానికి కేసీఆర్ కి సమయం పడుతుంది.
    కొంచెం గుర్తు తెచ్చుకొండి. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో చాలామంది చనిపోయారు. దానికి కారణం- చంద్రబాబు వర్గీయులు, సినిమా డైరెక్టర్ బోయపాటిసీనుల హడావుడిమాత్రమేనని వార్తలు వచ్చాయి. దాన్ని పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి తెలివిగా దారి మల్లించింది. సావర్కర్ గురజాడలు మూర్తీభవించిన గరికపాటి నరసింహారావు అభిప్రాయాలు ప్రచురించింది. నేరాన్ని బ్రాహ్మడి మీదికి నెట్టేశారు. చాగంటి మూర్ఖ భక్తి ఉపన్యాసాలు పుష్కర చావులకి కారణమని గరికపాటి ప్రకటనని పచ్చమీడియా ప్రచారంలోకి తెచ్చిమ్ది. ఆవిధంగా నేరాన్ని మోయడానికి బ్రాహ్మడు పనికివచ్చాడు .మళ్ళీ చాగంటిని సలహాదారు గా తీసుకొంది పచ్చప్రభుత్వం.
    అలాగే ఒక బ్రాహ్మణ ఐఏఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కోల్పోయాడు. ఆయన్ని సమర్థించినందుకు ఆంధ్రభూమి పత్రిక ఎడిటర్ వుద్యోగం కోల్పోయాడు.
    బ్రహ్మలికి దివ్య శక్తులు లేవు. అవి కల్పిసున్నది, వాటిని అవసరానికి ఉపయోగించుకొంటున్నది, ఊడబెరుకుతున్నది కూడా సూద్రులే. ఎందుకంటే మొదటినుంచి వాళ్ళు పూజారులు కాదు దేవుళ్ళు. నాటి కృష్ణుడి నుంచి నేటి బాబాలవరకు గాడ్ మెన్ బ్రాహ్మణేతరులే.అందుకే పూజారులని కాపాడుకోవడం వాళ్ళ అవసరం. పూజారిని కాపాడుకోవడం కాదు వాడుకోవాలి అని తెలిసిన వాళ్ళు కోస్తా సూద్రులు.
    యింకా కంచ ఐలయ్యలాంటి సూద్రమేధావులకి ఆత్మాభిమానం వట్టి డొల్ల.
    అయన క్రైస్తవాన్ని ఆకాశానికి ఎత్తుతారు. మరో వైపు సమ్మక్క సారక్క జాతర ల గొప్పదనాన్ని గురించి మాట్లాడుతారు.నిజానికి క్రైస్తవ మిషనరీలు అనాగరికంగా భావించింది గ్రామదేవతలు గిరిజన దేవతలు వాటిఆచారాలు బలులనే. వాటితో పోలిస్తే బ్రాహ్మడు గొప్పవాడని మిషనరీలు భావించారు[రాబర్ట్ డి నొబిలి ,వైట్ హెడ్ ....]
    అందుకే క్రైస్తవం వల్ల ఎక్కువగా అంతరిస్తున్నవి యివే.
    అంతే కాదు కర్ణాటకవాళ్ళు కేవలం మతపర ఆత్మాభిమానం కోసమే కాదు, మాతృభాష గురించి కూడా పోరాడుతున్నారు ఆత్మాభిమానంలేని ఐలయ్య యింగ్లీషుకి పాదాభివందనం చేస్తున్నాడు.కన్నడ దళిత మేధావి దేవనూర మహాదేవ,కుసుమ బాలే వంటివారు ఎలిమెంటరీ బడులలో మాతృభాష కన్నడని తప్పనిసరి చెయ్యాలని ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు.అవార్డులు పదవులు తిరస్కరిస్తున్నారు. [మరోవైపు హిందుత్వ ని వ్యతిరేకిస్తూ అవార్డు వాపసు చేసారు]
    ఆత్మాభిమానం గురించి మాట్లాడడానికి కేవలం లాజిక్ సరిపోదు.భావోద్రేకాలు కూడా కావాలి .
    వలసవాదానికి భావదాస్యానికి మారు పేరు ఐన సూద్రులు వారు రాజకీయ నాయకులూ అయినా ఐలయ్యలా మేధావులు అయినా మాట్లాడే అర్హతలేదు.
    నేటి సూద్రులు వలసికరించ బడిన ఆధునిక బ్రాహ్మడికో ,వలసవాదానికో మోకరిల్లకుండా క్షణం బతకలేరు

    https://m.facebook.com/story.php?story_fbid=1449535871828512&id=100003163390045
    ---- రాణి శివ శంకర శర్మ

