Friday 7 July 2017

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం!మానవుడనేవాడున్నాడా అని దేవుడి కొచ్చెను అనుమానం!

          If triangle made a god,they will give three arms and one body - just like themselves!ఈ లెక్క ప్రకారమే మనిషి దేవుడికి తన రూపాన్నే ఇచ్చాడు కాబోలు!అనేక విధాలుగా తనని తనే అర్చించుకుంటాడు మానవుడు - అతని ఆత్మపూజకు నామాంతరమే దేవుడు!అతని ఆహారమే అతని దేవుడి నైవేద్యం - బ్రాహ్మణుడు పాయసం పెట్టాడు, శూద్రుడు పొంగలి పెట్టాడు, బోయతిన్నడు మాంసం పెట్టాడు!ఇతర జీవులైన వృక్షాలకీ జంతువులకీ అవసరం లేని దేవుడు మానవుడికే ఎందుకు అవసరం అయ్యాడు?

          ఆధునిక విజ్ఞానశాస్త్రం కొన్ని కీలకమైన చోట్ల త్రవ్వకాలు జరిపి అక్కడ దొరికిన వస్తువుల వయస్సును విశ్లేషించి ఆఫ్రికా లోని Rift Valey 4-5 మిలియన్ సంవత్సరాల వెనక Australopithecines అనే తొలి hominid సమూహం భూమిమీద నడిచిన తొలి ప్రాంతం అని నిర్ధారించారు.అలా తూర్పు ఆఫ్రికా ఒడిలో పెరిగిన పూర్వమానవజాతి Homo erectus యొక్క శిధిలాలు Ethiopia,Kenya మరియూ Tanzaniaలోని Turkana సరసు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఆ పూర్వమానవసమొహం ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర దక్షిణ భాగాలు రెండింటా వ్యాపించారని తెలియజేస్తున్నాయి.ఈ Homo erectus జాతియే ఆసియా,యూరోప్ ఖండాలకు కూడా విస్తరించింది.ప్రాచీనమైన  Homo erectus జాతి నుంచి ఆధునికమైన Homo sapiens జాతి ఆవిర్భావం కొంత నెమ్మదిగా జరిగింది - ఇది బహుశా 200.000 నుండి 100.000 మధ్య జరిగి ఉండవచ్చును!ప్రస్తుతం అందరు శాస్త్రవేత్తలూ ఈ ఆధునిక Homo sapiens జాతినే అసలైన మానవసంస్కృతీనిర్మాత అని గుర్తించారు. ఇతని ఆవాసాలు యెక్కడెక్కడ దొరికితే ఆ ప్రాంతం అత్యంత ప్రాచీన కాలం నుంచి మానవజాతికి అనుకూలంగా ఉన్నట్టు పరిగణించి అక్కడ యెన్నెన్నో పరిశోధనలు చేస్తున్నారు - మానవుల సామాజిక మనస్తత్వం లోని చిక్కుముడులను విప్పడానికి పనికొచ్చే పనిముట్ల కోసం!తొలి మానవ జాతి ఆఫ్రికాలో పుట్టి మొదట భరతఖండాన్ని చేరడం, తర్వాత ఆఫ్రికా నుండి మానవచలనం ఆగిపోవడం, తర్వాత ప్రపంచమంతటికీ భారత దేశాన్ని చేరిన సమూహమే వ్యాపించడం అనే మొత్తం వివరాలను క్రె.శ 2003లో Stephen Openheimer బృందం తాము చేసిన పరిశోధనలను గుదిగుచ్చి ఒక యానిమేషన్ వీడియోను రూపొందించింది.అరచేతులు రంగుదేలి కనిపిస్తూ రక్తారుణ నేత్రాలను కలిగి ఉండి నల్లని దేహంతో విలసిల్లే మహామాతను గురించీ సకల నాగరికతలూ భరతభూమి నుంచే మొదలు కావడాన్ని గురించీ సనాతనులు చెప్పినప్పుడు ఈ దేశంలోనివారే కొందరు వెక్కిరించారు.మరీ నీచమయిన విషయం యేమిటంటే, చరిత్రను చరిత్రలా చదివితే వారికి కూడా తల్లియే ఐన జగన్మాతను కేవలం హిందువులకు మాత్రమే అంటగట్టి sex worker అని అవమానించారు - తల్లిని కూడా దూషించగలిగిన సంస్కారహీనమైన హిందూద్వేషం వారిది!

          మనుష్యులు లిపిని కనిపెట్టి తమ జ్ఞానాన్ని అక్షరబద్ధం చేసిన తర్వాత వాటిని చదివితే అప్పటి వారి ఆలోచనలను కూడా చదివి స్పష్తమైన చరిత్రను నిర్మించగలం కాబట్టి అప్పటి నుంచి తెలుస్తున్న దానిని చరిత్రయుగం అని అంటున్నాము.దీనికి ముందరి కాలమైన చరిత్ర పూర్వయుగంలో మానవుల జీవన విధానం యెట్లా ఉండేది అని తెలుసుకోవడానికి వాళ్ళు నివసించిన ఇళ్ళు, వాడిన వస్తువులు మాత్రమే ఆధారం.ఇంటి ఆనవాళ్ళు కనిపిస్తే తలుపులు,గోడలు,కిటికీలు ఉన్న అమరికని బట్టి అవి కట్టినవాళ్ళ తెలివిని అంచనా వెయ్యడం,ఏ పనికి తగిన పనిముట్లు ఎక్కువ దొరికితే వాటిని దేనికి ఉపయోగిస్తారో ఆ పని అప్పుడు ఎక్కువమంద్ చెసేవాళ్ళు అని అనుకోవడం - అంతే!ఆంధ్ర ప్రాంతంలో తొలి మానవుడి ఆనవాళు 1,50,000 సంవత్సరాల ముందునుంచి దొరుకుతున్నాయి.ఈ కాలం గురించి సరైన తీరులో విశ్లేషించడానికి దీన్ని కొన్ని దశలుగా విడగొట్టారు - రాతి యుగం,ఇనుప యుగం,కంచు యుగం అని చాలా ఉన్నాయి.తమకు దొరికిన సమాచారం యొక్క విస్తృతిని బట్టి ఎవరికి వారు రకరకాల దశలను, అంతర్దశలను వర్ణించారు.అన్ని దశలోనూ ఇంటిలో వాడే వస్తువులలో కుండ ప్రముఖ పాత్రని వహిస్తుండటం విశేషం!మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసి ఇతర జీవుల కన్న అధికుడిగా నిలబెట్టిన లక్షణం ఆహారాన్ని దాచుకుని తినడం - అందుకు పనికివచ్చే సాధనమే కుండ.అందుకే అప్పటి ముంచి ఇప్పటి వరకు మనుషులు సంప్రదాయకంగా పాటించే అన్ని క్రతువులలోనూ, పూజలలోనూ, యజ్ఞాలలోనూ కుండ ప్రముఖపాత్రని వహిస్తున్నది - ఇప్పటి మనుషులు డబ్బు చుట్టూ తిరుగుతున్నట్టు అప్పటి మనుషుల జీవితం కుండ చుట్టూ తిరుగుతూ ఉండేది కాబోలు!

          దక్కను పీఠభూమి రాతియుగపు మానవునికి అత్యంత అనుకూలమైన ప్రదేశం.ఇక్కడి నేల హిమాలయాల కన్న చాలా పూర్వపుది. ఇక్కడి కొన్ని రాతిపొరలు మరింత ప్రాచీనమైనవి.ఇక్కడి వాతావరణం ఈనాటి కన్న మరింత వేడిగా ఉండేది.విపరీతమైన వర్షాలు కురిసేవి.నదీనదాలూ వాగువంకలూ ఎడతెగక పారుతూ ఉండేవి.వర్షాలు,ఎండలు ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉండటం వల్ల లాటిరైట్ రాయి ఏర్పడింది.ఇది పనిముట్లూ ఆయుధాలూ చెయ్యడానికి అనువైనది.పాత రాతియుగంలో ఒకే పనిముట్టును అన్ని పనులకూ వినియోగించిన మనిషి ఏ పనికా పనికి విడివిడీగా పనికి తగ్గ పనిముట్టును వాడటం నేర్చుకుని కొత్త రాతియుగంలోకి అడుగు పెట్టాడు.ఈ పనిముట్లని అమర్చి పటుకోవడానికి కర్రను వాడాడు.కర్ర స్థానంలోనూ పనిముట్టు స్థానంలోనూ లోహాన్ని వాడటంతో లోహయుగం మొదలైంది.రాతియుగం నుంచి లోహయుగం వరకు ఉన్న జీవనవిధానాన్ని నాగరికత అని పిలవలేము - లోహం ఇచ్చిన సౌకర్యం వల్ల స్థిరత్వం అవసరమై నగరాలను నిర్మించుకున్నాకనే నాగరికత మొదలైంది.

          పాత రాతియుగం నుండి చారిత్రక దశ వరకు అన్ని దశల పనిముట్లు గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ వద్ద దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇక్కడ కేవలం నాలుగు చరపు మైళ్ళ పరిధిలోనే ఆరు చోట్ల పనిముట్లు కనిపించాయి.ఖమ్మం జిల్లాలోని భద్రావ్=చలానికి 40 మైళ్ళ దూరంలో 35 రకాల పనిముట్లు కేవలం 50 గజాల మేరలో దొరికాయి.ఆగ్నేయాసియాలో కెల్లా రాయచూరు,బళ్ళారి జిల్లాలను కొత్త రాతియుగపు జన్మస్థలాలుగా పేర్కొనవచ్చును.ఇక్కడినుంచి తూర్పునా పడమరనా ప్రక్కన ఔన్న నెల్లూరు,అనంతపురం,కడప,కర్నూలు జిల్లాలకు విస్తరించింది.సమాజం వేటదశ నుంచి పశుపాలక వ్యసాయ దశకు యెదిగేసరికి పరిసరాలను గురించిన విజ్ఞానం పెరిగింది.జ్ఞానం విస్తరించిన కొద్దీ కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.పాత సమస్యలు పరిష్కారమయ్యాయని సంబరపడనివ్వకుండా కొత్త సమస్యలు మనశ్శాంతిని పోగొడుతున్నాయి - దానితో కొత్త దేవుళ్ళు,కొత్త నమ్మకాలు,కొత్త కర్మకాండలు పుట్టి మతం వ్యవస్థీకృతమై స్పష్టమైన రూపం తీసుకోవడం మొదలైంది.

          ఆది మానవ జాతి అడివి జంతువుల తర్వాత ఎక్కువగా భయపడింది అగ్నికే!అడవిలో తరచుగా పుట్టే నిప్పు కార్చిచ్చు - అది సమస్తాన్నీ దహిస్తుంది కాబట్టి భయపడి పారిపోవడం సహజం.అయితే అదే నిప్పు శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందనీ, అడివి జంతువుల్ని భయపెడుతుందనీ, చీకటిలో వెలుతురు నిస్తుందనీ, నిప్పుల మీద కాల్చిన మాంసమూ దుంపలూ తేలిగ్గా జీర్ణమవుతాయనీ తెలిశాక దానిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.ఆఖరికి రెండు కర్రలను రాపాడించి అగ్నిని చెయ్యడం సాధించిన మానవుడికి శూన్యం నుంచి మహాశక్తిని ఉద్భవింపజేసినంత మహోత్సాహం కలిగింది.ఈ కర్రలతో అగ్నిని ప్రజ్వలింపజేసే ప్రక్రియకే సంస్కృతంలో ఆరణి మధనం అని పేరు.అలా తమకు స్వాధీనమైన మహాశక్తి ఎల్లప్పుడూ తమని క్షేమంగా ఉంచాలని భావిస్తూ దానికి దివ్యత్వాన్ని కటబెట్టి ఆరాధించడంలో దైవం అనే భావన మొదటిసారి మనిషి ఆలోచనలోకి చొచ్చుకుని వచ్చింది!

