Monday 14 June 2021

ఇప్పుడు ఆంజనేయుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు ముందుకు రావడం వాళ్ళంతట వాళ్ళు చెయ్యడం లేదు - ప్రభుత్వం తన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి వీళ్ళని వాడుకుంటున్నది!

ఇప్పుడు ఆంజనేయుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు ముందుకు రావడం వాళ్ళంతట వాళ్ళు చెయ్యడం లేదు.శంకర మఠం తరపున వచ్చిన స్వామీజీ కూడా తితిదే పండితులకి తెలియక కాదు, ఉద్యోగాలు పోతాయనే భయంతో ఉన్నారు అని అంటున్నారు.టీవీలో జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు కూడా దీని గురించి ఇది అనవసరమైన విషయమని అనేక ఉపపత్తులు చూపిస్తూ షిర్డీ సాయిబాబా ఎవరో వందేళ్ళ క్రితం ఎవరికీ తెలియదని బల్లగుద్ది చెప్పారు.ఒక్క సాయిబాబాయే కాదు, చాలామంది దేవుళ్ళు నూటయాభై యేళ్ళ కాలంలోనే హిందువులకి పరిచయం అయ్యారు.

ఈరోజున హిందువులకి ప్రపంచ మత మహాసభలో చప్పట్లు కొట్టించుకుని మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన వివేకానందుడు తను చేసిన మతప్రచారం మొత్తంలో వేదం గురించి ఏమి చెప్పాడు, తను చేసిన మతప్రచారంలో ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు?"Let the Vedas, the Koran, the Puranas, and all scriptural lumber rest now for some time — let there be worship of the visible God of Love and Compassion in the country.","Personally I take as much of the Vedas as agrees with reason. Parts of the Vedas are apparently contradictory...So far the theory is all right. But that only these books which are called the Vedas are His knowledge is mere sophistry. Manu says in one place that that part of the Vedas which agrees with reason is the Vedas and nothing else. Many of our philosophers have taken this view." - ఇవి వేదం మీద గౌరవం ఉన్న మాటలేనా!వేదంలో ఏమి ఉంది అని చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడం వరకు మెచ్చుకోవాల్సిందే,సొంత పులుముడులు చెయ్యకపోవటం కూడా మంచి లక్షణమే."The Vedas are the only exponent of the universal religion.This is the doctrine of love declared in the Vedas, and let us see how it is fully developed and taught by Krishna, whom the Hindus believe to have been God incarnate on earth. He taught that a man ought to live in this world like a lotus leaf, which grows in water but is never moistened by water; so a man ought to live in the world — his heart to God and his hands to work." అని ఉగ్గడించినది వాస్తవమే కానీ "“Give up,” says the Veda, “give up." అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం?వేదం ఈ ప్రపంచాన్ని తిరస్కరించి సన్యసించమని చెప్పలేదు.అది మానవులు భూమియొక్క సారాన్ని ఉపయోగించుకుని సుఖభోగాలను అనుభవించడానికి సృష్టికర్త చెప్పిన ప్రవర్తనా నియమావళి. అసలు "Personally I take as much of the Vedas as agrees with reason. Parts of the Vedas are apparently contradictory" అనడం మానవులకు వేదం రూపంలో జ్ఞానాన్ని వ్యక్తం చేసిన సృష్టికర్తను ధిక్కరించడమే అవుతుంది!ఋగ్వేదం మొదటి మంత్రం మొదలు అధర్వణ వేదం ఆఖరి మంత్రం వరకు గల సహస్రాధికమైన మంత్రాలలోని ఏ రెండు మంత్రాలూ ఒకదాన్ని మరొకటి ఖందించుకునే అవకాశం లేదు.వేదాలను ఆమూలాగ్రం పరిశోధించిన ప్రాచ్య పాశ్చాత్య పరిశోధకులలోని ఏ ఒక్కరూ ఇంత దారుణమైన అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యలేదు.

అసలైన విచిత్రం హిందుమతానికి ఇంత గొప్పదనాన్ని తీసుకొచ్చిన గొప్పవాడని  మనం వివేకానందుడి భజన చేస్తుంటే నిన్న గాక మొన్న ఇదే రామకృష్ణ మఠం వాళ్ళు తమకు హిందూమతంలోని ఒక శాఖ అని కాక ప్రత్యేక మతం గుర్తింపు కావాలని కోర్టులో కేసు వెయ్యటం ఎలా సాధ్యం? అలా రామకృష్ణ మిషన్ వాళ్ళు ఎందుకు అడిగారంటే, వివేకానందుణ్ణి ఇంగ్లీషు వాళ్ళు హిందువుల మీద రుద్దారు గనక!

Vivekananda was initiated on February 19, 1884, became a Fellowcraft on March 15, 1884, and was raised to Master Mason on May 20, 1884 in Anchor and Hope Lodge #1. - ఇది వివేకానందుడి భారత జాతీయత!ఆఁ, ఏముంది ఇందులో - ప్రపంచ స్థాయిలో వ్యాపించి ఉన్న ఇంగ్లీషువాళ్ళ వలసల మధ్య మతప్రచారం కోసం అటూ ఇటూ తిరగడానికి అవసరం అవుతుందని తీసుకున్నాడు కాబోలు అనుకోవడానికి వీల్లేదు.

వివేకానందుడు ప్రపంచానికి పరిచయం చేసింది హిందూధర్మాన్ని కాదు, లూసిఫర్ మతాన్ని అని తెలుసుకోవడానికి W.Bro.Connor అనే పెద్దమనిషి 1894 January 22న W.Bro.Gilbert ఆనె పెద్దమనిషికి ఇతని గురించి "I take very great pleasure in introducing to you personally and as a freemason, our East India Brother Swami Vivekananda, whom I examined in the English Work, in which he was made a Master Mason in Anchor and Hope , 236 E.C."అని వ్రాసిన ఉత్తరం చాలదూ!

AlberT Pike తమ లూసిఫర్ మతం గురించి చెప్పినది ఇది -  A "Lodge" is defined to be "an assemblage of Freemasons, duly congregated, having the ascred writings, square, and compass, and a charter, or warrent of constitution, authorizing them to work."The room or place in which they meet, representing some part of King Solomon's Temple, is also called the Lodge; and it is that we are now considering.

Every Lodge is a Temple, and as a whole, and in its details, symbolic.The universe itself supplied man with the model for the first temples reared to divinity.The arrangement of the Temple of Solomon,the symbolic ornaments which formed its chief decorations, and the dress of the High-Priest, all had reference to the order of the universe, as then understood.The Temple contained many emblems of the seasons - the sun,the moon,the planets,the constellations Ursa Major and Minor, the zodiac, the elements, and the other parts of the world.It is the Master of this Lodge, of the Universe,Hermes,of whom khirom is the representative,that is one of the lights of the Lodge.

The Holy Bible,square and Compass, are not only styled the Great Lights in Masonry,but they are also technically called the furniture of the Lodge;and, as you have seen, it is held that there is no Lodge without them. This has some times been made a pretext for excluding Jews from our Lodges, because they cannot regard the New Testament as a holy book.The Bible is an indispensable part of the furniture of the Christian Lodge, only because it is the sacred book of Christian religion.The Hebrew Pentateuch in a Hebrew Lodge, and Koran in a Mohammedan one,belong on the Alter;and one of these, and the Square and Compass,properly understood, are the Great Lights by which a Mason must walk and work.