    ReplyDelete
  27. బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. పరిత్యజించడానికి కారణం - ఆ వృత్తికి ఒకప్పుడు హిందూసమాజం ఇచ్చిన ఉద్యోగ భద్రత (Job security) ని ఆ తదుపరి ఉపసంహరించుకోవడం. అలా ఉపసంహరించుకోవడాని క్కారణం అంతకుముందటి బ్రాహ్మణ ద్వేష ప్రచారాలూ, తద్ద్వారా హిందూ మతగురువుల పట్ల ఆదరాభిమానాల్నీ, సానుభూతినీ నశింపజేయడం. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు. రాష్ట్రం నలుమూలలా వేదపాఠశాలలూ, అవీ నామమాత్రంగా ఉండడానికైతే ఉన్నాయి. కానీ అక్కడ శిక్షణ పొంది బయటికొస్తున్నవాళ్ళ సంఖ్య బొత్తిగా సరిపోదు ఈ ఏనుగుని ఎత్తడానికి !

    గతంలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డ బ్రాహ్మణ ద్వేషమే ఈ కొఱతకు మూలకారణం

    ఈ పరిస్థితి హఠాత్తుగా తలెత్తినటువంటిది కాదని గమనించాలి. దీని అసలు చరిత్రని అందఱూ కాస్త తెలుసుకోవాలి.

    ౧. ఏ విధంగా మెజారిటీ బ్రాహ్మణులు దేవాలయాల్నీ, పురోహితవృత్తినీ వదిలిపెట్టి లౌకిక ఉద్యోగాల్లో చేఱాల్సి వచ్చింది ?

    ౨. తదుపరి కాలంలో ఆ లౌకిక ఉద్యోగాల నుంచి కూడా వారిని ఏ విధంగా బహిష్కరించడం జఱిగింది ?

    ౩. అది ఏ విధంగా వారిని విదేశాల పాలు చేసింది ?

    ౪. ఆ విదేశీ/ నవ నాగరిక బ్రాహ్మణులు ఏ విధంగా అర్చక-పురోహిత కుటుంబాలక్కూడా ఆదర్శమై కూర్చున్నారు ?

    ౫. తద్ద్వారా అర్చక-పురోహిత వృత్తి తన గ్లామర్‌ని పూర్తిగా కోల్పోయిన వైనం

    ౬. మతం గుఱించి బోధించేవాళ్ళు లేకుండా చేయడం ద్వారా ఈ పరిస్థితి ఏ విధంగా ముందు మతాన్నీ, తదుపరి సంఘాన్నీ దెబ్బకొట్టబోతున్నది ?

    వీటి మధ్య ఉన్న గొలుసుకట్టు సంబంధమూ, పరస్పర ప్రభావమూ, సామాజిక వాతావరణమూ ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది.