          పాత రాతి యుగంలో మానవులు చనిపోయిన తమవారిని ఎక్కడ చనిపోతే అక్కడే వదిలి పోయేవారు,కొత్త రాతియుగం వచ్చేసరికి కళేబరాలను భద్రంగా కొన్నిచోట్ల పాతిపెట్టి గుర్తులు ఉంచడం నేర్చుకున్నారు.వైదిక సాహిత్యంలో పరోత్పసులు(మృతకళేబరాలను వదిలేసి పోయేవారు),ఉద్ధితులు(మృతకళేబరాలను ఎత్తయిన చోట దాచేచారు) అనే పేర్లు వినబడతాయి.మానవుడి ఆధ్యాత్మిక జీవనంలో క్రతువ్లు ముఖ్యపాత్ర వహించడంలో ఈ శవసంస్కారం మొదటి దశ కావచ్చు.ఇందులో చనిపోయిన మనిషి పట్ల ఉన్న ఆత్మీయతనీ అనుబంధాన్నీ ప్రద్ర్శించడం కనిపిస్తుంది - ఎక్కడ బడితే అక్కడ వదిలేసిన నిర్లక్ష్యం వల్ల కలిగిన అపరాధ భావనకి బదులు ఇతను ఎక్కడికి వెళ్ళాడు అనే ప్రశ్నకి దివ్యలోకాలకి వెళ్ళాడు అనే జవాబు,అక్కడ ఎవరు ఉంటారు అనే ప్రశ్నకి దేవుడు ఉంటాడు అనే జవాబు కలిసి అతని మనసుకి ఓదార్పుని ఇచ్చింది!ప్రతి మనిషి శరీరంలో ఒక ఆత్మ ఉంటుందనీ అది మనిషిని విడిచిపెట్టడమే మరణం అనీ భావించేవారు.విగతాత్మ,మృతశరీరం కొంతకాలం వరకు పకపక్కనే ఉంటాయని భావించి చనిపోయినవారిని నిలువునా పడుకోబెడితే పట్టేటంత మట్టిపాత్రలో పెట్టి పక్కనే ఆహార పదార్ధాలను కూడా ఉంచి పూడ్చిపెట్టేవారు

          వీటికి సమాంతరంగా సృష్టిని గురించిన అలోచనలు కూడా దైవభావన మరింత బలపడటానికి కారణం అయ్యాయి.ఏనాడు దైవభావన మానవుడి మనస్సులో ప్రవేశించిందో ఆనాటి నుంచి తనకు సంబంధించిన సమస్తాన్నీ దానికే అంటుగట్టెయ్యటం మొదలు పెట్టాడు - మంచి జరిగితే అతను కరుణీంచాడని పొంగిపోవటం,చెడు జరిగితే అతను శిక్షించాని కుంగిపోవటం,అతన్ని ప్రసన్నం చేసుకుని శిక్షని తప్పించుకోవటానికి పడరాని పాట్లు పడటం!క్రతువులు ఎక్కువై చింతన తగ్గి జీవితం మరింత సంక్లిష్టమై కొందరికి విసుగు పుట్టి దైవభావనను తిరస్కరించేసి నాస్తికత్వాన్ని ప్రబోధించి పాటించటం మొదలు పెట్టారు!దేవుడు ఉన్నాడు అని వాదించి ఆ దైవభావన చుట్టూ తమ జీవితాలను తిప్పుకునేవారూ, దేవుడు లేడని వాదించి దైవభావనని తిరస్కరించి తమ కష్టసుఖాలను తమ బుద్ధికే అప్పగించేవారూ అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్కపక్కనే బతుకుతూ ఒకరిని మరొకరు అవహేళన చేస్తూ బతికేస్తున్నారు తప్ప ఏవరూ ఎవరినీ మార్చలేకపోతున్నారు.మన తెలుగువాడే అయిన మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వైవీ రెడ్డిగారు నిన్నమొన్నటివరకు నాస్తికుడిగా ఉండి ఈ మధ్యనే ఆస్తికులయ్యారు - ఎలా జరిగిందీ మార్పు అని అడిగితే "దేవుడు ఉన్నాడనటానికి సాక్ష్యాలు లేనట్టే లేడనటానికీ గ్యారెంటీ లేదు కదా!" అనేశారు.మనకి ఏ విషయమైనా శాస్త్రీయమైనది అనిపించాలి అంటే అది మన నమ్మకాలకి అతీతంగా సంక్లిష్తత లేకుండా మన అనుభవానికి అందాలి, కదా!మరి, రెడ్డి గారి లిటిగేషను ఆస్తికత్వాన్నీ నాస్తికత్వాన్నీ కూడా అశాస్త్రీయం చేసేస్తున్నది - అందుకే, ఈ రెడ్లని చచ్చినా నమ్మకూడదు:-)

          ఐతే, ఇన్నాళ్ళూ నాస్తికులు తమకు సపోర్టుగా తెచ్చుకుంటున్న సైంటిస్టులు కూడా ఈ మధ్య ఆస్తికపు మాటలు మాట్లాడుతున్నారు - వారిలో కొందరు నాస్తికులు కూడాను!ఆధునిక యుగంలో మనకి టీవీలూ,ఫ్రిజులూ,కార్లూ,విమానాలూ ఇచ్చిన సైన్సు మహా అయితే ఒక రెండు వందల సంవత్సరాల నుంచే కొంచెం వూపు తెచ్చుకుంది.అంతకుముందు సైన్సు అంటే ఏమిటో కూడా తెలియని జనాలు ఉండేవాళ్ళు - ఎన్టీవోడి సినిమా చూడని తెలుగోళ్ళలా!మొదటి దశలో సైంటిస్టులు ఆస్తికులా నాస్తికులా అనే తేడా లేకుండా తమ సిద్ధాంతాలకీ విశ్లేషణలకీ భౌతికపరమైన ఆధారాల కోసమే వెతికేవాళ్ళు.దానినే తర్వాత తరాల వాళ్ళూ అందిపుచ్చుకున్నారు.నిన్నమొన్నటివరకు బాగానే నడిచింది కానీ ఇపుడిప్పుడు కొంచెం ఎదురుదెబ్బలు ఎక్కువ కావటంతో ఆగి ఆలోచిస్తున్నారు, ఏమో దేవుడు ఉన్నాడేమో అని సందేహిస్తున్నారు.

          మొదటి కుదుపు 1919లో Edwin Powell Hubble (November 20, 1889 – September 28, 1953) విశ్వం వ్యాకోచిస్తున్నదని ప్రకటించినప్పుడు వచ్చింది.20వ శతాబ్దపు తొలినాళ్ళ వరకు పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు కేవలం 100 మిలియన్ల నక్షత్రాలు ఉన్న మన పాలపుంత ఒక్కటే మొత్తం విశ్వం అనుకునేవారు.వీళ్ళందరూ విశ్వానికి ప్రారంభం అంటూ లేకుండా mass,space,energy వంటి సమస్తమైన ద్రవ్యాలూ ఎప్పుడూ ఉండేవని అనుకునేవారు.Sir Frederick Hoyle అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విశ్వం వ్యాపిస్తునదన్న సిద్ధాంతాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించాడు - ఇతను steady state సమర్ధకుడు,Hubble కనుక్కున్న సృష్టి ప్రారంభానికి Big-Bang అనే వెక్కిరింత పేరు పెట్టింది ఇతనే!ఐన్‌స్టీన్ కూడా కంగారు పడ్డాడు - మొదట తన లెక్కల్లో విశ్వం వ్యాపిస్తునదన్న విషయం చొరబడకుండా మోళీ చేసి తర్వాత దాన్ని ఒప్పుకోలేకపోవటం ఒక చారిత్రక తప్పిదం అనేశాడు!ఆఖరికి, 1992లో COBE Satellite Experiments వ్యాకోచించే విశ్వానికి ఒక ప్రారంభం ఉన్నదని ఋజువు చెయ్యటంతో ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సి వచ్చింది.మొదటి కొత్త పాఠం కొట్టిన దెబ్బ నుంచి తేరుకుని ఆలోచిస్తే everything అనుకుంటున్న పదార్ధం nothing అనే శూన్యం నుంచి వచ్చిందనే రెండో పాఠం కూడా దానికే అతుక్కుని ఉందని తెలుసుకున్నారు.ఇక్కడి నుంచి శాస్త్రవేత్తల పరిభాషలోకి కొత్త పదాలు రావటం మొదలుపెట్టాయి.Edward Milne అనే బ్రిటిష్ రచయిత సాపేక్ష సిద్ధాంతం గురించి ఒక గణితశాస్త్రగ్రంధం రాసి చివర్లో "As to the first cause of the universe,in the context of expansion.that is left to the Readr to insert,but our picture is incomplete without Him" అని ముక్తాయించాడు.Edmund Whittakerఅనే మరొక బ్రిటిష్ శాస్త్రవేత్త విశ్వం యొక్క ప్రారంభం గురించి "Divine will constiruting Nature from Nothingness" అనేశాడు.కొందరు నాస్తికులైన శాస్త్రవేత్తలు కూడా ఆస్తికత్వం గురించి తమ కరుకైన భాషను మార్చి ఒక సమాంతరమైన దృగ్విషయం ఉన్నదని ఒప్పుకుంటున్నారు!అటువైపు నుంచి Cosmology కూడా ఇంత సంక్లిష్టమైన గ్రహతారకాదులతో కూడిన  విశ్వనిర్మాణం అనుకోకుండానో దానంతటదిగానో జరగడం కుదరనిని తేల్చి చెప్పి ఇది ఒక సంకల్పం చేత ఏయే సంభావ్యతలు ఏయే విధంగా జరిగితే విశ్వం ఇప్పుడున్న విధంగా ఉంటుందో ప్రణాళిక వేసి నిర్మించినట్టు ఉన్నదని బల్లగుద్ది చెబుతున్నది.దానితో తప్పనిసరై విశ్వం మొదలు కావటానికి కారణం గురించి చెప్పేటప్పుడు శాస్త్రవేత్తల నోటి నుండి "Super Intellect","Creator","Supreme Being" అనే మాటలు దొర్లడం మొదలు పెట్టాయి.

          ఈ రెండు పాఠాలూ వంటబట్టాక కొంత కాలానికి ఈ విశ్వమంతా జీవం అనేది ఆవిర్భవించడానికి తగినట్టు దశల వారీ మలుపులతో ల్కెక ప్రకారం నడుస్తున్నదనే మూడవ పాఠం కూడా తెలిశాక శాస్తర్రంగం దైవసృష్టి వైపుకే మొగ్గు చూపుతున్నది!ఒక చిత్రమైన విషయం ఏమిటో తెలుసా!మహావిస్ఫోటనం గనక కొంచెం నెమ్మదిగా జరిగి ఉంటే అప్పుడు ఆవిర్భవించిన ద్రవ్యం యొక్క విభిన్న అస్తిత్వాలు తమను తాము ఆకర్ధించుకునే గురుత్వాకర్షణ శక్తి యొక్క తీవ్రత వీటిని వ్యాకోచిమంప జేస్తున్న విస్ఫోటనం యొక్క శక్తి కన్న అధికమై వెనక్కి కుంచించుకుపోయి ఉండేవి - అలా జరిగితే మనం ఇప్పుడిలా ఉండేవాళ్ళం కాదు - If the rate of expansion one secnd after the Big Bang had been smaller by even one part in a hundred thousand-million-million, the universe would have re-collapsed before it ever reached its present size.మన చుట్టూ ఉన్న విశ్వం మొత్తం మనం ఉన్న భూగ్రహం మీద జీవం పుట్టడానికి సరిపడినట్టు లెక్క ప్రకారం ఉండటాన్ని గమనించిన జీవధర్మశాస్త్రవేత్తలు(Biologists) మరింత విస్తుపోయారు.ఆమ్లజని(Oxygen)తో కూడిన వాతావరణం అతి ముఖ్యం, ఇతర మూలకాలు ఉదజని(Hydrogen), నత్రజని(Nitrogen), కర్బనం(Carbon), భాస్వరం(Phosphorus) వంటివి కూడా ముఖ్యమే!కేవలం Cytosine, Guanine, Adenine, Thymine అనే నాలుగు nitrigen containing nucleobase ఇటుకలతో ఏర్పడిన DNA అనే సంక్లిష్టమైన నిర్మాణం విశ్వరచనకి సంబంధించినంత వరకు ఒక కోతిని Typing Machine ముందు కూర్చోబెట్టి రామాయణాన్ని రచింపజేయవచ్చుననే THeory of Probability సిద్ధాంతం నవ్వుకోవడానికి మాత్రమే పనికివస్తుందని తేల్చి చెప్పింది!

