Sunday 9 February 2020

ఈ ప్రభుత్వాధినేతల ధోరణి చూస్తుంటే "మాకు ప్రజభిమానం వద్దు,మరుసటి ఎన్నికల్లో ప్రజలు మాకు వోట్లు వెయ్యకపోయినా ఫర్వాలేదు!రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చటమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రం మొత్తాన్ని ఎడారిగానూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అగ్నిగుండంగానూ మార్చేవరకు మమ్మల్ని ఎవరూ ఆపలేరు!" అని శపధం పట్టినట్టు కనిపించడం లేదూ!


అసలు వైకాపా ప్రభుత్వం ఇంత వింత పరిపాలన ఎలా చేస్తున్నది? ప్రభుత్వాధినేతల ధోరణి చూస్తుంటే "మాకు ప్రజభిమానం వద్దు,మరుసటి ఎన్నికల్లో ప్రజలు మాకు వోట్లు వెయ్యకపోయినా ఫర్వాలేదు!రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చటమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రం మొత్తాన్ని ఎడారిగానూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అగ్నిగుండంగానూ మార్చేవరకు మమ్మల్ని ఎవరూ ఆపలేరు!" అని శపధం పట్టినట్టు కనిపించడం లేదూ!
ఇప్పటి పరిస్థితిని అంచనా వెయ్యాలంటే అసలు మొదలును చూడాలి కదా!Y. S. Jaganmohan Reddy కడప జిల్లాలోని జమ్మలమడుగు/పులివెందుల గ్రామమలో  Y. S. Rajasekhara Reddy,d Y. S. Vijayamma దంపతులకు 1972 డిసెంబర్ 21న పుట్టాడు.హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఇతని మొదటి పాఠశాల.నిజాం కాలేజిలో B.Com చదివాడు.1886 ఆగస్టు 28న భారతీ రెడ్డి గారిని పెళ్ళి చేసుకున్నాడు.ఇద్దరు ఆడపిల్లలు.ఇతను Church of South India (Diocese of Rayalaseema) సభ్యత్వంతో పులివెందుల CSI-Town Churchకి హాజరవుతూ ఉంటాడు.
2004 నాటి ఎన్నికల్లో ప్రచారసభల్లో పాల్గొని రాజకీయ రంగప్రవేశం చేశాడు.2009లో కడప నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడు అయ్యాడు.తండ్రి చనిపోయిన మరుక్షణమే తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డాడు.మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నప్పటికీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ ఇతనెంత పట్టుదలతో శ్రమించాడో వారంత పట్టుదలతో తిరస్కరించేశారు.
మరొకరైతే నీరసించిపోయేవారే, కానీ తండ్రిని మించిన పోరాట పటిమ గల ఇతను కేవలం ఆరునెలలకే మెరుపులాంటి ఐడియాతో "తండ్రి మరణవార్త్ అవిని అతని మీద అభిమానంతో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను" పరామర్శించి ఓదార్చే మిషన రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో చాలా మంచిపేరును తెచ్చుకున్నాడు.నిజానికి ఈ యాత్ర తండ్రి చేసిన పాదయాత్రకు నకలు లాంటిది - అంగికం, వాచికం కూడా తండ్రిని పోలి వుండేటట్టు బాణీని మార్చడంతో సెంటిమెంటు వరదలై కురిసింది!ఆ ఉత్సాహంతో 2010 నవంబర్ 29న కాంగ్రెసుతో ఇక కుదరదని తెగదెంపులు చేసుకుని 2010 డిసెంబర్ 7న YSR Congress paarTy అనే కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని ప్రకటించాడు.ఈ పేరులో ఒక తమాషా వుంది - ఇంగ్లీసు పొడి అక్షరాల్లో తండ్రి పేరు కనిపిస్తుంది గానీ తెలుగులో "యువజన శ్రామిక రైతు కాంగ్రెస్", దీన్నీ ఇంగ్లీషు లిపిలో రాస్తే Y(uvajana) S(raamika) R(aitu) అవుతుంది.అన్నట్టుగానే అన్ని సన్నాహలూ పూర్తి చేసుకుని 2011 మార్చిలో పార్టీని స్థాపించి తర్వాతి ఎన్నికల్లో కడప మొత్తాన్ని తన గుప్పిటిలోకి తెచ్చేసుకున్నాడు.
అయితే, అదే 2011 ఆగస్టు 10న మాజీ మంత్రి P Shankar Rao రాష్ట్ర హైకోర్టులో అతని మీద CBI విచారణ కోసం పిటిషన్ వేశాడు - అభియోగం 2004-2009 మధ్య కాలంలో తండ్రి యొక్క ముఖమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజాధనాన్ని హారతి కర్పూరం చేశాడని.ఆగస్టు 17న FIR దాఖలు అయ్యింది - ప్రస్తుతం 13 కేసులు మాత్రమే ఉన్నాయని అంటున్నారు గానీ అవి కొన్ని ఒకేలాంటి కేసుల్ని కలిపి నమోదు చేసిన చార్జిషీట్ల సంఖ్య. 120-B (criminal conspiracy), 420 (cheating), 409 (criminal breach of trust) and 477A (falsification of accounts) సెక్షన్ల కింద 74 కేసులు నమోదు అయ్యాయి.Section 13 of the Prevention of Corruption Act అనేది అదనం.