    ReplyDelete
  28. గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్ద ప్రక్రియ (silent process) లో ఉన్నదే ఈనాడు బహిరంగంగా విశ్వరూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఈ సామాజిక సంక్షోభం తలెత్తకుండా హిందువులూ, వారి నాయకులూ కొన్ని దశాబ్దాల క్రితమే కాస్త ముందుచూపుతో, ఈషణ్మానవత్వంతో వ్యవహరించి ఉంటే బావుండేది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ బ్రాహ్మణుల్ని అణచివేయడమూ, వారు తమకెన్నడూ చేయని అపకారాలకు వారిమీద కులకక్ష సాధించడమూ - ఇవే లక్ష్యంగా పెట్టుకున్నాయి అబ్రాహ్మణ హిందువుల నాయకత్వంలోని ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా చాలా హీనమైన పేదఱికానికి గుఱిచేశారు బ్రాహ్మణ కులాన్ని ! రిజర్వేషన్ల పేరుతో ఎంత చదువుకున్నా ఉద్యోగాలివ్వకుండా హింసించారు. ప్రమోషన్లు ఇవ్వకుండా హింసించారు. ఏ పాపమూ ఎఱుగని బ్రాహ్మణ ఉద్యోగులమీద తప్పుడు అవినీతి కేసులు బనాయించి మఱీ హింసించారు. భూపరిమితి చట్టాల పేరుతో, కమిటీల పేరుతో వ్యక్తిగత భూములూ, దేవాలయ భూములూ లాగేసుకుని హింసించారు. పూజారులకు జీతాలివ్వకుండా ఎగ్గొట్టి హింసించారు. ఓరియంటల్ కళాశాలల్లో చాలీచాలని జీతాలకు తెలుగూ, సంస్కృతమూ చెప్పుకుని బతుకుతూంటే "బ్రాహ్మణుడు ఆ మాత్రం కూడా ఎందుకు బతకా"లని ఏకంగా ఆ కళాశాలల్నే ఎత్తేశారు. అలా ఎక్కడెక్కడ బ్రాహ్మణుడు ఆశ్రయం పొంది ఒక ముద్ద అన్నం తింటున్నాడో కనిపెట్టి ఆయా వ్యవస్థల్నీ, సంస్థల్నీ క్రూరంగా కూలద్రోసుకుంటూ పోతూ అతన్ని దయాదాక్షిణ్య రహితంగా లేవగొట్టారు. ఏతావతా హిందువులకు తరతరాల గురువైన బ్రాహ్మణుడికి చివఱికి ఆ హిందూసమాజంలో మనుగడనే దుర్భరం చేశారు. బ్రాహ్మణుడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందనే పూర్వ నమ్మకాన్ని కాలరాచి బ్రాహ్మణుడి పొట్టగొడితే అభ్యుదయం అవుతుందనే ఒక నవీన కలికాలపు ధర్మశాస్త్రాన్ని రచించారు. బ్రాహ్మణుడి యొక్క తరతరాల సాంప్రదాయిక జీవన వనర్లన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు. ఇన్ని చేశాక, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా జీవించడానికి కావాల్సిన ప్రాపులూ, వాతావరణమూ సంపూర్ణంగా అదృశ్యమైనాక ఈ రోజు మీకు పూర్వపు బ్రాహ్మణుడే కావాలంటే ఎక్కడ దొఱుకుతాడు ?

    అలా అబ్రాహ్మణులు ప్రభుత్వాల రూపంలో బ్రాహ్మణుల్ని బాధించడానికి పూనుకోవడం ఊరికే తమాషాగా జఱిగింది కాదు. సర్వే జనా స్సుఖినో భవన్తు అని ఆశీర్వదించే బ్రాహ్మణుడు లోకకంటకుడుగా, సంఘద్రోహిగా చిత్రించబడడం చిత్రమే అయినా ఆ విచిత్ర విద్వేష మనస్తత్త్వానికి నింపాదిగా పునాదులు వేసిన కుట్ర ఒకటుంది. దాని వెనుక ఒక కుహనా సైద్ధాంతిక ప్రాతిపదిక (false ideological basis) ఉంది. గతశతాబ్దంలో సర్వేసర్వత్రా బ్రాహ్మణుల మీద విస్తృతంగా జఱిగిన విశృంఖలమైన దుష్ప్రచారమే ఆ ప్రాతిపదిక. ఈ దుష్ప్రచారంలో నాస్తికులూ, కమ్యూనిస్టులూ అయిన బ్రాహ్మణులు కూడా అమాయకంగా పాలుపంచుకున్నారు, దాని మూలమూ పర్యవసానాలూ ఊహించలేక ! ఈ కుట్రకు నాందీప్రస్తావన చేసినది క్రైస్తవ మిషనరీలు కాగా అమలు జఱిపింది బ్రిటీషు ప్రభుత్వం. బ్రాహ్మణులకు తరతరాలుగా సమాజంలో ఉన్న ప్రాచుర్యాన్నీ, జనాదరణనీ నాశనం చేస్తే తప్ప హిందూమతాన్ని నాశనం చేయలేమనే కీలకాన్ని వారు కనిపెట్టారు. ఈ కుట్రలో భాగంలో ప్రతిరాష్ట్రంలోనూ ఎక్కడెక్కడి బ్రహ్మద్వేషుల్నీ దగ్గఱికి తీసి, దువ్వి, తెఱ వెనుక ఆర్థికాది సహకారాలు అందించి రెచ్చగొట్టారు. నిజంగా బ్రాహ్మణులు వీళ్ళు ప్రచారం చేసినంత బలవంతులూ, విలన్లే అయితే వాళ్ళ శాల్తీల్ని లేపేసి మొగ్గలోనే తుంచి అవతల పారేసి ఉండేవాళ్ళు. బలహీనులూ, నిస్సహాయులు గనుకనే తమ మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఏమీ అనలేకా, ఏమీ చెయ్యలేకా దీనంగా చూస్తూ నిలబడ్డారు.

