Sunday, 3 October 2021

గ్రిగేరియన్ క్యాలెండరుని మర్చిపోతే తప్ప మన కాలగణనం అర్ధం కాదు!

వైదిక సాహిత్యం చంద్రుడికి సంబంధించిన 27 లేక 28 నక్షత్ర సమూహాలను, ఖగోళ సంబంధమైన solstice, equinox వంటివాటిని గురించి చెప్తున్నది.కొందరు వైదిక సాహిత్యం గ్రహాలను గురించి చెప్పలేదు కాబట్టి అప్పటివారికి గ్రహాలను గురించి తెలియదనీ గ్రీకుల నుంచి వచ్చిన ఖగోళ శాస్త్రం చెప్పిన తర్వాతనే నేర్చుకున్నారని అనుకుంటున్నారు.కానీ అది నిజం కాదు.ఎందుకంటే, భూమిమీదనుంచి చూస్తున్నప్పుడు అస్పష్టంగా కనిపించే నక్షత్రాలను గుర్తు పట్టాలంటే ప్రకాశవంతమైన నక్షత్రాల కన్న స్పష్టంగా కనిపించే గ్రహాలను గమనించడం చాలా అవసరం. అసలు అస్పష్టంగా ఉన్న నక్షత్రాలను కూడా గమనించి అంత విస్తారమైన పరిశోధన చేసినవారికి అంత ప్రకాశవంతమైన గ్రహాలు కనపడకపోవడమే విచిత్రమైన విషయం.

వైదిక సాహిత్యంలోని ప్రాచీనమైనవని భావిస్తున్న బ్రాహ్మణాలూ ఉపనిషత్తులూ వేదాంగ జ్యోతిషం వంటి ఖగోళ శాస్త్రాలూ గ్రహాల పేర్లను ఉదహరించ లేదు, నిజమే!గ్రహాలను గురించిన మొట్టమొదటి ప్రస్తావన పూర్వ సామాన్య శకం రెండవ శతాబ్ది(200 BCE)లో రచించబడినదని భావిస్తున్న మహాభారతంలో కనిపిస్తుంది.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పూర్వ సామాన్య శకం మూడవ శతాబ్ది(300 BCE)లో పరిఢవిల్లిన గ్రీకులు వృద్ధి చేసిన ఖగోళ విజ్ఞానం పరిచయం అయ్యేవరకు ఇక్కడి వారికి గ్రహాలను గురించి తెలియదని భావించి ఉంటారు. అయితే, వైదిక ఋషులకి గ్రహాలను గురించి తెలుసు. కానీ,వాటిని ఖగోళ సంబంధమైన సాంకేతికత ప్రకారం కాక వాచ్యంగా ఉదహరించారు. వేదాంగ జ్యోతిషం మొత్తం సూర్య చంద్ర తారకా సమూహపు సాపేక్ష దూరాల మీద ఆధారపడినది కాబట్టి గ్రహాలను గురించి చెప్పలేదు. ఇప్పటికీ గ్రహాల ప్రమేయం లేకుండానే సూర్యుడు, చంద్రుడు, 12 రాశులూ 27 లేక 28 నక్షత్ర సమూహాలూ మాత్రమే ఖగోళ జ్యోతిష శాస్త్రాల  కాలగణనకు ప్రధానమైన ప్రమాణం అని చెప్పాలి.ఈ 27 లేక 28 నక్షత్ర సమూహాలు చంద్రుడు విశ్వాక్షం చుట్టూ పరిభ్రమిస్తూ రాశిచక్రాన్ని 27.3 రోజులలో పూర్తి చెయ్యడానికి సూచన మాత్రమే.దీనివల్ల ఏడాదికి చాంద్రమాసాలు 12 లేక 13 అవుతాయి. ఈ హెచ్చుతగ్గుల్ని సరిచెయ్యడానికే ఒకోసారి అధికమాసం ఒకోసారి క్షయమాసం వస్తూ ఉంటాయి.

బ్రాహ్మణాలు ఇతరులు pleiades అని పిలిచే కృత్తికా సమూహాన్ని తూర్పు దిశలో ఉంచాయి. అధర్వణ వేదం(XIX 7.2) ఆయనాన్ని మఖ(Leo) రాశికి అనుసంధానించింది.అసలు ఈ నక్షత్రాలలో అతి ప్రకాశవంతమైనవి కూడా గ్రహాలతో పోలిస్తే చిన్నగానూ అస్పష్టంగానూ కనబడతాయి.అలాంటప్పుడు అంత అస్పష్టమైన నక్షత్రాలనే గుర్తించినవాళ్ళు వాటికన్న ప్రకాశవంతమైన గ్రహాలను గుర్తించలేకపోవడం అనేది హాస్యాస్పదం! అసలు చంద్రుని కాంతియే కొన్ని నక్షత్రాలను కప్పివేసి అస్పష్టం చేస్తున్నప్పుడు మొదట గ్రహాలను గురించి వాటికి దగ్గరలోని నక్షత్రాలను గుర్తించడం తేలిక.బృహస్పతి(Jupiter) ఒక్కో నక్షత్రం వద్ద అయిదు నెలలు ఉంటాడు, శని(Saturn) ఒక సంవత్సరం పాటు ఉంటాడు.చంద్రకాంతి తగ్గిన రోజున గ్రహాన్ని గుర్తుపట్టి దాని సాయంతో అస్పష్టమైన నక్షత్రాలను గుర్తించవచ్చును.

మహాభారతం మరియు ఇతర పౌరాణిక కధలు ఈ 27 నక్షత్రాలను దక్ష ప్రజాపతి కుమార్తెలనీ చంద్రుని భార్యలనీ చెబుతాయి.ఇక్కడ కదులుతున్న చంద్రగ్రహాన్ని పురుషతత్వంతోనూ స్థిరమై ఉండి వేటినైతే చలిస్తున్న చంద్రగ్రహం స్పృశిస్తుందో వాటిని స్త్రీతత్వంతోనూ పోల్చారు.అయితే, యజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత(Taittiriya Samhita II.3.5.1) ప్రజాపతికి ముప్పైముగ్గురు కుమార్తెలని పేర్కొంటున్నది.ఇక్కడ కూడా చంద్రుడు వీరిలో రోహిణిని ఎక్కువ ప్రేమించాడని చెప్పటం వల్ల ఈ కధలో కూడా చెప్పదల్చుకున్న ప్రధాన విషయం ఒకటే అని తెలుస్తున్నది - కానీ 27 కాస్తా 33 ఎట్లా అయ్యింది?ఉన్న 27 నక్షత్రరాశులకీ చంద్రగమనానికీ చాంద్రమాసాలకీ లెక్క సరిపోతుంటే వీటిని నక్షత్రరాశులని అనుకుంటే కాలానికి సంబంధించిన అన్ని లెక్కల్నీ తిరగరాయాలి! పోనీ, వైదిక సాహిత్యంలో ఉద్ఘాటించిన 8 మంది వసువులూ 11 మంది రుద్రులూ 12 మంది ఆదిత్యులూ ఇద్దరు అశ్వినీ దేవతలూ అయిన 33 అనుకుంటే సరిపోతుందా!వసువులూ రుద్రులూ భూమికీ ప్రకృతికీ సంబంధించినవాళ్ళు - ఖగోళ గణితానికి చంద్రుడి భార్యలుగా అంటుకట్టటం కుదరదే?ఇంకొక వైపున ఋగ్వేదం(VII.86.1;X.88.13) సూర్యుడిని కూడా నక్షత్రం అని చెప్పి విశ్వంలో ఉన్న 34 కాంతుల్లో సూర్యుడు అత్యంత ప్రముఖమైన కాంతిస్వరూపం అని చెప్తున్నది.ఇప్పుడు ఈ 34 నుంచి 27 నక్షరాలనూ సూర్యుడినీ చంద్రుడినీ విడదీస్తే మిగిలిన అయిదూ బుధుడు, శుక్రుడు, వరుణుడు/అంగారకుడు, గురుడు, శని అనే గ్రహాలకి లెక్క సరిపోతున్నది!

ఋగ్వేదం ఒక చోట(I.163.2) అశ్వమేధ యాగంలోని యజ్ఞాశ్వాన్ని సూర్యునితో పోలుస్తున్నది, మరొక చోట(I.162.18) 34 భాగాల కింద విభజించటం గురించి చెబుతున్నది,మరొక చోట(I.162.19) ఋతువులు లేక కాలావధుల ప్రకారం విబజించినట్టు చెబుతున్నది - అంటే అశ్వమేధ యాగంలోని యజ్ఞాశ్వపు 34 దేహభాగాల్ని వర్ణించే మంత్రాలు గుర్రం దేహంలోని మాంసఖండాల్ని గాక నభోమండలంలోని కాలాన్ని శాసించే 34 నక్షత్రాలను సూచిస్తున్నాయనేది తెలిస్తే ఇన్ని దశాబ్దాల శతాబ్దాల హిందూద్వేషుల మలినబుద్ధికి అసహ్యం వేస్తుంది! అనంతకాలం లోని ఒక సంవత్సరం అశ్వం యొక్క ప్రాణం అయితే 34 నక్షత్రాలను అశ్వానికి ఉన్న 34 ప్రాణనాడులతో అనుసంధానించి పూజించే ప్రక్రియని తమ కోడి మెదడు పులుముడు తెలివిడితో ఆయా మాంసఖండాల్ని అగ్నిలో వెయ్యటం కింద మార్చి చెప్తున్నారు హిందూద్రోహులు.

34లో చంద్రుణ్ణి చలనాధిపతి అనుకుంటే సూర్యుడు కూడా నక్షత్రం అవుతున్నాడు గాబట్టి చంద్రుడికి ముప్పైముగ్గురు భార్యలనే లెక్క కూడా సరిపోతుంది.ఇంతకు ముందరే నేను చంద్రవరుడికీ సూర్యవధువుకీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే, జరిగే కళ్యాణ మహోత్సవం కధ చెప్పాను కదా - చదివారా?కధ బాగుంటుంది, చదవండి!ఈ కధలన్నిట్లో చంద్రుణ్ణే ఎందుకు పురుషుణ్ణి చేశారు?సూర్యుడికేం తక్కువ?ఎందుకంటే, అందర్లోకీ చురుకైన వాడు కాబట్టి!ఋగ్వేదం(I.105.10) స్వర్గంలో ఉన్న అయిదు ఎద్దుల్ని గురించి చెప్తున్నది - ఇవి అయిదు గ్రహాలే అయ్యే అవకాశం ఉంది! సూర్యుడికి చెప్తున్న ఏడు గుర్రాలు సూర్యగ్రహం(Sun), చంద్రగ్రహం(Moon), బుధగ్రహం(Mercury), శుక్రగ్రహం(Venus), వరుణ/అంగారకగ్రహం(Mars), గురుగ్రహం(Jupiter), శనిగ్రహం(Saturn) అయ్యే అవకాశం కూడా ఉంది!

తైత్తిరీయ బ్రాహ్మణం(I.V.2) Those who sacrifice here attain(naksate) heaven beyond. This is the nature of the Nakshatras(Naksatranam naksatratvam). అని చెప్తుంది.ఎక్కడ sacrifice అని చూసినా "బలి, జంతుబలి - బొమ్మాళీ ఇదిగో ఇక్కడ జంతుబలి గురించే ఉంది, అబద్ధం చెప్తున్నారు ఈ బ్యామ్మర్లు, పట్టేశాన్!" అని రెచ్చిపోయేవాళ్ళ కోసం కొంత అదనపు సమాచారం ఇస్తున్నాను.ప్రతి నక్షత్రానికీ ఒక resident deity ఉంటాడు/ఉంటుంది, అంతే కాదు, ఒక వైదిక ఋషికి కూడా సంబంధం ఉంటుంది.ఋగ్వేదం(X.22.10) "the secret of the peoples of the seers who have the power of the nakshatras(guha yadi kaveenaam visam nakshatrsavasam)" అని ప్రస్తావిస్తుంది.అంటే, నక్షత్రాలు కాంతితో ప్రకాశిస్తే ఋషులు జ్ఞానంతో ప్రకాశిస్తారు కాబట్టి ఇద్దరూ సమానులే అని చెప్పడం అబద్ధం ఎట్లా అవుతుంది?ఋగ్వేదం (X.68.11) చాలా స్పష్టంగా Like a dark horse ornamented with pearls, our fathers(the seers) made the nakshatras. They placed the darkness in the night and light in the day. Brhaspathi broke open the rock and found the rays(cows) అని ప్రకటిస్తుంది! ఇక్కడ ఆకాశాన్ని 34 కాంతివంతమైన నక్షత్రాలను అలంకరించుకున్న నల్లని గుర్రంతో పోల్చారు,కాలంలో అర్ధవంతమైన భాగం అయిన సంవత్సరాన్ని కూడా గుర్రంతో పోల్చారు, అశ్వమేధ యాగంలోనూ గుర్రాన్ని చూపిస్తున్నారు, వీటన్నిటికీ వేగమూ చలనమూ అనే సంబంధం కనబడుతూనే ఉంది అయినా సరే ఆ అర్ధం తీసుకోకుండా బలీ తిండీ అంటుంటే ఎవడు చెప్పగలడు? తిండియావ, అదీ గుర్రం మాసం రుచి మీద యావ ఉన్నవాళ్ళు తప్ప వీటన్నిటి మధ్యనా చంపి తినే సంబంధం ఎట్లా వూహించగలరు? ఒక పక్క వేదం ఎక్కడ పడితే అక్కడ జీవహింస మహాపాపం అంటుంటే వేదప్రోక్తమైన యజ్ఞకర్మలో జంతుబలిని వేదం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఎట్లా అనుమతిస్తారు?