          జీవధర్మానుసారం జీవకణాలలో జరుగుతున్న జీవ రసాయనిక చర్యలు సమస్తం Photosynthetic Reaction,Respiratory Reaction అనే రెంటి మధ్య జీవశక్తి ఉయ్యాల వూగుతూ ఉండటం వల్ల జరుగుతున్నాయి - వుయ్యాల ఆగితే దేహంలోని హంస విశ్వంలోని పరమహంసను చేరుకున్నట్టే!నిజానికి ఈ రెండు reactions లోనూ reactants,productsగా ఉన్న మూలకాలు ఒకటే - ఒక చర్యలోని reactants మరొక చర్యలో products అవుతూ వస్తున్నాయి:

Photosynthetic Reaction on chlorophyll of plants is:
 

The equation expressed in words would be:
carbon dioxide + water + energy -> glucose + oxygen

Respiratory Reaction at cellular level is:








The equation expressed in words would be:
glucose + oxygen -> carbon dioxide + water + energy

          మొదటిది విశ్వశక్తిని రూపం మార్చి దృశ్యమాన ప్రపంచం ఉపయోగించుకోగలిగిన స్థితిశక్తిని ఉనికిలోకి తీసుకొస్తుంది. రెండవది ఒక వస్తువులో దాని నిర్మాణాన్ని పట్టి ఉంచుతున్న స్థితిశక్తిని వస్తువును బద్దలు కొట్టడం ద్వారా రూపం మార్చి గతిశక్తిని ఉనికిలోకి తెచ్చి క్రియకు కారణం అవుతున్నది. శక్తిని సృజించేది స్త్రీత్వం అనీ క్రియను జరిపించేది పురుషకారం ఆనీ అనుకుంటే  సృష్టిని స్త్రీపుంసయోగోద్భవం అని సనాతనులు అనడంలోని అంతరార్ధం తెలుస్తుంది. ఈ రెండు చర్యల్నీ శాసించే నియమాలే విశ్వంలోనూ శక్తి, ద్రవ్యం మధ్యన జరిగే సయ్యాటను శాసిస్తున్నాయి - అవే ఉష్ణగతిజశాస్త్రం(Thermodynamics) యొక్క నాలుగు నియమాలు.
-------------------------------
1.Zeroth law of thermodynamics: If two systems are in thermal equilibrium with a third system, they are in thermal equilibrium with each other. This law helps define the notion of temperature.
2.First law of thermodynamics: When energy passes, as work, as heat, or with matter, into or out from a system, the system's internal energy changes in accord with the law of conservation of energy. Equivalently, perpetual motion machines of the first kind are impossible.
3.Second law of thermodynamics: In a natural thermodynamic process, the sum of the entropies of the interacting thermodynamic systems increases. Equivalently, perpetual motion machines of the second kind are impossible.
4.Third law of thermodynamics: The entropy of a system approaches a constant value as the temperature approaches absolute zero. With the exception of non-crystalline solids (glasses) the entropy of a system at absolute zero is typically close to zero, and is equal to the logarithm of the product of the quantum ground states.

The second law was postulated earlier (1824) in the Sadi Carnot’s study of the working of steam engine, and the first law in 1848 by Hermann Helhholts and William Thomson.Later in year 1931 Fowler realized that thermal equilibrium had to be defined before first law.
-------------------------------
          ప్రస్తుతం సైంటిఫిక్ ప్రపంచం ఒప్పుకుంటున్న సిద్ధాంతాలలో చాలామటుకు వెసులుబాటు కోసం చేసిన తప్పనిసరి అమరికలే ఎక్కువ. రాగద్వేషాలకు ఎవ్వరూ అతీతులు కారు కదా, సైంటిస్టులలో కూడా వ్యక్తిగతమైన అహంకారాలకు లోనై ఇతరులు కనుగొన్న సత్యాలను మరుగుపర్చటానికి ప్రయత్నించేవారూ ఉన్నారు..సైంటిఫిక్ ప్రపంచంలో కూడా అప్పుడప్పుడు లాబీయింగ్ పనిచేస్తూ ఉంది , క్రైస్తవుల అధిపత్యానికీ క్రైస్తవుల మీద చర్చి అధికారానికీ బీటలు కొట్టే యే సిద్ధాంతం కూడా ఆదరణకి నోచుకోదు!అయితే, ఈ ఉష్ణగతిజనియమాలు మాత్రం చిన్నా పెద్దా శాస్త్రవేత్తలు నిజమైన జ్ఞానదాహంతో కలిసి సాగించిన సమిష్టి కృషితో నిగ్గుదేల్చిన సత్యాలు.ఒక్క రెండవ నియమమె తొలినాటి ప్రహేళిక(Puzzle) స్థాయి నుంచి అన్ని అడ్డంకుల్నీ దాటుకుని సిద్ధాంత రూపం ఏర్పడటానికి ఒక శతాబ్దం పైనే పట్టింది = కాబట్టి, నమ్మవచ్చును!ఈ రెండవ నియమం ఏమి చెబుతున్నదంటే, ఒకదానినొకటి ప్రభావితం చేసుకొనగలిగిన పరస్పర సంబంధం కలిగి ఉన్న అనేకానేక వ్యవస్థలలోని ఒక స్వతంత్రమైన వ్యవస్థలో entropy ఏ విధమైన బాహ్యశక్తి పనిచేయకుండా ఉంటే క్రమబద్ధమైన వేగంతో పెరుగుతూ ఆ వ్యవస్థ అప్పుడున్న ordorliness నుంచి disorderliness వైపుకి నడుస్తుంది.ఒక వ్యవస్థలో ఇప్పుడున్న order అలాగే ఉండాలంటే దానిమీద ఏదో ఒక బాహ్యశక్తి పని చేయాల్సిందే, ఆ వ్యవస్థను పట్టి ఉంచే బాహ్యశక్తి వెనుక ఆ వ్యవస్థ ఉండి తీరాల్సిన అవసరమూ ఆ అవసరాన్ని గుర్తించిన ఒక సంకల్పమూ ఉండి తీరాల్సిందే!

          ఈ తిరుగులేని పాదార్ధిక నియమమే దైవం అనే ఆధ్యాత్మిక భావనను శాస్త్రీయమైనది అని రుజువు చేస్తున్నది.ఎలాగంటే, విశ్వం లోని ప్రతి అంశం ఎంతో నిర్దిష్టంగా నిర్మించబడి ఉండి బాహ్యశక్తి పనిచేయనప్పటి అస్థిరత్వంలోకి జారుకుని నశించిపోవడం లేదు కాబట్టి దీనిని స్థిరంగా ఉంచడం కోసం శక్తిని ప్రయోగించుతున్న దివ్యసంకల్పమే దైవం అని తెలుస్తున్నది కదా!ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే,పాదార్ధిక ప్రపంచంలోని భౌతిక రసాయనిక చర్యలను మాత్రమే కాదు, మానవ సమూహపు చరిత్రగమనంలోని మలుపులను కూడా ఈ నియమమే ప్రభావితం చేస్తున్నది!ప్రాచీన కాలపు చరిత్రలో ఒక రాజవంశం పుట్టినా, ఒక రాజవంశం అంతరించిపోయి మరొక రాజవంశం ప్రభవించినా అక్కడొక అవసరమూ క్రాంతదర్శకులైన కొందరి బలమైన సంకల్పమూ కనిపిస్తున్నది. ఆధునిక కాలంలో జరిగిన, జరుగుతున్న మహోద్యమాలలోనూ భీకరమైన యుద్ధాలలోనూ కూడా అది జరిగి తీరాల్సిన అవసరమూ ఆ అవసరాన్ని గుర్తించిన కొందరి సంకల్పమూ స్పష్టంగా గోచరిస్తున్నది, అవునా! 

          కానీ, సమాంతర ప్రతిపాదన పేరున అది కూడా  వాస్తవమే అని ఒప్పుకున్న నాస్తికులైన ఆ శాస్త్రవేత్తలు ఇంకా నాస్తికులుగానె ఉన్నారనేది మనం తెలుసుకుంటే ఇంతటితో పరమసత్యం నిరూపించబడినదని అనుకునే అవకాశం లేదు.ఇప్పటికీ దేవుడు ఉన్నాడని ఒపుకోవడమా ఒప్పుకోకుండా ఉండిపోవటమా అనేది వారి వారి వ్యక్తీగతమైన అవసరాలే నిర్ణయిస్తాయి.ఇతర దేశాల్లో కన్న మన దేశంలో విభిన్న ధోరణుల పట్ల సహిష్ణుత ఎక్కువ. ఏకేశ్వరోపాసకులున్నారు. బహుళదేవతారాధకులున్నారు. ఈశ్వరుని విషయంలో ఒక నిర్ణయానికి రాని రకరకాల విశ్వాసాల వాళ్ళూ ఉన్నారు. అవిశ్వాసులూ ఉన్నారు. ఈ దేశం అఖండ భారతంగా లేని స్థితిలో, అంటే పెద్ద చిన్న రాజ్యాలుగా ఉంటున్న సందర్భంలోనూ విశ్వాస - మత - ప్రాతిపదికన అట్టి రాజ్యాలు ఏర్పడడం గానీ, విశ్వాస ప్రాతిపదికన పాలన జరగడం గానీ లేదు. రాజులెవరైనా, రాజ్యాలేవైనా, వివిధ విశ్వాసాల వాళ్ళు వారారాధించే దేవుళ్ళ మందిరాలూ అన్నీ, అంతటా విస్తరించే ఉంటుండేవి. అందరినీ ఆరాధించే వాళ్ళు కొందరైతే, తామంగీకరించిన దేవతామూర్తిని మాత్రమే ఆరాధిస్తూ మిగిలిన విశ్వాసాల పట్ల ఆరాధ్యుల పట్ల ఉదాసీనంగా ఉండేవారు ఇంకొందరు. తమ దైవాన్ని అభిమానిస్తూ ఇతరాలను సరైనవి కావని గానీ, తమ దైవం కంటే అల్పశక్తిమంతాలని గాని తలుస్తుండే వాళ్లు మరికొందరు. ఇలాటివన్నీ తెలీనివీ, తేలనివీ, జీవితానికి అవసరం లేనివి అనే దృష్టి కల రకరకాల ధోరణులవారూ ఈదేశంలో సామరస్య పూర్వకంగా సహజీవనం చేస్తూనే వచ్చారు. సైద్దాంతిక స్థాయిలో ఆ స్థాయి కలవాళ్ళ మధ్య వాద వివాదాల రూపంలో పరస్పర విభేదాలుంటున్నా, సాధారణ ప్రజలంతా ఆ వివిధ సైద్దాంతికులందరినీ పెద్దలు - జ్ఞానులుగానే విశ్వసించి గౌరవిస్తూనే ఎవరికి వారు, తమకు నచ్చిన ధోరణిని యధాశక్తి అనుసరిస్తూ, అందరూ సామాజికంగా సామరస్యంతో సహజీవనం సాగిస్తూ వచ్చారు. ఈ సంస్కృతి - ఈ దేశ సంస్కృతిగా ఇక్కడి వారికి నరనరాన జీర్ణించుకుని అలవాటుగా మారి ఉంది కనుకనే చక్కగా కొనసాగుతూ వచ్చింది.ఈ సనాతన ధర్మం యొక్క సూత్రాన్ని తెగనివ్వకూడదు - ఇతరుల నమ్మకాల్ని అవహేళన చెయ్యడానికి వీల్లేదు, నీకంట్లో దూలముంచుకుని నాకంట్లో నలుసును తప్పు పడుతున్నట్టు ఇతరుల మతాల్లో తప్పుల్ని వెదకడం సంస్కారహీనం, ఒక మతం పేరుతో ఏకమై ఇంకో మతం మీద పెత్తనం చెయ్యడం దుర్మార్గం!

          దేవుడు లేడని తీర్మానించుకుంటే ఆ దేవుణ్ణి సంతోషపెట్టి తప్పు చేసి కూడా శిక్షల్ని తప్పించుకోవడం కోసం క్రతువులు చెయ్యాల్సిన బాదరబందీ లేకుండా తన విజయాలకి తనే కారణమని భావించి గర్వంగా బతికెయొచ్చు,దేవుడు ఉన్నాడని నిర్ణయించుకుంటే ఆయనకి కోపం తెప్పించే అడ్డదిడ్డం పనులు చెయకుండా ప్రాప్తించినదానితో సరిపెట్టుకుని వినయంగా బతికెయ్యొచ్చు. విశ్వరచనలోని క్రమబద్ధమైన పురోగతిని అర్ధం చేసుకుని ప్రకృతి నియమాల్ని పాటిస్తే చాలునని ప్రతి ఒక్కరూ అనుకుంటే పరస్పరహననకాంక్ష తగ్గి సామరస్యం వెల్లివిరుస్తుందనేది అత్యంత ప్రాచీనకాలం నుండి నేటికీ కొనసాగుతున్న సనాతనధర్మం అనుభవం మీద నేర్చుకుని చెబుతున్న సత్యం!యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

43 comments:

  1. >>దేవుడు ఉన్నాడని నిర్ణయించుకుంటే ఆయనకి కోపం తెప్పించే అడ్డదిడ్డం పనులు చెయకుండా ప్రాప్తించినదానితో సరిపెట్టుకుని వినయంగా బతికెయ్యొచ్చు.

    కానీ! పుట్టాలన్నా, బతకాలన్నా, చావాలన్నా.. చివరికి చచ్చాక కూడా దేవుడ్ని(?) త్రుప్తిపరచాల్సిందే.. లేకపోతే.. అటేడు తరాలూ.. ఇటేడుతరాలూ.. ఢాం...

    ReplyDelete
  2. సారంగోల ముగిసిపోయాక ఇప్పుడు మళ్ళీ మీరు అడుగులు వేయాల్సిన కొత్తదారులు కనిపిస్తున్నాయి హరిబాబు గారూ.