1999-2000 మధ్య కాలంలో కర్నాటక సరిహద్దులలోని సండూరు దగ్గిర ఒక చిన్న power companyతో మొదలైనప్పుడు ఇతను ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్త మాత్రమే - దాని వ్యాపార పరిధి చాలా తక్కువ.FIR ప్రకారం సండూరులో పవర్ ప్లాంట్ పెట్టిన మరుసటి ఏడాది 2001కే M B Ghorpade అనే original promoter నుంచి 53.51 కోట్లు చెల్లించి SPCLని కొనెయ్యగలిగాడు!కేవలం నాలుగేళ్ళలో అంటే 2005 నాటికే రెండు Mauritius-based  కంపెనీల నుంచీ 2i Capitalకంపెనీ నుంచీ Pluri Emerging Company నుంచీ మొత్తం Rs 124.60 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురాగలిగాడు - ఏమి సమర్ధత, ఏమి సమర్ధత! ఇంతటి సమర్ధత గల ఇతను తండ్రి మరణించిన 2009 తర్వాత ఒక్క కొత్త కంపెనీని కూడా పెట్టకపోవటానికి కారణం ఏమిటి?అది సహజమైన వ్యాపార దక్షతయే అయితే జీవితకాలం పాటు కొనసాగాలి కదా!
జగన్ Asia Infrastructure Sicar అన్న పేరు గల Luxembourg based companyకి beneficial ownerగా వ్యవహరిస్తూ ఆ కంపెనీల నిధుల్ని SPCL వైపుకు మళ్ళించినట్టు CBI ఆరోపించింది.జగన్ చేసిన మరొక అనుమానాస్పదమైన వ్యవహారం SPCLకి చెందిన 82 లక్షల రూపాయల విలువ గల షేర్లని ఒక అయిదు కంపెనీలకి అమ్మటం - Sai Surya Warehousing Company limited, Excel Prosoft Limited, Sigma Oxygen Limited, Nelcast Finance Limitited and ZM Infotech Limited అనే ఈ అయిదు కంపెనీలూ మొదట Keelawn Technologies Ltd అనే కంపెనీలో merge అయ్యాయి, పిదప దాన్ని జగన్ taekeover చేశాడు.Carmel Asia అనే కంపెనీ మొదట Jagathi Publications Private Limited, Indira Television అనే మీడియా కంపెనీల్ని ప్రారంభించి 2008లో  Sakshi daily and Sakshi TV channelని కూడా ప్రారంభించటం జరిగింది.2001 నాటికి కేవలం ఒక చిన్న పవర్ ప్లాంటు యజమాని అయిన ఇతని కంపెనీలకు అంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు ఎలా వచ్చాయి? అందులో ఉన్న చిదంబర రహస్యం ఏమిటంటే వీరంతా రాజశేఖర రెడ్డి ద్వారా ఇతరమైన అవినీతి మార్గాలలో లబ్ధి పొంది దానికి చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని జగన్మోహన రెడ్డి పెట్టిన అవి తయారు చేసిన ఉత్పత్తులు అంటూ యేమీ లేని ఉత్తుత్తి కంపెనీల ఖాతాలలో వేశారు - అది CBI చేసిన నిర్ధారణ.
2012 మార్చి 31న CBI మొదటి చార్జిషీటు దాఖలు చేసింది - ఇందులోనే జగన్మోహన్ రెడ్డి A1గానూ విజయసాయి రెడ్డి A2గానూ బిరుదులు పొందారు, సహనిందితులు 13 మంది.ఏప్రిల్ 3న రెండవ చార్జిషీటు, మే 7న మూడవ చార్జిషీటు వేసింది CBI - అన్నింటిలోనూ వారిద్దరే A1, A2లు.మే8న Sakshi daily, Sakshi television channel, Janani Infra కంపెనీల ఆస్తుల్ని సీజ్ చేసింది.మే 9 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సాక్షి పత్రిక మరియు చానెలుకు వ్యాపార ప్రకటనలు ఆగిపోయాయి.హైకోర్టు మే 23న జగన్ కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.మే 23న CBI జగనుకు మే 25 లోపు తనముందు హాజరవ్వాలని సమన్లు పంపించింది.మే 25న విచారణ ప్రారంభించిన CBI మే 27న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించింది.
మన కసికొద్దీ మనం చిప్పకూడు అనుకున్నప్పటికీ ఇలాంటి వాళ్ళకి కారాగారంలో కూడా వైభవాలకి తక్కువేం ఉండదు.న్యాయవువస్థ కూడా కొన్ని చిత్రమైన అసమానతలను పాటిస్తున్నది.నేరాలలోనూ విభజన ఉన్నది - సివిల్, క్రిమినల్ చట్టాలు వేరు.నేరస్వభావాన్ని బట్టీ నేరం యొక్క తీవ్రతను బట్టీ శిక్షలలో కూడా అంతరాలు ఉంటాయి.న్యాయవాదుల్లోనూ న్యాయమూర్తుల్లోనూ మానవసహజమైన దౌర్బల్యాలు ఉన్నాయి, ఉంటాయి.అసలు జగన్ అప్పటికి విచారణ పూర్తయిన నేరస్థుడు కాదు.అప్పటి జగన్ కారాగార వాసం అతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విచారణ కోసం కోర్టు తన ఆతిధ్యంలో ఉంచుకోవడం లాంటిది మాత్రమే - కాబట్టి ఆహార్య భోజన విహార నియమాలు వర్తించవు కాబోలు!ఆ సమయంలో కూడా నాగార్జున జైలుకి వెళ్ళి కలవడం లాంటి వార్తల వల్ల ఫోకస్ రింగ్ అతని మీద పడుతూనే ఉంది.కొందరు సీనియర్ జర్నలిస్టులు చెప్పినదాన్ని బట్టి సినిమా రంగంలో జగన్ బీనామీ సంస్థ అయిన R R Creations నుంచి తనకు రావల్సిన బకాయిల కోసం వెళ్ళినట్టు తెలుస్తున్నది. అంతే కాదు, కాంగ్రెసు నుంచీ తెలుగుదేశం నుంచీ డజనుకు పైన శాసనసభ్యులు అతన్ని కలిశారు - తెదెపా నాయకులు అతను చంచల్ గూడ జైలుని తన పార్టీ ఆఫీసు కింద మార్చడానికి అధికార పార్టీ సహాయం చేస్తున్నదని ఆరోపించారు కూడాను.