ఇక్కడ ఇంకొక తిరకాసు కూడా ఉంది, ఎవరూ అడక్కపోయినా నేను పట్టించుకున్నాను - నక్షత్రాలని సృజించినది కూడా వైదికఋషులే అనడం ఎంతవరకు సత్యం?బ్రహ్మ సృష్టి చెయ్యగలిగినది కూడా వేదం ద్యోతకం అయిన తర్వాత వేదం ప్రకారమే కాబట్టి వేదం ద్యోతకం అయినవారికి సృజించే శక్తి ఉండటం కూడా సంభవమే. దీని కోసమే ఈనాటి హిట్లర్ వంటివాళ్ళు ఆనాటి సోమకుడిలా వేదాలను ఎత్తుకుపోయారు, నేర్చుకోవటం కోసం అహరహం తపించిపోయారు. అదీ గాక, నక్షత్రాలను వీరు అక్కడ ఉంచకపోయినా అవి అక్కడ ఉన్నాయని కనుక్కుని వాటి ఉపయోగం ఏమిటో తెల్సుకుని అవసరానికి ఉపయోగించుకోగలగడం కూడా  ఒక రకమైన సృష్టియే కదా! Jupiter అని పిలవబడే గురుగ్రహం ఒక్కటే క్రమం తప్పని చలనాన్ని నమోదు చేస్తున్నది, మిగిలిన వాటి చలనాల్లో స్థిరత్వం తక్కువ, గురుగ్రహం మిక్కిలి కాంతివంతమైనది - కాబట్టి cosmic law మీద అధిపత్యం ఉన్న దేవగురువు స్థానం ఇచ్చారు - వైదిక సాహిత్యపు ఖగోళ నియమాల్లోనూ పామరులకి విజ్ఞానశాస్త్రాన్ని అందించే పురాణ కధల్లోనూ!

నక్షత్రాలకీ గ్రహాలకీ వైదిక ఋషులతో సంబంధం ఉంటుందనే విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, Big Dipper అని ఇతర్లు పిలిచే సప్తర్షి మండలం లోని ఋషుల  గురించి తెల్సుకుంటే చాలు అన్ని సందేహాలూ తీరుతాయి.వ్యక్తులుగా నక్షత్రాలతో సంబంధం స్పష్టం కాకపోయినా కొన్ని ఋషిగణాలకి సామూహికంగా నక్షత్రాలతో ఉన్న సంబంధం వల్ల ఆయా ఋషిగణాలకు సంబంధించిన వ్యక్తులకి కూడా ఆయా నక్షత్రాలతో సంబధం ఉన్నట్టే లెక్క.ఆ విధంగా చూస్తే బృహస్పతి అంగిరస గోత్రీకుడు కాగా Kavi, Usana, Sukra అనే మిగిలిన ముగ్గురూ భృగు గోత్రీకులు. సప్తర్షులను ఎలుగుబంటిని గుర్తు చేస్తూ Rukshas/ఋక్షజులు అని కూడా అంటారు!బృహస్పతిని గురుడు అని మనం పిలుస్తుంటే ఇతర్లు Jupiter అని గుర్తించితే శుక్రతారని Venus అని ఇతర్లు గుర్తించారు. చూశారా, ఇప్పటికి దేవతల రాజగురువు బృహస్పతి అయితే శుక్రుడు రాక్షస గురువు ఎందుకయ్యాడో తెలుస్తున్నది! గబుక్కున తెలియకపొతే నేను కొంచెం విడమరిచి చెప్తాను చదివి తెలుసుకోండి. ఫలిత జ్యోతిషంలో గురుగ్రహం జాతకుల జీవితాల మీద ధనాత్మక ప్రభావం చూపిస్తే శుక్రగ్రహం ఋణాత్మక ప్రభావం చూపిస్తుంది - ఒక మనిషి తన జీవితకాలంలోనే వైభవాన్ని చూస్తున్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టూ దరిద్రాన్ని అనుభవిస్తున్నపుడు నరకంలో ఉన్నట్టూ భావిస్తాడు కదా!

గురుగ్రహం ఒకసారి కక్ష్యని పూర్తి చెయ్యడానికి 12 సంవత్సరాలు పడుతుందనే విషయాన్ని బట్టియే 5X12=60 సంవత్సరాల కాలచక్రాన్ని ప్రతిపాదించారు.చైనీయుల 60 సంవత్సరాలకీ 28 నక్షత్రాల క్యాలెండరుకీ వైదిక సాహిత్యంలోని ఖగోళ శాస్త్రమే పునాది. ఇది బాబిలోనియన్ ఖగోళశాస్త్రంలో కనిపించని ప్రత్యేకత - కాబట్టి గ్రీకులు చెప్పేవరకు మన ప్రాచీనులకు గ్రహాల గురించి తెలియదనటం అశాస్త్రీయం. సంప్రదాయ హిందూ ఖగోళశాస్త్రంలో ప్రతి నక్షత్రానికీ/గ్రహానికీ ఒక ఋషిపరంపర అనుసంధానించబడినట్టే ఒక ప్రధానదైవతం కూడా అనుసంధానించబడి ఉంటుంది!Jupiterకి వైదిక సాహిత్యంలో అత్యంత శక్తివంతుడైన ఇంద్రుణ్ణి అధిపతిగా చెప్పారు. ఇది రోమన్లు జూపిటర్ వర్షాలు కురిపించే దేవుడని చెప్తున్నదానితో సరిపోతుంది. అయితే, ప్రాచీనులు గ్రహాలను దేవతల పేర్లతో సూచించారు తప్ప రెంటికీ అభేదం చెప్పలేదు. వైదిక దేవతలని ఆ గ్రహాలకి మాత్రమే పరిమితం చెయ్యకూడదు, అట్లాగే గ్రీకో రోమన్ దేవతలకి గ్రహాల్తో సంబంధం ఉందని అనుకోకూడదు. ఇవన్నీ కొన్ని వివరాలు కలుస్తూ కొన్ని వివరాలు వేరౌతూ ఉన్న జ్ఞాన శకలాలు - పొలికలను చూసి అన్నీ ఒకటే అనుకోవడమూ తప్పే, తేడాలను చూసి అసలు సంబంధం లేదనుకోవడమూ తప్పే!మన ప్రాచీనులు నక్షత్రాల చుట్టూ అల్లిన పురాణ కధలకు అర్ధం మన పూర్వ ఋషులకు మాత్రమే సాధ్యమైన అద్భుతం - వీటికి చెప్పాల్సిన హేతుబంద్ధమైన వ్యాఖ్యానం కోసం వీటికి సంబంధం లేని చోట్ల వెదకడం వల్లనే కొన్ని కధలు అర్ధం లేనివి గానూ కొన్ని కధలు అసభ్యమైనవి గానూ అనిపిస్తున్నాయి!

హిందూ పురాణాలు గ్రహాలకీ దేవతలకీ కలిపిన సంబంధం ఇట్లా ఉంటుంది:Vishnu - Mercury, Brhspati - Jupiter - indra, Skanda(Son of Shiva) - Mars, Sukra - Venus, Yama - Saturn, అంటే ఒక కధలో Mercury యొక్క చలనాన్ని గానీ విశేషాన్ని గానీ స్వభావాన్ని గానీ సూచిస్తూ ఉండే పాత్రలో విష్ణువుని ప్రవేశపెట్టి కధ నడిపిస్తారు. భృగువులు దైత్యులకీ అంగిరసులు దివ్యులకీ గురుత్వం వహించి నడిపిస్తారని ఇదివరకు చెప్పాను కదా, వీళ్ళిద్దరికీ మొదట్లో ఒకరినొకరు గెలవాలనే స్థాయిలో విరోధం ఉండేది కాదు."తారా శశాంకం", "శశాంక విజయం" అనే శృంగార కలహం జరిగాక దేవదానవుల మధ్యన పరస్పరారోహణావరోహణ పర్వం మొదలయ్యింది!చంద్రుడు, బృహస్పతి, తార - ముగ్గురూ దేవతలే!వాళ్ళ మధ్య జరిగినది నిషిద్ధ శృంగారం!ఇప్పటి పొలిటీషియన్ల మాదిరి శుక్రుడు చంద్రుడి పక్షం వహించడంతో అది కాస్తా దేవతలకీ దానవులకీ పీటముడి అయి కూర్చుంది!

పాతవీ కొత్తవీ కలుపుకుని ఒక పదహారు వెర్షన్లు ఉంటాయేమో ఈ కధకి. విశృంఖలత్వాన్ని విమర్శించే నీతిఖద వెర్షన్ ఉంది, తారని తిరుగుబాటు తత్వానికి ప్రతీకను చేసిన ఫెమినిస్టు వెర్షన్ ఉంది, ముసలి బృహస్పతీ పడుచు తారా అంటూ బాల్యవివాహ వెర్షన్ కూడా ఉంది, ఆధునిక కాలపు హిందూద్వేషులకి కావ్యరచనాశక్తి ఉండి ఉంటే హిండూ గిబ్రమామిక్ కిచిడీ వెర్షన్ కూడా వచ్చి ఉండేది!ఇంతకీ మూలకధ చాలా చిన్నది - బృహస్పతి(Jupiter) యొక్క భార్య(the star)ను సోముడు(moon) ఎత్తుకెళ్ళి దాచేశాడు, రాక్షస గురువైన శుక్రుడు(Venus) చంద్రుడి పక్షం వహిస్తే దేవతల్లో ముఖ్యుడైన రుద్రుడు/స్కందుడు(Mars) గురుడి పక్షం వహించారు.తారకి బుధుడు(Mercury) అనే కొడుకు పుట్టాడు.అసలు పుట్టడం చంద్రుడికే అయినప్పటికీ ఈ బుధుడికి గురుడూ చంద్రుడూ కూడా తండ్రులే అయ్యారు. ఆకాశంలో The Jupiter, The Moon, The Venus, The Mars, The Mercury, The Stars ఎప్పుడెప్పుడు ఎలాగెలాగ కనిపిస్తాయో చూస్తే అసలు చిక్కుముడి విడిపోతుంది, చూద్దామా!Jupiter అత్యంత స్థిరమై నభోమండలాన్నీ నక్షత్రలోకాన్నీ/తారాసమూహాన్నీ పరిపాలించే స్వర్గదైవతం!కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ చంద్రుడు ప్రకాశించడం వల్ల నక్షత్రాలు కాంతి తగ్గి మసకబారిపోతున్నాయి - అంటే చంద్రుడు తారను తీసుకెళ్ళి దాచేశాడు.Venus ఎప్పుడూ సూర్యుడికి దగ్గిరగానే ఉంటూ ఉదయసంధ్యలోనూ సాయంసంధ్యలోనూ మాత్రమే కనిపిస్తుంది - అంటే శుక్రుడు దేవతల్లో చంద్రుడి పక్షానికి రావడం.Mars రాత్రుళ్ళు మాత్రమే కనిపించడం అంటే గురుడి పక్షాన చేరడం.Mars కాంతిలో venus కన్న కొంచెం తగ్గి ఉండి చంద్రగ్రహానికీ శుక్రగ్రహానికీ దగ్గిర్లో తచ్చాడుతూ ఉంటుంది!

వైదిక సాహిత్యంలో కనిపిస్తున్న తారాశశాంకం కధ గ్రహాలను గురించి మనవాళ్ళకి గ్రీకులు చెప్పాకనే తెలిసిందనే వాదనను పూర్వపక్షం చేస్తున్నది!ఇతర దేశాల వాళ్ళు Morning Star, Evening Star, Night Star అని పిలుస్తూ కొన్ని నక్షత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లుగానే The Sun, The Moon, The Jupiter, The Venus, The Mars, The Mercury, The Stars అనేవి ఎలా సంచరిస్తూ ఎప్పుడెప్పుడు ఎలా కనబడతాయి అనే దానికి సన్నివేశ కల్పనతో కూడిన కధారూపాన్ని ఇవ్వడం ఆ జ్ఞానాన్ని కొన్ని వందల వేల తరాల పాటు గురుశిష్యపరంపర ధారణ చేసి అధ్యయన స్వాధ్యాయాలను కొనసాగించడానికి చేసుకున్న ఏర్పాటు.ఇవ్వాళ modern psychology అద్భుత జ్ఞాపకశక్తిని సంతరించుకోవడానికి రెండు ముఖ్యమైన చిట్కాలను చెప్తున్నది.తరచుగా మర్చిపోయే అవకాశం ఉన్న పదాన్ని గుర్తుంచుకోవడానికి దాన్ని మనకు అత్యంత ప్రీతిపాత్రమైన మరొక పదంతో కలపాలి.మనకు ప్రీతిపాత్రమైన పదాన్ని మనం మర్చిపోవడం అసాధ్యం కాబట్టి దానితో సంబంధం కలుపుకున్న అసలు పదం కూడా గుర్తు వచ్చి తీరుతుంది!లేదా మనం తరచు మర్చిపోతున్న పదాన్ని అంత ప్రీతిపాత్రం కాని మరొక పదంతో సంబంధాన్ని కలుపు కునేటప్పుడు కొన్ని అదనపు చిట్కాలు పాటించాల్సి వస్తుంది.మొదటి టెక్నిక్ అందరికీ తేలిగ్గానే అర్ధం అవుతంది గానీ రెండవ టెక్నిక్ ఒక ఉదాహరణ చెప్తే అర్ధం అవుతుంది - గవాస్కర్ అనే వ్యక్తి ముఖం గుర్తుండి పేరును మర్చిపోతున్నారనుకోండి - మనస్సులో గవాస్కర్ని గవ్వలస్కర్టు తొడుక్కున్నట్టు వూహించుకోండి!ఇక్కడ మనం వూహించుకునే దృశ్యం ఎంత అసంబద్ధంగా అంత మంచిది, నేను చెప్పింది నమ్మలేకపోతే ధారణా బ్రహ్మ రాక్షస గరికిపాటి నరసింహా రావు గారిని అడిగి తెలుసుకోవచ్చు.మన పూర్వీకులు అనేక శాఖలూ సూక్తాలూ మంత్రాలూ ఉన్న వైదిక వాజ్మయాన్ని ఒక్క అక్షరం కూడా గ్రంధస్థం చెయ్యకుండా కొన్ని లక్షల సంవత్సరాలు గుర్తుంచుకోగలిగారంటే దాని వెనక ఎంత ప్రజ్ఞ ఉందో ఆలోచించుకోండి!

ఇప్పుడు మనం పాటిస్తున్న విగ్రహారాధన వైదిక సాహిత్యంలోని చతుర్వేదాలలో ఎక్కడా లేదు.శివకేశవుల కన్న అగ్ని ప్రముఖంగా కీర్తించబడింది!అగ్ని చేతనే సృష్టి చలనానికి అవసరమైన శక్తులన్నీ నడుస్తున్నాయనే గమనికయే వైదికఋషుల్ని అంత ఎక్కువ స్థాయిలో అగ్నిని ప్రస్తుతించేలా చేసింది.సనాతన ధార్మిక కార్యాచరణలో యజ్ఞం ప్రముఖ పాత్ర వహించడానికి కారణం కూడా అదే!అయితే, అధర్వణ వేదంలో గృహస్థులు చెయ్యాల్సిన వ్రతవిధానం మొదట కలశప్రతిష్ఠ చేసి ఆ వ్రతానికి అధిదేవతకు చెయ్యాల్సిన కైంకర్యాలను కలశానికి చేసేలా రూపొందించారు. ఇప్పటికీ వ్రతాల్లో పటాల్ని కానీ మూర్తిని కానీ అక్కడ పెట్టినా కలశం తప్పనిసరిగా ఉంచడం అది వైదిక ప్రోక్త విధి కాబట్టే!అయితే, అగ్ని సకల దేవతా స్వరూపం అనేది తిరుగులేని సత్యం.అందుకే ఒక్క హిందువులలోనే కాక బౌద్ధులు, జైనులు, యూదులు, క్రైస్తవులు, ముస్లిములు మొదలైన అన్ని మతాల దైవపూజలో దీపారాధన ఉన్నది.