    ఒక రకంగా చెప్పాలంటే - ఈనాడు తెలంగాణవాదులు ఆంధ్రా ఏరియావారి మీద చేస్తున్న దుష్ప్రచారం లాంటిదే చేశారు గత శతాబ్దంలో బ్రహ్మద్వేషులు. ఆ దుష్ప్రచారం చాలా ప్రతిభావంతంగా, సమర్థంగా జఱిగింది. బ్రాహ్మణులు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా దానికి కులగజ్జిపరమైన వక్రభాష్యాలు చెప్పారు. జాతికి బ్రాహ్మణులు చేసిన సేవలన్నీ వారి ఆధిపత్యానికి చిహ్నమని ప్రచారం చేశారు. బ్రాహ్మణులు తమ కులాచారం పాటిస్తే అది బ్రాహ్మణుల కులగజ్జి. దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఏ కులానికి ఆ కులాచారం ఉంది. ఆయా కులాలు ఆయా ఆచారాల్ని పాటిస్తే అది కులగజ్జి కాదు. బ్రాహ్మణులు తమ కులాచారాన్ని పాటించడం మాత్రమే కులగజ్జి. బ్రాహ్మణులు ధనికులైతే అది రాజుల దగ్గఱ వాళ్ళు చేసిన పైరవీల ఫలితం. వాళ్ళు పేదలైతే అది వాళ్ళ సోమరిపోతుతనం. ఈ దుష్ప్రచారంలో జాతికి వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు చేసిన ఉపకారాలూ, ఉపచర్యలూ, దేశం కోసం వివిధ చారిత్రిక ఘట్టాల్లో వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలూ, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన ఇక్కట్లూ, వాళ్ళతో పాటు వాళ్ళ ఆడవాళ్ళు పడ్డ బాధలూ అన్నీ మఱుగున పడవేయబడ్డాయి.

    ReplyDelete
  29. ఒక పేద, నిస్సహాయ, బడుగువర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వారిని దేశానికి విలన్‌లుగా చిత్రిస్తూ భారీ బడ్జెట్టుతో ప్రభుత్వస్థాయిలో అత్యంత వ్యవస్థీకృతంగా జఱిగిన ఈ తరహా బుఱదజల్లుడు ప్రచారం బహుశా ప్రపంచంలోనే న భూతో న భవిష్యతి. బహుశా ఇది కలియుగ లక్షణం. కలిపురుషుడి లీల.