For further instruction as to the symbolism of the heavenly bodies, and of the sacred numbers, and of the temple and its details, you must wait patiently until you advance in Masonry,in the mean time exercising your intellect in studting them for yourself. To study and seek to interprer corectly the symbols of the universe, is the work od the sage and philosopher. It is to decipher the writing of God, and penetrate into His thoughts.

అక్కడ బైబిలు తప్ప ఇతర మత గ్రంధాలను ఉంచరు. కొత్త నిబంధనతో సహా బైబిలుని ఉంచారు గదా అని వాళ్ళు పాటించేది క్రైస్తవం అనుకుంటే కుదరదు.వాళ్ళలో ఏ ఒక్కరూ పొరపాటున కూడా యహోవా పేరును గానీ యేసు క్రీస్తు పేరుని గానీ ఉఛ్చరించరు, వాళ్ళని దైవాలు అని ఒప్పుకోరు.కుండబద్దలు కొట్టి చెప్పాలంటే క్రైస్తవులు దుష్టశక్తి అంటున్న లూసిఫరును దేవుడు అనీ యహోవాయే దుష్తశక్తి అనీ భావించే కొత్త మతం వాళ్ళది.ఎటూ లాడ్జింగుల దగ్గిర బైబిలు పెడుతున్నారు గాబట్టి పైకి క్రైస్తవులం అంటారు, తెర వెనక కుట్రలతో అధికార పదవులను అందుకుని తమ కొత్త మతానికి సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు పాప్యులారిటీ తెచ్చుకోవడంలో కూడా చాలా చిత్రమైన పద్ధతిని పాటిస్తారు.ఒక మ్యాసన్ ఒక రాజకీయ నాయకుణ్ణి అధికారంలోకి తీసుకు వచ్చి తనకు అనుకూలమైన చట్టాలను చేయించుకోవడానికి తన తెలివితోనూ బలిమితోనూ కలిమితోనూ ప్రయత్నిస్తూ మరొక మ్యాసన్ మరొక రాజకీయ నాయకుణ్ణి అధికారంలోకి తీసుకు వచ్చి తనకు అనుకూలమైన చట్టాలను చేయించుకోవడానికి తన తెలివితోనూ బలిమితోనూ కలిమితోనూ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు మ్యాసన్లూ లాడ్జింగుల దగ్గిర చేరినప్పుడు బ్రదర్స్ మాదిరి ఉంటారు గాబట్టి తమ పావుల్ని అధికారంలోకి తెచ్చుకునే విషయంలో ఒకరికొకరు సహకరించుకుంటారని అనుకోకండి, అలా సహకరించుకుని సర్దుకుపోరు సరిగద -  ఎదటివాళ్ళని అణిచేసి తమవాళ్ళని పైకి తీసుకురావడానికి అవతలి వైపు వాళ్ళ మీద చేస్తున్న దాడిలో తమ మ్యాసనిక్ బ్రదర్లని సైతం చంపటానికి వెనకాడని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు!

మ్యాసనిక్ బ్రదర్సు ఇలా ఒకళ్ల మీద ఒకళ్ళు కుట్రలు పన్నుతూ ఒకళనొకళ్ళు తొక్కేస్తూ చంపేస్తూ ఉంటే మ్యాసనిక్ సీనియర్లు కలగజేసుకోరు.ఎందుకో ఆల్బర్ట్ పైక్ మహాశయుడు చెప్పేశాడు - "One will take an oath to oppose any unlawful usurpation of power, and then become the ready and even eager instrument of a usurper. Another will call one 'Brother,' and then play toward him the part of Judas Iscariot, or strike him, as Joab did Abner, under the fifth rib, with a lie whose authorship is not to be traced.masonry does naot change human nature, and cannot make honest men out of born knaves." అని.

పేరు వచ్చాక లూసిఫర్ మత సంబంధమైనవి గానీ మ్యాసన్రీ లాడ్జింగుల ఆచార వ్యవహారాలకు సంబంధించినవి గానీ కొన్ని చిహ్నాలను వాడటం వల్ల మాత్రమే ప్రజలకు వాళ్ళ నిజమైన అస్తిత్వం తెలుస్తుంది తప్ప వాళ్ళంతట వాళ్ళు చెప్పుకోరు.అప్పటికే అభిమాన వర్గం లేక అనుచర వర్గం ఎక్కువ కావడం వల్ల మెజారిటీ క్రైస్తవులు కూడా చచ్చినట్టు వీళ్ళని భరిస్తారు.అటువంటి రహస్య మతాన్ని పాటించిన వివేకానందుడు హిందువులకి ఆదర్శ పురుషుడు ఎట్లా అయ్యాడు? హిందువులకి బుద్ధీ జ్ఞానం లేకపోవటం వల్ల - మరీ ముఖ్యం బ్రాహ్మణులకి సిగ్గు లేకపోవటం వల్ల!

ఒకటి గుర్తుంచుకోండి, నేను హైందవేతరుల్ని తిట్టడం గానీ బ్రాహ్మణుల్ని తిట్టడం గానీ ఆ జాతి మొత్తాన్నీ జనరలైజ్ చేసి తిట్టడం లేదు.సిరాజ్ ఉద్దౌలా పక్కనే మీర్ ఖాసిం ఉన్నాడు గాబట్టి చెడ్డ ముస్లిముల్ని తిడితే సిరాజ్ ఉద్దౌలాని తిట్టినట్టూ కాదు, మంచి ముస్లిముల్ని పొగిడితే మీర్ ఖాసిముని మెచ్చుకున్నట్టూ కాదు.మొదటినుంచీ పుట్టు బ్రాహ్మల్ని నేను గౌరవించనని చెప్తూనే ఉన్నాను.అయితే, చరిత్రను మలుపు తిప్పిన అనేక సన్నివేశాల్లో కీలకమైన స్థానంలో నిలబడి జాతికీ మతానికీ సంస్కృతికీ ద్రోహం చేసినది పుట్టు బ్రాహ్మణులే కాబట్టి అలాంటివాళ్ళని ఇప్పుడు ఇక్కడ పేరు పేరున చూపించి తిట్టాలని నిశ్చయించుకున్నాను.

మార్కండేయ, శివ, విష్ణు పురాణములు పద్ధెనిమిది గానీ నూట ఎనిమిది గానీ అన్నీ వ్యాస భగవానుడు రచించినవి కావు.వేద విభజన చెయ్యడం కూడా ఒక వ్యాసుడి వల్లనే పూర్తి కాలేదు, 28 మంది వ్యాస నామధేయులు కలిసి కొన్ని తరాల పాటు శ్రమించి వేదవిభజన చేసినట్లు విష్ణు పురాణంలోని ప్రస్తావన వల్ల తెలుస్తుంది.తమ బోడి గొప్పల కోసం తామ బుద్ధికి తోచిన చెత్తని ఆయా కాలాలలోని బ్రాహ్మణులు ప్రక్షిప్తాల కింద ఇరికించారు.వాటిలో నూటికి తొంభై శాతం ధర్మబోధ కన్న బ్రాహ్మణాధిక్యత వెల్లి విరియడానికి కారణం ఏమిటి?