విశ్వంలో అగ్ని ప్రజ్వరిల్లని చోటు లేదు, సూర్యచంద్రగ్రహతారకాదులు అగ్ని స్వరూపాలే!అగ్ని మానవశరీరంలో అల్ప ప్రమాణంలో ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం అనల్పం. అగ్నిని పరికించినపుడు, దాన్ని ఎన్నో రకాలుగా ప్రాణానికి పర్యాయపదంగా భావించవచ్చు. అసలు మీరు బ్రతికి ఉన్నారా లేదా అని నిర్థారించడానికి మీ శరీరంలో వెచ్చదనం ఇంకా మిగిలి ఉందా లేక మీ శరీరం చల్లబడిపోయిందా అన్నది ముఖ్య సూచిక.మన సంస్కృతిలో ఈ అగ్ని అనే మూలకాన్ని రెండు ముఖాలు కలిగి చాలా పౌరుషంగా ఉండే పొట్టేలు వాహనంగా గలిగిన అగ్నిదేవుడుగా భావిస్తాము. ఈ రెండు ముఖాలూ ఒకటి జీవితాన్ని ప్రసాదించడానికీ, రెండవది జీవితాన్ని హరించడానికీ ప్రతీకలు. మనలో అగ్ని జ్వలించకుండా మనకి ప్రాణం నిలబడదు. కానీ, మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఈ అగ్ని పట్టుతప్పి, అన్నిటినీ హరిస్తుంది. అది మన శరీరాన్ని దహించినపుడు దాన్ని దహనము అంటాము. అదే అగ్నిని మనకి తినడానికి అయోగ్యంగా ఉండేవాటిని ఉడికించి కాల్చి రుచికరంగా, తినడానికి వీలుగా చేసేందుకు వినియోగిస్తున్నాము. అలా అగ్నికి మన శరీరం బయటా, లోపలా ఎన్నో ప్రమాణాలున్నాయి. మన శరీరంలో మండే అగ్నులని ఒకసారి గమనిద్దాము. అందులో ఒకటి జఠరాగ్ని.  'జఠరం' అంటే ఉదరము, పొట్ట లేదా జీర్ణక్రియ. మీరు తింటున్నదాన్నంతటినీ మీ పొట్టలో ఏమాత్రమైనా అగ్నిలేకుండా  దాన్ని జీర్ణం చేసుకోలేరు. ఇక్కడ ఆహారం ఇంధనంగా పనిచేస్తోంది, దాన్ని మీరు విడగొట్టి దానిలో నిబిడీకృతమైన శక్తిని మీ అవసరానికి తగ్గట్టు వెలువరించడానికి. మీ జఠరాగ్నికి ఇంధనం సరిగా సమకూర్చి జాగ్రత్తగా పోషిస్తే, అది పునరుత్పత్తి అగ్నిగా మారుతుంది. ఈ జీర్ణక్రియ, పునరుత్పత్తీ రెండూ జఠరాగ్నిమీద ఆధారపడి ఉన్నాయి.

వైదిక సంస్కృతిలో, మనుషుల జీవితాలకు సంబంధించి ఏ ముఖ్య ఘట్టం జరిగినా అది అగ్ని చుట్టూనే జరుగుతుంది. అగ్ని లేకుండా, ఏ పూజలూ లేవు, ఏ పెళ్ళిళ్ళూ లేవు అసలు ఏ ముఖ్యమైన సంఘటనలూ జరుగవు. అగ్నిని అనేక రూపాలుగా, మార్గాలుగా వినియోగించడం ఈ సంస్కృతిలో స్థిరపడిపోయింది.అగ్ని చుట్టూ, జతకూడడమూ, సంభాషించుకోడమూ చాలా ఎక్కువగా వృద్ధిని కలిగిస్తాయి. కారణం, ఎక్కడ అగ్ని ఉంటుందో, అక్కడ ఆకాశం ప్రభావం ప్రబలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు అనువైన వాతావరణం సృష్టించాలనుకున్నా, మీరు ముందుగా చెయ్యవలసింది నూనె దీపమో, నెయ్యి దీపమో వెలిగించడం. ఇది భారతీయ జీవన సరళిలో ఒక ముఖ్య భాగం.కొవ్వొత్తులకి ఈ రకమైన ప్రభావం ఉండదు,ఒక నూనె దీపంతో మీరూ మీ కుటుంబసభ్యులూ లాభంపొందేలా ఒక ఆకాశక్షేత్రాన్ని సృష్టిస్తున్నారు. ఇంట్లో ముఖ్యంగా పసిపిల్లలూ, గర్భిణులూ, రోగులూ,ఉన్నప్పుడూ, మామూలుగా అందరి ఆరోగ్యానికీ ఇంట్లో నూనె దీపం వెలిగించడం ఆవశ్యకం. ఆ అగ్ని మీ ఆరోగ్యానికీ, పుష్టికీ మీలోని జఠరాగ్నిని ప్రజ్వలనం చేయడమే గాక, చిత్తాగ్నిని రగిల్చి ఆకాశాన్ని అందుబాటులోకి తెస్తుంది. మీలోని వివేకజ్ఞానము ప్రజ్వలిస్తూ ఉండడం చాలా ముఖ్యం. ఒక్క భౌతిక అగ్నులే మండుతూ, మీ వివేకము జ్వలించనపుడు జీవితం దుర్భరమై, భయానకంగా రూపుదిద్దుకుంటుంది. జఠరాగ్ని అత్యధికమై, చిత్తాగ్ని నామమాత్రంగా ఉన్నపుడు మనుషులు మూర్ఖాతిమూర్ఖమైన పనులు చేస్తుంటారు.

చంద్రుడు భూమి మీద కలిగించే ఓషధి సంబంధమైన ఋతు ప్రభావాల్లో అంగారకగ్రహం(Mars) యొక్క పాత్రను వివరించే రహస్యాలు కుమార సంభవం కధలో ఇమిడి ఉన్నాయి.పార్వతి కోరుకున్న శివుని వీర్యం అగ్ని ద్వారా కృత్తికా షట్కానికి చేరి షణ్ముఖుడై ప్రభవించడం ఉగ్రరీతిన కనిపించే అరుణ తార Mars తన పరిభ్రమణ వల్ల భూమి మీద నుంచి చూస్తే Mars లోనయ్యే మార్పులకీ భూమిని యుద్ధాలకీ సేద్యాలకీ సన్నద్ధం చెయ్యడంలో Mars యొక్క ప్రాముఖ్యతను సూచించే విషయాల్ని కధగా మలిస్తే అది కుమారసంభవం అవుతుంది!

మనం భూమి మీదనుంచి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ ఊహాజనిత కక్ష్య వెంబడి పన్నెండు నక్షత్రాల గుంపులను గుర్తించారు. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాలను బట్టి వాటికి 01.మేషం, 02.వృషభం, 03.మిథునం, 04.కర్కాటకం, 05.సింహం, 06.కన్య, 07.తుల, 08.వృశ్చికం, 09.ధనుస్సు, 10.మకరం, 11.కుంభం, 12.మీనం అని పేర్లు పెట్టారు.

సూర్యగ్రహం(Sun),చంద్రగ్రహం(Moon),బుధగ్రహం(Mercury),శుక్రగ్రహం(Venus),వరుణ/అంగారకగ్రహం(Mars), గురుగ్రహం(Jupiter),శనిగ్రహం(Saturn) అనే ఏడు గ్రహాలూ నక్షత్ర సూక్తం పేర్కొన్న ఇరవై ఏడు నక్షత్రాలూ మేషాది మీనపర్యంతం ఉన్న పన్నెండు రాశులూ భూమి మీద నుంచి గమనించగలిగి వుండి వాటి స్థానచలనాల యొక్క సంబంధాల వల్ల కాలాన్ని లెక్కించటానికి వీలు పడుతుంది గనక వీటిని గురించి విస్తరించి చెప్పారు పూర్వ ఋషులు.అంత మాత్రాన పూర్వఋషులకి ఈ కొన్ని నక్షత్రాల గురించి తప్ప మిగిలిన వాటిని గురించి తెలియదని ఎట్లా చెబుతారు?సూర్యుడు మేషాది మీనపర్యంతం ఉన్న ఈ రాశి చక్రాన్ని చుట్టి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. అంటే సూర్యుడు ఒక సంవత్సరకాలంలో పన్నెండు రాశుల్ని దాటి మొదటికి వస్తాడన్నమాట. అంటే ఒక్కో నక్షత్ర రాశిలోనూ దాదాపు ఒక్కో నెల ఉంటాడు. ఇది సౌర మానం.ఇక చంద్రుడు నెల రోజుల్లోపే (ఇంకా చెప్పాలంటే 27-28 రోజుల్లోనే) రాశి చక్రాన్ని చుట్టి వస్తాడు. ఈ 27 రోజుల స్వల్ప కాలంలో చంద్రుడు ఎప్పుడు ఏ రాశిలో ఉన్నదీ గుర్తించేదెలా? అనేదొక సమస్య. ఈ సమస్యను తీర్చడానికన్నట్లు రాశి చక్రం చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. ఇలాంటి నక్షత్రాలను ఇరవై ఏడింటిని గుర్తించారు. అవి:01.అశ్విని(ఆశ్వయుజ మాసం - 07), 02.భరణి, 03.కృత్తిక(కార్తీక మాసం - 08), 04.రోహిణి, 05.మృగశిర(మార్గశిర మాసం - 09), 06.ఆర్ద్ర, 07.పునర్వసు, 08.పుష్యమి(పుష్య మాసం - 10), 09.ఆశ్లేష, 10.మఘ(మాఘ మాసం - 11), 11.పుబ్బ(పూర్వ ఫల్గుణి), 12.ఉత్తర(ఉత్తర ఫల్గుణి)( ఫాల్గుణ మాసం - 12), 13.హస్త, 14.చిత్త(చైత్ర మాసం - 01), 15.స్వాతి, 16.విశాఖ(వైశాఖ మాసం - 02), 17.అనురాధ, 18.జ్యేష్ఠ(జ్యేష్ట మాసం - 03), 19.మూల, 20.పూర్వాషాఢ(ఆషాఢ మాసం - 04), 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం(శ్రావణ మాసం - 05), 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర(బాధ్రపద మాసం - 06), 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి! చంద్రుడు రాశి చక్రం వెంబడి గల ఈ 27 నక్షత్రాలను ఒక్కసారి చుట్టి వచ్చాడంటే 12 రాశుల రాశి చక్రాన్ని చుట్టి వచ్చినట్లే. ఈ 27 నక్షత్రాల పరిధి 12 రాశులలో పరుచుకుని ఉంటుందన్నమాట. ఒక్కో నక్షత్ర పరిధిని నాలుగు భాగాలు (పాదాలు)గా విభజిస్తే మొత్తం 108 పాదాలవుతాయి. ఈ 108 నక్షత్ర పాదాలు 12 రాశులలో ఉన్నాయని గుర్తుంచుకుంటే ఒక్కో రాశిలో 108/12 = 9 నక్షత్ర పాదాలున్నట్లు సుళువుగా ఊహించవచ్చు.

పౌర్ణమి రోజున చిత్రా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా వచ్చిన నెల చైత్ర మాసం అవుతుంది.పౌర్ణమి రోజున జ్యేష్ఠా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా వచ్చిన నెల జ్యేష్ఠ మాసం అవుతుంది. కృష్ణపక్షం 14 రోజులూ శుక్లపక్షం 14 రోజులూ ఒక అమావాస్య ఒక పౌర్ణమి కలిపి నెలకు 30 రోజులు అనేది లెక్క. పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు. ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు.

సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు. అధిక మాసము చాంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు, ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే. ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.

సౌరమాస పరిధిలో చాంద్రమాసం ఇమిడినపుడు అది అధికమాసం అని అర్థమవుతున్నది. కానీ దీనికి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. అంటే ఒక చాంద్రమాస పరిధిలో సౌరమాసం సంభవించడం. మరొక విధంగా చెప్పాలంటే అమావాస్య నుండి అమావాస్య వరకు గల సమయం లోపల, సూర్యుడు రెండు రాశులు దాటుతాడు. ఇది చాలా అరుదు. 141 ఏళ్ళకొకసారి సంభవిస్తుంటుంది. వెనువెంటనే 19 ఏళ్ళకు మరలా ఇటువంటిది జరిగి తిరిగి 141 ఏళ్ళ తరువాత మళ్ళీ జరుగుతుంది. దీనిని క్షయ మాసం అని పిలుస్తారు. 1823 లో వచ్చిన స్వభాను నామ సంవత్సరం తరువాత 141 ఏళ్ళు గడిచిన పిదప 1964 లో వచ్చిన క్రోధి నామ సంవత్సరంలో క్షయ మాసాలు సంభవించాయి. 1964 తరువాత మళ్ళీ కేవలం 19 ఏళ్ళ దాటగానే 1983 లో రుధిరోద్గారి నామ సంవత్సరంలో మరో క్షయ మాసం సంభవించింది. ఇక మనెవ్వరి జీవిత కాలాలలో మనము క్షయ మాసాన్ని చూడబోము. ఎందుకంటే తరువాయి క్షయ మాసం సంభవించబోయేది 141 ఏళ్ళ తరువాత 2124 లోని తారణ నామ సంవత్సరంలోనే.