    http://hindujwala.blogspot.in/2012/02/blog-post_28.html

    ReplyDelete
  30. మీరు కాబట్టి బ్రాహ్మణులకు సమర్ధింపుగా వ్రాసారు. 10 సం రాల నుండీ బ్లాగింగ్ లో ఉన్నాను. ఒక్క బ్లాగర్ అయినా దళితులకు సమర్ధింపుగా వ్రాసిన వారిని చూడలేదు. కత్తి మహేశ్ కుమార్ అనే బ్లాగర్ దళితుడినని ఎపుడూ వాపోతుండేవారు. ఆయన మొన్న పవన్ కళ్యాణ్ ని విమర్శించినపుడూ దళితుడు కాబట్టి ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. రిజర్వేషన్ కి వ్యతిరేకంగా అందరం ఒకే మాట మీద ఉన్నాం ఆయనతో సహా...నేనెపుడూ ఒక మాట అనేదాన్ని పొట్ట చుట్టుకొలత చూసి రిజర్వేషన్ ఇవ్వాలి అని...మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక బిల్ పెట్టింది. పొట్ట చుట్టుకొలత ఎక్కువున్న పోలీసులకు పతకాలు ఇవ్వకూడదు అని స్పష్టం చేసింది. ...ఎంత సంతోషం వేసిందో చెప్పలేను... సమాజంలో మార్పు రావాలంటే దళితులు ఒక్కరే మారితే సరిపోదు. వారిని మార్చేలాగా మనం మారాలి. ఒక్క బ్రాహ్మణుడైనా దళితులవైపు నిలబడ్డాడా ? ఎంతసేపూ రిజర్వేషన్లు తీసుకుంటున్నారని అక్కసే గానీ వాళ్ళ అసలు బాధ ఏవిటనేది ఎవరైనా ఆలోచించారా ? వ్యాపారస్థులలో దళితులెందుకు లేరు అని నిన్న ఐలయ్య గారు ప్రశ్నిస్తున్నారు. అది వాళ్ళకి వాళ్ళు వేసుకోవలసిన ప్రశ్న! సమాధానం కూడా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు గిరి గీసుకుని ఆ గీతలోనే మేముంటాం అంటే ఎవరేం చేయగలరు ? ఆ మాటకొస్తే వ్యాపారస్థులలో బ్రాహ్మణులు కూడా తక్కువే ! ఏదైనా కులం గురించి మనం ప్రస్థావించదలుచుకుంటే బ్రాహ్మణ, దళితులనిద్దరినీ వదలకూడదు. బ్లాగర్లందరిలోకి బాగా తిక్క పుట్టించే బ్లాగర్లలో తేటగీతి బ్లాగర్ ఒకడు... ఒళ్ళంతా బ్రాహ్మణ కారం పూసుకుని వ్రాస్తూ ఉంటాడు.

    ReplyDelete
    Replies
    1. ఈ పొట్ట చుట్టుకొలత విచికిత్స ఏమిటో?


      దూపాటి సంపత్కుమారాచార్య అని ఒక హాస్యరచయిత బడిపంతుళ్ళ తిట్ల వెనక వారికున్న వ్యామోహం గురించి చాలా పరిశోధన చేసారు.

      ఒకానొక ఉపాధ్యాయుదికి పూరీలు అంటే ఇష్తం అనుకోండి,మాటిమాటికీ "ఏమిట్రా!మాడిపోయిన పూరీలా మొహం పెట్టావు?" అని గద్దిస్తారు - ట!
      అదే పెరుగు ఇష్టమనుకోండి పిల్లల్ని "కొడితే తలకాయ పెరుగుబుడ్డిలా పగలాలి,ఏమనుకున్నావో!" అని బెదిరిస్తారు - ట!

      ఆ ప్రకారం మీ ఆయనకి పొట్ట వస్తున్నట్టు గానూ లేదా వచ్చేసినట్టుగానూ నేను అనుమానిస్తున్నాను,నిజమేనా నీహారిక గారూ?

      Delete
    2. మావారికి పొట్ట వచ్చే సమస్యే లేదు. ఎందుకంటే నేను అంత టేస్టీగా వంట చేయను చేసే ఉద్దేశ్యం కూడా లేదు. పరమ పనికిరాని పనులలో వంట ఒకటి అనేది నా భావన. పండుగలపుడు 9 రకాలు నైవేద్యం పెట్టమని చెప్పింది కూడా ఈ బ్రాహ్మణులే అని నా అనుమానం. ఈ వంటల కారణంగా నాకు పండుగలంటేనే విరక్తి వచ్చేసింది. చేయమని మిమ్మల్ని ఎవడడిగాడు అని అనుకోకండి... సమాజం అన్న తరువాత అందరూ వెళ్ళే దారిలో వెళ్ళాలి.
      ఒకసారి మాదిగ మీటింగ్ చూసాను. అక్కడికి వచ్చినవాళ్ళు అందరూ 200 cm తక్కువ కాకుండా పొట్ట కలిగి ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్ లలో అన్యాయం జరుగుతున్నదని చర్చించుకుంటున్నారు. వీళ్ళకి రిజర్వేషన్ లు అవసరమా అనిపించింది. అందుకే పొట్ట చుట్టుకొలత చూసి రిజర్వేషన్స్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. అలాగే పొట్ట ఉన్న పోలీస్ ని చూసినా పోలీస్ ఉద్యోగంలో చేరేటపుడు దేహ దారుడ్యం చూసి ఉద్యోగం ఇస్తారు. ఆ తరువాత దేహ దారుధ్యం అవసరం లేదా ? అంత లావుగా ఉన్న పోలీసులు ఎలా పరిగెడతారు అనిపించింది.
      మీరన్నట్లు సన్నగా ఉండటమనేది ఇష్టం కానీ ఎపుడూ సన్నగా ఉండాలంటే కుదరదు కాబట్టి లావు అయినవాళ్ళు రిజర్వేషన్స్ వదులుకోవాలి.