    ReplyDelete
    Replies
    1. http://adugu.in/%e0%b0%86%e0%b0%a7%e0%b0%bf%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b0%be%e0%b0%b0-%e0%b0%ae%e0%b0%a4%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d
      దానికంటే ఇది మరీ ’పాషాణ అడుగు‘ పురాణపండ ఫణి గారూ, సారంగలో వ్యాఖ్యలని స్వేచ్ఛగా కొంతకాలం ప్రచురించారు. ఇక్కడ ఆ అవకాశం కూడా వుండదని నా అభిప్రాయం. ఎందుకంటే, దీని సంపాదకుని మరొక ప్రయత్నమైన ’చమన్‘ లోని వ్యాసాలకు నేను పంపిన సందేహ వ్యాఖ్యలు (ఆధారాలతో సహా) కనీసం ఒక్కటి కూడా ప్రచురించను కూడా లేదు. ఒకే రకమైన రొడ్డకొట్టుడు వ్యాసాలు, కవితలు, పరిశీలనలు వుంటాయి. అవన్నీ కుల, మత (ఆధిపత్య అని వారి దృష్టి) ద్వేష రియాక్షనరీ రచనలు తప్పితే నిర్మాణాత్మకమైన, తార్కికమైన ఆలోచన అక్కడ వుండదు. వేర్పాటువాద సాహిత్యం అందరినీ కలుపుకుపోలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బహుశా బ్లాక్ చేయవచ్చు. Hatred is first step towards perversion. అలాంటి steps ఎంతో కాలంనుండి వేసి, ఎన్నో వేల సహ ప్రయాణాలు చేసిన సుదీర్ఘ ద్వేష ప్రయాణికుల వెబ్ పత్రిక ’అడుగు‘ ఇది. ‘అనావృత వైఖరితో సంభాషణ’ (Dialogue with and open attitude) అనేది ఇలాంటి ’అడుగు‘ తో అసాధ్యమని అనే భావిస్తున్నాను. ఈ నా వ్యాఖ్యను అక్కడి అడుగు సారథులు, శ్రేయోభిలాషులు ఎవరైనా చదివినట్లయితే వారికి నా సలహా ఏమిటంటే మీరు గనక నిజంగా రెండో వైపువారి (మీ దృష్టిలో వైరిపక్షం) చెబుతున్నది ఆధారసహితంగా వినాలని, తెలుసుకోవాలని వుంటే ముందుగా ఒక విషయం పట్ల చర్చ మొదలుపెడదాం. అది మూలవాసులు, ఆర్యులు అనబడే విభజన గురించి సశాస్త్రీయమైన ప్రమాణాలతో చర్చిద్దాం. ఆసక్తి వుంటే రండి, ఇప్పుడే సత్యాన్వేషణకి మేం సిద్ధం. అదిగాక సమకాలీన లించ్ విషయాల దగ్గరనుండి అన్నీ చర్చిద్దాం.

      Delete
    2. నేను సాహిత్య సభల్లో తరుచుగా ఒక మాట చెబుతూ ఉంటా. దానితోనే ఇది మొదలుబెడతా. ‘సాహిత్యం ఎలా ఉంది, అందులోని ప్రధాన చర్చనీయాంశాలేంటనేది- సాహిత్యాన్ని ఎవరు రాస్తున్నారు, ఎవరు చదువుతున్నారు, ఎవరు విశ్లేషిస్తున్నారు- వీరంతా ఏ కులంలో, ఏ వర్గంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఏ లింగంలో ఉండి తమ తమ పనులు చేస్తున్నారు, ఏ సమయ సన్నివేశాలకు జవాబుదారీగా ఉంటూ తమ పాత్ర నిర్వర్తిస్తున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడే భారతీయ సాహిత్య స్వరూప స్వభావాలుగానీ మన రెండు రాష్ట్రాల తెలుగు సాహిత్య సారాంశం గానీ సరిగ్గా అర్థమయ్యే అవకాశం ఉంది.’ ఈ మాటల్ని విడివిడి సభల్లో సాహితీ మితృల ముందుంచాను కానీ వాటినింతవరకూ అక్షరబద్ధం చేయలా. అందుకే ఇక్కడ వాటిని ప్రస్తావించా!

      ఈ చూపును విస్తరిస్తే, సాహిత్యానికి అనువర్తింపజేస్తే తేలేదేంటి? అగ్రకుల హిందూ రచయితలూ, కవులూ అగ్రకుల పాఠకుల కోసం సృష్టించిన సాహిత్యమే భారతీయ సాహిత్యం. అదే అగ్రకుల హిందూ సాహిత్య విమర్శకులు అగ్రకుల పాఠకుల కోసం, సృజనకారుల కోసం చేసిన విశ్లేషణా, సమీక్షణలే సాహిత్య విమర్శగా రూపొందింది. వీరిలో ఎక్కువమంది అగ్రకుల హిందూ మధ్యతరగతికి చెందినవారు కాగా మిగిలిన వాళ్లంతా ఎగువ మధ్యతరగతికి చెందినవాళ్లు. అంతేకాకుండా వీళ్లంతా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు చెందిన పురుషులు. స్త్రీలు చాలా తక్కువ.
      http://adugu.in/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%85%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0

      Delete
    3. శ్రీనివాసుడుగారూ... పై వ్యాఖ్య పెడుతూ మిమ్మల్ని కూడా తలచుకున్నాను. ఈ మధ్య కాలంలో మీరెక్కడా కనబడక, మిమ్మల్ని ప్రస్తావించలేదు. ఆ ప్రజాస్వామ్యపు దారులు కొందరికేనని నాకు తెలుసు. కానీ హరిబాబుగారు తన సొంత బ్లాగ్ వేదికగా కూడా దుమ్ము దులపగలరని నమ్మకం.

      Delete
    4. "బజ్రాయుధం","అగ్నివీణ" పేర్లలోని హిందూత్వాని కూడా భరించలేకపోతున్నారు!"తుప్పు పట్టిన కత్తి","డొల్లు రాగాల్ పాత వీణ"అంతే బాగుంటుందేమో సెలవిస్తారా?లేఅదంటే,పూర్తిగా మనవాళలి తెలియని "Damscus Sword","symphonical lair" అని వాడి కింద వాటికి అర్ధాలు ఇచ్చి మళ్ళీ నిఘంటు ప్రమాణీకతల లాంటివి కూడా ఇస్తే అప్పుడు బాగుంటుందా?పోనీ సర్దుకుపోదామంటే అవి కూడా వాళ్ళవాళు పురాణాల్లో వాడిన ప్రతీకలే మరి.అసలు వాళ్ళు కవిత్వం రాయకుయండా గమ్మునుంటే మీచేత ఈ తిట్లు తినకుండా ఉండేవాళ్లని నా నమ్మకం!

      Delete
    5. >>నవలలో పాత్రల మానసిక స్థాయినీ, వాటి చైతన్య స్థాయినీ, వాటి సత్వర వాతావరణ పరిస్థితుల్నీ దృష్టిలో పెట్టుకోకుండా అవి బూతులు తిట్టడం తప్పని వల్లంపాటి వెంకటసుబ్బయ్య కూడా అనడానికి కారణం ఆయన జీర్ణించుకున్న ఆధిపత్య సంస్కృతే.
      hari.S.babu
      వాస్తవిక జీవితంలో ఎడాపెడా బూతులు మాట్లాడుతూ ఉండటం కరెక్టే,కానీ సాహిత్యంలో కూడా ఎడాపెడా వాడితేనే అది అధిపత్య సంస్కృతి మీద తిరుగుబాటు అని చెబుతున్నారా మీరు.అతిగా వాడకండి అని సలహా ఇచ్చినందుకు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ లాంటి వాళ్ళు కూడా దుర్మార్గులు అయిపోయారు మీ దృష్టిలో – దేని సమర్ధించాలి అనే స్పష్టత ఉందా మీలో?మీరు వేస్తున్న అడుగు అరాచకత్వానికీ వదరుబోతుతనానికీ పెద్దపీట వెయ్యడానికేనా?

      Delete
    6. ఫణి గారూ, నేనీ మధ్య ఫేస్ బుక్ లో కొంత చురుగ్గా స్పందిస్తున్నాను. ఆ ముచ్చట కూడా తీరిపోయింది. శాస్త్రీయ, తార్కిక చర్చ తప్ప సమస్త సొల్లు, విద్వేషపూరిత రెటోరిక్ అంతా అక్కడ రాజ్యమేలుతోంది. నా ఫేస్ బుక్ ఐ.డి. ఇది. https://www.facebook.com/Sreenivasudu

      ఫేస్ బుక్ లోజరుగుతున్న రచ్చ నిత్య నకారాత్మక విద్వేష వ్యాఖ్యలు, టపాల గురించి, ధనుంజయమూర్తిగారి ఫేస్ బుక్ పోస్ట్ ఇది.

      Dhanunjaya Murthy ఫేస్ బుక్ మిత్ర శత్రుత్వాలు. గురించి ఆలోచిస్తున్నారు.
      29 జూన్ 11:07 AMకి ·

      తిరిగే కాలు, తిట్టే నోరూ, టైపే కీబోర్డూ, కెలికే మూలశంక మనస్తత్వాలూ ఊరకుండవని పెద్దల మాట.
      అయితే అలా ఊరేగే వాళ్ళను చూసి చూసీ ఊరకున్నంత ఉత్తమము, బోడి గుండంత సుఖమూ లేవని కూడా వాళ్ళు సెలవిచ్చారు.
      కానీ, మనం ఊరకుంటామా? అస్సలుండము.

      ఏదో చెప్పాలనుకున్నది చెప్పడానికి పోస్ట్ చేయడం ఓకే. కానీ, ఎవరినో కెలకడాని మాత్రమే పోస్ట్ చేసే సైకోలు.
      పోస్ట్ పైన తన అభిప్రాయాన్నేదో టిప్పణీ ఇవ్వడం ఓకే. కానీ, తిట్టడానికే వాల్ మీదికి వచ్చి రెట్టలేసే కాకులు.
      తనతో విభేదిస్తూ కామెంట్ ను పెడితే పెట్టారులే అనుకుంటే ఓకే. కానీ, అలా పెట్టినవారిని బూతులతో కుళ్ళబొడిచే నీచులు.
      కనిపించని ఫ్రెండ్సయితే ఉన్నారు కానీ, అదృష్ట వశాత్తూ కనిపించని కత్తుల్లేవు. అలా ఉండుంటే పొడుచుకొని చచ్చి ఉందురేమో అనిపిస్తుంది.

      ఫేసు బుక్కు పోస్టుల్లో చెప్పేవన్నీ ఆ వ్యక్తీ ఆచరిస్తున్నాడనుకొనే అమాయకత్వం నుండి జనించిన ఒక స్నేహ అభ్యర్ధన.
      ఆపైన మొదలైన స్నేహం.
      అటు పిమ్మట అన్నా, అక్కా, తమ్ముడూ, చెల్లీ, నేస్తమా ల నయగారాలు.
      నడిచే ఎన్ సైక్లోపీడియాలకు స్టికర్ల పుణ్యమాని వంగి వంగి ఇచ్చే సులభ గౌరవ ప్రపత్తులు.
      ఇన్విజిబుల్ గురువులకు, గండ పెండేరాన్ని తొడిగిన ఉద్దండ కవి, రచయిత గండభేరుండాలకూ ప్రణామాలు.

      తర్వాత్తర్వాత మెల్లగా మొదలయ్యే అసహనం. అభిప్రాయాలతో విభేదించడంతో మొదలుపెట్టి, బూతులు లంకించుకోవడం. ఆపై మిత్రశత్రువులను తిడుతూ పోస్టులను పెట్టుకొని ఆనందించడం.
      ఒకానొక బ్రేకింగ్ పాయింట్లో.... కనిపించకుండానే తనవన్నీ పంచుకున్న మిత్రుడిని అన్-ఫ్రెండ్ చెయడం.
      ఆనక బ్లాక్ చేసుకొని ప్రశాంతంగా ఉండటం.

      ఇది డార్విన్ చెప్పని ఫేస్ బుక్ స్నేహ పరిణామ క్రమం.

      అందుకేనేమో నేను ఫాలో అయ్యే ఒక పెద్దాయన ఇలా అన్నాడు.

      “Arguing with strangers online is like wrestling sharks.
      Even if you win, it was a really stupid thing to do” అని.

      నిజమే కదూ ఫ్రెండ్స్!