భోజరాజు కాలానికే ఈ రోగం ముదిరిపోయి మార్కండేయ శివపురాణ కర్తలని తన ముందుకి పిల్చుకుని విచారించి వాళ్ళకి హస్తఛ్చేదనాది శిక్షలు వేసి ఇక మీదట తమ గ్రంధాలను సొంత పేర్లతోనే వెలయించాలి తప్ప వ్యాసాది ప్రసిద్ధ ఋషుల పేర్లను పెట్టకూడదని శాసనం చేశాడు.ఇప్పటికీ హిందువులు నమ్మలేని ఒక విషయం చెప్తాను - బమ్మెర పోతన ఆంధ్రీకరణ వల్ల తెలుగువాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రీమద్భాగవతం వ్యాసకృతం కాదు!

గీతగోవిందం అనే బూతుభక్తికావ్యం రాసిన జయదేవుడి సోదరుడైన బోబదేవుడు భాగవత గ్రంధకర్త!"హిమాద్రేః సచివస్యార్ధే సూచనా క్రియతే2ధునా స్కంధా2ధ్యాయ కధానాంచ యత్రప్రమాణం సమాసతః శ్రీమద్భాగవతం నామ పురాణంచ మయేరితం విదుషా బోబదేవేన శ్రీకృష్ణస్య యశో2న్వితం" అని తనే హిమాద్రి అనే మరో కావ్యం రాస్తూ అక్కడ చెప్పుకున్నాడు.

మొదట బోబదేవుడు ఎందుకలా భాగవతం వ్యాసుడి పేరున వెలయించాడో అర్ధం కాలేదు నాకు.ప్రక్షిప్తాలు చేర్చడం అంటే తాము చెప్పేవి వేదం ఒప్పుకోని తప్పుడు మాటలు అని తెలిసి వాటికి వేదప్రామాణ్యం ఉన్నదని చెప్పుకోవడం కోసం వేదసమర్ధన చేస్తున్న భాగాల మధ్యన ఇరికించడం తామెవరో తెలియనివ్వకపోవడం కోసం అవసరమే గానీ అంత గొప్ప వైదికధర్మప్రచారం చేస్తున్న భాగవతం వ్రాసి తన పెరును దాచుకోవడం దెనికి?భాగవతంలో వైదిక ధర్మ విరుద్ధమైన అంశాలు ఏమి ఉన్నాయి?

ఉన్నాయి!ఒకసారి భాగవతం ఎలా పుట్టిందో గుర్తు చేసుకోండి?"వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా,ఒకమారు వ్యాసుని పుత్రు డయిన శుకమహాముని కనీసం గోచీకూడా లేకుండ దిగంబరంగా వెళ్తున్నాడు. ఆ పక్క దేవకన్యలు ఒక సరస్సులో బట్టలులేకుండా స్నానాలు చేస్తున్నారు. వారు శుకుని చూసి కూడ చీరలు ధరించలేదు. ఏమాత్రం సిగ్గుకి చలించకుండా ఉల్లాసంగా జలకాలాడుతూనే ఉన్నారు. శుకుడి వెనకాతలే, వయోవృద్ధుడు, పరమజ్ఞాన స్వరూపుడు అయిన వ్యాసమహర్షి, కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరు ఎంతో సిగ్గుతో గబగబ చీరలు కట్టేసుకున్నారు.అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు, దిగంబరుడు, నవయువకుడు ఐన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు ఐన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకొన్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి, వ్యాసుడు అందుకు కారణ మేమిటని అడిగాడు; అప్పుడు వారునీ కుమారుడికి స్త్రీపురుషబేధభావము లేదు; అంతేకాక ఆయన నిర్వికల్పుడు; మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు; నీకు, ఆయనకు ఎంతో భేదం ఉంది అన్నారట!

నిజానికి మహాభారతం అని మనం అనుకునే మూలకావ్యం పేరు జయ - అదొక ఇతిహాసం.అది కూడా ఇప్పటి వలె లక్ష శ్లోక విస్తారం కాదు.అసలు వ్యాసుడు కేవలం నాలుగు వేల నాలుగు వందల శ్లోకాలు మాత్రమే వ్రాసి ఆయన ఆనుమతితో శిష్యులు అయిదు వేల ఆరువందలు శ్లోకాలు వ్రాశాక పదివేల శ్లోకాలతో కధ పూర్తైపోయింది.భోజరాజు కాలానికే అది ముప్పయి వేల శ్లోకాలకి పెరిగిందీ ఇప్పటికి లక్ష శ్లోకాలకి పెరిగిందీ ఆయా కాల్లాల్లోని బ్రాహ్మణుల చేతివాటం వల్లనే. అయితే, భారతానికి చేర్చిన చేర్పుల వల్ల మూలకధకు గానీ ఆ కావ్యం నుండి వ్యాసుడు ఆశించిన వైదికధర్మబోధకు గానీ భంగం కలగలేదు, పైన పంచమవేదం అనే ప్రశస్తి వచ్చింది, అది మంచిదే అనుకుంటున్నాను నేను!.కానీ, ఆ వ్యాసుడికి లేని మానసిక రోగాన్ని అంటగట్టిన పిట్టకధ ఇక్కడ ఎందుకు చెప్పాడు రచయిత?శుక మహర్షి గొప్పవాడే, కానీ వ్యాసుడు అలా స్తీలకి లోకువ అయిపోయేటంతలా శుకుడి కన్న తక్కువ స్థాయి వాడు ఎట్లా అవుతాడు?శుకమహర్షిని పొగడటం కోసం వ్యాసుణ్ణి అతనికన్న కిందకి దించే సన్నివేశాన్ని కల్పించడం అవసరమా?

ఇంతకీ, వ్యాసభారతంలో కృష్ణప్రశస్తి లేదా!మరి నారదుడు "పవిత్రమైన అనేక ధర్మవిశేషాలను నీవు వెల్లడించావు. సరే కానీ, పొరపా టేమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణుకథలు చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణవిశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు, ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే." అని ఎలా అన్నాడు?

ఈ మొత్తం గందరగోళపు వ్యవహారం అర్ధమయ్యాక జ్ఞానానికి బదులు విధేయతను ఉగ్గడించే కుట్రని మొదట ఆనవాలు పట్టలేని తక్కువ స్థాయిలో చేసింది భాగవతమే అనిపించింది నాకు.అది అలవాటు కావడం వల్లనే క్రమేణ ప్రశ్నించే తత్వం పోయి కాస్త వేషం వెయ్యగలిగి కొంచెం తర్కం తెలిసినట్టు నాటకం ఆడగలిగితే చాలు విశాఖలో డూప్లికేట్ శారదా పీఠం పెట్టిన దొంగ వెధవ లాంటివాళ్ళని కూడా నమ్మడానికి సిద్ధపడిపోయారు హిందువులు. నారదుడి చేత అంత చక్కని సుభాషితాలు చెప్పించిన బోబదేవుదు ఇతర ప్రక్షిప్తకారుల మాదిరిగానే కొన్ని వేదవిరుద్ధమైన అంశాలని చొప్పించి దేహశుద్ధి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వ్యాసుడి పేరుతో ప్రచారంలోకి తెచ్చాడు.వ్యాసుడి పేరుతో ఉండటం వల్ల ఇతర పండితులు ఆమోదించేశారు.ఒకసారి అమోదం పొందాక తన కర్తృత్వాన్ని చెప్పుకున్నాడు.