ఇంగ్లీషువాళ్ళు మనమీద రుద్దిన గ్రిగేరియన్ క్యాలెండరు 15వ శతాబ్దంలో రూపొందించబడింది.అది కూడా అరబిక్ క్యాలెండరును కాపీ కొట్టి తయారు చేసుకున్నదే!ఆ అరబిక్ క్యాలెండరు మళ్ళీ మన నుంచి కాపీ కొట్టి అది కూడా సరిగ్గా చెయ్యలేక తప్పులు వస్తుంటే పానశాల రచయిత ఉమర్ ఖయ్యాం భారతీయుల ఖగోళ విజ్ఞానం నుంచి నేర్చుకుని సర్దుబాట్లు చేశాక ఏర్పడిన నమూనా!కానీ వాళ్ళందరికీ ఆ విజ్ఞానాన్ని అందించిన ఈ ప్రాచీన భారతీయ ఋషుల లెక్కలు మాత్రం ఒక్కసారి కూడా తప్పు కాలేదు!గ్రీకుల ఖగోళ విజ్ఞానం మనవాళ్ళు నేర్పినదే, వాళ్ళు దాన్ని కొంత అభివృద్ధి చేశాక మనకు చెబితే దాన్ని కూడా తీసుకుని అదివరకటి జ్ఞానరాశికి కలిపారు మనవాళ్ళు!మన లెక్కల ప్రకారం దిన వార మాసాలు చంద్రుణ్ణి బట్టి ఏర్పడి సంవత్సరం సూర్యుణ్ణి బట్టి ఏర్పడితే ఇంగ్లీషువాళ్ళ లెక్క ప్రకారం అన్నీ సూర్యుణ్ణి బట్టే ఏర్పడతాయి.

తమాషా ఏంటంటే, "జనవరి తర్వాత ఫిబ్రవరియే ఎందుకు రావాలి?Sunday తర్వాత Monday మాత్రమే ఎందుకు వస్తుంది?Sunday తర్వాత Friday ఎందుకు రాకూడదు?" అనే రకం ప్రశ్నలకి వాళ్ళకన్న మనకే ఎక్కువ తెలుసు!1999 నుంచి 2001 మధ్యన Y2K పేరుతో ఎంత భయోత్పాతం సృష్టించారో ఇప్పుడెంతమందికి గుర్తుంది?మన దగ్గిర్నుంచి కొట్టేసి రంగులు మార్చి హంగులు చేర్చి మళ్ళీ మనకే తమ సొంత ఆవిష్కరణల పేరున ప్రదర్శనకి పెడుతున్నారు,పైన వాళ్ళు నేర్పాకే మనకి నాగరికత అబ్బిందని పోజులు కొడుతున్నారు!

ఇవ్వాళ మన సంస్కృతి గురించి మనం చెప్పుకోవటానికి కూడా ఇంగ్లీషు వాడకపోతే ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఉంది.మనకి ఆరు ఋతువులు మూడు కాలాలు ఉంటే వాళ్ళకి ఋతువులా కాలాలా అని తేడా తెలియని నాలుగు సీజన్స్ మాత్రమే ఉన్నాయి.మనకి ఏ ఋతువు ఎప్పుడు వస్తుందో తెలియటానికి ఒక నక్షత్రం దిజ్మండలం మీద కనపడటమూ భూమి మీద వాతావారణంలోని మార్పులూ సాక్ష్యం అయితే వాళ్ళకి సూర్యోదయం జరిగి రోజు మారటమే సాక్ష్యం.ఆ లెక్కకీ ఈ లెక్కకీ పోలికే లేదు,దీన్ని బట్టి దాన్ని దాన్ని బట్టి దీన్ని తెలుసుకోవటం కుదిరే పని కాదు.మన సంప్రదాయం మీద గౌరవం ఉంటే గ్రిగేరియన్ క్యాలెండరుని పూర్తిగా మర్చిపోతే తప్ప మన కాలగణనం అర్ధం కాదు.మన కాలగణనానికి సంబంధించి తప్పనిసరిగా అర్ధం చేసుకోవలసిన వాటిలో ఇంగ్లీషు ప్రమేయం లేకుండా చెప్తే అర్ధం కానివి నాలుగు విషయాలు ఉన్నాయి.equnox,solstice అనే జంట గురించి మొదట చెప్తాను.solstice అంటే అయనసంధి అని చెప్పవచ్చు.మన సంవత్సరాలకు 12 మాసాలు, 6 ఋతువులు 3 కాలాలు 2 అయనాలు ఉన్నాయి.

ఆయనాలను గురించి తెలుసుకోవాలంటే తన చుట్టూ తను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడితో సహా ఈ భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సౌరమండల నమూనాని మర్చిపోయి భూమి విరాట్ పురుషుడి కటిస్థలం దగ్గిర విశ్వాక్షం మీద స్తిరంగా ఉండే భూలోకానికి పైన ఉన్న భువర్లోకంలో సూర్య చంద్ర గ్రహ తారకాదులు విశ్వాక్షం చుట్టూ వలయాకారంలో పరిభ్రమించే దృశ్యాన్ని వూహించుకోవాలి.అలాంటి అమరికలో మిగిలిన అన్నీ ఒకే రకమైన గమనాన్ని చూపిస్తే సూర్యుడు మాత్రం కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయనం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఒక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు.

"చైత్ర మాసం -- ఉత్తరాయనం -- వసంత ఋతువు, వైశాఖ మాసం -- ఉత్తరాయనం -- వసంత ఋతువు, జ్యేష్ట మాసం -- ఉత్తరాయనం -- గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం -- ఉత్తరాయనం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు, భాద్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు, ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు, కార్తీక మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు, మార్గశిర మాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు, పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు, మాఘ మాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు" అని మాసాలకీ ఆయనాలకీ, ఋతువులకీ ఉన్న సంబంధాల్ని ఒక్కచోటకి చేర్చి ఒక వరసను కూర్చి చెప్తున్నాను నేను. దీని ప్రకారం జనవరిలో ఉత్తరాయణ ప్రారంభం, మార్చి 21Vernal equinox అన్న పేరున్న పగలూ రాత్రీ సమానమై ఉండే వసంత విషువత్, జూన్ 21Summer solstice(ఉత్తరాయణ విషువత్తు) అన్న పేరున్న సుదీర్ఘమైన పగటి పూర్వ దక్షిణాయణ సంధి, జూలై నెలలో దక్షిణాయణ ప్రారంభం,సెప్టెంబర్ 23Autumnal equinox అన్న పేరున్న పగలూ రాత్రీ సమానమై ఉండే శరద్ విషువత్, డిసెంబర్ 21Winter solstice అన్న పేరున్న హ్రస్వమైన పగటి పూర్వ ఉత్తరాయణ సంధి వస్తాయి.ఉత్తరాయణ ప్రారంభాన్ని సూచించే సూర్యుని మకర రాశి ప్రవేశమే మకరసంక్రాంతి ఖగోళ శాస్త్రం ప్రకారము జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభం అవుతుంది.!

కూర్మపురాణం వంటి పురాణాలూ సూర్యసిద్ధాంతిక వంటి శాస్త్రగ్రంధాలూ భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, సూర్యుడి చుట్టూ భూమి తిరగడం అనే సౌరమండల నిర్మితిని విశ్వానికి ఆపాదిస్తుంటే మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం వంటివి పధ్నాలుగు లోకాల విరాట్పురుష నిర్మాణం ప్రకారం విశ్వాన్ని నిర్మించి చూపిస్తున్నాయి.మత్స్య పురాణం ప్రకారం చంద్రుడి వృద్ధి క్షయాలూ కిరణాలూ సూర్యుడి వలెనే ఉంటాయని చెప్తుంది.అయితే చంద్ర రధానికి తారకలతో ఏర్పడిన మూడు చక్రాలు ఉంటాయి.కాడికి చెరొకవైపున అజ-శతమఖ-వృష-వాజి-నరాశ్మ-సప్తధాతు- హంస-వామ-మృగ-నామములు గల పది తెల్లని గుఱ్ఱాలు ఉంటాయి. కుజ బుధ గురు శుక్ర శనులను తారాగ్రహములని జ్యోతిఃశాస్త్రం చెప్తుంది.కాలనిర్ణయాన్ని ప్రభావితం చేసే ఈ మూడు రకాల కదిలే అంశాలను కలిపి మన పెద్దలు శింశుమార చక్రము అని వర్ణించారు.దీని అమరిక మొత్తానికి ధ్రువతార ప్రధాన కేంద్రం.

ఈ సూర్యచంద్రాది గ్రహములును జ్యోతిర్గణములును అన్నియు వాతమయములగు పగ్గములతో ఆయా అమరికలతో ధ్రవునితో బిగింపబడి కంటికి కానరాని ఆ వాయవ్య పాశముల బలమున ఆ ధ్రువుడు ఉన్నంత కాలమును అతనిని ప్రదక్షిణించుచు అంతరిక్షమున సంచరించుచుండును. నదీ ప్రవాహజలమందలి నౌకను ఆ జల మెట్లు వహించునో అట్లే ఈ వాయుశక్తి ఈ దేవ గృహముల (జ్యోతిర్గణముల)ను అంతరిక్షమున వహించుచుండును. ఇవియే కాదు. తారలన్నియు-మరీచులు -అవియు ధ్రువునితో నిబద్దములై తా మతని చుట్టు తిరుగుచు ధ్రువుడును తిరుగుట కవకాశము నిచ్చుచున్నవి. ఇవన్నియు వాయుమయ చక్రముచే ప్రేరితములయి కొరవిని గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె తిరుగుచుండును.అని శ్రీ మత్స్యమహాపురాణమున ఖగోళ వ్యవస్థయందు సూర్కది గ్రహరథాది స్వరూప శిశుమార స్వరూప ప్రతిపాదనను నూట ఇరువదియైదవ అధ్యాయము వివరిస్తున్నది.

ప్రాచీన వైదిక సాహిత్యంలో కనిపించే సౌరమండల విరాట్పురుష నిర్మితులు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రంలోని సూర్యకేంద్రక, భూకేంద్రక సిద్ధాంతాల మాదిరి ఒకదానినొకటి ఖండించుకున్నట్టు కనిపిస్తాయి.కానీ ఈ రెండు ప్రాచీన భారతీయ సిద్ధాంతాలు సృష్టిని బింబ, ప్రతిబింబ రూపాలలో choopistoo పరస్పరాశ్రితమై ఉంటాయి.అంటే, కాలగనణానికి సంబంధించిన తిధి, వార, మాస,ఋతు, ఆయనాదులను నిర్మితిని బట్టి లెక్క కట్టినప్పటికీ ఒకే విలువ వస్తుంది.

జై శ్రీ రాం!

Tuesday, 14 September 2021

అవ్యక్త వినాళ గ్రంధి పూర్వజన్మ వాసనలను మోసుకొస్తుందా?గత జన్మలోని పాపాలకు నిష్కృతి లేదా!

పునర్జన్మ అనే విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇటీవలి వరకూ అంటరాని సబ్జెక్టుగా చూసి దూరం పెట్టేసింది!యెక్కువ శాతం విషయమంతా మతగ్రంధాలలోనే ఉంది.భారతీయ సనాతన ధర్మం తొలినుంచీ సకల జీవరాశులలోనూ వాటి తత్త్వానికి జీవాత్మ అనే పదాన్ని వాడుతున్నది.పైగా భగవద్గీతలో "ఆత్మ నాశనము లేనిది" అని చెప్పి "ప్రాబడిన వస్త్రాల విడిచి నరుడెట్లు క్రొత్తవి తా ధరించు నట్లె జీర్ణ దేహాల వీడి నూత్న దేహాల ధరించు దేహి" అని చెప్పడం వల్ల పునర్జన్మ అనే భావన హిందూ ధర్మంలో అంగీకరించబడిందని తెలుస్తుంది!అబ్రహామిక్ మతాలైన జుదాయిజం,క్రైస్తవం,ఇస్లాం మతాలు వాటి ప్రధాన బోధనల్లో పునర్జన్మని తిరస్కరించినా వాటిలోని కొన్ని శాఖలు మాత్రం పునర్జన్మ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి!

"పుట్టినన్ చావు తధ్యమ్ము"అని తెలిసిన మనిషికి యెంత కాలం బతికినా ఇంకా తనివి తీరకపోవడం వల్లనో యేమో "మరుజన్మ ఉన్నదో లేదో!ఈ మమత లప్పుడే మవుతాయో?" అని బెంగ కూడా పుట్టి "చావన్ పుట్టుక తప్పదు" అని ధైర్యం చెప్పుకుని ఇప్పుడు చేసిన తప్పులు చేయకుండా అప్పుడు మరింత గొప్పగా బతుకుదాం లెమ్మని ఓదార్చుకోవడానికి ఈ అందమైన వూహ అతని బెంగ తీరుస్తుంది కాబోలు!హిందూ ధర్మంలో కర్మ-జన్మ-సంసారచక్రం అనే భావన అవైదిక శ్రమణ సాంప్రదాయం నుంచి వచ్చిందని Patrick Olivelle అనే ఇండాలజిస్ట్ సూత్రీకరించాడు.దక్షిణాపధంలోని ద్రవిడ సంస్కృతి నుంచి వైదిక సంస్కృతి ఈ పునర్జన్మ సిధ్ధాంతాన్ని స్వీకరించడం మరొక సంభావ్యత!మరికొందరి విశ్లేషణ ప్రకారం ఈ పునర్జన్మ సిధ్ధాంతం యొక్క అసలు ప్రతిపాదన బౌధ్ధమతంలోనిది!నిజమే కావచ్చు,ప్రాచీన కాలపు ధార్మికసాహిత్యంలో పునర్జన్మ ప్రస్తావనలు ప్రముఖంగా లేకపోవడానికీ బుధ్ధుని తర్వాతికాలం నుంచి మొదలైన పౌరాణికసాహిత్యం నుంచే ఈ పునర్జన్మ భావన విస్తృతంగా ఉండటానికీ అదే కారణం అయి ఉండాలి!