      Delete
    3. సో,కంచె ఐలయ్య గారి ప్రకార్మ్ బ్రాహణులూ మీ అభిప్రాయం ప్రకార్qం పొట్ట ఉన్నవాళ్ళూ రిజర్వేషన్లు ఆశించకూడదు.మరి నేను పొడుగు పొట్లకాయలు కూడా రిజర్వేషన్లు ఆశించకూడనివాళ్లే అని అంటాను.నిజానికి ప్రపంచంలో అన్ని రకాల అణిచివేతలకీ,కుంగుబాట్లకీ గురవుతున్నవాళ్ళు మాలాంటి పొట్టిబుడంకాయలే!

      రోడ్డుమీద ఏదన్నా జరిగితే గుంపులో దూరి తొంగిచూసేందుకు వీల్లేదు,బస్సుల్లో లగేజి పైన పెట్టటం కుదిరి చావదు,గుండెల్లో ఎంత వీరత్వం ఉన్నా సైన్యంలోకి వెళ్ళడం కుదరి చావదు - ఇలా ఎన్నని చెప్పాలి పొట్టిబుడంకాయల ఆత్మన్యూనత!

      మా బంగారంతో సహా ప్రతి ఆడపిల్లా నాకు ప్రభాసు లాంటి చెయ్యెత్తు మగాడే మొగుడు కావాలని కోరుకుంటున్నారు - మా సంగతి ఏంటి?