కావ్యం పుట్టుక గురుంచి కవి చరిత్ర గురుంచీ చారిత్రకపరమైన సాక్ష్యాలను ఇవ్వకపోవటమూ అభూత కల్పనలను జోడించటమూ అన్ని చోట్లా ఉన్నదే కదా అనుకోవడానికి వీల్లేదు.తొలినాడు వ్యాసప్రోక్తం అని భ్రమించి వదిలి వెయ్యడం వల్ల పండితుల దృష్టిని దాటిపోయి భాగవత పురాణకధలో దాక్కుని ఉన్న అవైదిక అంశాలలో ఒకదాన్ని గుర్తించాను నేను.

స్వాయంభువు వంశ విస్తారము గ్రురించి చెప్తున్న చతుర్థ స్కంధం యొక్క కధ ఇది:"స్వాయంభువ మనువునకు శతరూప అనే భార్యవల్ల ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పెద్దదైన ఆకూతిని మనువు పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆకూతికి సోదరులు ఉన్నప్పటికీ తన సంతానం విస్తరిల్లటంకోసం స్వాయంభువమనువు పుత్రికా ధర్మాన్ని పాటించాడు. అందుకు మనువు భార్య శతరూప ఆనందంతో అంగీకరించింది.ఆ విధంగా పెండ్లాడిన రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సును భగవంతునియందే లగ్నం చేసినవాడు కనుక అతనికి ఆకూతియందు శ్రీమహావిష్ణువు యజ్ఞుడు అనే పుత్రుడుగా, లోకేశ్వరి అయిన ఆదిలక్ష్మి విష్ణువును ఎప్పుడూ విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షిణ అనే కన్యకగా జన్మించారు. స్వాయంభువుడు ఎంతో సంతోషించి తన కూతురి కుమారుడు, అత్యంత తేజోవంతుడు, శ్రీవిష్ణుదేవుని అవతారము అయిన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి ప్రజాపతి కామగమన అయిన దక్షిణను తన దగ్గరనే ఉంచుకున్నాడు. తరువాత సకల మంత్రాలకు అధిదేవత అయిన యజ్ఞుడు తనను భర్తగా కోరిన దక్షిణను చేపట్టాడు. వారిద్దరూ ఆదిదంపతులు కనుక ఆ అన్నాచెల్లెళ్ళ వివాహం లోకవిరుద్ధం కాలేదు"

నిజానికి మనువులు, ప్రజాపతులు అనేకమంది పుట్టి ఎన్నో తరాలు గడిచాక యజ్ఞుడికి దక్షిణ అనే చెల్లెలు తప్ప వరణీయమైన కన్య దొరకనట్టు జరిగిన శాస్త్రవిరుద్ధమైన కలయికను తప్పనిసరి చేసి జరిపించి వాళ్ళు ఆది దంపతులు గాబట్టి అది అప్పుడు ధర్మవిరుద్ధం కాలేదు అని ఎట్లా తీర్మానించాడు రచయిత?బైబిలులోని ఆదాము హవ్వల వంటి అక్రమ అసంబంధం ఇక్కడ కూడా ఉంది అని చెప్పడానికి హిందూమతద్వేషులు ఇరికించినట్టు లేదూ!

ఒక్క హిందువులకే కాదు సమస్త మానవజాతిలోని కుటుంబవ్యవస్థ యొక్క అనుబంధాలను అంటే వావివరుసలను వేదం నిర్వచించింది!అవి అలాగే ఉండాలని ఎందుకు శాసించిందో తెలుసుకోవాలంటే వైదిక ధర్మానుసారం వివాహం చేసుకోవడం వల్ల మన వద్ద ఉన్న దృశ్యాన్ని గమనించాలి.

ఒక పురుషుడు ఒక మహిళ ఆజీవపర్యంతం కలిసి బతకాలి, పురుషుడు మహిళ కన్న కనీసం అయిదు సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి, ఇద్దరూ ఒకే గోత్రానికి చెందినవారై ఉండకూడదు అనేవి వివాహ వ్యవస్థకు పునాదులు.వేదం విశ్వంలోని ప్రతి విషయంలోనూ చెప్పినట్లే వావి వరసల అమరికలో ప్రతి పురుషుడికీ ప్రతి మహిళకీ పితృ,సహజన్మ,పుత్ర సంబంధాలను నిర్వచించి సమగ్రమైన కుటుంబ వ్యవస్థకి రూపం ఇచ్చింది.

ఒక మహిళకి పితృసంబంధంలో నాన్న, పెదనాన్న, చిన్నాన్న అనే స్థానాలలో పురుషుడు నిలబడి ఉంటాడు.తల్లికి అన్నలు గానీ తమ్ముళ్ళు గానీ ఉంటే వాళ్ళు మేనమామలు అవుతారు.తండ్రికి తండ్రి తాత, తాతకు తాత ముత్తత వంటి అందర్నీ పితృసంబంధంలో చెప్తే సరిపోతుంది.మహిళకు సహజన్ముల తరంలో నాన్న, పెదనాన్న, చిన్నాన్నలకు ఉన్న పురుష సంతానం ఉంటే వయస్సులో పెద్దవాళ్ళు అన్నలూ వయస్సులో చిన్నవాళ్ళు తమ్ముళ్ళూ అవుతారు.మేనమామలకు పురుష సంతానం ఉంటే పెద్దవాళ్ళు  మేనబావలు అవుతారు చిన్నవాళ్ళు మేనమరుదులు అవుతారు.మహిళకు పురుష సంతానం ఉంటే వాళ్ళు కొడుకులు అవుతారు.అన్నదమ్ముల కొడుకులు మేనల్లుళ్ళు అవుతారు, కూతుళ్ళ భర్తలు అల్లుళ్ళు అవుతారు.

ఒక పురుషుడికి మాతృసంబంధంలో అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ అనే స్థానాలలో మహిళ నిలబడి ఉంటుంది.తండ్రికి అక్కలు గానీ చెల్లెళ్ళు గానీ ఉంటే వాళ్ళు మేనత్తలు అవుతారు.తల్లికి తల్లి అమ్మమ్మ, తండ్రికి అత్ల్లి నాన్నమ్మ వంటి అందర్నీ మాతృసంబంధంలో చెప్తే సరిపోతుంది.పురుషుడికి సహజన్ముల తరంలో అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మలకు ఉన్న మహిళా సంతానం వయస్సులో పెద్దవాళ్ళు అక్కాలూ వయస్సులో చిన్నవాళ్ళు చెల్లెళ్ళూ అవుతారు.మేనత్తలకు మహిళా సంతానం ఉంటే పెద్దవాళ్ళు  వదినలు అవుతారు చిన్నవాళ్ళు మరదళ్ళు అవుతారు.పురుషుడికి మహిళా సంతానం ఉంటే వాళ్ళు కూతుళ్ళు అవుతారు.అక్కాచెల్లెళ్ళ కూతుళ్ళు మేనకోడళ్ళు అవుతారు, కొడుకుల భార్యలు కోడళ్ళు అవుతారు.