      ఈ పోస్టుకు మరొక స్పందన

      Kunala V Raö :(చూస్తూ వుండండి ..
      రాబోయే రోజుల్లో facebook సుపారీ గ్యాంగులు తయారవుతాయ్ ..
      మన తరపున సుఫారీ
      తీసుకుని వారి కారెక్టరును మర్డర్ చేసి
      జీవితంలో వారిని fb వైపు చూడకుండా తరిమికొడతారు

      Delete
  3. ఆకరాలు,
    ప్రాక్తన,
    వైధానిక
    వంటి ముతక మాటలు ఎందుకు వాడారో తెలియదు.నాకైతే వీటిలో ఒక ముక్క అర్ధం కాలేదు.బహుశా వీటి అర్ధాలు వీరు ద్వేషించే బ్రాహ్మణికల్ ఎధ్నో ఫాసిజాన్ని రుదిన వారు కూర్చిన నిఘంటువులనే వెతుక్కోవాలి కాబోలు!ప్రాకృత భాషలోని సౌందర్యాన్ని వారెవరో ప్రస్తావించటమే తప్ప ఉపయోగించలేదు అని వాపోయే పెద్దమనిషి సరళంగా ఉండే మామూలు తెలుగు వాడకుండా ఈ గంభీరమైనట్టిదీ మరియూ గహనమైనట్టిదియునూ అయిన గ్రాంధికాన్ని ఎందుకు వాడుతున్నారు?

    ReplyDelete
    Replies
    1. హ... హ.. హ... ఎందుకనగా అది యొక భావ దారిద్ర్యము. ఆ దారిద్ర్యము నుండి విముక్తి కష్టము

      Delete
  4. సారధుల్ని చూస్తే తెలియడం లేదా రధగమనం ఎట్లా ఉంటుందో:-)

    ReplyDelete
  5. One Face book post >>>> 1
    Ram Karnam
    ==== మధ్యలో వేలాడే మడత బ్యాచ్ - 1 ===
    ఉదాహరణలు:
    1. EVIL SON (ఈ విల్సన్) - అనగా... దుర్మార్గపు కొడుకు
    2. Mundus (ముండస్) – అనగా.. పెళ్ళాం దృష్టిలో మృతుడు
    వీళ్ళు కిరస్తానీలో హిందువులో, నాస్తికులో ఆస్తికులో, పేదలో ధనికులో, ఊరివాళ్లో సిటీ వాళ్ళో, అసలు ఆడో మగో అర్ధం కారు. వీళ్ళకి గతంలో ఏమి అయిందో, ప్రస్తుతం ఏమి అవుతున్నదో, భవిష్యత్తులో ఏమి కోరుకుంటున్నారో ఎవరికీ అర్ధంకాదు. అటూ ఇటూ కాకుండా మధ్యలో వేలాడుతూ, మూత్రం తక్కువా, ముక్కడం ఎక్కువా ఉండే రాతలు విసర్జించి ఫేస్బుక్ లో గబ్బులేపుతుంటారు.
    ఈ రోజు ఎవరిమీద పడి ఏడుస్తారో రేపు వాళ్ళ కిందనుండి నవ్వుతూ లేస్తారు .. బట్టలు తొడుక్కుంటూ.
    వాళ్ళ రాతల్లో ఈ క్రింది విధమైన మేధోపెంట గోచరమవుతుంది.
    ** నాస్తిక అవతారమెత్తి హిందువులని ప్రధానంగానూ, మిగతా మతాలని మొక్కుబడిగానూ తిడుతుంటారు. కా...ని వారి శ్రీమతులు మాత్రం ప్రతాదివారం చర్చిలకెళ్లి ప్రార్ధనలు చేస్తుంటారు. దానర్ధం వీళ్ళ రాతలతో కనీసం వాళ్ళ భార్యలని కూడా కన్విన్సు చెయ్యలేరు.
    ** స్త్రీల అణచివేత గురించి , వివాహ వ్యవస్థలో లోపాల గురించి ఇరగ రాస్తుంటారు. కా ....ని శ్రీమతులని గాలికి వదిలి పరాయి స్త్రీలలో ముసలి, ముతకని చూసుకుని దొంగతనంగా టెలిఫోన్ తీగలగుండా చొంగని ప్రసారం చేస్తుంటారు. ఈ చొంగ ప్రసారాలు ఆంధ్ర రాజధాని అమరావతి నుంచి దేశరాజధాని ఢిల్లీ దాకా వ్యాపించి ఉంటాయి (విదేశాల్లో కూడా ఉండొచ్చు.. ఇంకా కన్ఫర్మేషన్ రావాలి )
    ** అగ్ర కులాలని దోపిడీ కులాలు అనీ, తార్పుడు గాళ్ళనీ, హంతకులు అనీ ఏదేదో తిడుతుంటారు . కా...ని అలాంటి దోపిడీదారులే, హంతకులే తమ ఇంటివారిని వివాహాలు చేసుకోవట్లేదని నిష్టూరపుపెంట నిదానంగా వదులుతుంటారు . ఏ background నుంచి వచ్చామో దాన్ని, ఆ ప్రజల్నీ వదిలేసి వేరేవాళ్ళలో కలిసిపోవాలని ఎంత ఆత్రమో!
    ** అమెరికా పర్యటించడం కోసం.. అక్కడ జీవించే అవకాశంకోసం నానా వంకలు పాకుతుంటారు. మరీ కావాలంటే నానా గుడ్డలు తుడుస్తుంటారు. కా...ని అమెరికాలో ఆల్రెడీ ఉన్న భారతీయులపై చీటికీమాటికీ వంగ్యపెంట విసురుతుంటారు.
    ** దళితులు ఎలాగైనా రాజకీయ అధికారం సాధించాలని బోధిస్తుంటారు . కాని తెరచాటున YSRCP టికెట్ల కోసం నానా గడ్డి నములుతుంటారు. ఆ టికెట్ వస్తే ఓట్లకోసం మాత్రం దళితులనీ, ఆదివాసీలని కొంగుకి ముడేసుకోవడానికి అ”సామాన్య” కుట్రలు సేవల రూపంలో చేస్తుంటారు.
    ** అచ్చంగా కిరస్తానీ వేర్లూ, పేర్లూ, తీర్లూ కలిగీ, కిందా, పైనా, పక్కలా బాగా బలిసీ, పైకి మాత్రం అణచివెయ్యబడిన దళితుల్లాగా దీనమైన ఫేస్/పోస్ట్ పెడతారు. కాసేపటికి మళ్ళీ మేం మూలవాసులం, మొదట మాదే ఈ దేశం అంటారు. కా ... ని నిద్రలేచినకాడి నుంచి మతాన్ని తిట్టే నెపంతో దేశాన్ని తిట్టి శునకానందం పొందుతుంటారు. ఎవరో ఎక్కడినుంచో వలస వచ్చి మూతికి, ముడ్డికీ ముంతలో, పొంతలో కట్టారన్న ఊహాపెంట ఒకటి ప్రచారం చేస్తుంటారు.
    *** కుల సంఘాల్నీ, ఒక కులమింటివాళ్ళు కలిసి పార్టీ చేసుకోవడాన్ని తిట్టిపోస్తుంటారు. కా .... ని కొన్ని కులాలు సంఘటితమయ్యి, కొందరు వీళ్ళకి రక్షణవలయంగా ఏర్పడి, మిగతా వాళ్ళంతా సర్వస్వం ధారబోసి కొత్త వ్యవస్థని దేశంలో ప్రతిష్టించి వీళ్ళని నాయకులుగా చెయ్యాలన్న ఆశాపెంట ప్రదర్శిస్తుంటారు.
    ఇంకా చాలా విభిన్న రకాలైన అటూఇటూ గాని ఆలోచనా ఆశుద్ధాల్ని ఫేస్బుక్ లో పిచికారీ చేస్తుంటారీ కిరస్తానీ కిలాడీలు.
    అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరు పొందాలని కలలు గని , ఎవరూ పట్టించుకోనందువల్ల చివరికి అంతర్జాలపు మార్జాలంగా మిగిలిపోయి, . “వాల్లు, వీల్లు” అంటూ తెలుగు భాషని కకావికలం చేస్తూ, ఫేస్బుక్ ని తన అక్షర దోషాగ్నికీ, అంతర ద్వేషాగ్నికీ ఆహుతి చేసే సుబ్బిగాడేమో.. ఇలాంటి మడతలకి చిడతలు వాయించే రిమోట్ మడతగా రూపాంతరం చెందాడు.
    వాళ్లకి నా ఆత్మీయ సలహా ఇదే -
    అరె బేవకూఫ్ లారా,
    మీ రాతలూ, నీతులూ, కోతలూ స్ఫూర్తిగా తీసుకుని మీ పెళ్ళాలే మతాన్ని వదలడం లేదు, సింగారించుకుని చర్చికి వెళ్ళడం మానడం లేదు. మీ పిల్లలకే పల్లెల్లో ఉన్న నిజమైన దళితుల పిల్లలతో ఒక గంట కూడా గడపాలనిపించడం లేదు. బ్యూటీ పార్లర్ లలో Facial కుర్చీలోనో, ఇంట్లో లెట్రిన్ సీట్ మీదనో ఖాళీగా కూర్చున్న టైంలో కూడా దళితుల గురించి మీ కుటుంబసభ్యులెవరి చేతా ఆలోచింపచెయ్యలేక పోతున్నారు. ఇలాంటి చేతగాని దద్దమ్మలైన మీరు ఎవరి మధ్య గొడవలు పెట్టి , ఎవరి జీవితాలని నాశనం చెయ్యడానికిరా ఈ విషపు వ్యాసాలు?
    ఒక కులం వాళ్ళు కలుసుకుని తినడమో, తాగడమో చేస్తే వేరే ఏ కులం వాడికీ ఏ నష్టం లేదు. కాని కొన్ని కులాల మధ్య వైషమ్యాల చిచ్చు పెట్టి , ఆ చిచ్చులో రాజకీయ చుట్టలు వెలిగించుకోవాలనే మీ లాంటి నగర, నాగరిక నపుంసక నాయకుల వల్లనే సమాజం సర్వనాశనమయ్యేది..
    అందుకే .. దయచేసి అన్నీ మూసుకుని కూర్చోండి బే.