అయితే, 2013 సెప్టెంబర్ 23న పదహారు నెలల ఏకాంతవాసం తర్వాత CBI కోర్టు అతనికి నిబంధనలతో కూడిన బెయిలును మంజూరు చేసింది!ఆ నిబంధనలలో అతి ముఖ్యమైనవి అనుమతి లేకుండా హైదరాబాదు విడిచిపెట్టి వెళ్ళరాదనేదీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలనేదీ ఉన్నాయి.2 లక్షల ష్యూరిటీని కూడా కట్టించుకున్నది.వైకాపా  శ్రేణుల ఉత్సాహానికి అంతు లేకుండా పోయింది!ఆర్ధిక నేరాలకు సంబంధించి ప్రపంచ స్థాయిలో ఉండి సుప్రీం కోర్టు కూడా ఇతను చేసిన నేరాల్ని "ఆర్ధిక ఉగ్రవాదం" అని పేర్కొనడం వల్ల బెయిలు రావడమే వాళ్ళు తమ ప్రయత్నాలకు లభించిన విజయం అనుకుని ఉండవచ్చు.
కానీ, CBI కోర్టు యొక్క సాంకేతిక పరిభాషలో అతను నిర్దోషి అని నిరూపణ కాలేదు.ఇప్పటికీ  CBI కోర్టు యొక్క ప్రత్యక్ష విచారణ పూర్తి కాలేదు. ఆనాడు ఇచ్చిన కండిషనల్ బెయిల్ కొన్ని కేసుల విచారణని పూర్తి చేసి మరికొన్ని కేసులలో విచారణ కోసం ఇచ్చిన విరామం మాత్రమే.అయితే అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ బెయిలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ గమనించితే వైకాపా శ్రేణులకే కాదు, మనకు కూడా తమకు ఎదురు తిరిగినందుకు అణిచివేసి కాళ్ళబేరానికి తెచ్చుకుని తమకు అనుకూలమైన సమయంలో ఉపయోగించుకోవడానికి ఆ కేసులు పెట్టినట్టు అనిపిస్తుంది.లెక్క ప్రకారం చూస్తే అప్పటి బెయిల్ అతనికి ఏడవ లక్కీ చాన్స్!
ఆనాటికీ ఈనాటికీ అవినీతికి అధికారం తోడైనవాళ్ళ వైభవం ఎట్లా వుంటుందో ఒక్కసారి జగన్ బెయిలు మీద జైలు బయటికి వచ్చిన సన్నివేశం చూడండి - ఎంత కోలాహలం, ఎంత ఆనందం, ఎంత సంభ్రమం, ఎంత ప్రజాభిమానం!నిజమే మరి, రాగద్వేషాలు లేని తులనాత్మక దృష్టితో చూస్తే రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండి జగను ఆర్ధిక కార్యకలాపాలకి ప్రోత్సాహం ఇచ్చారని CBI చార్జిషీట్లలో పేర్లు ఉన్న Geeta Reddy, Sabita Indra Reddy, Dharmana Prasada Rao, Mopidevi Venkatramana వంటి రాజకీయ నాయకులు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ ఉన్నారు.ఇదెక్కడి విచిత్రం?బయట ఉంటే సాక్షుల్ని బెదిరించటం అనే కారణం ఒక్క జగనుకేనా వర్తించేది, అదే నేరంలో భాగస్వాములైన వీరంతా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా!