క్రీ.పూ570 నుంచి క్రీ.పూ495 మధ్యన జీవించిన పైధాగరస్ అనే గ్రీకు మేధావి పునర్జన్మలని సమర్ధించాడు.క్రీ,పూ428 నుంచి క్రీ.పూ348 మధ్యన జీవించిన మరో గ్రీకు మేధావి ప్లాటో తన రచనల్లో పునర్జన్మలకి సంబంధించిన ఉదాహరణల్ని కూడా ఉల్లేఖించాడు.అయితే తదనతర కాలంలో క్రైస్తవం తన ప్రధాన సిధ్ధాంతమైన "మారుమనస్సు పొందిన నరుడు భగవంతునిచే ఆశీర్వదించబడి సరాసరి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడు" అన్న సూత్రీకరణతో పొసగనందున ఈ భావనని తదనంతర కాలంలో వ్యతిరేకించింది!కానీ వారిలో కొన్ని శాఖల వారు ఇప్పటికీ పునర్జన్మను ప్రస్తావిస్తున్నారు.అసలు శిలువ వేయబడి మరణించినాడని నిర్ధారించిన దైవపుత్రుదు జీసస్ రెండు రోజుల తర్వాత పునరుత్ధానం ద్వారా పైకి లేవడం కూడా ఒక రకంగా పునర్జన్మయే కదా!అర్వాచీన కాలంలో క్రీ.శ19వ శతాబ్దానికి చెందిన Schopenhauer లాంటి అమెరికన్ మేధావులు భారతీయ సంస్కృతి వల్ల్ల ప్రభావితులై ప్రతిపాదించగా Henry David Thoreau,Walt Whitman,Ralph Waldo Emerson లాంటివారు సమర్ధించగా క్రైస్తవ మతం కూడా Francis Bowen ద్వారా ప్రవేశపెట్టబడి Christian Metempsychosis పేరుతో నూతన కాలపు క్రైస్తవంలో పునర్జన్మ సిధ్ధాంతం ఆమోదించబడటం మొదలైంది!

ఆధునిక శాస్తవేత్తలలో పునర్జన్మల గురించి శాస్త్రీయంగా పరిశోధించినది ఒకే ఒక వ్యక్తి - Dr. Ian Stevenson!అక్టోబర్ 31,1918లో పుట్టిన ఈ కెనడియన్ అమరికాలో సైకియాట్రిస్టుగా ప్రఖ్యాతుడై 2007 ఫిబ్రవరి 8న చనిపోయాడు.ఇతను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా కి సంబంధించిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో యాభయ్యేళ్ళు పని చేసినా,1957 నుంచి 1967 వరకూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి శాఖాధిపతిగా పనిచేసినా అందరికీ తెలిసింది మాత్రం పునర్జన్మల గురించి చేసిన పరిశోధనల వల్లనే!పునర్జన్మ సిధ్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,జ్ఞాపకాలు,పుట్టుమచ్చలు,ఇంకా దేహానికి తగిలిన గాయాలు కూడా ఒక జన్మ నుంచి మరొక జన్మకి సంప్రాప్తిస్తాయనే సూత్రీకరణల్ని ఇతను ఆధారాలు చూపించి నిరూపించాడు.నలభయ్యేళ్ళకి పైన ప్రపంచమంతా కాలికి బలపం గట్టుకుని కలయదిరిగి యెక్కడెక్కడ పునర్జన్మకి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చినా వాటినన్నిట్నీ శాస్త్రీయమైన పధ్ధతిలో అవి నమ్మదగ్గవే అని నిర్ధారించుకుని గ్రంధస్థం చేశాడు.

ఇతను సైన్సు అంటే యేమిటో తెలియని నిరక్షర కుక్షీ కాదు,శాస్త్రీయ పరిశోధనలు యెలా జరపాలో తెలియని మూర్ఖుడూ కాదు.ఇతను చేసినది కేవలం రికార్డు చెయ్యటం మాత్రమే,కానీ చాలా ఖచ్చితంగా చేశాడు - అదీ శాస్త్రీయమైన పధ్ధతిలో!ఇతని పరిశోధన ప్రధానంగా పారాసైకాలజీకి సంబంధించిన విషయాలతో మొదలైంది.చాలాకాలం క్రితం నుంచీ చాలామంది శాస్త్రజ్ఞులకి గందరగోళంగా అనిపించి అటుకేసి వెళ్ళకుండా ఉన్నవైపుకి ఇతను ధైర్యంగా వెళ్ళాడు.అప్పటికే కొందరు వ్యక్తులు హిప్నటిక్ ట్రాన్సులో ఉన్నప్పుడు హఠాత్తుగా గతజన్మ జ్ఞాపకాల్ని చెప్పడం జరుగుతున్నది,కానీ ఇతను వాటికి విశ్వసనీయత ఉండదు గనక భౌతికపరమైన ఆధారాల కోసం ప్రయత్నించాడు.అంటే హిప్నటిక్ ట్రాన్సులోకి తీసుకెళ్ళి గతజన్మ వివరాల్ని చెప్పించడం కాకుండా గతజన్మ గురించి చెప్తున్న వాళ్ళు పూర్తి స్పృహలో ఉండి చెప్తున్నవాటిని రికార్డ్ చెయ్యటం,వీళ్ళకి గానీ వీళ్ళ కుటుంబ సభ్యులకి గానీ ఆ గతజన్మ అని చెప్పబడుతున్న వ్యక్తుల గురించి తెలిసే అవకాశం ఉందేమో వెతకటం,ఇక్కడి వ్యక్తుల గురించి యేమీ చెప్పకుండా రెండో చోట వివరాల్ని సేకరించి రెంటినీ పోల్చటం - పూర్తి శాస్త్రీయమీన పధ్ధతిలోనే పని చేశాడు."Either he [Dr. Stevenson] is making a colossal mistake. Or he will be known as the Galileo of the 20th century." Journal of Nervous and Mental Disease అనే సైంటిఫిక్ జర్నలులో Dr Harold Lief వ్యాఖ్యానించాడు!

పునర్జన్మ అనేది ఉన్నదని ఒప్పుకోవటం వల్ల మూఢనమ్మకాలు పెరుగుతాయని భావించి వీటి గురించి నిరాసక్తంగా ఉన్న హేతువాదులైన శాస్త్రజ్ఞులు గానీ క్రైస్తవ మత విశ్వాసాలకి విరుధ్ధమనుకున్న వారు గానీ ఇతని కృషిని తిరస్కరించలేక పోయారు.ఇతను వైజ్ఞానిక ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడని వెక్కిరించడం గానీ ఇతను తిరోగమనవాది అని పేర్లు పెట్టడం గానీ యెవరికీ సాధ్యపడ లేదు!ఎలా జరుగుతున్నదో తెలియడం లేదు గాబట్టి పునర్జన్మ అనేది ఉన్నదని ఒప్పుకుంటే మూఢనమ్మకాలు పెరుగుతాయనే వాదన కాంతిని గురుంచి పరిశోధనలు జరుగుతున్నప్పుడు చేసి ఉంటే ఎలెక్టిక్ బల్బ్ అనేది ఉనికిలోకి వచ్చి ఉండేది కాదు. కాబట్టి పునర్జన్మలను గురించి మనం పట్టించుకోక తప్పదు.పునర్జన్మలు ఉన్నాయని చెప్పడానికి వస్తుగతమైన సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు అది ఎలా జరుగుతున్నదో తేల్చి చెప్పడమే సైన్సు యొక్క లక్ష్యం అయినప్పుడు నిర్లక్ష్యం చెయ్యడం దేనికి?

ఇప్పటి వరకు మనకు తెలిసిన జ్ఞానం యొక్క పరిధికి లోపల ఉన్నవి అర్ధం కావదం కూడా నిన్నటి రోజున జరిగిన శాస్త్రీయమైన పరిశోధనల తర్వాత పెరిగిన జ్ఞానవిస్తృతి వల్లనే అయినప్పుడు పునర్జన్మల గురించి అసలు తెలుసుకోవడానికే అంత సంకోచించడం దేనికి? అది సైన్సును మతపరమైన కోణం నుంచి చూడటం అనే పొరపాటు అవగాహన వల్ల జరుగుతున్నదని అనుకుంటున్నాను నేను. అబ్రహామిక మతాలను అనుసరించేవారిలో కొందరు సైన్సుని ద్వేషిస్తారు,సైంటిస్టులను చంపేశారు,తిరుగు లేని సాక్ష్యాలు దొరికిన తర్వాత కూడా తమ మతగ్రంధాలలో చెప్పిన కొన్ని విషయాలను అసత్యం అని ఒప్పుకోరు.అదే వైదిక ధర్మానుయాయులు సైన్సుని ఏనాడూ ద్వేషించలేదు,సైంటిస్టులని చంపలేదు,భౌతిక సాక్ష్యాలు ఉన్న వైజ్ఞానిక సత్యాలను తిరస్కరించలేదు.

ప్రస్తుతం హేతువాదులు అశాస్త్రీయం అని విమర్శిస్తున్న పురాణకధలు కల్పితాలు అని చాలామంది హిందువులకి తెలుసు.అందరికీ అన్నీ తెలియాలనీ తెలిసి తీరాలనే నియమం లేదు.తమ జీవనం గడవటానికి అవసరమైనంత ధనం సంపాదించి కుంటుంబాన్ని పోషించుకుంటే చాలునని అనుకుంటే దానికి పనికొచ్చేది మాత్రమే తెలుసుకుంటాడు.కాదు, నువ్వు గుమాస్తాగిరీతో సరిపెట్టుకోవటానికి వీల్లేదు, వేదసారం మొత్తం తెలుసుకోవాల్సిందే అని మెడ మీద కత్తి పెట్టి చెప్పటం ధర్మం కాదు.కాబట్టి ఆధ్యాత్మిక వికేంద్రీకరణను పాటిస్తున్న హిందువులలో జ్ఞానానికి సంబంధించిన అంతరువులు ఉంటాయి.

ప్రస్తుతం మనం నివసిస్తున్న భారతాదెశానికి బయట పుట్టిన అబ్రహామిక మతాలలోనూ భారతదేశంలో పుట్టిన జైనం, బౌద్ధం వంటి వైదిక మతాలలోనూ శ్రీవైష్ణవం,వీరశైవం వంటి వైదిక సంప్రదాయంలోనివే అయిన మతశాఖలలోనూ ఆయా మతస్థాపకులకు విధేయత పాటించడం తప్పనిసరి.వాటన్నిటిలోనూ తర్కానికి నిలవని సంగతులు ఉన్నప్పటికీ మతస్థాపకులూ మతప్రచారకులూ చెప్పారు గాబట్టి నమ్మితీరాలనే నిబంధనలూ ఉన్నాయి, ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితి కూడా ఉంది.వ్యక్తిగత స్థాయిలో వాటిని సమర్ధించను గానీ వ్యతిరేకించడం కూడా చెయ్యను.ఆయా మతాలకు చెందిన  వాళ్ళు వైదిక ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు ఆత్మరక్షణ కోసం ధర్మరక్షణ కోసం ప్రతిదాడి చెయ్యడం తప్ప వాటిపట్ల ద్వేషం లేదు నాకు.జ్ఞానంలో అంతరువులు ఉంటాయని ఒప్పుకున్నప్పుడు వారి జ్ఞానానికి తగ్గ అంతరువులో వారు ఉన్నారని సరిపెట్టుకోవడం తప్ప వారిని ద్ధరుంచాలనేది పేరాశయే అవుతుంది.కానీ, ప్రతి హిందువూ శాస్త్రీయత లేని ఆధ్యాత్మికత వ్యర్ధం అనేది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.

వైదిక ధర్మం యొక్క మూలసారం అయిన కర్మయోగం యొక్క ప్రభావం లేని యూదు, క్రైస్తవ, ఇస్లాం,లూసిఫరియన్ అనే నాలుగు అబ్రహామిక మతాల యొక్క మూలగ్రంధాలు ఒక జీవికి ఒక జన్మయే ఉంటుందని చెప్తాయి.మానవుడు కాని ఇతర జీవులకు అసలు ఆత్మ గానీ భాగవత సంబంధం గానీ లేదని చెప్తాయి.ఉన్నది ఒక్కటే జన్మ కాబట్టి ఈ జన్మలో తమ దేవుణ్ణి నమ్ముకుంటే మరణాంతరం శాశ్వత స్వర్గ ప్రాప్తి కలుగుతుందనీ తమ దేవుణ్ణి నమ్మనివారికి శాశ్వత నరక ప్రాప్తి కలుగుతుందనీ చెప్తాయి.ఆయా మత విశ్వాసాల మధ్య పెరిగిన శాస్త్రజులు కూడా ఆ పరిధికి మించి ఆలోచించకపోవటం సహజమే.Stevenson నమోదు చేసిన వివరాల లోని "ఒక మనిషికి మరణం తర్వాత శాశ్వత స్వర్గం లేక శాశ్వత నరకం గాక తిరిగి భూమి మీదనే మరొక జన్మ ప్రాప్తించడం" అనే దృగ్విషయం అబ్రహామిక మతభావనలను శాస్త్రీయమైనవి అని భావించేవారికి అశాస్త్రీయమైనది అనిపించడం కూడా సహజమే!అదే వైదిక ధర్మం యొక్క మూలసారం అయిన కర్మయోగం యొక్క ప్రభావం ఉన్న బౌద్ధం, జైనం వంటి మతాల యొక్క మూలగ్రంధాలు పునర్జన్మలను అంగీకరించడమే గాక తమ ధార్మిక సాహిత్యంలో హిందూ ధార్మిక సాహిత్యం కన్న కొంత ఎక్కువ ప్రాముఖ్యతను కూడా ఇచ్చాయి.

పునర్జన్మల మీద పరిశోధన చెయ్యడానికి ఉన్న మొదటి అవరోధం ఒక జన్మ యొక్క జ్ఞాపకాలు మరు జన్మకు ఎలా సంక్రమిస్తున్నాయనేది భౌతికపరమైన సాక్ష్యాలు లేని అమూర్తమైన విషయం కావడం, అవునా?నిజానికి ఇప్పుడు మనం ఉన్న దాన్ని వ్యక్తం అని అనడం వల్ల వ్యక్తమాన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దృగ్విషయానికీ భౌతికపరమైన అస్తిత్వం ఉంది, ఉంటుంది, ఉండి తీరాలి.ఆలోచనలకూ అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ రూపం ఉంది - అవి మెదడులో నిక్షిప్తం అయ్యేది వస్తుగతమైన రూపంలోనే!మనం ఈరోజున మన చుట్టు ఉన్న ప్రపంచాన్ని గుర్తు పట్టడానికి ముందు ఏం జరుగుతున్నది?పసితనంలో ఒక ముఖం పదే పదే మనకు కనిపిస్తున్నప్పుడు "అమ్మ!" అనే పదాన్ని వింటూ ఉండడం వల్ల ఆ ముఖానికి సంబంధించిన సమాచారం మెదడులో ఒక చోట ఒక ప్రత్యేకమైన అమరికను నమోదు చేసి దానికి "అమ్మ" అనే పదాన్ని సూచికలా తగిలిస్తుందని నాడీశాస్త్రం విశ్లేషించి చెప్తున్నది.న్యూరాలజీ అనే సైన్సు ఇప్పటికీ ప్రాధమిక దశలోనే ఉంది కాబట్టి ఆలోచనలకూ అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ ఉన్న భౌతిక రూపాన్ని కంటితో చూడటం కుదిరే పని కాదు.