    ReplyDelete
  6. Ram Karnam
    ==== మధ్యలో వేలాడే మడత బ్యాచ్ - 2 ===
    EVIL SON, Mundus లాంటి మధ్యలో వేలాడే మడత బ్యాచ్ వికృత విన్యాసాల రెండో భాగం.
    మధ్యలో వేలాడ్డం అని ఊరికే అనలేదు – వీళ్ళని నిఖార్సైన దళితులు దళితులుగా గుర్తించరు, నిఖార్సైన కిరస్తానీలు కిరస్తానీలుగా గుర్తించరు, నిఖార్సైన నాస్తికులు నాస్తికులుగా గుర్తించరు. శోచనీయమైన విషయం ఏంటంటే నిఖార్సైన మగాళ్ళు వీళ్ళని మగాళ్ళగా కూడా గుర్తించరు. ఎందుకంటే ఎప్పుడూ మగవిరుద్ధంగా మేకప్ చేసుకుని ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెడుతూ ఉంటారు. ఉదాహరణకి ముండస్ లేటెస్ట్ ఫోటో చూస్తే మనకి షూటింగ్ స్పాట్ లో షాట్ కీ షాట్ కీ మధ్య గ్యాప్ లో గడ్డం కింద చెయ్యిపెట్టుకుని కూర్చుని సాలోచనగా చూస్తున్న సుకుమారమైన సినీ నటి గుర్తుకొస్తుంది. కవర్ పేజితో కలిపి ఊహిస్తే తన తండ్రి అయిన తనికెళ్ళ భరణి సాంప్రదాయబద్ధంగా పెంచబోతే మొరాయించి భరతనాట్యం బదులు రికార్డింగ్ డ్యాన్సులు నేర్చుకుని ఐటెం సాంగులకి పెట్టింది పేరైన నృత్య కళాకారిణి లాగానూ, అయినా తండ్రి మీద ప్రేమ ఏ మాత్రం తగ్గని ఉత్తమురాలు లాగానూ అనిపిస్తాడు.
    వీరి జీవన శైలి కూడా మధ్యలో వేలాడుతున్నట్టే ఉంటుంది. ఇద్దరూ ఒకే స్త్రీ కోసం కత్తులు దూస్తారు. ఆ స్త్రీ ఇద్దరి మొహాన కాండ్రించి ఉమ్మితే వెంటనే ఇద్దరూ మిత్రులైపోయి సోషల్ మీడియాలో సహజీవనం చేస్తుంటారు. ఈ రోజు ఎవరిని వెనకనుండి కసిగా తంతారో, రేపు వారి ముందుకెళ్లి వినయంగా వంగేస్తుంటారు. వీళ్ళకి “కిరస్తానీ” అనేది సరైన పేరు కాదు.. “సంకరస్తానీ” అంటే బాగుంటుంది.
    మరికొన్ని మధ్యలో వేలాడే విషయాలు -.
    *** “మా వాళ్ళ” కి ఇంత జరిగితే ఎవరూ పోస్టులు పెట్టలేదని తిడతారు. “మావాళ్ళు” అంటే ఎవరో అర్ధంగాక జుట్టు పీక్కుంటాం. “దళితులం” అంటారు. పోనీ దళితులు మన వాళ్ళే కదా అని మనం పోస్టులు పెడితే మొసలి కన్నీరు అంటారు, ముసుగు అంటారు, డ్రామా అంటారు, హిందువుల అహంకారం అంటారు. మరి దళితులు హిందువులే కదా అంటే కాదంటారు. “మరేంటి?” అంటే చెప్పరు. దళితులు అనే వాళ్ళు – అంబేద్కర్ పిలుపుమేర బౌద్ధం తీసుకున్న వారు గానీ, లేదా హిందువులుగా మిగిలిపోయినవారు గానీ .. మధ్యలో ఇంకెవరు? అంటే .. చెప్పలేరు. “మేమే మధ్యలో వేలాడే మడతలం” అని వారు చెప్పకపోయినా మనకి వినిపిస్తుంది.
    **** అణగారిన వాళ్ళంతా విద్య, ఉద్యోగం, సాధికారత , స్వాతంత్రం సాధించాలంటూ సోది వినిపిస్తుంటారు.. కానీ 90 ML లిక్కర్ చుక్కలూ, నాలుగు గొడ్డు ముక్కలు కోసం వీళ్ళ దగ్గరికి వచ్చిన కుర్రోళ్ళకి బుద్ది చెప్పి, మార్గదర్శనం చేసి వెనక్కి పంపాల్సింది పోయి వీళ్ళ పోస్టులకి లైకర్లుగా, కామెంటర్లుగా, షేరర్లుగా వాడుకుని వాళ్ళ జీవితాల్ని ఫేసుబుక్కార్పణం చేయిస్తారు. వీళ్ళ పిల్లలు మాత్రం బాగా వెనకేసుకుని విలాసంగా విహార యాత్రలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఏ గగరపర్రుకో, అగిరిపల్లికో తీసుకరావచ్చుగా ఆ యువరత్నాలని కూడా. ** “కొడకల్లారా, మీ కొడుకులని తీసుకురండిరా” అని అరవాలనిపిస్తుంది.మొదలు వీళ్ళు వస్తే గదా వీళ్ళ కొడుకులు రావడానికి అని మనలని మనమే సమాధానపరచుకుంటాం.
    **** ఎప్పుడూ వాడెవడో ఖండించలేదనీ, మూల్గలేదనీ, ముక్కలేదనీ రాగాలు తీస్తుంటారు. పేస్ బుక్ పోస్ట్ లే అతిపెద్ద నిరసన, మహా పోరాటం అనే భ్రమలో బతుకీడిస్తుంటారు. ఫేస్బుక్ అనేది అప్పట్లో లేకపోవడమే ఈ కులవివక్షకి అసలు కారణమన్నట్టూ, అందరూ అదిపనిగా పోస్టులు రాస్తూ ఉంటే ఆదర్శ సమాజం ఆవిర్భవిస్తుందన్న హాస్యభరిత సిద్దాంతాలని చాలా సీరియస్ గా నమ్మబలుకుతుంటారు. కాని .. పని చెయ్యకుండానే డబ్బులొచ్చే ఉద్యోగం, ఇంట్లో మాట్లాడే వారెవరూ లేని అనాధ బతుకు మాత్రమే వారు పోస్టులు పెట్టడానికి కారణమన్న సంగతి వారు పబ్లిగ్గా ఒప్పుకోరు. వాళ్ళ వెధవ పోస్టులూ, ఫేక్ స్టోరీలూ, ఫోటోషాప్ కిరికిరిల వల్లనే యదార్ధ సంఘటనలకి కూడా ఫేస్బుక్ లో ఆదరణ తగ్గిందన్న సంగతి కూడా తెలియనట్లు నటిస్తారు.
    **** నాస్తికులేమి చెయ్యాలి, మానవవాదులేమి చెయ్యాలి, హేతువాదుల విధి విధానాలేమిటి, చదువుకున్నవాళ్ళకి ఉండాల్సిన బాధ్యతలు ఏంటి అంటూ ఏవేవో రా లేదా కూ స్తుంటారు. కాని వీళ్ళు కట్టుకున్న భార్యకి గానీ, జీతం దొబ్బే ఉద్యోగానికి గానీ, పుట్టి పెరిగిన ఊరికి గానీ, పౌరులైన దేశానికి గానీ పైసాకి పనికిరారు. పైగా పెద్ద బరువవుతుంటారు – దేశాలు బట్టి అయినా పోకుండా.

    ReplyDelete
  7. వీళ్ళకి నేనిచ్చే ఆత్మీయ సలహా ఏమిటంటే -
    అరె మేకప్పొదలని మహాత్ములారా,
    ఉద్యమాలు మీకెందుకు గాని, ఫోటోలు పెట్టుకోండి.
    ముందుకు ఉద్యమిస్తున్న బానపొట్టని వెనక్కిలాగి, అణగారిన అనాధ జుట్టుని పైకి లేపి, ముతక గడ్డాల్నీ , ఉరుము గుడ్లనీ ఫోటోలలో బంధించి, ఆ ఫోటోలని మీ ఫేస్బుక్ పేజీలో మోహరింపజేసి, అవి చూసి భయభ్రాంతులైన జనం అత్మరక్షణార్ధం విసిరే మొహమాటపు మెచ్చుకోళ్ళకి కాసేపు ముగ్ధులయ్యి, ఆపై మూడు పెగ్గుల మందేసి ముసుగేసుకుని పడుకోకుండా మీకెందుకురా ఉద్యమాలు? మీ రాతల్లో/ఆలోచనల్లో విషయం ఉంటే మీ పెళ్ళాం పిల్లలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేసి ఉండేవారు. వాళ్లకి చెప్పబోతే చెప్పుతెగే అవకాశం ఉండే ఆకుల్లాంటి మీ ఆదర్శాలకి ఇక్కడెవరూ తైలం రాసేవాళ్ళు లేరు.
    వాడు అది చెయ్యలేదు, వీడు అది వెయ్యలేదు అని చెప్పడానికి మీరెవరు అసలు కోన్కిస్కా గొట్టాల్లారా .. ఎవరు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఎవరి ప్రాధమ్యాలు వారికుంటాయి.
    చాలామంది రోహిత్ ‘నిజ జీవితం’ అంతమైనందుకు ఏడిచారు, మీరు వాడి ‘స్వప్నాల’ గురించి బుక్కేసి బొక్కేశారు.
    చాలామంది మధుకర్ పోగుట్టుకున్న నిండు జీవితం గురించి బాధపడ్డారు , మీరు వాడి శవం పోగుట్టుకున్న అర్ధ అంగం గురించి ఆవేదన చెందారు.
    అంతే.
    ఎవరి ప్రాధామ్యాలు వారివి. ఇంకొకరికి ఎంత తీట ఉందో మీకెందుకు బే. ముందు మీది మీరు గీరుకుని చావండి.
    Comment
    హేతువాది నయా విచిత్రం గా ఈ మస్కిటో-కిల్లింగ్ మార్టిన్ మరియు ఎంకీస్ లవర్
    లాంటి చిరిగిన చెడ్డీ బేచ్ వీరులంతా ,కొన్ని వాస్తవాలను ఎప్పటికీ ఒప్పుకోరు .
    .
    1. దళితుల కన్నా ఆర్దికంగా,సామాజికంగా బాగా వెనకబడ్డ సామాజిక వర్గాలున్నాయి. వారే అడవి పుత్రులైన ఆదివాసులు. వీరెంత స్వచ్చంగా ఉంటారంటే వీరి కులం ఏంటో,మతం ఏంటో మరియు తాము వెనకబడ్డామన్న స్పృహ లో కూడా లేరు.
    2. దళితుల సమస్యలను దళితులే అర్దం చేసుకుంటారన్న డోగ్మాలు. మరెవరన్నా స్పందిస్తే అదంతా ఫేక్,నాటకం,బూటకం.
    3. అగ్రకులాల రాజకీయ ఆధిపత్యం నశించాలంటారు. "వారు మీ దృష్టిలో అగ్ర(ఎక్కువ)కులాలు కాబట్టే అధికారంలో ఉన్నారు కదా,ఫలితంగా మీవి తక్కువ కులాలు కాబట్టి గమ్మున ఉండండి " అనే నాలాంటోడు కౌంటర్ వేస్తే సమాదానం ఉండదు. (మీ ఇంఫీరియర్-కాంప్లెక్సులు,చెత్త వొకాబులరీ వదులుకొమ్మని ఓ వెయ్యిసార్లు నేను సలహా ఇచ్చిఉన్నా)
    నిజంగా గ్రామీణ స్థాయిలో వందల ఏళ్ళుగా సామాజిక వివక్ష,దుర్బర దారిద్రంలో ఉన్న దళిత మిత్రులకు,అమాయక ఆదివాసీ మిత్రులకు నాలాంటోళ్ళ సంపూర్న మద్దతు,సహాయం ఎప్పటికీ ఉండి తీరుతుంది.
    కానీ అటూఇటూ కానీ ఈ రాత్రి ఏసీ రెస్టారెంట్లో తిన్న బిర్యానీ అరగని చిరిగిన చెడ్డీ, విక్రుత బావాలున్న ఈ ఫేక్ సో-కాల్డ్ దళితులకు నా వాడిపదేసిన చెడ్డీ తప్ప మరేమీ ఇవ్వలేను.
    Praveen Kumar Voleti Thanks Ram Karnam గారు for understanding my version..

    చప్పట్లు తప్ప దేన్ని accept చేయని సైకాలజీ అత్యంత ప్రమాదకరం.
    Frankly, అలాంటి విపరీతపు సైకాలజీలే ఏ ఉద్యమలకైనా ఇంటర్నల్ కాన్సర్ల వంటివి..

    ఆ నెగిటివిటీ వల్ల అసలు పాజిటివ్ అప్ప్రోచ్ అయిన హేతువాదం/నాస్తికత్వం మీద అలానే జనానికి, హేతువాదులంటే శాడిస్టులు అనే ఒపీనియన్ క్రియేట్ అయ్యింది, నాలాంటి వాళ్ళకి ఆ నెగిటివిటీ కి అసహ్యం పుట్టి వాటి మీద గౌరవం పోయి నా పరిధిలో నేను ఉండటం మొదలుపెట్టాను.
    ఇప్పుడు దళితవాదం.

    ఒకానొక time కి తోటివారికే విసుగు-చికాకు పుట్టేస్తుంది కూడా..

    నెగిటివిటీ తో ఎప్పుడూ దేన్ని సాధించలేము. Exposure మాత్రమే వస్తుంది. ప్రయోజనం మటుకూ శూన్యం. వాళ్లకు కావలసింది ఆ exposure మాత్రమే అని తెలుసుకుని silent అయ్యి నా ప్రశాంత నేను కాపాడుకుంటున్నాను.

    ReplyDelete
  8. వేద విద్యలెల్ల వేశ్యలవంటివి
    భ్రమలపెట్టి తేట పడగనీవు

    ReplyDelete
    Replies
    1. >>>>>>>ఇది రాసింది రెటమత విద్వాంసుడని అనుకుంటున్నాం. ???? అతడికో సూటి ప్రశ్న - వేదవిద్యలెల్ల వేశ్యలయితే వాటిని విన్నందుకు చెవుల్లో సీసం పోసారని నిమ్నవర్గాల బాధ దేనికి? )))) వాటిని మాకు నేర్పలేదని ఏడుపెందుకు?

      Delete
    2. అది వేమన శతకములోది. చిన్నప్పుడు చదివిన గుర్తు.

      Delete
    3. ఏడుపు నేర్పనందుకు కాదు. అవి అడ్డుపెట్టుకోని మీరు తాలిబాన్లకంటే చేసిన నీచమైన పనులగురించే

      Delete
    4. A post by RAM KARNAM about facebook perverts like you,

      Ram Karnam
      ·

      యాకోబన్నా,

      మనం ఉన్నవూర్లోనూ, చుట్టుపక్కల ఊర్లలోనూ ఏమీ చెయ్యకూడదు. చదువు అయ్యాక, ఉద్యోగం అయ్యాక, సంపాదించి పిల్లలకి పెట్టాక అప్పుడు సురక్షితమైన ప్రాంతంలో కూర్చుని విలాసంగా చుక్కేసుకుంటూ ఫేస్బుక్ లో పోస్టులు పెడుతుండాలి. అదీ ఉద్యమమంటే. ఉన్న ఊర్లో మాత్రం అవసరాన్ని బట్టి అందరితో లౌక్యంగా ఉండాలి. అప్పుడప్పుడూ గుంపుగా వేరే దూరపు ఊర్లకి వెళ్ళి అరచి, ఫోటోలు దిగి వచ్చెయ్యాలి. వచ్చేశాక ఆ ఫోటోలు పెట్టాలి , "ఏసెయ్యండి" అంటూ పోస్టులు పెట్టాలి. అదీ ఉద్యమమంటే. చాశావా ఫేస్బుక్ లో ఒక్క నా కొడుకన్నా స్వంత ఊర్లో ఏమి పీకాడో చెబుతున్నాడా? చెప్పడు. ఎందుకంటే ఏమీ పీకడు, పీకలేడు. మనమూ అలాగే ఉండాలి .. బయటేదో పీకుతున్నట్టు కనిపించాలి. కొన్నాళ్ళకి కుదిరితే నాయకుడవుతాం.. కుదరకపోయినా కనీసం గుర్తింపు అయినా వస్తుంది.