ఈ విషయాలను మాత్రమే చూస్తే అలానే అనిపిస్తుంది.కానీ అతను జైలునుంచి విడుదలైన 2013 నాటి రాజకీయ వాతావరణంలో అతను తీసుకున్న అతి పెద్ద U-Turn చరిత్రను ఏ మలుపు తిప్పిందో గమనిస్తే అతని అవినీతి వాస్తవం అనీ తెలుస్తుంది, అతని అరెస్టు వెనక ఉన్నది కాంగ్రెసు రాజకీయ కక్ష సాధింపు కూడా వాస్తవం అని తెలుస్తుంది, అతని విడుదల కూడా తల్లి కాంగ్రెసులోనూ పిల్ల కాంగ్రెసులోనూ ఉన్న అధికారం లేనిదే ఒక్క క్షణం కూడా బతకలేని అవినీతిపరుల మధ్యన కుదిరిన వ్యాపార ఒప్పందం అని నాకు అర్ధమైంది.అతను బెయిలు మీద విడుదలయ్యే సమయానికి కాంగ్రెసు తెలంగాణ ఏర్పాటుకు వాగ్దానం చేసి కూడా ఎలా విడగొట్టాలో తెలియక దాదాపు పదేళ్ళ నుంచి వాయిదా వేస్తూ వస్తున్నది.అరెస్టు కాకముందరి ఎనికల్లో కూడా ఒక్క కడప జిల్లాను మాత్రమే పట్టుకోగలిగాడు గానీ మిగిలిన ఆంధ్ర ప్రాంతంలో అతనికి ఉన్న బలం నామమాత్రమే, తెలంగాణలో అది కూడా లేదు.అందుకే జైలుకి వెళ్ళకముందు విభజనని వ్యతిరేకించినవాడు బెయిలు మీద విడుదలైన 2013 నుంచీ విభజనకు అనుకూలమైన వాదనలు చెయ్యడం మొదలుపెట్టాడు.అప్పటివరకు కాంగ్రెసు చంద్రబాబు విభజనను వ్యతిరేకిస్తున్నాడని విమర్శిస్తూ లేఖలు తీసుకోవటం లాంటి చెత్తపనులు చెయ్యటం తప్ప విభననని జరిపించటానికి చోరవ చూపించటం లేదు.ఆర్టికల్ మూడు గురించిన సూచన చేసి రాష్ట్ర విభజనని వేగవంతం చేశాడు.తెలంగాణ ఉద్యమం చంద్రబాబును దోషిని చేసింది గాబట్టి తెలంగాణలో ఉద్యమ నిర్మాత కేసీయారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రానికి తను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని అంచనా కట్టాడు!నా ఉద్దేశం ప్రకారం రాజీ ప్రతిపాదన జగన్ వైపునుంచే వచ్చి ఉండాలి.ఎందుకంటే, ఆర్టికిల్ మూడుతో కేంద్రప్రభుత్వం చెయ్యగలిగిన ఏకపక్ష విభజన అనే ఆలోచన కాంగ్రెసువాళ్ళలో వచ్చి ఉంటే జగనును బయటికి తీసుకు రావాల్సిన అవసరం లేదు.కాబట్టి జగను జైలునుంచి నన్ను బయటకు తీసుకొస్తే తను విభజనకి సహకరించి తన మంత్రివర్గంలో వాళ్ళకి చోటిస్తాననే క్విడ్ ప్రోకో ప్రపోజల్ పంపించడం వల్లనే అతని స్వేచ్చావిహారం మళ్ళీ మొదలైందనేది నా నమ్మకం. నేను అంత గట్టిగా జగను వైపు నంచే రాజీ ప్రతిపాదన వెళ్ళిందని చెప్పడానికి బలమైన సాక్ష్యం శివరామకృష్ణన్ కమిటీకి కేంద్రం పంపించిన లిస్టులో పులివెందుల ప్రముఖమైనది కావటమే! దొనకొండతో సహా మిగిలినవి కూడా అన్నీ అతనికి అనుకూలంగా ఉండటం చూస్తే రాజధాని స్థల నిర్దేశం విషయంలో అతను ఏది ప్రతిపాదిస్తే దాన్నే కేంద్రం కమిటీకి రీడైరెక్ట్ చేసినట్టు ఉంది - 2014లో అతను గెలిచి ఉంటే పులివెందుల గానీ దొనకొండ గానీ రాజధాని అయివుండేది.  అప్పటి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండి ఫోక్స్ వ్యాగన్ కుంభకోణంలో ఇరుక్కున్న బొత్స సత్యనారాయణ ఇప్పటి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోనూ ఉన్నాడు కదా! జగన్ జైల్లో ఉన్న కాలంలో సహనిందితులైన వీళ్ళు బయట ఉండి ఉద్ధరించిన ఘనకార్యాలు ఇవే - అతనికీ కాంగ్రెసు అధిష్ఠానానికీ రాజీ ప్రతిపాదనలు పంపించడమూ తద్వారా మొత్తం వ్యవహారంలో అందరికీ పడబొయే శిక్షలను తప్పించుకోవడమూ తప్ప ఇంకో పని లేదు వాళ్ళకి.
జగన్ బెయిలు మీద విడుదలయ్యే సమయానికి కాంగ్రెసులోనే కొందరు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అరి భీకరమైన ఉద్యమం చేస్తున్నారు.ప్రజల్లో దానికి ప్రోత్సాహం లేకపోయినా ఎందుకు కొనసాగించారో తెలుసా!జగన్ ఇచ్చిన ఆర్టికిల్ మూడు ప్రకారం విడగొట్టటానికి కావలసిన సంఖ్యాబలం పార్లమెంటులో కాంగ్రెసుకు లేదు.ప్రతిపక్షం సహాయం తప్పనిసరి.ఒకవేళ వాళ్ళు అడ్డం కొట్టి విభజన బిల్లు వీగిపోతే మా ఉద్యమం వల్లనే రాష్ట్రం ఒక్కటిగా నిలబడిందనే కీర్తిని కొట్టెయ్యడానికి వాళ్ళలా కాలక్షేపం చేశారు తప్పితే అందులో నిజాయితీ లేదు. కాంగ్రెసుతో మిలాకత్ అయ్యి ఉండకపోతే అతను సమైక్య ఉద్యమంలోకి దూకేవాడు తప్ప విభజనని సమర్ధిస్తూ U-turn తీసుకుని వుండేవాడు కాదు.జగను ఇచ్చిన అయిడియా వల్ల విభజన తర్వాత ఆంధ్రలో కాంగ్రెసు పార్టీ సర్వనాశనం అవుతుందని అంతవరకు భయపడిన కాంగ్రెసువాళ్ళకి ఇప్పుడు వైకాపాలోకి దూకెయ్యొచ్చుననే వెసులుబాటు ఉంది కదా!