అలా పురుషుడి చుట్టూ మహిళ పధ్నాలుగు స్థానాలో కనిపిస్తుంది,అలాగే మహిళ చుట్టూ పురుషుడు కూడా పధ్నాలుగు స్థానాలలో కనిపిస్తాడు.అయితే, పురుషుడు మహిళ కన్న కనీసం అయిదు సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి, ఇద్దరూ ఒకే గోత్రానికి చెందినవారై ఉండకూడదు అనే నియమాల ప్రకారం పురుషుడు మరదలు అనే స్థానంలో వచ్చే స్త్రీని మాత్రమే వివాహం చేసుకోగలడు, స్త్రీ మేనబావ స్థానంలో వచ్చే పురుషుణ్ణి మాత్రమే వివాహం చేసుకోగలదు.అంత ఖచ్చితమైన నిబంధనలతో వివాహవ్యవస్థను ఏర్పర్చిన వైదిక సంప్రదాయ విరుద్ధమైన వివాహాన్ని మనువు, శతరూపల తర్వాత అన్ని తరాలు గడిచాక జరిగినట్టు చెప్పడం ఎంత అసహ్యం! అదీగాక, దాదాపు అన్ని పురాణాలలోనూ వర్ణించబడిన సూర్య చంద్రాది రాజవంశ చరిత్రలు మనువుతోనే ప్రారంభం కావడాన్ని బట్టి మనువు రాజ్యవ్యవస్థను ఏర్పరచిన తొలి రాజపురుషుడు అని భావించాలి తప్ప సమస్త మానవాళికి మనువూ శతరూపలే తలిదండ్రులు అనే అర్ధం రాదు!

ఇదే తెలుగు భాగవతం యొక్క నారయ కృతమైన ద్వితీయ స్కంధం మొదటి భాగంలో  "బ్రహ్మ యజన్మ్ చెయ్యాలని సంకల్పించి అప్పటికి యజ్ఞవిధి లేక తనే తపస్సు చేసి ఆ జ్ఞాన్ని పొంది యజ్ఞం చేసినప్పుడు మరీచి మొదలైన ప్రజాపతులు బ్రహ్మ చేసిన యాగం చూసి తాము గూడా ఉత్సుకులై ఆ భగవానునికి ప్రీతి కలగేటట్లు యజ్ఞం చేశాక అది చూసి స్వాయంభువుడు మొదలైన మనువులూ, దేవతలూ, దానవులూ, రాజులూ, మనుష్యులూ మున్నగు వారు అందరూ, వాళ్ల వాళ్ల కిష్టమైన దేవతలను కొలుస్తూ సాటిలేనివాడూ, యజ్ఞస్వరూపుడూ అయిన లక్ష్మీ నాధునికి ఫలం చెందునట్టులగా మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు" అని చెప్పడం వల్ల మనువుకు అనేకమంది సమకాలికులు ఉన్నారని తెలుస్తున్నప్పుడు స్వగోత్రవివాహం మాత్రమే చెయ్యాల్సిన దురవస్థ ఏర్పడే అవకాశం లేదు. అయినప్పటికీ మామూలు పరిస్థితిలో దోషమే కానీ అప్పుడు తప్పనిసరి కావడం వల్ల దోషం కాలేదు అని దబాయిస్తున్నాడు రచయిత ఇక్కడ!

మన పురాణ కధల ప్రకారం సృష్టి మొత్తం ఒక్క వారంలో జరగలేదు.ఆధునిక జీవపరిణామ సిద్ధాంతం వలె దశల వారీ జరిగినట్టు ఎన్నో చోట్ల ఉంటుంది.ఇదే భాగవతంలో మహత్తత్త్వ సృష్టి, దేవసర్గ,మానవసర్గ, అని పేర్లు పెట్టి ఇరవై ఎనిమిది దశలని వర్ణించి చెప్పిన రచయితయే మనువు మానవజాతి అంతటికీ ఏకైక బీజప్రదాత అని చెప్పడం స్వవచోవ్యాఘాతం కాదూ! బోబదేవుడే రాశాడో తర్వాత ఇరికించారో తెలియదు గానీ కధకి ఎలాంటి ప్రాధన్యత లేని విషయాన్ని పనిగట్టుకుని ప్రస్తావించుతూ గుమ్మడికాయల దొంగ మాదిరి ఒక చచ్చు పుచ్చు సమర్ధన అతికించడం చూస్తుంటే ఇరికించిన వాడు వైదిక ధర్మానికి చెందిన వాడు కాదనేది నిజం.మరి, గజేంద్ర మోక్షణం,రుక్మిణీ కల్యాణం,భీష్మనిర్యాణం వంటి కధల్ని జనరంజకం చేసిన గరికిపాటి నరసింహా రావు, చాగంటి కోటేశ్వర రావు లాంటి పండితులు వీటిని చూడలేదా!హిందువుల ఆధ్యాత్మిక జీవితాన్ని అన్నిటికన్న ఎక్కువ ప్రభావితం చేస్తున్న ఒక గ్రంధాన్ని ఆమూలాగ్రం చదవని పాండిత్యం కూడా ఒక పాండిత్యమేనా? కుర్రాళ్ళకి నచ్చడం కోసం జోకులేస్తూ ఎక్కువ ఫోకస్ తెచ్చుకుని సంతోషించే దురద తగ్గించుకుని చెప్తున్న దానిలో వేదవిరుద్ధమైన అంశాలు ఉన్నాయేమోనని తర్కించుకుంటే ఎందుకు తప్పులు వస్తాయి?ఇక చాగంటి కోటేశ్వర రావు గారు దీర్ఘాలు తీస్తూ అక్కడ ఉన్నది ఉన్నట్ట్టు గుర్తుకు తెచ్చుకుని చదివెయ్యడం తప్ప మెదడుని అస్సలు ఉపయోగించరు - విన్నవాళ్ళలో ఎవరు ప్రశ్నించితే వాళ్ళకి అది శాస్త్రం,ఇది దోషం అని ఏదో ఒక పేరు చెప్పి బెదిరించి నోరు మూయించుతారు!

అశ్వమేధ యాగం గురించి చెప్తూ కౌసల్య చచ్చిన గుర్రం పక్కన పడుకోవడం గురించి అది తప్పనీ వేదంలో లేదనీ చెప్పాల్సింది పోయి "భర్తను ఎవంత అనురాగంతో కౌగలించుకుంటుందో అంత అనురాగం చూపిస్తూ కౌగ్లించుకోవాలి" అనే నియమాన్ని తను వేదంలో చూసి చెప్తున్నట్టు బల్లగుద్ది చెప్పేశారు -  తను చెప్తున్న సొల్లుని చెవులప్పగించుకుని వినేవాళ్ళు ఉన్నారు కదా అని ఎంత ధైర్యమో!