      Delete
  31. ఇంతకంటే నీచంగా మాట్లాడిన త్రిపురనేని రామస్వామి చౌదరి ని కవి రాజు అన్నారు . ట్యాంక్ బ్యాండ్ మీద విగ్రహం కూడా పెట్టారు. ఈయన దళితులను సమాజానికి ఎదురు తిరిగేటట్లు చేసి వారిని social acceptance నుండి దూరం చేసాడు , మిగతావారిని నీచంగా విమర్శించాడు . తాను తప్ప సమాజం లో ఏవర్గం గౌరవము అధికారం పొందకుండా ఉండేటట్లు దారులు మూసి వేసాడు . . ఆ టీడీపీ కి మీ బీజేపీ మద్దతు కూడా ఇచ్చింది .. అప్పుడు టీడీపీ కి కమ్యూనిష్టులు కూడా మరో వైపు మద్దతు ఇచ్చారు . అంత లేకి గా దిగజారి కమ్యూనిస్ట్ మనస్తత్వం వున్న టీడీపీ కి మద్దతుఇవాల్సిన అగత్యం బీజేపీ కి ఏమిటి ? అంత టీడీపీ ని బతికించుకోవాలన్న కోరిక బీజేపీ కి ఎందుకు. ఆపొత్తు లో బీజేపీ అభిమానులు వున్న చోట్ల కమ్యూనిస్టులకు ఎలాట్ అయినప్పుడు కార్యకర్తల వేదనను బీజేపీ ఇప్పుడైనా వినిపించుకొందా ? . ఇప్పుడు ఐలయ్య విగ్రహం ట్యాంక్ బండమీద దేనికి టీడీపీ ఆధ్వర్యం లో అసెంబ్లీయే సెంట్రల్ హాల్ లో పెడతారేమో . మాత మార్పిడులకు వైస్సార్ ని నిందిస్తారు . మరి ఎన్టీఆర్ దేవాలయ వ్యవస్థల్ని సర్వ నాశనం చెయ్యలేదా . దానికోసం రెవెన్యూ వ్యవస్థల్ని కూడా ఖూనీ చేశారు . అప్పటినుండి కదా ప్రజలు దేవాలయాలతో హిందూత్వం తో ఎమోషనల్ అటాచ్మెంట్ కోల్పోయింది . అప్పటినుండి కదా మాత మార్పిళ్లు ఊపు అందుకొంది . దేవాలయాలకు వందల ఎకరాలు ఉంటాయి కాదీ దీపం పెట్టె డబ్బు ఉండదు . వారి చెంచాగాళ్ళు భూముల ఆదాయం అనుభవిస్తారు . సంవత్సరానికి 50,000 పైన ఆదాయం ఉంటే ఆ దేవాలయాలు ప్రభుత్వ పర్యవేక్షణ క్రిందికి వస్తాయి కనుక దేవాలయానికి చెందిన 200 ఎకరాల భూమిని కవులకు తీసికొని ఎకరా కు రూ 200 కవులు ఇస్తాడు (250 స్ 200 =50,000). ఇక్కడ మాత్రం దున్నే వాడిదే భూమి అని ఉండదు . పేదలే దేవుళ్ళు , బీద బిక్కి బలహీన , బహుజనులు అని కేకలు పెట్టిన నాయకుడు ఆ దున్నే వాడికే భూమి అప్పచెప్పి మిగిలిన ఆదాయం దేవాలయానికి ఇవ్వొచ్చు కదా . మధ్యలో ఎకరాకు 200 రూపాయలు ఇచ్చే దళారీ ఎందుకు ? వీడు దేవాలయాల్ని, హిందువుల్ని , బీద బిక్కి బలహీన , బహుజనులు అందరి రక్తాన్ని త్రాగుతాడు . లక్ష కోట్ల బడ్జెట్ వున్నప్పుడు 60 వేల కోట్లు తినటం కంటే . 3 వేల కోట్ల బడ్జెట్ వున్నప్పుడు 5 వేల కోట్లు నటం పెద్ద అవినీతి . మన తెలుగు వాళ్ళు చేసికొన్న అదృష్టం కొద్దీ చంద్రబాబు లాంటి విజన్ వున్న ఒక డైనమిక్ లీడర్ దొరికాడు . లేకుంటే రాష్ట్రం కుక్క లు చించిన విస్తరి అయ్యేది

    https://www.facebook.com/ravisankar.vipparla/posts/802751383207408

    ReplyDelete
  32. Common people in the west know hardly anything about India. But one thing they all know: India has an ‘inhuman’ caste system, which is an important feature of their religion, Hinduism. Most also ‘know’ that Brahmins are the highest caste, which oppresses the lower castes, and worst off are the untouchables.

    I learnt this already in primary school, but knew nothing at that time about the concentration camps of Nazi Germany only a few years earlier or about the atrocities of slavery or colonialism. Yet the Indian caste system with Brahmins as villains was part of the curriculum in Bavarian schools in the early 1960s, and it still is today: some time ago I asked three young Germans in Rishikesh what they associate with Hinduism. Their prompt reply was, “caste system”. Surely, they also had learnt that it was most inhuman. In all likelihood, all over the world school children are taught about the ‘inhuman’ caste system. Why?

    There is likely an agenda behind it.

    Yes, the caste system exists, and untouchables, too. And it exists all over the world. Curiously, ‘caste’ is Portuguese for class. It is not even an Indian term.
    In all likelihood, all over the world school children are taught about the ‘inhuman’ caste system. Why?