కానీ, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని ఆంధ్ర ప్రజలు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు! ఆ 2014 నుంచి ఈ 2019 వరకు అతను ఏమి చేశాడో ఇవ్వాళ మళ్ళీ ఎత్తిపొయ్యడం దేనికి?అంత సంక్లిష్తమైన పరిస్థితుల్లో మరొకడయితే 2019లో గెలిచే అవకాశం లేదు.నిజానికి 2014లో అతనున్న హుషారులో ఆ దెబ్బకి మతి చలించాల్సింది - అతనెట్లా తట్టుకోగలిగాడో నాకిప్పటికీ ఆశ్చర్యమే!మొత్తానికి ధైర్యం కూడదీసుకోగలిగాడు కానీ అనుభవలేమి వల్లనూ తట్టుకోలేని అవమానం నుంచి పుట్టిన ఆక్రోశం వల్లనూ చాలా తప్పులు చేశాడు.ప్రతి ఎత్తుగడా వేస్తున్నప్పుడు అతని పక్షం వాళ్ళు అద్భుతం అనుకున్నారేమో గానీ ప్రతిసారీ తెల్లమొహం వెయ్యాల్సి వచ్చే స్థాయిలో ఎదురు తంతూ ఉండేవి. చంద్రబాబు సమర్ధత మోదీ కేసీయార్ ఇద్దరికీ ఈర్ష్యను పుట్టించి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం, ప్యాకేజీకి తూట్లు పొడవటం, చంద్రబాబు బీజెపీ నుంచి విడిపోవటం ఇతనికి అనుకూలమైన పరిస్థితిని సృష్టించాయి.
మరి, అంతటి పోరాట పటిమ గల చాణక్యుణ్ణి మించిన మహా మేధావి "మాకు ప్రజభిమానం వద్దు,మరుసటి ఎన్నికల్లో ప్రజలు మాకు వోట్లు వెయ్యకపోయినా ఫర్వాలేదు!రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చటమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రం మొత్తాన్ని ఎడారిగానూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అగ్నిగుండంగానూ మార్చేవరకు మమ్మల్ని ఎవరూ ఆపలేరు!" అని శపధం పట్టినట్టు ఇంత చెత్త పాలన ఎందుకు చేస్తున్నాడు? అతన్ని దగ్గిర్నుంచి చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట - అతని రాగద్వేషాలు చాలా తీవ్రమైనవి, తనని అభిమానించినవాళ్ళని అందలం ఎక్కించుతూ తనని అవమానించినవాళ్ళని అణగదొక్కుతూ పగలబడి నవ్వుకునే ఫ్యాక్షనిస్టు మనస్తత్వం!
తండ్రి చనిపోయిన 2009 నుంచి ముఖ్యమంత్రిత్వం కోసం అంత తపన పడినవాడు వ్యూహ నిర్మాణ చాతుర్యంలో నలభయ్యేళ్ళ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుని కూడా దెబ్బ మీద చెబ్బ కొట్టి పదే పదే కళ్ళనీళ్ళ పర్యంతం చెయ్యగలిగిన కేవలం ఒక దశాబ్ద కాలపు పోరాటంతో సాధించటం గొప్ప విశేషమే - నేను ఇక్కడ తన జీవితాన్ని రేఖామాత్రం చూపించింది కూడా ప్రశంసాభావంతోనే!నన్ను గురించి నేను ఒక political analyst అనుకుంటున్నాను.సీనియర్ అయినా జూనియర్ అయినా political analyst అనేవాడు ప్రజలకి ఒక వ్యక్తిని పరిచయం చెయ్యాలనుకున్నప్పుడు వ్యక్తిగత రాగద్వేషాలను ఆ విశ్లేషణలోకి రానివ్వకూడదు.జగన్ అభిమానులు కొందరు నాకు చంద్రబాబు అభిమాని అని ముద్ర కొట్టేశారు.కానీ వారికి తెలియనిదీ తెలిసినా పట్టించుకోనిదీ ఏమిటంటే చంద్రబాబును గురించి కూడా ఇలాగే చెప్పాను.
ఒక రాజకీయ నాయకుణ్ణి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక, అధికారం నుంచి తప్పుకున్నాక అనే మూడు దశల్లోనూ అతన్ని గమనించాలి.మూడు దశల్లోనూ అతని ప్రవర్తన ఒక్కలాగే ఉంటే అతనిలో ప్రజల పట్ల నిజాయితీ ఉందని చెప్పడానికి అతని శత్రుపక్షం వాళ్ళకి కూడా అభ్యంతరం ఉండదు.చంద్రబాబును మనం ఈ మూడు దశల్లోనూ చూసి ఉన్నాము కదా - భాషలో ఉన్న సభ్యత అలాగే ఉంది, ప్రవర్తనలోని హుందాతనం అలాగే ఉంది, సమస్యల పట్ల స్పందన అలాగే ఉంది,ప్రజల పట్ల అభిమానం అలాగే ఉంది, ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందన కూడా అలాగే ఉంది!