హిందూమతద్వేషులని మించి ఈ బ్రాహ్మణాధములు వైదిక ధర్మం పరువు తీస్తుంటే నేనూ ఇంకో పదిమంది శూద్ర కులస్థులం పిచ్చోళ్ళలా వీళ్ళని తిట్టేవాళ్ళతో పోట్లాడి వాళ్ళతో చావు తిట్లు తింటున్నాం.తిట్లతో పాటు అవతలివాళ్ళు సంఖ్యాబలం పెంచుకుని తంతే దెబ్బలు తినీ చంపితే చచ్చిపోయేది మేము,వాళ్ళు మాత్రం సాగినంత కాలం బ్రాహ్మణోత్తముల మాదిరి దణ్ణాలు పెట్టించుకుంటూ కానికాలం వస్తే పాస్టర్ల కిందనో ముల్లాల కిందనో రూపం మార్చి వేషం మార్చి భాష మార్చి తమ గౌరవాలు తగ్గని ఏర్పాట్లు చూసుకుంటారు.ఉండవల్లి అరుణ్  కుమార్ అనే బ్రాహ్మడికీ భండారు శ్రీనివాస రావు అనే బ్రాహ్మడికీ మతమార్పిడులు జరుగుతున్నప్పుడూ హైందవేతరులు సంఖ్యాబలం పెంచుకుని వరసపెట్టి హిందూ దేవాలయాల్ని కూల్చుతూ అర్చామూర్తుల్ని పగలగొడుతూ అదేమని అడిగితే అర్చామూర్తుల్ని ఎలుకలు తినేశాయనీ తేనెటీగలు రధాన్ని తగలబెట్టాయనీ కాకమ్మ కబుర్లు చెప్తున్నప్పుడూ రాని కోపం క్రైస్తవుల్ని అడ్డుకుంటుంటే సాటి హిందువుల మీద వచ్చింది - పిలక ఉందో లేదో చూసి అది పట్టుకుని నడి రోడ్డు కీడ్చి ఝాడించి తన్నొద్దూ వీళ్ళని?

రామాయణంలో ఉన్న అవైదికమైన వాటి గురించి చాగంటి కోటేశ్వర రావు గారి మీద కోపం తెచ్చుకుంటున్న పండితులు కూడా హరిశ్చంద్రుడి కధలోని అసంగతాల్ని సమర్ధించేస్తున్నారంటే హిందువులని వేదానికి దూరం చెయ్యాలనుకున్న కుట్ర సఫలీకృతం అయినట్టే కదా!గౌతమ బుద్ధుడు కల్పిత పాత్ర అని ఇదివరకు చెప్పాను.ఇప్పుదు మళ్ళీ చెప్తున్నాను.ఒక్క ఆనాటి గౌతమ బుద్ధుదే కాదు,ఒక్క ఈనాటి షిర్డీ సాయిబాబాయే కాదు బయటివాళ్ళు మన దేశపు చరిత్రలోనూ కధలలోనూ ప్రవేశపెట్టినవాళ్ళు చాలామంది ఉన్నారు. "ఉత్థిష్ఠత,జాగృఅత్,ప్రాప్యవరాన్నిబోధత" అని గర్జించి హిందువులలో నూతన తేజాన్ని నింపిన వివేకాననదుడు ఫ్రీమ్యాసన్రీ సంస్థలో సభ్యత్వం ఉన్నవాడు!” అంటే ఎంతమంది నమ్ముతారు? ముందుండి ఉద్యమాన్ని నడిపించిన గాంధీని పక్కకి పెట్టి అతని తర్వాతి స్థానంలో ఉన్న నెహ్రూని ప్రధానమంత్రిని చెయ్యడానికి గాంధీకి లేని ఫ్రీమ్యాసన్రీ సభ్యత్వం నెహ్రూకి ఉండటమే కారణం అని నేనంటే మీరు మాత్రం నమ్మగలరా!ఫ్రీమ్యాసన్రీ సభ్యత్వం కావాలంటే బైబులుని దైవగ్రంధం అని ఆమోదించి తీరాలి!అయితే, చేరిన వెంటనే ఎకాఎకి మతమార్పిడి చెయ్యరు, మతప్రచారం చెయ్యమని పట్టు పట్టరు.కానీ, మాసన్రీ లాడ్జింగుల్ని స్థాపించేవాళ్ళు బైబిలుని తమ గ్రంధం క్రింద ప్రకటించి మూలమట్టం, స్కేలు బద్దల పక్కన పెడతారు.మత ప్రాతిపదికన చేర్చుకోరు గానీ చేరిన క్రైస్తవేతర మతస్థులు తమ మతగ్రంధాల్ని ఉంచమని అంటే తిరస్కరిస్తారు.రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అభ్యంతరం చెప్పలేదని అనుకోవచ్చు.అదీ గాక, ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఉన్నవాళ్ళకి రవి అస్తమించని అఖండ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క వలసల మధ్యన తిరగడానికి వీసాలూ పాస్ పోర్టులూ అక్ఖర్లేదు కాబట్టి రాజకీయ నాయకులూ వ్యాపారస్తులూ స్వేచ్చగా తిరగడానికి వెసులుబాటు కోసం తీసుకున్నారంటే అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. కానీ హిందూ సన్యాసికి ఫ్రీమ్యాసన్రీ సభ్యత్వం అదీ క్రింది స్థాయి, మధ్య స్థాయి కూడా కాదు, పై స్థాయి మ్యాసన్లు కూడా "బ్రదర్" అని సంబోధించే స్థాయి సభ్యత్వం ఎలా వచ్చింది?

అసలు ఏమాత్రం సందేహించకుండా నమ్మెయ్యడమే తప్ప అమెరికాలో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక మహాసభలో హిందూమతం తరపున ప్రసంగించడానికి మన దేశం మొత్తం మీద ఇతరులకి ఎవరికీ తెలియని మారుమూల దక్షిణేశ్వరంలో దక్షిణేశ్వరం దాటితే ఎవరికీ తెలియని రామకృష్ణ పరమహంస శిష్యుడైన కుర్రసన్యాసి అత్యంత సమర్ధుడని నిర్వాహకులకి ఎలా తెలిసింది?ప్రపంచ మతమహా సభలో వివేకానందుడి ప్రసంగానికి జరిగిన మర్యాదల గురించి అప్పటి మీడియా మోతెక్కించడానికి మందు గురు శిష్యుల గురించి దేశం లోపల ఎంతమందికి తెలుసు అని మనం ఎప్పుడూ ఆలోచించనే లేదు - ప్రచారం యొక్క ప్రభావం అది!ప్రపంచ మత మహాసభలు జరిగింది  ఎప్పుడు?ఆనాటికి శంకర పీఠాలు అనామకమైనవా, రామానుజ పీఠాలు అనామకమైనవా, మధ్వ పీఠాలు అనామకమైనవా?వేదాలను తృణీకరిస్తూ ఏర్పడిన బ్రహ్మసమాజపు సంప్రదాయానికి చెందిన వివేకానందుడు అసలు వైదిక ధర్మానికి సరైన ప్రతినిధి ఎలా అయ్యాడు - అంతా మాయ కదూ!