    There is likely an agenda behind it.

    https://mariawirthblog.wordpress.com/2017/09/13/the-bashing-of-brahmins-and-indias-caste-system-has-an-agenda/

    ReplyDelete
  33. అగ్రవర్ణం రంగు పులిమి అధఃపాతాళానికి తొక్కేశారు. ఏ కులంవారి ఇంటికైనా వచ్చి మలినంలేని మనసుతో మంత్రం చదివి, ఆశీర్వదించేవాడు బ్రాహ్మడు. తింటానికే తిండిిలేక, వుండటానికి నీడలేక అల్లాడుతున్న బ్రాహ్మడు అగ్రవర్ణమా? రేపటికి దాచుకోవడం ఆనాటి బ్రహ్మణునకు తెలియదు. మీరంతా ఇచ్చే ఇంతైనా కూడా ఆనందంగా తీసుకువెళ్ళేవాడు బ్రాహ్మణుడు. మీరనుకునే అగ్రవర్ణ బ్రాహ్మడు, వాడు బ్రతకడం కోసం నాలుగు లోగిళ్ళలో వంట చేసుకుని బ్రతుకుతున్నారు. అగ్రవర్ణం అనే బిరుదును వాడి వంటికి బురదలా రాసి , వీడు పంది అని గెలిచేసే కుహనావాదులకు తక్కువేంలేదు. బ్రాహ్మణుడంటే చులకన, వాడి వేషం చులకన, వాడి ఆడది చులకన, వాడి బ్రతుకు చులకన. శాసించడం అంటే ఇప్పటికీ తెలియనివాడు, బ్రాహ్మడే. అగ్రవర్ణం పేరుతో ఈ నాటికీ బ్రహ్మణుణ్ణి దెప్పిపొడవని జాతి ఏది???అన్ని కులాలవారికన్నా పనికిమాలినవాడిగా మార్చబడినవాడు బ్రాహ్మణుడు. ఆనాడు వారిని కమ్మ, కాపు, రెడ్డి,రాజు ఇలా అనేక జాతులు కలసి పోషించాయి.... ఇప్పుడు బ్రాహ్మణునకు విలువలేదు...అవసరానికి తప్ప. ఒకప్పుడు మంత్రాలకు మాన్యాలు ఇచ్చారు...తరువాత ప్రశ్నించే కాలం వచ్చింది...వెంపాల చెట్లకు నిచ్చెనలు వేసే మేధావులు పుట్టారు. వారికెందుకు అంత గౌరవం అన్నారు? వాల్లు తయారీ రంగంలో లేరు వాళ్ళకిచ్చేదేమిటి అన్నారు...ఇచ్చేది ఆపేశారు. అన్నం పెట్టాల్సిన అమ్మలు మారిపోయారు. దాచుకోవడం చేతకాని బ్రాహ్మణులు దరిద్రులైనారు. అన్నీ వ్యాపారంతో కూడుకున్నప్పుడు బ్రాహ్మణుడు కూడా మంత్రాన్ని వ్యాపారం చేసాడు. తప్పేముంది? మీరంతా ఎదో ఒక వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు బ్రాహ్మణుడు మాత్రం మంత్రం అమ్ముకుంటే తప్పేంటి? ఏం, బ్రాహ్మడు బైకు ఎక్కకూడడా, కారు కొనకూడడా, ఏసీ లు పెట్టుకోకూడడా, ప్రతి దానికీ బ్రాహ్మణుడు చులకనే. చివరికి బ్రాహ్మణునికి పెల్లి కూడా వయసు దాటిపోయిన తర్వాత చేసుకోవలసి వస్తోంది ఎందుకంటె కటిక దరిద్రం అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి. బ్రాహ్మణునకు రక్షణలేని పరిస్థితి. చివరకు బ్రాహ్మణుడు సహాయంకోసం కార్పొరేషనల చుట్టు కుక్కలాగా తిరగాల్సిన పరిస్థితి. అసలు మనుషుల్లోనే ఏకత్వం లేనప్పుడు, బ్రాహ్మణునకు మాత్రం అదెలా అబ్బుతుంది? ఇది ఏమైనా 80% బ్రాహ్మణులు అతి నికృష్ట జీవితం గడుపుతున్నారనేది నా పరిశీలనలో తేెలిననిజం. అగ్రవర్ణం అనే పదం బ్రాహ్మణులకు తగిలించి వారిని సర్వనాశనం చేస్తున్నది ఈ వ్యవస్థ అంటే అతిశయోక్తి కాదు.వారి కులాన్ని చూసి ఏడవకండి...వారు జీవన విధానాన్ని చూసి ఆలోచించండి....
    మిత్రులారా అన్యదా భావించకండి _/\_

    https://m.facebook.com/story.php?story_fbid=1972174509692672&id=100007004256738

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...