మరి, జగన్ మొదటి రెండు దశల్లోనూ ఒక్కలానే ప్రవర్తిస్తున్నాడా?ఔను, ఇతను కూడా ఒక్కలానే ప్రవర్తిస్తున్నాడు - "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యాలి!" అన్న అప్పటి కక్షనే ఇప్పుడు తీర్చుకుంటున్నాడు కదా!అంతే కాదు, అమరావతి అని పేరు పెట్టినప్పటినంచి మొదలుకొని దాన్ని ఆపడానికి ఎన్ని విఫల ప్రయత్నాలు చేశాడు?సభలో ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం ల్యాక yes,yes,yes అన్నాడు గానీ అయిదేళ్ళ పాటు గ్రీన్ ట్రిబ్యునలుకు పిటిషన్లు వెయ్యటం లాంటి జాతీయ స్థాయి కుట్రల నుంచి ఎన్ని ప్రపంచ స్థాయి ప్రయత్నాలు చేశాడు?అతను గెల్చాడనీ ముఖ్యమంత్రి కాబోతున్నాడనీ తెలిసిన వెంటనే అతని అభిమానులు సోషల్ మీడియాలో "అమరావతి ఇక ముగిసిపోయిన కధ!" అని హర్షాతిరేకంతో పొలికేకలు పెట్టారు కదా!దాని అర్ధం ఏమిటి? చంద్రబాబు లాగే జగన్ యొక్క ప్రవర్తన కూడా ఈ రెండు దశల్లోనూ ఒక్కలాగే ఉంది - భాషలో ఉన్న అసభ్యత అలాగే ఉంది, ప్రవర్తనలోని లేకితనం అలాగే ఉంది, సమస్యల పట్ల అజ్ఞానం అలాగే ఉంది, ప్రజల పట్ల చిన్నచూపు అలాగే ఉంది, అభిమానుల నుంచి వస్తున్న ప్రతిస్పందన కూడా అలాగే ఉంది!అదే అసలైన సమస్య - జగన్ అతని అభిమానులూ ముఖ్యమంత్రి స్థానాన్ని వ్యక్తిగత కక్షల్ని తీర్చుకోవడం కోసం తప్పు కాదని అనుకోవటమే.కాంగ్రెస్ జగన్ని జైల్లో పెట్టించడం కక్ష సాధింపు చర్య కాబట్టి అతను అమాయకుడని వాదిస్తున్నారు."నేరం రుజువు కానంతవరకు ఆరోపణల్ని ఎదుర్కొంటున్నవాడిని దోషి అనకూడదు!" అనేది కోర్టులు తమవల్ల పొరపాట్లు జరగకుండా పెట్టుకున్న సాంకేతికపరమైన నిషేధం, కానీ ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి చేసిన నేరారోపణని న్యాయమూర్తులు పరిశీలించి ప్రాధమిక సాక్ష్యం కేసును కొట్టిపారెయ్యలేననత బలమైనది అయితేనే విచారణకు స్వీకరిస్తాయనేది మర్చిపోకూడదు. "సండూరులో పవర్ ప్లాంట్ పెట్టిన మరుసటి ఏడాది 2001కే M B Ghorpade అనే original promoter నుంచి 53.51 కోట్లు చెల్లించి SPCLని కొనెయ్యగలగటం" లాంటి అద్భుతం అతన్ని అవినీతిపరుడు కాదనేవారిలో ఎవరు చేసి చూపించగలరు?
ఇవ్వాళ వీళ్ళకి అధికారం ప్రజలకి సేవ చెయ్యడం కోసం కాదు.సేవ చెయ్యాలంటే ప్రజల మీద ప్రేమ ఉండాలి.అది ఉన్నవాడు ఎవడూ అమరావతిని భ్రమరావతి అని గానీ హైమావతి అని గానీ అనటానికి సాహసించడు. నదిలో పడవ మునిగితే ఆ మునక వెనక సాక్షాత్తూ పర్యాటక శాఖామంత్రి ఉన్నాడని తనకు తెలిసిన నిజం చెప్పినందుకు హర్షకుమార్ అనే మాజీ పార్లమెంటు సభ్యుణ్ణి అరెస్టు చేసిన పద్ధతి ఎలా వుంది?అతను చేసిన భయంకరమైన నేరం ఏమిటని నాలుగు టీముల్ని పంపించి వేటాడారు?పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందని పోలీసులే ఒప్పుకుంటున్నా కూడా ప్రజలు జగన్మోహాన్ రెడ్డిని అభిమానించగలుగుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
రాజశేఖర రెడ్డి కాలపు దోపిడీదారుల దేవుడి రాజ్యపు అసలైన ముఖాన్ని ప్రజలకి చూపించడానికే వీళ్ళు పోటీలు పడుతున్నారు.కేవలం ఆరోగ్యశ్రీ లాంటి మొన్ని ప్రజాకర్షక పధకాలు జనం మొహాన కొట్టినందుకు దేవుడని పేరు తెచ్చుకున్న తండ్రితో సహా కొడుకుని కూడా అసహ్యించుకునే పద్ధతిలో చరిత్రని సృష్టించడం కోసం ఇప్పటి ప్రభుత్వం తహతహలాడుతున్నట్టు నాకు అనిపిస్తున్నది.హర్షకుమార్ అరెస్టు వల్ల పరిటాల రవి హత్య కేసులో అరెస్టవ్వాల్సిన వాడు ఇప్పుడు జైల్లో ఉన్న కొండారెడ్డి కాదు, హంతకులకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనిచ్చిన జగనే అని తెలియడం లేదా!లేదంటే ప్రజావేదికను కూల్చాలిన అవసరం ఏమిటి?అందువల్ల అతను గడించిన కీర్తి ఎంత?కోడెల శివప్రసాదరావు వంటి 35 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తిని ఆత్మహత్య వైపుకి నడిపించడం వల్ల వీళ్ళు సాధించింది ఏమిటి?అవినీతి మచ్చతో జీవించడానికి ఖేదపడి అతనిలాంటి స్వాభిమానులు తనువు చాలించడానికీ అవినీతి మచ్చను చూసుకుని ఇతనిలాంటి సిగ్గులేనిజాతి గర్వించడానికీ ఉన్న తేడా వీళ్ళు చేసిన వెధవపని వల్లనే తెలిసింది.