తిరుమల తిరుపతి దేవస్థానపు వేదపండితులకి విశాఖ నగరపు నడిబొడ్డున డూప్లికేట్ శారదా పీఠం పెట్టిన స్వరూపానందేంద్ర సరస్వతి జగద్గురువుల కన్న ఎక్కువ ప్రమాణం అయ్యాడు.వేదం యజ్ఞాలలో జంతుబలిని సమర్ధించిందని కుండబద్దలు కొట్టి చెప్పిన వాళ్ళకి దేశంలోని గుర్తింపు పొందిన ధర్మపీఠమూ కలిసి రావడం లేదు, హిందూ మత సంస్థ కూడా సహకారం ఇవ్వటం లేదు - అది కొంత నయమే!ఇవ్వాళ పొట్టకూటి కోసం ఒక క్రైస్తవుణ్ణి శ్రీమహావిష్ణువుతో పోల్చి ఆంధ్రలో జరుగుతున్న మతాంతరీకరణలకి కొమ్ము కాస్తున్న వీళ్ళు రేపటి రోజున తిరుమల చర్చి కింద మారిపోతే పాస్టరు వేషం కట్టడానికి కూడా సిద్ధపడతారు అదే పొట్టకూటి కోసం - పెద్ద మసీదు కధలో హుక్కా పీలుస్తూ పడగొట్టిన శివాలయాన్ని గురించి "హాఁ, సైతాన్ కా ఘర్!" అనగలిగిన బ్రాహ్మణోత్తముల మాదిరి.

భారతేతర సమూహాలు గొప్పలు చెప్పుకుంటున్న ఆధునిక విజ్ఞానం సమస్తం భారతదేశపు నడిబొడ్డు నుంచి దొంగతనం చేసి తీసుకు పోయిందే!వాళ్ళు చేసింది కూడా దొంగతనం కాదు కుక్షింభరులైన బ్రాహ్మణులు బయటివాళ్ళనుంచి అధిక మొత్తం విత్తానికి ఆశ పడి అతి కీలకమైన శాస్త్రాల్ని వాళ్ళకి అప్పజెప్పి ఇక్కడ మాయంచేసి జాతిద్రోహం,ధర్మద్రోహం,దైవద్రోహం చేశారు!ఈనాటి యూరోపియన్ కాస్మాలజిస్టులు సమర్ధిస్తున్న సూర్యకేంద్రక సిద్ధాంతం వంటివాటిని మాత్రమే ఉనికిలో ఉండి భాగవత పురాణంలో ఎక్కువగానూ ఇతర పురాణాలలో కూడా అక్కడక్కడ కనబడుతున్న శింశుమార చక్రం,ధృవమండల నిర్మితి వంటివాటిని సమర్ధిస్తున్న శాస్త్రగ్రంధాలు మాయం అయిపోవటం వెనక బయటి వాళ్ళ కుతంత్రంతో పాటు లోపలివాళ్ళ సహాయం కూడా ఉంది అనేది బల్లగుద్ది చెప్పగలను నేను.

"అన్నీ వేదాల్లో ఉన్నాయిష గాళ్ళు!" అని ఇతర్లు మనల్ని వెక్కిరిస్తున్నప్పుడు వీళ్ళు ఏమి చేస్తున్నారు?అంత స్థాయిలో వేదవిజ్ఞానం మాయమై పోవడానికి మూలకారణమే వీళ్ళు అయినప్పుడు "మనమెంత పోగొట్టుకున్నామనే విషయం కూడా తెలియని స్థితిలో సమాజం ఉంది" అని వీళ్ళు ఎవర్ని విమర్శిస్తున్నారు?మిగిలిన కులాలు వృత్తి విద్యలు నేర్చుకుని వీళ్ళని ఇప్పటి వరకు కూర్చోబెట్టి మేపిందీ ఇప్పటికీ కూర్చోబెట్టి మపుతున్నదీ ఇకముందు కూర్చోబెట్టి మేపేదీ వేదాన్ని నేర్చుకుని జ్ఞానాన్ని దాచుకుని వారసత్వాన్ని కాపాడుతారనే కదా - మరి, మిగిలిన కులాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే బ్రాహ్మణ కులస్థులు వాళ్ళ పని వాళ్ళు చెయ్యక వేదాల్ని పోగొట్టడాన్ని కూడా శూద్ర కులస్థుల నిర్లక్షం ఖాతాలో వేసేస్తున్నారు, ఎంత ధైర్యం వీళ్ళకి?

అప్పటివరకు తన పోష్టుల్ని ముసలి సాయిత్రి గురించి చెప్తున్న క్యామెడీ కబుర్లతో హుషారెక్కించిన గుంటూరు మెంటల్ డాక్టర్ మొదటిసారి మోదీ ప్రధాని అవ్వగానే తనకే పిచెత్తినట్టు అయిపోవడానికి కారణం ఏమిటి?అది లెఫ్టిస్టి భావజాలానికి హిందువులు కట్టిన గోరీ అని అర్ధం అవ్వడం వల్లనే!అయితే, హిందువులు కూడా దాన్ని రివర్సులో అర్ధం చేసుకుని మరో పిచ్చితో  అల్లాడిపోతున్నారు.డెబ్భయ్యేళ్ళ పాటు హిందూమతాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్న హిందూమతద్వేషులు చేసిన సకల ప్రయత్నాలను వమ్ము చేస్తూ అవకాశం కోసం ఎదురు చూసిన హిందువులు ఇన్నేళ్ళకి తగినవాడి దొరికాడని మోదీని ప్రధానిని చేస్తే మోదీ వల్లనే హిందువులు ఇన్నేళ్ళు బతికున్నారనీ మోదీ లేకపోతే హిందువులు చచ్చిపోతారనీ ఎందుకు అబద్దాలు చెప్తున్నారు?ఐవీయార్ కృష్ణారావు లాంటి ఓ పదిమంది బ్రాహ్మలకి ఉద్యోగాలు ఇస్తే చాలునా!

క్రైస్తవులు హిందువులకి కొత్త దేవుళ్ళని పరిచయం చెయ్యడం వెనక మతమార్పిడి కన్న పదింతల భయంకరమైన కుట్ర ఉంది.ఒక సందేహం రావాలి, "మతమార్పిడి చేసుకుని లాక్కుపోయి దశమ భాగాల పేరుతో ఆదాయం పెంచుకోవచ్చు గదా, హిందువుల్లో కొత్త దేవుళ్ళని పుట్టించి హిందువులకి ఆ దేవుళ్ళ మీద భక్తి ప్రపత్తులు పెంచితే వాళ్ళకి ప్రయోజనం  ఏంటి" అని."అలా లాక్కుపోగలిగినవాళ్ళని లాక్కుపోతూనే ఉన్నారు,మళ్ళీ హిందువులకి భక్తిభావం పెంచి ఉద్ధరించడం పిచ్చితనం కాదా!" అని కూడా అనుమానం రావాలి.

కానీ, వాళ్ళు భయపడుతున్నది వేదం యొక్క శక్తిని గురించి - లాక్కుపోయేవాళ్ళని క్రైస్తవంలోకి లాక్కుపోయి మిగిలిన హిందువుల్ని వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసినప్పుడు హిందువులు తమ సమస్యలకు పరిష్కారం కోసం వెదుకుతూ ఏదో ఒకనాటికి వేదం వైపుకి చూస్తారు.ఒకసారి వేదం చదివి అందులోని సత్యాలను అర్ధం చేసుకుంటే ఆనంతమైన శక్తి పుడుతుంది.అలా వేదం యొక్క శక్తిని తెలుసుకోనివ్వని డైఅవ్ర్షన్ టాక్టిక్ ప్రకారం మన దేశపు చరిత్రలోకీ పురాణ కధల లోకీ చాలామందిని ప్రవేశ పెట్టారు.