భవిష్యత్తులో అయితే చూడగలిగే అవకాశం ఉంది.దానికి న్యూరాలజీ అనే శాఖ చాలా ముందుకు వెళ్ళాలి.ప్రస్తుతానికి న్యూరాలజీ అనేది న్యూరో ఫిజిక్స్, న్యూరో కెమిస్ట్రీ, న్యూరో సైకాలజీ అనే శాఖల కింద విడిపోయి ఎదుగుతున్నది. పునర్జన్మలకి సంబంధించిన దృగ్విషయాల్ని ఆయా శాఖల పరిజానం వెలుగులో పరిశీలిస్తే కొంత మేరకు గందరగోళం తగ్గి ఒక స్పష్తమైన వగాహన కుదిరే అవకాశం ఉంది.

ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నేను అప్పటికి కాంతి అనే శక్తి ఫోటాన్లు అనే యూనిట్ల గుంపులా ప్రయాణిస్తుందని తెలిసిన దాన్ని బట్టి ప్రాణం అనే శక్తి బయాన్లు అనే యూనిట్ల గుంపులా ప్రయాణిస్తుందని వూహించాను.ఈ వూహ ఇప్పటికీ కొత్తదే, ఇతరులు ఎవరూ ఇలా ఆలోచించడం లేదు.ఇప్పటికీ శాస్త్రజ్ఞులు సైతం ఇలాంటి వూహల్ని చెయ్యడం లేదు.నాకు వచ్చిన వూహ చెత్తది మాత్రం కాదు.అది అర్ధం కావాలంటే అప్పుడు నేను ప్రాణశక్తిని పోల్చిన కాంతిశక్తిని గురించి ఇప్పుడు సైన్సు ఏం చెప్తుందనేది తెలియాలి.

ఒకానొకప్పుడు, క్రైస్తవం పుట్టుకతో మొదలై దాదాపు భారతేతర ప్రాచీన నాగరికతలను మటుమాయం చేసిన ఆ వెయ్యేళ్ళ అంధతమస్సు అంతరించి తొలి వైజ్ణానిక ఉషస్సులు పొటమరించిన 17వ శతాబ్దపు మలి సంధ్య నాడు ఐజాక్ న్యూటన్ తన OPTICKS:OR, A TREATISE OF THE REFLEXIONS,REFRACTIONS,INFLEXIONS AND COLOURS OF THE LIGHT  అన్న పరిశోధనాత్మక వ్యాసంలో కాంతిని particle అని చెప్తున్న సమయానికే Christiaan Huygens తన Traité de la Lumière/Traetise on Light (1690) అన్న అన్న పరిశోధనాత్మక వ్యాసంలో కాంతిని wave అని చెప్తున్నాడు.

"కోడి ముందా?గుడ్డు ముందా!" అనే ప్రశ్నకి ఇప్పటి వరకు ఎవరూ జవాబు చెప్పలేదు.అది సరదా ప్రశ్న అనుకున్న వాళ్ళు అసలు పరిశోధనకి దిగలేదు.అది గంభీరమైన ప్రశ్న అనుకున్న వాళ్ళు పరిశోధించారు గానీ ఒక జవాబు దొరక లేదు."కాంతి తరంగమా?లేక పదార్ధమా!" అనేది కూడా అలాంటి చిక్కునే ఎదుర్కొంటున్నది.అయితే గియితే 1801ల నాడు Thomas Young చేసిన రెండు చీలికల ప్రయోగాన్ని కాంతి యొక్క తరంగ స్వభావాన్ని నిర్ధారించడం కోసమే చేశాడు గానీ ఫలితంలో కనిపిస్తున్న ఒక ద్వైదీభావం కొత్త వింతల్ని పుట్టించింది.మొదటి రోజుల్లో కాంతి తరంగమే తప్ప పదార్ధం కాదు అని టాపు లేపేసిన ప్రయోగం కాస్తా తర్వాత జరిగిన అతి ముఖ్యమైన Photoelectric effect అనే కోణం నుంచి చూస్తే టెంకి జెల్ల తినేసి మళ్ళీ "కాంతి తరంగమా?లేక పదార్ధమా!" అని తేల్చుకోలేని స్థితి దాపరించింది వైజ్ఞానిక లోకానికి.ఈ అహమహమిక మకతికా తికమకను తొలగించడానికి quantom theory/గుళికా సిద్ధాంతం ఆవిర్భవించింది.

ఇంతకీ, ప్రయోగం చాలా ఖచ్చితమైనదని అందరు శాస్త్రజ్ఞులూ ఒపుకుంటూనే మొదట అది కాంతి తరంగం అని సాక్ష్యం చూపించేసినదని బల్ల గుద్ది చెప్పేసిన చాలా కాలం తర్వాత ప్లేటు ఫిరాయించేసి కాంతి కిరణాలు తలిదండ్రులు తమను గమనిస్తున్నారని తెలిసినప్పుడు ఒకలానూ తలిదండ్రులు తమని గమనించట్లేదని తెలిసినప్పుడు ఒకలానూ ప్రవర్తించే అల్లరి పిల్లలను తలపిస్తున్నాయని ఎందుకు మాట మార్చేశారు?

నమ్మట్లేదు కదూ!Anil Ananthaswamy అనే మేధావి చెప్తున్నది ఇలా ఉంది:18వ శతాబ్దం నాటి Thomas Young మొదలు క్వాంటం ధియరీ మీద పరిశోధనలు చేస్తున్న శాస్తజుల వరకు ఎందరో ఇదే ప్రయోగాన్ని తమకు అనుకూలమైన మార్పులు చేసుకుని ఉపయోగించుకున్నారు.కాంతిని ఒక చీలిక నుంచి పంపినప్పుడు ఒక రకమైన అమరికనీ రెండు చీలికల నుంచి పంపినప్పుడు మరొక రకమైన అమరికనీ చూపించటం వరకు అన్ని చోట్లా అందరికీ ఒకే ఫలితం వస్తున్నది.రెండు చీలికల నుంచి పంపినప్పటి interference కూడా ఒకేలా ఉంది.1924ల నాడు Louis de Broglie వంటి వారూ కూడా ఎలెక్ట్రాన్లను పంపించినప్పుడు సైతం ఇదే interference pattern కనిపిస్తుందని ఒప్పుకున్నారు.

అయితే, తరవాత దశలో మరింత ఖచ్చితత్వం కోసం కాంతి రేణువుల్ని ఒక్కొక్క సారి ఒక్కొక్కటి చొప్పున పంపినప్పుడు కొన్ని విడతల తర్వాత కాంతి తరంగం అయినప్పుడు కనిపించాల్సిన interference pattern కనిపిస్తున్నది,ఏమిటీ వింత, రేణువులు వాటిలో అవి interfere అవుతున్నాయా!ఇదే వింత అనుకుంటే ఈ వింతను పట్టేద్దామని ఒక detector అనే దాన్ని పెట్టి చూశారు.ఇప్పుడు interference లేదు,కాంతి యొక్క తరంగ స్వభావం పోయింది!సరే, అనుకుని detector అనే దాన్ని తీసి చూశారు.ఇప్పుడు interference వచ్చింది,కాంతి యొక్క రేణువు స్వభావం పోయింది!

“It’s not the physical act of measurement that seems to make the difference, but the act of noticing!” అని అంటున్నది మనబోటి హిందూమతత్వవాది కాదు, బాబు గోగినేని లాంటి హేతువాద సిద్ధాంతి కాదు - క్వాంటం ఫిజిక్స్ అనే వైజ్ఞానిక శాఖకు మూలస్తంభం అయిన Werner Heisenberg అనే మహామేధావితో చాలా కాలం పాటు కలిసి పనిచేసిన Carl von Weizsäcker అనే భౌతిక శాస్త్రవేత్త! ఆధునిక విజ్ఞాన శాస్త్రం భౌతిక అస్తిత్వం లేనిదాన్ని గుర్తించటానికి ఇష్టపడటం లేదు గానీ కాంతి అలా ప్రవర్తించడం వెనక కాంతికి కూడా తను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఫలితాన్ని చూపించాలి అనే నియమాలు ఉన్నాయని తెలుసుకుని తన ముందు ఉన్న సంభావ్యతలలో సరైన దానిని ఎంచుకునే జ్ఞానం ఉంది అని ఒప్పుకోవాలి.

అలా కాక పోతే detector లేనప్పుడు ఒకలా ప్రయాణించిన కాంతి detector ఉన్నప్పుడు అలా ప్రయాణించకపోవడానికి హేతుబద్ధమైన కారణం చెప్పాలి.ఇప్పుడు నేను జీవశక్తికి బయాన్ అనే రూపం ఎందుకు ప్రతిపాదించానో అర్ధమై వుండాలి మీకు.ఒక జీవి పుట్టినది మొదలు గిట్టబోతున్న క్షణం వరకు ఆ జీవి యొక్క ఆలోచనలకూ అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ రూపం ఉంది - అవి మెదడులో నిక్షిప్తం అయ్యేది వస్తుగతమైన రూపంలోనే!వయస్సు ముదిరి ముదిమి వల్ల గానీ ప్రమాదం వల్ల గానీ జీవి మరణించినప్పుడు వాటిని తనలో నిక్షిప్తం చేసుకున్న జీవశక్తి ఆ జీవి యొక్క దేహాన్ని వదిలి విశ్వంలోకి ప్రవేశిస్తుంది.అలా విశ్వంలోకి చేరిన ఆ జీవశక్తి వెనువెంటనే గానీ సమయ విలంబంతో గానీ ఒక స్త్రీ గర్భంలో అంకురిస్తున్న బీజరూపంలోకి ప్రవేశించినప్పుడు ఆ జీవశక్తి ప్రాబడిన వస్త్రాలను విడిచి క్రొత్తవి ధరించినట్లు  నూత్నదేహధారి అవుతుంది.

ఒక జీవి పుట్టినది మొదలు గిట్టబోతున్న క్షణం వరకు ఆ జీవి యొక్క ఆలోచనలకూ అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ వైదిక ఋషులు వాసనాత్రయం అని పేరు పెట్టారు.ఇప్పుడు మనం జీవుల దేహంలో జరిగే జీవన క్రియల్ని స్థూల పరిచయం చేసుకుంటే గానీ ఇది అర్ధం కాదు. నేను అప్పుడప్పుడు హిందూమతద్వేషుల్లో కొందర్ని "గొట్టాం!" అని తిడుతున్నాను గానీ శాస్త్రం ప్రకారం మనం కూడా గొట్టాలమే!మనమే కాదు అన్ని జీవులూ గొట్టాలే - హైడ్రా వంటి సీలెంటిరేట్స్ తప్ప ప్రతి జీవికీ మూతి ఇటువైపునా ముడ్డి అటువైపునా ఉన్న గొట్టం చుట్టూ ఇతర అవయవాలు అతుక్కుని ఉన్నాయి.ఒక రంధ్రం ఆహారాన్ని లోపలికి పంపిస్తే ఒక రంధ్రం జీర్ణం కాని మలినాల్ని బయటికి పంపిస్తుంది.ఇదేమీ లెక్కా డొక్కా లేని యవ్వారం కాదు.తిని కూర్చోవడం కాదు, ప్రతి గొట్టామూ విశ్వంలో ఉన్న సమతౌల్యాన్ని నిలబెట్టటానికి తన వంతు పని చెయ్యాలి.వీటిని కొనసాగించడం కోసం ప్రతి జీవిలోనూ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి.మొదటిదైన ఆహారాన్ని వినియోగంలోకి తెచ్చేది జీర్ణ వ్యవస్థ.ఆహారాన్ని దహించి ప్రాణశక్తికి చైతన్యాన్ని కలిగించే ఇంధనాన్ని సమకూర్చే శ్వాసకోశ వ్యవస్థ ఉన్నది.ఆహార వినియోగం వల్ల ఒకచోట పుట్టిన శక్తిని అన్ని చోట్లకీ పంపించడానికి రక్తప్రసరణ వ్యవస్థ ఉన్నది.జీవి యొక్క చలనానికి దోహదం చేస్తున్న కండరాల వ్యవస్థ ఉన్నది.వీటికి పైన పూలదండలోని దారంలా సమాచారం అందించి సమన్వయం చేసే నాడీ వ్యవస్థ ఉన్నది.మెదడు ఈ నాడీ వ్యవస్థ లోని అతి ముఖ్యమైన ఒక భాగమే కానీ మెదడు ఒకటే నాడీ వ్యవస్థ కాదు.

దేహానికి బయట నుంచి మనకు తగిల్తే చర్మాన్ని కాల్చి పారేస్తున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ మన దేహం లోపల పుట్టి కొన్ని మంచి పనులు చేస్తుందని ఎంతమందికి తెలుసు?అట్లాగే మనకు నిద్ర అనేది చలనానికి కారణమైన కండరాలు అలిసిపోయినప్పుడు పుట్టిన ల్యాక్టిక్ యాసిడ్ శాతాన్ని తగ్గించడం కోసం ప్రకృతి జీవులకు చేసిన ఏర్పాటు అని ఎంతమందికి తెలుసు.బయటి నుంచి తీసుకున్నప్పుడు అవధి లేని మత్తును కలిగించి భ్రమలకు దాసుల్ని చేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న మార్ఫిన్ వంటివే అయిన ఎండార్ఫిన్లు దేహం లోపల పుట్టినప్పుడే మనకు ఆనందానుభూతులు కలుగుతాయనేది ఎంతమందికి తెలుసు?ఈ ప్రత్యేకమైన ద్రవాల్ని స్రవించే దేహభాగాల్ని గ్రంధులు అంటారు.జీర్ణ గ్రంధులు జీర్ణ రసాల్ని స్రవిస్తాయి.క్లోమ గ్రంధి క్లోమ రసాన్ని స్రవిస్తుంది.ఏ రసం ఎక్కడ పని చేయాలో అక్కడికి చేరుకోవడానికి గ్రంధి నుంచి నాళం ఉన్నవాటిని సనాళ గ్రంధులు అయితే నాళం లేని వాటిని వినాళ గ్రంధులు అంటారు.వినాళ గ్రంధుల నుంచి స్రవించే వాటిని రక్తం మోసుకుంటూ తిరుగుతుంది.ఆ రసం ఎక్కడ ఏ పని చెయ్యాలో అక్కడికి రక్తం చేరుకున్నప్పుడు ఆ అవయవంలో ఆ రసం యొక్క స్పర్శ తగిలినప్పుడు జరగాల్సిన పనులు జరుగుతాయి.ఆ అవయవంలోనే రక్తంలో ఆ రసం యొక్క ఉనికిని తెలుసుకునే ఏర్పాటు ఉంటుంది.