      Delete
  9. జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. తన మిత్రపక్షమైన బీజేపీకి చురకలింటిస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు బీజేపీకి చేతనైతే గో రక్షకులను పంపించాలని సవాల్ విసిరారు.

    :-):-):-):-):-):-):-):-):-):-):-):-):-)

    ReplyDelete
    Replies
    1. నేనూ ఇప్పుడే చదివాను:-)

      Delete
    2. HI sir
      i also joining
      you are post hart touching

      Delete
  10. >>వ్యాఖ్యలని స్వేచ్ఛగా కొంతకాలం ప్రచురించారు. ఇక్కడ ఆ అవకాశం కూడా వుండదని నా అభిప్రాయం. ఎందుకంటే, దీని సంపాదకుని మరొక ప్రయత్నమైన ’చమన్‘ లోని వ్యాసాలకు నేను పంపిన సందేహ వ్యాఖ్యలు (ఆధారాలతో సహా) కనీసం ఒక్కటి కూడా ప్రచురించను కూడా లేదు.


    నాన్నా! ఇక్కడకూడా అంతే.. నిమ్న వర్గాలని తిట్టి, బాపనోళ్ళని పొగిడితేగాని ఇక్కడ కామెంటులని ఆక్సెప్ట్ చెయ్యరు. పైగా గాపనోళ్ళని సుతిమెత్తగా విమర్శించి, చూశావా నేను కూడా తిట్టానూ అంటూ ఎదవ పోసొకటి

    ReplyDelete
    Replies
    1. >>నాన్నా! ఇక్కడకూడా అంతే.

      hari.S.babu
      ఇక్కడ నిమ్నవర్గాలని తిట్టినది ఎవరు?బాపనోళ్ళని పొగిడినది యెవరు?నా పద్ధతి నేను స్పష్తంగానే చెప్పాను కదా!నేను హిందువుని.అది మీకూ తెలుసు,అవునా కాదా?అపుడెప్పుడో మార్క్సిస్టు హెగెలియన్ "తనని రేప్ చేస్తుంటే గుడ్లప్ప్పగించి చూస్తున్న మొగుళ్లకి ద్రౌపది విదాకులు ఎందుకు ఇవ్వలేదు?" అని అడిగినప్పుడూ ఈ మధ్యన మళ్ళీ ఒక అనామక వ్యాఖ్యాత అదే రకంగా కామెంటు వేసినప్పుడూ అది విడి విడి వ్యక్తుల random voimiting అనుకుని వదిలేశాను,కానీ హిందువుల్ని ఎలాగైనా సరే అవమానించాలని జరగని రేప్ జరిగినట్టు ఒక పద్ధతి ప్రకారం కొవ్వు పట్టిన కూతల్ని కూసున్నారే,అలాంటివాట్ని కూడా సహిస్తేనే హిందువులు నీకు మంచోళ్ళుగా కనిపిస్తారా నాన్న నీకు?హుందువులు ఇంకా ఎర్రిపప్పల్లా ఉన్నారని అనుకుంటున్నావు - కళ్ళు తెరువు!

      నేను బ్రాహ్మల్ని విమర్శించింది నీకు చమ్మగా ఉందాలని కాదు,నా మతంలో ఎవరు తప్పుల్ని ఇరికించినా కర్రు కాల్చి వాత పెటే దమ్ము నాకుంది!నీ ముడ్డి నలుపు నువ్వు చూసుకోకుండా "పైగా గాపనోళ్ళని సుతిమెత్తగా విమర్శించి, చూశావా నేను కూడా తిట్టానూ అంటూ ఎదవ పోసొకటి" అనే సుత్తి మానుకో!గోరక్షణ పేరుతో మనుషుల్ని చంపుతున్న మొదటి రోజుల్లోనే "గోష్పాదం,గోపుచ్చం" అనే మాటలతో వ్యతిరేకిబంచాను.నీలాంటి పుచ్చొంకాయల బోడి సర్టిఫికెట్ నాకు అఖ్ఖర్లేదు!అతి జుగుప్సాకరమైన భాష మితిమీరీన వ్యక్తీగ్త ద్వేషం లేనంతవరకూ ఏ కామెంటునీ వలపక్ష్జం చూపించి బ్యాన్ చెయ్యట్లేదు నేను.అది నీకూ తెలుసు.

      బ్రామ్మల్ని తిడితే చమ్మగా ఉండే దురద నీకుంటే అలాంటి బ్లాగులు చాలా వున్నాయి.నా బ్లాగులో మాత్రం పాయింటు ఉంటే హిందూమతాన్ని విమర్శించే కామెంటు అయినా వేశాను,వేస్తాను.

      నిన్ను తిడితే నీకు నెప్పిగా ఉంటుంది కాబట్టి నిన్ను తిట్టకూడదు,మరి బ్రామ్మల్ని తిడితే యెందుకు నీకు చమ్మగా ఉంటుంది?

      hold your toung!
      don't underestimate hindus.

      Delete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. బైబిలులో కూడా తప్పొప్పుల గురించి ఒక పోష్టు రాయండి. దాని గురించైతే ఎంతో కొంత నేను కూడా చర్చించగలను.

    ReplyDelete
    Replies
    1. బైబిలు గురించి నాకు యేమీ తెలియదు.తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు.ఇస్లాం గురించి ఎందుకు రాస్తున్నానో,ఈ సీరీస్ వెనక ఉన్న ప్లాన్ యేమిటో స్పష్తంగానే చెప్పాను.బ్రాహ్మణాధిక్యత అనేది ఒకప్పుడు పాటించారు గాబటి రాశాను.ఇవ్వాళ లేనప్పుడు గోల చేసి ప్రయోజనం ఏముంది?రేపు మళ్ళీ రానివ్వకూడదని చెపాను,ఇందులో వాళ్ళానెవర్నో చమ్మగా వుంచడానికి చేసింది ఏముంది?అలాగే,ఇస్లామిక్ తీవ్రవాదం ఉన్నదనేది యదార్ధం.కాబట్టి దాని గురించి నాకు జిజ్ఞాస కలిగింది.క్రైస్తవంలో కూడా వ్యాపించాలనే తత్వం ఉన్నమాట నిజం.వారికీ "ప్రపంచం మొత్తాన్ని యేసు పాదాల మీద పడెయ్యటమే మన లక్ష్యం కావాలి!" అని చర్చి ఫాదర్లు సూటిగానే చెబుతారు.అయితే,ఇస్లాము మాదిరి క్రూరత్వం లేదు,చాయిస్ ఇస్తారు,ఇతర మతాల్ని సహిస్తారు,తప్పుల్ని ఒపుకుంటారు కాబట్టి మనమూ క్రూరంగా విమర్శించాల్సిన పని లేదు.

      సాక్ష్యం మ్యాగజైను దగ్గిర ముష్టాఖ్ అహ్మద్ చేస్తున్న దుర్మార్గం తెలిసేవరకూ నాకూ ఇస్లామును ఎడాపెడా విమర్శించాలనే దురద లేదు.అయోధ్య సమస్య గురించి రాసిన పోష్టులో కూడా ముస్లిములతో సయోధ్య ద్వారానే సమస్యని పరిష్కరించాలని గట్టిగా చెప్పాను.మతం విషయంగా వాళ్ళు ముస్లిములు కావచ్చు,కానీ జాతీయత విషయంలో వాళ్ళూ భారతీయులే అనేది నా అభిప్రాయం!నేనిప్పుడున్రాస్తున్న విషయాలాలో చాలావరకూ ముష్టాఖ అహ్మద్ లాంటివాళ్ళకు కూడా తెలియవచ్చు,తెలియకపోవచ్చు!హిందువుల్లో ఎంతమందికి తమ మతం గురించి తెలుసు?

      పొద్దున లేవగానె ఇంట్లో ఉన్న పటాలకి దణ్ణం పెట్టుకోవడం,స్కూలుకో,కాలేజికో,ఆఫీసుకో పరిగెతడం - రాత్రికి పడుకోబోయేముందు గుర్తొస్తే దణ్ణం పెట్టుకుని పడుకోవడం - రోజువారీ ఉరుకుల పరుగ్యుల జెవితంలో ఇంతకన్నా మతంతో సంబంధం ఏముంది?ముస్లిములూ,క్రైస్తవులూ,బౌద్ధులూ ఎవరైనా అంతే!ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి ఇవ్వాళ ప్రత్యేకమైన రోజు అని చెప్తేనో టీవీలో శిఉభలగ్నం కార్యక్రమంలో చూస్తేనో దగ్గిరలో ఉన్న గుడికి వెళ్ళటం తప్ప వేదాల్లో ఏముంది,ఉపనిషత్తుల్లో ఏముంది,హిరణ్యగర్భుడంటే ఎవరు,భాగవతంలో పదమూడో స్కంధంలో ఏముంది అనే జిజ్ఞాస ఎంతమందిలో ఉంది?

      దీనికోసమేనా ఎప్పుడో మా కులాలకి వేదాలు నేర్పలేదని ఇవ్వాళ్తి బ్రాహ్మల్ని తిట్టటం?నీకు చాతనయిన పని చేసుకుని నీ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి ఏ బ్రాహ్మడు అడ్డు పడుతున్నాడు నీకు?రీజర్వేషన్ల గురించి రాసిన పోష్టులో అంబేద్కర్ చెంపల మీదనుంచి కన్నీళు జారీపడుతుంటే తుడుచుకోవటం కూడా మర్చిపోయి యేడ్చిన సనివేశం అబద్ధమని ఈ "ఇక్కడ కూడా అంతే నాన్నా!" అనీ నేను అడ్మిన్ హోదాలో డెలిట్ చేసిన కామెంటులో "నీకు అంత దమ్ముంటే...." అనీ ఇంకా రెచ్చిపోవాలనుకుంటున్నవాళు అనగలరా?అంబేద్కరుని మోసం చేసిన క్యాప్టెన్లు ఎవరో కొంచెం చరిత్ర చదివితే పేర్లతో సహా వారే తెలుసుకోవచ్చు కదా!స్వార్దమంతా బ్రాహ్మణుల్లోనే ఉన్నట్టు డొక్కు వాదనలు చెయ్యడం దేనికి?

      Delete
  13. దీనెమ్మ.. జీవితం

    "భోపాల్ : మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు నుంచి రోగులకు జ్యోతిషం, వాస్తు, హస్త సాముద్రికం, వేదపరమైన కర్మకాండలను సూచించేవారి సేవలను రోగులకు అందజేయబోతోంది. ఈ రంగాల్లో నిపుణులతో ప్రత్యేకంగా ఆస్ట్రాలజీ ఔట్‌ పేషెంట్ డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. మహర్షి పతంజలి సంస్కృత సంస్థాన్ డైరెక్టర్ పీఆర్ తివారి తెలిపిన వివరాల ప్రకారం...

    మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహర్షి పతంజలి సంస్కృత సంస్థాన్ సహకారంతో ఈ డిపార్ట్‌మెంట్లను నడుపుతారు. జ్యోతిషం, వాస్తు, హస్త సాముద్రికం, వేదపరమైన కర్మకాండలను సూచించేవారు ఈ డిపార్ట్‌మెంట్లలోని రోగులకు వారంలో రెండు రోజుల పాటు సేవలను అందజేస్తారు. రోజుకు సుమారు 4 గంటల వరకు ఈ సేవలను అందజేస్తారు. రోగుల చేతుల్లోని రేఖలను, వారి జాతక చక్రాలను పరిశీలించి తగిన సలహాలు ఇస్తారు.

    జ్యోతిషపరమైన సలహాలు కావాలనుకునేవారు రూ.5 చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది. జ్యోతిషం గుడ్డి నమ్మకం కాదని, శాస్త్రీయతగలదని చెప్పేందుకు ఈ చర్య దోహదపడుతుందని తివారీ చెప్పారు."