సత్య హరిశ్చంద్రుడి కధ కూడా బయటివాళ్ళ చేతివాటమే. అందులో వేద విరుద్ధమైన విషయాలు చాలా ఉన్నాయి.అతి ముఖ్యమైనది మనుషులని బహిరంగ ప్రదేశాల్లో నిలబెట్టి బానిసల పేరున క్రయ విక్రయాలు జరపటం మన దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.అలా చెయ్యవచ్చని గానీ చేస్తారని గానీ మరొక పురాణంలోనూ ధర్మశాస్త్రాలలోనూ లేదు.కధలో హరిశ్చంద్రుడికి అవసరం అయినప్పటికీ అంతకు ముందు నుంచే క్రయవిక్రయాలు వ్యవస్థీకృతమై ఉంటేనే గదా ఆ సన్నివేశం సహజమైనది అయ్యేది,అవునా కాదా?

మన పౌరాణిక కధకులలోనూ ప్రవచన కర్తలలోనూ కొందరు రామాయణాన్ని విశ్లేషించిన పద్ధతి వల్ల అదొక హర్రర్ సినిమాలా తయారైంది - రాముడిలా ఉంటే మనమూ అడవుల పాలై కష్టాలు పడాల్సి వస్తుందని జనం దడుచుకు ఛస్తున్నారు.పులి మీద పుట్రలా హరిశ్చంద్రుడి కధ జనాల్ని నిజం చెప్పటానికి భయపడేలా చేస్తున్నది.కాటి సీను పద్యాలు వింటున్నప్పుడు కొంచెం వేదాంతం అలవాటవుతున్నది గానీ గంప లాభం చిల్లి తీసినట్టు కధ క్లైమాక్సుకు వచ్చేసరికి వేదాంతం పోయి నిజం చెప్పి అన్ని బాధలు పడే కన్న అబద్ధం చెబితే సరిపోతుంది గదా అనిపిస్తుంది హరిశ్చంద్రుడూ చంద్రమతీ లోహితాస్యుడూ పడుతున్న కష్టాలూ వాళ్ళ ఏడుపులూ చూస్తుంటే.కానీ, ఇది నిజం కాదు.ధర్మాన్ని అనుసరించడం కోసం మనం దేన్నీ త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు.కష్టాలు తెలివితక్కువతనం వల్ల వస్తాయి గానీ నీతిగా ఉండటం వల్లనో ధర్మానికి కట్టుబడటం వల్లనో రావు.శూద్రులు బ్రాహ్మణులు చెప్పక ముందునుంచీ తమ ధర్మాన్ని తాము పాటిస్తూనే ఊన్నారు.బ్రాహ్మణులు కూడా ఇతరులకి చెప్పడంతో పాటు తమ ధర్మాన్ని తాము పాటించాలి.

గత రెండు వందల యేళ్ళనుంచి "ఇది బ్రాహ్మణ మతం!సకల జనుల మతం కాదు!" అని తిట్టిన తిట్లకి శూద్రులు నొచ్చుకుని జవాబులు చెప్పి వీళ్ళ గౌరవాలు కాపాడుతుంటే, "ఎవడి కోసం కాపాడుతారు!మేము లేనిదే హిందూమతం లేదు!వాళ్ళు పోరాడాలి,మేము ఆశీర్వదించాలి!" అని చిరునవ్వులు నవ్వుకునే దొంగనాటకం ఆపితే మంచిది.ఇంతవరకు పల్లకీలో కూర్చోబెట్టి మోసిన శూద్రకులస్థులు ఇకముందు కూడా మోస్తారనే గ్యారెంటీ లేదు.పల్లకీలు దిగి కాళ్ళూ చేతులూ కూడదీసుకుని వాళ్ళు కూడా తమ వంతు పని చెయ్యాలి.బ్రాహ్మణ కులస్థులు ఇట్లా కూర్చుని తినడానికి అలవాటు పడిపోయి తమ కులం గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు చరుచుకుంటూ గడుపుతామంటే ఎల్లకాలం కుదరదు.

జై శ్రీ రాం!

2 comments:

  1. "కష్టాలు తెలివితక్కువతనం వల్ల వస్తాయి గానీ నీతిగా ఉండటం వల్లనో ధర్మానికి కట్టుబడటం వల్లనో రావు."- meeru matrame raayagalige dhairyamaina vaakyam. splendid and eye opening article...pranaamaalu. chaduvuthunnanta sepu yem kolpoyamo telustuune undi...kani yem cheyaalo teliyadam ledu....hmmm...ilaanti marinni vishayalu velugu loki teesuku vastaarani aasistuuu... mi abhimaani.( Kudirite paina cheppina vishayalaki chivaralo reference books/articles list unchagalarani manavi)

    ReplyDelete
    Replies
    1. మొత్తానికి పోష్టు మీకు అలా అర్ధం కావాలో అలానే అయ్యింది.దేన్ని నేను నొక్కి చెప్పానో ఆ ముక్కని ఎత్తి చూపించడంలో మీ ప్రజ్ఞ కనపడుతున్నది.

      సోర్సు లేని పోష్టు నేను వెయ్యను.ప్రతి చిన్న వాక్యానికీ సాక్ష్యాలు ఉన్నాయి.తితిదే పండితులు సాక్షాత్తూ వైదిక ధర్మాన్ని ప్రచారం చెయ్యడం కోసం అని చెప్పి ప్రచురించిన "ఆర్ష విజ్ఞాన్ సర్వస్వము - వేద సంహీత్లు" అనే గ్రంధం ఒక సాక్ష్యం.అందులోని రెండు అవైదికమైన అంశాలను గురించి ఇదివరకే పోష్టులు వేశాను.పరశురాముడు 21 సార్లు తిరిగి తిరిగి నిక్షత్రం చెయ్యడం అనే అబద్ధం గురించి కూడా ఒక పోష్టు వేశాను.

      ఇదే పోష్టుని ముఖపుస్తకం దగ్గిర కూడా వేశాను.మంచి రెస్పాన్స్ వచ్చింది.వేదం చదివి అర్ధం చేసుకుని మనకి నిజాలు చెప్పగలిగిన సద్బ్రాహ్మణుల్ని గౌరవించడం ఎంత ముఖ్యమో, బ్రాహ్మణుల్లోనే కొందరు పుట్టుక వల్ల తమకు ఆధిక్యతని ఆపాదించుకుని దాన్ని స్వలాభం కోసం ఉపయోగించుకునేవాళ్ళని నిగ్రహించడం కూడా అంతే ముఖ్యం!

      వైదిక ధర్మం కేవలం బ్రాహ్మణులకి ఆధిక్యతని తెచ్చెపెట్టి వాళ్ళకి భుక్తి ఏర్పాటు చెయ్యడం కోసం కాదు ఉన్నది - అన్ని కులాల వాళ్ళకీ వేదం తెలియాలి,అన్ని కులాల వాళ్ళూ వేదం చెప్పిన శాశ్వత సత్యాల్ని పాటించాలి.నేను అందుకోసం చెయ్యాల్సినది చేస్తున్నాను.

      మీ స్పందన చాలా బాగుంది.నాకు చాలా సంతోషంగా ఉంది.

      జై శ్రీ రాం!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...