ఇటువంటి వినాళ గ్రంధులు మానవ దేహంలో ఎనిమిది ఉన్నాయి.Pineal gland,Hypothalamus,Pituitary gland, Thyroid gland and Parathyroid, Thymus gland, Adrenals, Pancreas, Ovaries and Testes అనేవి అతి ముఖ్యమైన వినాళ గరంధులు.ఇవి కాక కాలేయం లాంటి సనాళ గ్రంధులు వినాళ గ్రంధుల పరిధి లోకి కూడా వస్తాయి. వీటిలో Testes and Overies అనేవి స్త్రీ పురుషుల లైంగీక్ ద్విరూపకతకు సంబంధించిన దేహధర్మాలను శాసిస్తాయి.estrogen,progesterone అనేవి స్త్రీల దేహంలో కనబడే సౌకుమార్యాన్నీ ఆకర్షణీయతనీ ఋతుచక్రాన్నీ ప్రభావితం చేస్తాయి.testosterone అనేది పురుషులకు ఆకర్షణను పెంచే కండరాల ఆకృతినీ మీసాలూ గడ్డాలూ వంటివాటిని పెంచి అంగస్తంభననూ శుక్లకణవృద్ధినీ శాసిస్తుంది.క్లోమము  Pancreas జీర్ణ వ్యవస్థకు చెందిన ఒక క్లిష్టమైన గ్రంథి.ఆల్ఫా, బీటా, డెల్టా కణజలాలు ఉన్నాయి. ఆల్ఫా కణాలు గ్లుకగాన్ అనే హార్మోనుని స్రవింపజేస్తాయి. బీటా కణాలు ఇన్సులిన్ అనే హార్మోనుని స్రవింపజేస్తాయి. డెల్టా కణాలు సొమటోస్టాటినుని స్రవింపజేస్తాయి.adrinal అనే అధివృక్క గ్రంధులు హృదయస్పందననీ శ్వాసక్రియనీ అదుపు చేస్తాయి.మూత్రపిండాలకు పైన ఉంటుంది.హఠాత్ సంఘటనలకి మన ప్రతిస్పందనని ప్రభావితం చేస్తాయి గనక వీటిని fight or flight గ్రంధులు అని కూడా అంటారు.Thymus ఆనెది తెల్ల రక్త కణాల్ని తయారు చేస్తూ రోగ నిరోధక శక్తిని ఉద్దీపింప జేస్తుంది.చిన్నప్పుడు దీని అవసరం ఏక్కువై ఉండి యుక్త వయస్సు వచ్చేసరికి దీని ప్రాధాన్యత తగ్గి క్షీణించి పోతుంది.Thyroid,paarthyraid అనే అవటు గ్రంధులు గొంతు భాగం వద్ద ముందుకు పొడుచుకు వచ్చి కనబడుతాయి.సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఇది అతి పెద్ద వినాళ గ్రంధి.అవటు గ్రంధి అయోడిన్ కలిగిన ధైరాక్సిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది.ఇది సాధారణ జీవక్రియా వేగాన్ని నియంత్రిస్తుంది.థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు ప్రతికణం పైనా ప్రభావం చూపిస్తాయి.

ఇక, Pituitary,Hypothalamus,Pineal గ్రంధులు మెదడు యొక్క ముడతల మధ్యన ఇరుక్కుని మెదడుకు అంటుకుపోయి ఉండి శరీరం యొక్క అన్ని సనాళ, వినాళ గ్రంధులను నియంత్రిస్తూ ఉంటాయి.Pituitary అని అంటున్న పియూష గ్రంధి అనేది ఎడినోహైపోఫైసిస్, న్యూరోహైపోఫైసిస్ అనే రెండు తమ్మెల కలయిక వల్ల ఏర్పడుతుంది.పరిమాణంలో అన్నిటికన్న చిన్నది గానీ ఇతర గ్రంధులను కూడా శాసిస్తున్న దీని ప్రాధాన్యతను బట్టి ఆ జీవి యొక్క ప్రవర్తన దీని పని తీరు వల్లనే ప్రభావితం అవుతుంది.Hypothalamus తను మిగిలిన శరీరాన్ని నియంత్రించదు గానీ మొత్తం వినాళ గ్రంధుల వ్యవస్థను మెదడుకు అనుసంధానిస్తుంది.

వీటన్నిటికి పైన ఉన్న Pineal అనేది చాలా కీలకమైన వినాళ గ్రంధి. ఇప్పటివరకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆధునిక పాదార్ధ విజ్ఞాన శాస్త్రం తెలుసుకోలేని అత్యంత గహనమైన విషయాలలో ఈ అవ్యక్త వినాళ గ్రంధి ఎలా పని చేస్తుంది అనేది కూడా ఒకటి.దాదాపు అందరు శాస్త్రజ్ఞులూ ఇది Melatonin అనే హార్మోనును స్రవిస్తుందనీ దివారాత్రాల చక్రానికి జీవుల్ని అనుసంధానం చేసి రాత్రి సమయానికి నిద్రించేలా పగటి సమయానికి మేల్కొనేలా చేస్తుందనీ తప్ప ఎక్కువ చెప్పడం లేదు.అందుకే ప్రాచీన భారతీయ విజ్ఞానులు దీనిని అవ్యక్త గ్రంధి అన్నారు కాబోలు!

విశ్వానికి కేవలం భౌతిక అస్తిత్వం మాత్రమే ఉందని భావించని ఆధ్యాత్మిక ప్రపంచం దీనిని మానవ దేహంలోనే ఉన్న శివుడి త్రినేత్రంతో సమానమైన అనంత శక్తి ప్రదాత అంటున్నారు.ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక వేత్తలు అందరూ దీని గురించి ఒకేలా చెప్తున్నారు. 1500వ శతాబ్ది కాలం నాటి Rene Descartes అన్న పేరు గల ఫ్రెంచ్ వేదాంతి అవ్యక్త గ్రంధిని The seat of the Soul అని వర్ణించాడు.

ప్రాచీన కాలపు ఈజిప్షియన్ సంస్కృతికి సంబంధించిన పౌరాణిక సాహిత్యంలోని Horus అనే దేవతామూర్తికి కూడా మూడవ కన్ను ఉంటుంది.దానిని కూడా అవ్యక్త గ్రంధికి సూచన కింద వర్ణిస్తారు.ప్రాచీన భారతీయ యోగశాస్త్రం మానవ దేహంలోని చక్రాలను వర్ణిస్తూ చెప్పిన ఆజ్ఞాచక్రం గురించి clarity, concentration, imagination, intuition, spiritual perception, universal connection అనేవాటిని శాసిస్తుందని చెప్పినవి అవ్యక్త గ్రంధికి కూడా వర్తిస్తున్నాయి.

The morphological and functional characteristics of the pineal gland అన్న తలకట్టుతో 2019 నాటి ఒక పరిశోధన సైతం pineal bodyని photo-neuro-endocrine transducer అని వర్ణించింది.ప్రతి పరిశోధనా పత్రం తన ముఖ్యమైన పరిశోధన గురించి ప్రధానమైన వివరాలే గాక కొన్ని ఇతర విషయాలను సైతం ప్రస్తావించే సంప్రదాయం చొప్పున “A forensic study published by Kurtulus Dereli et al. in 2018, analyzed the role of the pineal gland in suicide victims. The secretory activity of melatonin was quantified and proved to be low in patients that have committed suicide” అని వ్యాఖ్యానించింది.చివరన “It offers information on circadian and seasonal rhytms, thus connecting the outside world with the internal physiological and biochemical needs. Its role is embedded deep in complex neurological, endocrinological and psychiatric conditions and processes” అని ముక్తాయింపు ఇచ్చింది.అవ్యక్త వినాళ గ్రంధికి సంబంధించిన సమాచారం అన్ని మతశాఖలకు సంబంధించిన ప్రాచీన ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ అన్ని ఆధునిక పదార్ధ విజ్ఞాన శాస్త్రపు సూత్రీకరణలలోనూ ఒకలానే కనబడుతున్నది.

ఉండటానికి అన్ని జీవుల్లోనూ ఉంటుంది గానీ అది పూర్తి చైతన్య స్థితిలో ఉండదు అనేది అర్ధం పర్ధం లేని మూఢనమ్మకం మాత్రం కాదు.సుప్తావస్థలో ఉన్నప్పుడే మన దేహాన్నీ మనస్సునీ ఇంత ప్రభావితం చేస్తున్న అవ్యక్త గ్రంధిని గనక మనం చైతన్యవంతం చేసి మన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే విశ్వం నుంచి మనకు అవసరమైన ఆరోగ్యం,సంపద, నాయకత్వం, అధికారం, వైభవం వంటివి కోరుకున్న వెంటనే ప్రాప్తిస్తాయి.అయితే, దీనిని చైతన్య పరచటానికి ఉన్న ఓకే ఒక ప్రక్రియ యోగశాస్త్రంలో ఉంది.పద్మాసనం, చక్రాసనం, ఉష్ట్రాసనం వంటివి నేర్పించడం అసలైన యోగసాధనకు సాధకుణ్ణి సిద్ధం చేసే ప్రాధమికమైన తంతు మాత్రమే.అసలైన యోగశాస్త్రం మనస్సుని కేంద్రీకరించడం గురించి చెప్తుంది.చాలామంది యోగం సిద్ధించడం అంటే ఆలోచన లేని స్థితి అనుకుంటారు.కానీ అది చాలా తప్పు.జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క మేదడూ ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది, చెయ్యాలి కూడా.ఆలోచన లేకపోవడం అంటే బాల్చీ తన్నెయ్యడం కింద లెక్క వేసుకోవాల్సిందే!

అందుకే, యోగశాస్త్రం "ఆలోచన అంటే ఏమిటి?అది ఎలా పుడుతుంది?ఒక లక్ష్యం అనేది ఉన్నదని తెలిసి కూడా మనస్సు లక్ష్యానికి దూరం చేసే ఆలోచనల్ని ఎందుకు చేస్తుంది?లక్ష్యాన్ని చేరుకోవటానికి వ్యతిరేకమైన చెడు ఆలోచనల్ని అణిచి వెయ్యటం ఎట్లా?" అనే ప్రశ్నలకు సతార్కికమైన విశ్లేషణతో జవాబులు చెప్తుంది.యోగసాధన త్వరిత ఫలితం ఇవ్వాలంటే గురుముఖతః నేర్చుకుని శాస్త్రం ప్రకారం వెళ్ళాలి తప్ప అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా చదివేసి స్వయంపాకం చేస్తే అసలు వ్రతమే చెడుతుంది, ఇక ఫలితం ఎలా వచ్చి ఛస్తుంది?

ఆధునిక వైద్యశాస్త్రంలో పీనియల్ గ్రంధిని గురించి తెలుసుకున్న కొత్త విషయాలతో Chronomedicine అనే ఒక కొత్త శాఖను ప్రారంభించారు. ముగ్గురు researchers కలిసి clock proetein అనేదాన్ని కనుక్కుని 2017 నాటి Physiology and Medicine విభాగం క్రింద నోబెల్ బహుమతిని అందుకున్నారు.ఇలాంటి చెదురు మదురు ఆవిష్కరణలు చెయ్యడం తప్ప ఆధునిక వైద్యశాస్త్రం అవ్యక్త గ్రంధిని గురించి ఎక్కువ చెప్పడం లేదు.అయితే, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నవారికి ప్రాచీన కాలం నుంచీ అవ్యక్త గ్రంధిని శాసించడం అనేది ఒక లక్ష్యం అయినట్టు ఈజిప్షియన్, రోమన్, చైనీస్ తదితర ప్రాచీన సంస్కృతులను గురించి పరిశోధన చేసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.ఈజిప్షియన్లు దీనిని Eye of Horus అని పిలిచారు.నిజానికి ఆధునికులు పెట్టిన pineal gland అనేది ఫ్రెంచ్ భాషకు సంబంధించినది - వారికి అది pinecone ఆకారంలో కనపడి అలా పెట్టారు.

దాదాపు అన్ని సంస్కృతులలోనూ ఒకే విషయాలు చెప్పడం వల్లనూ అవి భారతీయ యోగశాస్త్రం చెప్తున్న విషయాలతో సరిపోలుతూ ఉండటం వల్లనూ దీనికి సంబంధించిన జ్ఞానాన్ని వృద్ధి చేసినది వైదిక ఋషులే అని నమ్ముతున్నాను నేను.ప్రాచీన భారతీయ వైజ్ఞానిక శాస్త్రాలలో ఆయుర్వేదం శరీరాన్ని నియంత్రించడం గురించి చెప్తుంది, యోగశాస్త్రం మనస్సును నియంత్రించడం గురించి చెప్తుంది.మనస్సును నియంత్రించడం అంటే అవ్యక్త గ్రంధిని నియంత్రించడమే కదా!

అవ్యక్త గ్రంధిని మనం నియంత్రించడానికి ప్రయత్నించే ముందు అవ్యక్త గ్రంధి మనస్సును ఎలా నియంత్రిస్తుందో తెలుసుకోవాలి.మన శరీరంలో కుండలిని నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాలలో ఆజ్ఞా చక్రం యొక్క స్థానం కూడా అవ్యక్త గ్రంధికి సమీపంలో ఉంటుంది. అవ్యక్త గ్రంధి చైతన్యవంతం అయిన మనిషి ఆలోచనలలో స్పష్టత(clarity) ఉంటుంది, లక్ష్యం పట్ల ఏకాగ్రత(concentration) పెరుగుతుంది, ఆశావహమైన వూహాత్మక శక్తి(imagination) విస్తృతం అవుతుంది, ఇంద్రియాతీతజ్ఞానగ్రాహ్యత(intution) అనుభవంలోకి వస్తుంది,ఆధ్యాత్మిక దృష్టి(spiritual perception) మెరుగు పడుతుంది, విశ్వలయను పట్టుకుని విశ్వంతో సరైన తీరున అనుసంధానం(universal connection) ఏర్పరచుకోగలిగి ఇతరులకు అసాధ్యం అనిపించే దుష్కరమైన కార్యాలను సైతం అత్యంత లాఘవమైన తీరున సుసాధ్యం చేస్తాడు.Tesla, Einstein, Heisenberg, Shrodinger వంటివారికి వేదవిజ్ఞానం గురించి తెలుసు. Leonardo Da Vinci యొక్క సృజనాత్మకత వెనుక ఉన్నది వేదవిద్యను అనుసరించి అవ్యక్త గ్రంధిని చైతన్యవంతం చెయ్యగలిగిన యోగశాస్త్రమే!