ప్రజలెక్కడ మర్చిపోతారోనని రోజుకోసారి "మాకు ప్రజభిమానం వద్దు,మరుసటి ఎన్నికల్లో ప్రజలు మాకు వోట్లు వెయ్యకపోయినా ఫర్వాలేదు!రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చటమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రం మొత్తాన్ని ఎడారిగానూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అగ్నిగుండంగానూ మార్చేవరకు మమ్మల్ని ఎవరూ ఆపలేరు!" అని శపధం పట్టినట్టు ప్రజలకి గుర్తు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నది ఈ ప్రభుత్వం.లేకపోతే 50 రోజులకి పైన అమరావతి రైతులు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తుంటే కనీసం ప్రభుత్వం తరపునుంచి ఒక అధికారికమైన రాజీ ప్రతిపాదనని కూడా పంపించకపోవడం ఏమిటి?అంతకన్న విచిత్రం యేమిటంటే రైతులు రాజీకి రాకుండా ఉద్యమాన్ని ఉధృతం చెయ్యడానికి ప్రోత్సహించడం - భూమిలిచ్చిన రైతుల్ని చంద్రబాబు బీనామీలని అనడం,ఉద్యమాలు చేసేవాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనడం లాంటివి రైతులు తమ వైపు నుంచి రాజీ ప్రతిపాదనలు చెయ్యకుండా ఉండటం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రమే!
సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలు తమకి సమస్యల్ని సృష్టించడానికి ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేస్తే సమయస్పూర్తితో వ్యవహరించి ఆ సమస్యల్ని పరిష్కరించి ప్రజల ఆవేశాల్ని చల్లార్చి ప్రతిపక్షాల దాడినుంచి తప్పుకుంటాయి.కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ కూడా రివర్సు గేరులోనే వెళ్తున్నది!రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వమే సమస్యని సృష్టించి ప్రజల్ని రెచ్చగొట్టింది.పోలీసులకి జేబుల్లో బ్లేడ్లని ఇచ్చి పంపించడం ఏమిటి?జై అమరావతి అన్నందుకు నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధుల్ని సస్పెండ్ చెయ్యటం ఏమిటి?ప్రభుత్వం పనిగట్టుకుని ప్రశాంతమైన పద్ధతిలో నడుస్తున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు లేదూ!
ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి చంద్రబాబుని బ్లేం చేద్దామన్న రంధి తప్ప నిజానికి రాజధాని తరలింపు కోసం అధికారికమైన ఉత్తర్వులు జారీ చెయ్యడం లేదు.అధికారులు పోయి విశాఖలో రైతుల దగ్గిర నుంచి భూముల్ని సేకరించటానికి చేస్తున్న ప్రయత్నాలకి కూడా మౌఖిక ఉత్తర్వులే తప్ప అధికారికమైన గెజెట్ ఆర్డర్ లేదు. అంటే, మూడు రాజధానులు లేక రాజధానిని విశాఖకు తరలింపు అనేది సాధ్యం కాదని వాళ్ళకీ తెలుసు.మరి ఎందుకు చేస్తున్నారు?నాకు తోచిన కారణాలు రెండు:1.తెలంగాణ ఉద్యమంలానే చంద్రబాబును ప్రజాద్రోహి అని నిరూపించి అతను తిరిగి ముఖ్యమంత్రి స్థానం దక్కడానికి వీల్లేని స్థాయిలో అతన్ని పతనం చెయ్యడం.అసెంబ్లీలో చంద్రబాబు అమరావతిని ధ్వంసం చెయ్యవద్దని నమస్కరించినప్పుడు వెకిలి నవ్వు నవ్వడం తన లక్ష్యం నెరవేరుతున్నదనే సంతొషానికి చిహ్నం.2.తనకెటూ చంద్రబాబుని మించి పేరు తెచ్చుకునేలా పరిపాలించటం చేతకాదు కాబట్టి ఉద్యమం హింసాత్మకంగా మారితే శాంతిభద్రతలకు విఘాతం అనే పేరున భాజపా విధించబోయే రాష్ట్రపతి పాలనను ఆహ్వానించి తన రాజకీయ చరిత్రను ముగించి వెయ్యడం.రాష్ట్రపతి పాలన సమయంలో పోలవరాన్ని వాయువేగంతో పూర్తి చెయ్యడంతో పాటు ప్రత్యేకహోదా ఇవ్వడం వరకు ఆంధ్రప్రజల్ని తనకు అధికారం కట్టబెడతారని నమ్మకం కలిగాక ఎన్నికలకు వెళ్ళడం అనేది బీజెపీ ప్లాను.అతని మీద ఉన్న కేసుల స్వభావం వల్ల బీజేపీకి ఉపయోగపడటం తప్ప తనకు మంచిపెరును తెచ్చుకునే స్వేచ్చ కూడా లేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు జగన్ ఇప్పుడు.
మొదటిది నెరవేరే అవకాశం లేదు.చంద్రబాబుని బూతులు తిట్టడమూ అతని యేడుపుముఖాన్ని చూసి ఆనందించడమూ వాళ్ళ స్వయంతృప్తికి పనికొస్తుంది గానీ చంద్రబాబుకి ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని వైకాపా నారావారిపల్లె సమావేశమూ చంద్రబాబుకు తెనాలిలో లభించిన ఘనస్వాగతమూ కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే ఉన్నాయి.ఇప్పటివరకు ఉద్యమకారులు ప్రశాంతంగానే ఉండటం చాలా గొప్ప - మున్సిపల్ ఎన్నికల వరకు ఇదే ప్రశాంతతా నిగ్రహమూ కొనసాగితే మంచిది, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితం ఎలా వుంటుంది, దాన్ని ప్రభుత్వం ఎట్లా స్వీకరిస్తుంది అన్న దాన్ని బట్టి ఈ ప్రభుత్వం పూర్తి సమయం అధికారంలో ఉంటుందా లేదా అన్నది చెప్పగలం.ఇప్పటి పరిస్థితిలో జగనుని తన పద్ధతుల్ని మార్చుకోగలిగే రీతిన ప్రభావితం చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు.