అవ్యక్త గ్రంధిని మన అధీనంలోకి తెచ్చుకోవడానికి నిశ్చల ధ్యానం, దీపదర్శనం, మంత్రపఠనం అనేవి అత్యుత్తమమైన సాధనాలు.అవ్యక్త గ్రంధిని చైతన్యవంతం చేసుకోవడానికి మన శరీరం ఒక్కటే పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, మన చుట్టు ఉన్న వాతావరణంలోని అతి సూక్ష్మమైన స్థాయిలోని కాలుష్యం కూడా అవ్యక్తగ్రంధిని బలహీనం చేస్తుంది.ప్రస్తుతం మనం అనుసరిస్తున్న యాంత్రిక నాగరికత విడుదల చేస్తున్న flouride అనే antioxidant అవ్యక్త గ్రంధిని సుప్తంగా కూడా ఉండనివ్వక బలహీన పరచడం వల్లనే ప్రజల్లో మానసిక రుగ్మతలు అంతకంతకు పెరుగుతున్నాయి.ఇదే కాదు, కోక్ కలుపుతున్న పానీయాలలో వాడుతున్న ఆర్సెనిక్ అవ్యక్త గ్రంధికి ఫ్లోరైడ్ కన్న పదింతలు హాని చేస్తుంది.చెవులు బద్దలయ్యే ధ్వనులు గాక శ్రావ్యమైన సంగీతం వినడం అవ్యక్త గ్రంధిని చైతన్యం చేస్తుంది.అమృతం అనేది యోగసాధన ఫలవంతమై మానసిక శక్తులు మన స్వాధీనంలోకి వచ్చిన అనుభూతి కలిగినప్పుడు అవ్యక్త గ్రంధి స్రవించిన seratonin, melatonin వంటి ఎంజైములు కలిసిన జీవద్రవ్యమే!

ఫలానా పని చేస్తే పుణ్యం వస్తుంది, ఫలానా పని చేస్తే పాపం వస్తుంది అంటే తూనా బొడ్డని వెక్కిరించే హేతువాదులు సైతం ఫలానా పని చేస్తే లాభం వస్తుంది, ఫలానా పని చేస్తే నష్టం వస్తుంది అని చెప్తే వెక్కిరించరు - కనీసం మనం లాభం వస్తుందని చెప్పిన పనిని చేసి చూసి నష్టం వస్తే నిలదీస్తారు, కదా!ఎందుకని?పాప పుణ్యాలకు మనం వాటిని నమ్మడంతో సంబంధం లేని భౌతిక అస్తిత్వం లేదు. లాభ నష్టాలకు మనం వాటిని నమ్మడంతో సంబంధం లేని భౌతిక అస్తిత్వం ఉన్నది.కొందరు ఇప్పుడు తమను పట్టి పీడిస్తున్న దరిద్రం గత జన్మలో చేసిన పాపానికి దేవుడు వేసిన శిక్ష అని సరిపెట్టుకుని అసలు ఆ దరిద్రాన్ని మూలం ఏమిటో తెలుసుకుని వదిలించుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్యని అజ్ఞానంతో బతికేస్తున్నారు.తమ గత జన్మ గురించి ఎలా తెలిసింది వారికి?కొందరు ఇప్పుడు తమకు కోరుకున్నదే తడవు దక్కుతున్న వైభవాలకి గత జన్మలో చేసిన పుణ్యాలకి దేవుడు ఇచ్చిన వరం అని విర్రవీగుతూ అసలు ఆ వైభవాలకి మూలం ఏమిటో తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్యని అజ్ఞానంతో బతికేస్తున్నారు.తమ గత జన్మ గురించి ఎలా తెలిసింది వారికి? జ్యోతిషం వంటి గణితశాస్త్ర పునాది ఉన్న వైదిక శాస్త్రాలను తమ పొట్ట కూటి కోసం వక్రీకరించుతున్న దురాశాపరులు చెప్పిన అభూతకల్పనలే తప్ప అవి బుద్ధిజీవులు నమ్మాల్సిన విషయాలు కావు.

అంత మాత్రం చేత అవ్యక్త గ్రంధి ప్రస్తుత జన్మ యొక్క దేహాన్ని విశ్వలయతో అనుసంధానించడానికీ గత జన్మ యొక్క ఆలోచనలకూ అనుభూతులకూ ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ ఉక్రోషాలకూ జ్ఞాపకాలకూ ఆనందాలకూ విషాదాలకూ ఇప్పటి జన్మకు అందిస్తుందనదానికీ సంబంధించిన సమస్త విషయాలనీ నిరాధారం అని త్రోసి పుచ్చడం సరి కాదు.Ian Stevenson నమోదు చేసిన అతి ముఖ్యమైన 20 మంది గురించిన వివరాలు అసత్యాలు కావు.వాటిలో అత్యంత ప్రముఖమైన స్వర్ణలత యొక్క అనుభవం బయటి ప్రపంచానికి తెలిసినది 1960ల నాడు.అప్పటికి స్వర్ణలతకు పదమూడేళ్ళ వయసు.మొదటిసారి ఆమెను విచారించిన తర్వాత తొమ్మిదేళ్ళ పాటు మోసం అనిపించడానికి ఆస్కారం ఉన్న అవకాశాలను గురించి పరిశోధన చేశాకనే 1969ల నాడు ఆమెను పూర్వజన్మకు సంబంధించిన కుటుంబ సభ్యుల ముందు నిలబెట్టారు.స్వర్ణలత మహిళ కావడంతో గత జన్మకు సంబంధించిన కుటుంబ సభ్యులు రాకపోకలని కొనసాగించడం వల్ల ఆమె ఒక్కరికే ఆ జ్ఞాపకాలు తర్వాత కూడా కొనసాగాయి గానీ ఇతరులకు చిన్న వయస్సులో బయతపడిన గతజన్మస్మృతులు యుక్తవయస్సుకు వచ్చేసరికి తగ్గిపోయి ఇప్పటి జన్మకు సంబంధించిన పరిస్థితులకు అలవాటు పడిపోయారు.కాబట్టి పునర్జన్మ అనేదానిని అశాస్త్రీయం అని కొట్టి పారెయ్యడం, హేతువాదులను వెక్కిరించడానికి పనికొచ్చే మహత్యం కింద పొగిడేసి రచ్చరచ్చ చెయ్యడం - రెండూ తప్పే!

కొందరికి దరిద్రం ప్రాప్తించడానికీ కొందరికి సంపదలు ప్రాప్తించడానికీ వారి వారి మనస్సులోని ఆలోచనలే కారణం తప్ప గత జన్మ లోని పాపం ఇప్పుడు మనని పట్టి పీడిస్తున్న దరిద్రానికీ గత జనం లోని పుణ్యం ఇప్పుడు మనం అనుభవిస్తున్న సిరిసంపదలకీ కారణం కానే కాదు. పునరపి జననం పునరపి మరణం అంటూ సాగుతున్న సర్పిల యాత్రకు మధ్యన ఈ వాసనా త్రయాన్ని పట్టుకుని అవ్యక్త గ్రంధి ఒక వంతెనలా నిచ్చెనలా ఉపయోగపడుతుంది.నిన్నటి జన్మ లోని కర్మల వల్ల పూర్వ జన్మ స్మృతులు ఆ వ్యక్తి యొక్క ఇప్పటి వ్యక్తిత్వానికి ఉత్సాహాన్నీ క్రియాశీలతనూ ఇచ్చేవి అయితే తిరుగు లేని విజయాల్ని అందుకుంటాడు.ఇప్పటి జన్మలోని తలిదండ్రులూ మిత్రులూ అతని పట్ల ఉన్న ఆదరం చేత సహాయం చేస్తూ ఉంటారు గనక అతని బతుకు నల్లేరు మీద బండి నడకలా సాగిపోతుంది.నిన్నటి జన్మ లోని కర్మల వల్ల పూర్వ జన్మ స్మృతులు ఆ వ్యక్తి యొక్క ఇప్పటి వ్యక్తిత్వానికి నిరాశనీ నిష్క్రియాశీలతనూ ఇచ్చేవి అయితే అంతు లేని అపజయాల్ని అందుకుంటాడు.ఇప్పటి జన్మ లోని తలిదండ్రులూ మిత్రులూ అతని పట్ల ఉన్న ఆదరం చేత సహాయం చేస్తూ ఉన్నప్పటికీ అతని బతుకు పల్లేరు కాయల పరుపు మీద నిద్రలా సాగిపోతుంది.

అన్నింటిలాగే డబ్బు కూడా కోరుకుంటేనే వస్తుంది.మనకి డబ్బు కావాలంటే ఇతరులకు అవసరమైన వస్తువునో సౌకర్యాన్నో మనం సృష్టించి ఇతర్లకి అమ్మాలి.మనకి అవసరమైన వాటిని మనం సంపాదించిన డబ్బుతో కొనుక్కోవాలి.ఇది ఆజీవపర్యంతం జరగాల్సిందే, ఇరవయ్యేళ్ళ వయస్సులో అమ్మానాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో సంతృప్తి పడిపోతే మనం చదుకోవడమూ అనవసరమే, ఉద్యోగాలూ వ్యాపారాలూ చెయ్యడమూ అనవసరమే, పెళ్ళి చేసుకోవడమూ అనవసరమే, పిల్లల్ని కనడమూ అనవసరమే - కదా!మనం ఉన్న దానితో సంతృప్తి పడిపోయి వదిలేస్తున్నదే మన పక్కనే ఇటు పుల్ల అటు తీసి పెట్టని సుకుమారులను చేరుతున్నది.తేడా అల్లా వారు లేమికి భయపడి డబ్బును గురించి ఆలోచిస్తున్నారు, మనం లేమిని ఇష్టపడి డబ్బును గురించి ఆలోచించడం లేదు.నిరంతరం డబ్బును గురించి ఆలోచించాలి,కోరుకోవాలి,తపించాలి - అప్పుడే డబ్బు మనని ఇష్టపడి మన దగ్గిరకి వస్తుంది.

ప్రతి మనిషికీ అప్పుడప్పుడు అనుభవంలోకి వచ్చే ప్రసూతి వైరాగ్యాన్నీ స్మశాన వైరాగ్యాన్నీ అఖండం, అద్భుతం, అతి పవిత్రం అని పొగిడేసి డబ్బు మీద ఆశని వదులుకోమని తప్పుడు కబుర్లు చెప్తున్నారు కొందరు ప్రవచన కర్తలు.నిజానికి వింటున్న దద్దమ్మలు ఆ చెత్త కబుర్లని నమ్మితే వీళ్ళని ఆ సొల్లు వాగడానికి పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారు?మన పక్కనే ఇటు పుల్ల అటు తీసి పెట్టని సుకుమారులు సైతం రోజుకి మిలియన్ల డాలర్లు సంపాదిస్తూ కూదా చాలదని తహతహలాడుతుంటే మనకి మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుని రిక్షా తొక్కుకుంటూనో కూలిపని చేసుకుంటూనో రోజుకి వెయ్యి రూపాయల సంపాదనతో సంతృప్తి పడిపోయి బతకమని చెప్పడం ఎంత దారుణం?

గత జన్మ నుంచి వచ్చిన వాసనా త్రయం వల్ల అనే విషయాన్ని మర్చిపోతే కొందరు దారిద్య్రం వల్ల తమలో తాము కృశించి పోవటానికీ కొందరు ఐశ్వర్య మదం వల్ల ఇతరుల్ని బాధలు పెట్టడానికీ మనస్సే కారణం అయినప్పుడు ఆ మనస్సుని మన స్వాధీనం లోకి తెచ్చుకోవడం ఎట్లా?సుప్తావస్తలో ఉండి మన మనస్సుని శిక్షణ లేని అశ్వంలా వదిలేసిన అవ్యక్త గ్రంధిని మనం ఒక గట్టి సంకల్పం చేసుకుని శ్రద్ధ, దీక్ష, ధైర్యం అనే ఆయుధాల సాయంతో పోరాడి గెలవటం తప్ప మరో దారి లేదు.వేదం ఆధ్యాత్మిక పరమైన మోక్షాన్ని మాత్రమే కాదు, భౌతికమైన సంపదలను సైతం ప్రతి ఒక్కరికీ ఆశించదగినవి అనే చెప్పింది.

"అసలు మనకు లోపలా బయటా కూడా సృష్టికర్తయే ఉన్నప్పుడు ఇక్కడ దేన్ని వదిలెయ్యాలి?ఎందుకు వదిలెయ్యాలి?దీన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి?ఎందుకు వెళ్ళాలి?ఎలా వెళ్ళాలి?" అనే చిన్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేనివాళ్ళు గురువులా!దేన్నీ వదలకండి - మీకున్న సమస్తమైన కోరికలలో ప్రతి కోరికనీ తీర్చుకునే హక్కు మీకుంది!గతజన్మ నుంచి చెడు జ్ఞాపకాలు గానీ చెడు ఆలోచన్లు గానీ సంక్రమించాయని తెలిస్తే కంగారు పడకండి, గతజన్మలో నేను చేసిన  పాపాలకి శిక్షగా ఈ జన్మలో దరిద్రాన్ని భరించాల్సిందే అని నిరాశపడిపోయి ఏడుస్తూ బతకాల్సిన అవసరం లేదు.యోగసాధన చేత మనస్సును చెడు ఆలోచనల నుంచి మళ్ళించి మంచి ఆలోచనలు చేస్తూ మీరు సుఖపడి ఇతరుల్ని సుఖపెట్టే అవకాశం ప్రస్తుత జన్మ ఇస్తున్నదనేది వ్యాసపరాశరాది చతుర్యుగ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్యపరంపర మీద ప్రమాణం చేసి మూడు కాలాలనూ ముడివేసి చూడగలిగిన నేను చెప్తున్న పరమసత్యం.ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!! 

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...