ఇతని వ్యాపార విస్తృతి ప్రపంచంలో ఎవరూ పోటీ పడలేనంత వేగంతో పెరిగి ఇప్పటికీ నికర సంపద ₹66.18 CRORE, స్థిరాస్థులు ₹72.82 CRORE, ఇతరాలు  ₹6.64 CRORE వైభవంతో అలరారుతున్నాడు. ఇది అతనికి అక్రమసంపాదన అనిపించటం లేదు.అతనికే కాదు, బొత్సకీ బుగ్గనకీ కూడా అంతే! ప్రజల్లో తమ పరిపాలన పట్ల ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ అంత మొండితనం చూపించటానికి వీళ్ళందరినీ క్రైస్తవ మత భావజాలం ప్రభావితం చేస్తున్నదని నా నమ్మకం.హిందువుల దృష్టిలో పాపం అంటే అబద్ధాలు చెప్పటం, దొంగతనం చెయ్యడం, ఇతర్లని చంపడం వంటివి - ఇవి చేస్తే దేవుడు శిక్షిస్తాడనే హెచ్చరిక వుంటుంది.వీటిలో దొంగతనం, ఇతర్లని చంపడం అనేవి చట్టంలో నేరం పేరున నిర్వచించి శిక్షలు వేస్తున్నారు.అయితే నేరం అనేది లౌకిక సంబంధమైనది, పాపం అనేది ఆధ్యాత్మికమైనది.చట్టం నేరం జరిగాక శిక్షించడం తప్ప నేరాల్ని జరగకుండా ఆపలేదు, ఖచ్చితమైన పాపపుణ్యాల నిర్వచనాలతో కూడుకున్న ఆధ్యాత్మికత నేరాల్ని జరగకుండా నివారించగలదు. కారణాలు ఏమైనా గానీ హిందువులు ఆధ్యాత్మికతకు దూరం కావడం వల్లనే కష్టాలు పడుతున్నారనేది వాస్తవం!అదే క్రైస్తవంలో మనం పాపకర్మలు అంకునే అబద్ధాలు చెప్పటం, దొంగతనం చెయ్యడం, ఇతర్లని చంపడం వంటివి కాక "యహోవా నా కాపరి!యేసే రక్షకుడు!" అని నమ్మకపోవటమే పాపం అవుతుంది.వాళ్ళ దేవుడు "అబద్ధాలు చెప్పటం, దొంగతనం చెయ్యడం, ఇతర్లని చంపడం వంటివి" చేసినవాళ్ళని శిక్షించడు, "యహోవా నా కాపరి!యేసే రక్షకుడు!" అని నమ్మనివాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు.ఇది జగన్ క్రైస్తవుడు కాబట్టి చెప్పటం లేదు.బుగ్గనా బొత్సా హిందువులే కదా!అయినప్పటికీ వీళ్ళ మనస్తత్వం కూడా "బాప్తిజం తీసుకున్నాను గాబట్టి యేసు నన్ను అని పాపాల నుంచీ రక్షిస్తాడు!" అని నమ్ముతున్నట్టు "నేను మంచివాణ్ణి, నా సంపాదన కష్టార్జితం,నన్ను అవినీతి పరుడని అంటున్నవాళ్ళే అవినీతిపరులు." అని అనుకుంటూ ఉంటారు.జగన్ అభిమానులు కూడా ఎవరు ఎన్ని సాక్ష్యాలు చూపించినా సరే జగన్ అవినీతిపరుడని ఒప్పుకోరు.అయితే, జగన్ పరిపాలన ఫలితం ఏదో ఒక రోజున వాళ్ళనీ నష్టపెడుతుంది, రోజు వరకు ఎదురు చూడటం తప్ప వాళ్ళను మార్చడం కోసం ప్రయత్నించి సాధించేది లేదు.
కాలోహి దురతిక్రమం!నహి నహి రక్షతి డుకృంకరణే!!యావత్తైలం తావద్వ్యాఖ్యానం!!!

5 comments:

  1. chandrababu mida prajalaku abhimnam chekku chedaraledu. idokkati chalu miru andhra bayata untaru ani chepadaniki. asalu miku andhralo vote undha leka americalo softwear job chestunnara?

    ReplyDelete
    Replies
    1. so, you are living in inside andhra.OK!you tell me what is the real situation?Do you think people will love jagan even after old people lost old age pensions?

      as if people wished for navaratnas, how is the implementation -you tell me.

      Delete
    2. i living in mvp colony. all is well. peoples happy no problem. u wait uptill gvmc elections u will see.

      Delete
    3. @Anonymous11 February 2020 at 00:29
      i living in mvp colony. all is well. peoples happy no problem. u wait uptill gvmc elections u will see.

      hari.S.babu
      So, You think YCP is ruling nice with standards of good governanace and It will win in gvmc elections!

      Delete
    4. @@Anonymous11 February 2020 at 00:29
      u wait uptill gvmc elections u will see.

      hari.S.babu
      Tomorrow is the continuation of today, do you agree or you are thinking that tomorrow is a miraculous event which is not dependant on today!

      what do you mean by shifting capital? This governmaent cannot build even a single building - he is searching for all ready completed buildings to live, that's all!Leaving fully constructed assembly and secretariat as barren and living here in rental houses is appearing to as shifting capital?

      are you not ashamed of your ignorance?Do you think all the people of vizag are idiots like you?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...