    ReplyDelete
    Replies
    1. డొనేషన్లూ,ఫీజులూ,పాకెట్ మనీలతో రేవ్ పార్టీల ఎంజాయిమెంట్లూ అంటూ ఇంతింత ఖర్చుపెట్టి ఇంజనీరింగ్,మెడికల్ చదువులు చదవటం వేస్టబ్బాయా!అతి తక్కువ ఖర్చుతో జ్యోతిస్షం,హస్త,నేత్ర,శ్వాస,మూతర్ సామ్ముద్రికం లాంటివి నేర్చుకుని దుకాణం పెట్టడం బెస్టు!సంస్కృతం నేర్చుకుని కాషాయం గట్టితివా కోట్లకు పదగెత్తినట్టే - నాస్సామిరంగ హిందూత్వమా మజాకా?

      Delete
    2. >>మూతర్ సామ్ముద్రికం
      LOL

      Delete
    3. This type of consultancy is existing in Great Britain since a long time.

      Delete
    4. ??This type of consultancy is existing in Great Britain since a long time.

      Is it?I have unnecessarily criticized man!అర్రెర్రెడ్డెడ్డెడ్డే,ఇంగ్లీషోడు చేస్తే కరెక్టే - అరిజెంటుగా ఇమిటేట్ చెసెయ్యాల!

      Delete
    5. దీనెమ్మ జీవితం! పెతోడూ పెర్వర్టే!
      No, Madhya Pradesh govt hospitals will not have Astrologers treating patients

      It's a fake news
      Posted on July 17, 2017

      On Sunday, some media outlets reported that the Madhya Pradesh government is planning to start an astrology OPD (out-patient department) in which astrologers will provide consultation to visitors facing “diverse problems”.

      As per a report in the New Indian Express, an “Astrology OPD” was being planned where, astrologers, vastu experts, palmists and proponents of Vedic karmakanda will delve deep into the horoscopes and lifelines of visitors, including patients, for three to four hours twice a week (preferably on weekends).

      http://www.opindia.com/2017/07/no-madhya-pradesh-govt-hospitals-will-not-have-astrologers-treating-patients/

      Delete
    6. >> astrologers, vastu experts, palmists and proponents of Vedic karmakanda will delve deep into the horoscopes and lifelines of visitors, including patients

      LOL..

      You calling it still a fake news... దీనెమ్మ జీవితం. మోడీ ఉన్నంతకాలం మనకీ దరిద్రం తప్పదు

      Delete
    7. @దీనెమ్మ జీవితం. మోడీ ఉన్నంతకాలం మనకీ దరిద్రం తప్పదు
      దీనెమ్మ జీవితం. మోడీ ఉన్నంతకాలం మనకీ దరిద్రం తప్పదు

      hari.S.babu
      ప్రతి అడమైన విషయానికీ మోదీతో లింకు పెట్టడం దేనికండి!
      దేశంలో ఎక్కడ ఎవడు తుమ్మినా,దగ్గినా మోదీని తిట్టదం దేనికి?
      రీజన్ లేకుండా వూర్కే వాగకుండా బుర్రపెట్టి ఆలోచించండి.
      మాట్లాడాలి గాబట్టి మాట్లాడటం నాకు నచ్చదు!

      Delete
    8. అందరు "మోడీ ఉన్నంతకాలం మనకీ దరిద్రం తప్పదు" గార్లకి,
      ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాజ్‌దీప్ సర్దేశాయి చెప్పిన కొన్ని వాస్తవాలు.అతని గురించి మీకు తెలీదని నేననుకోను.బీజేపీ పట్ల కొతగా ఇతనికి అభిమానం పెరిగి ఇలా రాశాడని మీరనుకుంటే నేను చెయ్యగలిగింది లేదు.

      1).నిజమే,గతేడాది కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆరెస్సెస్ కార్యకర్తలపై గర్హనీయమైన హి,సాకాండ పెరుగుతున్నది.మరీ కన్నూర్ క్=జిల్లాలో రక్తం ఏరులై పారుతోంది.
      counter fact:అయితే అక్కడ ఈ రక్తచరిత్ర ఇప్పుడే మొదలైంది కాదు.1960ల నుంచీ జరుగుతూనే ఉంది.ఏకపక్షం కూడా కాదు.2015లో రమేష్ చెన్నితల సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం ఇరువర్గలూ సమానంగానే బధితులవుతున్నాయని స్పష్టమయింది.
      (దీనికి కూడా మోదీయే కారణమా?అప్పుడప్పుడూ అక్కడక్కడా జరిగే మతకలహాలు కూడా అప్పటినుంచే ఉన్నాయి కదా!)

      2).బెంగాల్,కేరళ - ఈ రెండు రాష్త్రాల్లో మైనారిటీ వర్గాల జనాభా ఏక్కువ ఉండి హిందువులు అభద్రతకు లెనవుతున్నారు.దీనితో అక్కడ హిందువులకు జనాభా బలం పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది.
      counter fact:మరి,అతనూ మీరూ కూడా బీజేపీ హిందువుల్ని బుజ్జగించడాన్ని మాతర్మే ఘోరం,నేరం,దారుణం అంటూ ఇతర పార్టెలు దేశం మొత్తం మీద మైనారిటెల పేరుతో బుజ్జగించడం వల్ల వారు మెజారిటీగా ఉనంచోట హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సైలెంటుగా అది వాఆఆఅల్లకి జరగాల్సిన శాస్తి అన్నట్టు ఎందుకు ప్రతిస్పందిస్తున్నారు?
      (సూటిగా అడుగుతున్నాను,బీజేపీ హిందువులకి రక్షకురాలిగా బలం పెంచుకోఅవడం వల్ల మీకు పుడుతున్న నెప్పి ఇతర పార్టీలు ముస్లిములకి రక్షకులుగా బలం పెంచుకుంటున్నప్పుడు పుట్టడం లేదు,ఎందుకని?మీ ప్రవర్తన వల్ల మాకు దెబ్బ తగిలతే మీకు చమ్మగా ఉంటుందని తెలుస్తున్నదా లేదా?మరి, మిమ్మల్ని మేము ఎందుకు గౌరవించాలి>మాకు దెబ్బ తగిల్తే మీకు చమ్మగా ఉంటుందని తేలిపోయినప్పుడు "బాబ్బాబూ!మీరు మాంల్ని సెక్యూలరిస్టూల్ని గుర్తించకపోతే మేమ్యు చహ్చ్చిపోతాం!!" అని మీ మెప్పు కోసం అంగలార్చాల్సిన పని మాకేమిటి?చెప్పండి!)

      3).ఈ రెండు రాష్ట్రాలలో వామపక్షాల వోటుబ్యాంకు అనత్కంతకూ దిగజారుతోంది.దీనివల్ల వామపక్షేతర ప్రతిపక్షాల బలం కూడా క్షీణిస్తున్నది.
      counter fact:మోదీ అసలు గుజరతులో కూడా కనబడని ముందునుంచే జరుగుతున్న ఈ క్షెణతకి కూడా ఇంక పుట్టని మోదెకి అంతగట్టెయ్యటం తెలివైన వాడు చేసే పనేనా?

      4).సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను స్మానంగ రక్షించడంలో లౌకికవాద పార్టెల అవైఫల్యమే బీజేపీ ఎఉగుదలకి కారణం.గొప్ప ప్రజాభిమనాన్ని కూడగట్టుకుని పదవిలోకి అవ్చ్చిన మమతా బెనర్జీ చక్కని పలన అందించి ప్రజల మనసుల్లో రాజకీయంగ అతన స్థానం సుస్థిరం చేసుకోవచ్చు.కానీ రాజకీయపరమైన అభద్రతల కారణాన హ్రస్వదృష్టితో కూడిన రాజ్కీఅయ్ ఏజెండని అనుసరించటం ఆమెకు తప్పనిసరి అయిపోయింది.
      counter fact:1947 నుంచీ ఈ రాజ్కీయ అభద్రతని బట్టే కదా మైనారిటీ బుజ్జగింపు కార్యక్రమం నదుస్తున్నది.అప్పుడు మోదీ ఎక్కడ ఉన్నాడు?

      5).బెంగాల్.కేరళ - ఈ రెండు రాష్ట్రాల్లిఎ రాజకీయ ఇస్లాం స్వరూపం పూర్తిగా మారిపోయింది.బెంగాల్లో ఇదివరకటి సూఫీ సంప్రదాయం స్థానంలో వహాబీ ఇస్లాం ప్రభావంతో కఠోరమైన నైతికవాదంతో కూడిన తీవ్రవాద ధోరణులు చోటు చేసుకుంటున్నాయి.ఇది బంగ్లాదేశ్ వైఔనుంచి వీస్తున్న్న కొత్తగాలి.కేరళలో కూడా ముస్లిములు ఎక్కువగా ఉన్నచోట పశ్చిమాసియ ఆదెశాల నుండి స్థానిక మస్జీద్,మదర్సాలకు అందుతున్న నిధులతో ఇస్;ఆమిక్ చానదస్వ్వాదం పెరుగుతున్నది.
      counter fact:ముస్లిముల్లో తెవ్రవాద ధోరణుకు,అదె బైటుఇ దేశాల్ నుంచి వస్తున్న నిధులతో పెరగడం మీకు నిజంగానే తెలియదా?తెలిసి కూడా "మోడీ ఉన్నంతకాలం మనకీ దరిద్రం తప్పదు" పాట అలవాతైపోయి ఆ పాటని వదల్లేకపోతున్నారా?

      P.S:నేను చిత్రమైన గొప్పవాళ్ళు పోష్టు దగ్గిరనుంచి ఈదే మాత్ అచెప్తున్నాను,అయినా మీకు ఎక్కడం లేదు.లౌకికత్వం పేరుతో హిందువుల్ని మాతరమే మతతత్వవాదులని పేరు పెట్టేసి చేసిన హడవిడిం వల్లనే హిందువులు లౌకొకవాద పార్టీలకి దూరమయ్యారు,అర్ధమైందా?

      Delete
    9. Joke of the Decade

      "గోరక్షణ పేరుతో హింసకు పాల్పడుతున్న వాళ్లని ఆరెస్సెస్‌ ఎన్నటికీ సమర్థించదు. హింసకు పాల్పడిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. అంతేకానీ.. ఏ చిన్న ఘటన జరిగినా దానిని ఆరెస్సె్‌సకు ఆపాదించడం తగదు. మా సంస్థ ఎటువంటి హింసనూ సమర్థించదు. గోరక్షణ అన్నది వందల ఏళ్ల నుంచి వస్తోంది. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. దయ చేసి ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు."
      - ఆరెస్సెస్‌ ప్రచారక్‌ మన్మోహన్‌ వైద్య

      Delete
    10. @Anonymous21 July 2017 at 18:52
      Joke of the Decade

      hari.S,babu
      ఇందులో జోక్ ఏముంది?ఆరెస్సెస్ ఎప్పుడు పుటిందో అప్పుడు వాళ్ళుపెట్టుకున్న లక్ష్యాల్లో గోరక్షణ కూడా ఒకటి.అప్పటి నుంచి వాళ్ళ కార్యక్రమాల్లో అది ఒక భాగంగా ఉంది.!మీకివ్వాళ కొత్తగా తెలిసిందో,లేక అసలు తెలియకనో అది జోక్ అనిపిస్తున్నది,అంతే!

      Delete
  14. This is another fine facebook post today

    Ram Karnam
    నిన్న 08:26 AMకి ·

    === మంద భాగ్యులు ==

    అనగా “మంద” ని భాగ్యంగా గలవారు.

    చదువు, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చి భాగ్యవంతులయ్యాక ‘మంద’ ని కూడా పొంది మందభాగ్యులు కావాలన్న దుగ్ధకి గురవుతారు కొందరు. దీనికి మన సమాజంలో ఉన్న మంద మనస్తత్వం, పరాన్నజీవన విధానం బాగా తోడ్పడుతాయి. మందలు అనేక విధాలుగా తయారవుతాయి.

    కొందరు ఏ ప్రత్యేకమైన శ్రమ లేకుండానే ఒక మందకి యజమాని అయిపోతారు. వీళ్ళలో ముఖ్యంగా కళాకారులు, క్రీడకారులూ ఉంటారు. Fans Association ల పేరుతో అయాచితంగా దొరికే మందని ఈ కళా/క్రీడా కారులు వీలయిన చోటల్లా వాడుకుంటారు. అలాగే జాగ్రత్తగా కాపాడుకుని మిగతా ఆస్తుల్లాగే దాన్ని కూడా వారసులకి ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకే మందని కొడుకు ఒక రంగంలోనూ, నాన్న మరో రంగలోనూ వాడుకుంటూ ఉంటారు. (ఉదా: కొడుకు సినిమా కోసం, తండ్రి రాజకీయం కోసం). దీన్నే “ బహుళార్ధసాధక మంద” అంటారు. ఇలాంటి మందకి సహజంగానే ఆ యజమాని ఇంటిపేరు వచ్చేస్తుంది. ఉదా: కొణిదెల మంద, నందమూరి మంద, అక్కినేని మంద.

    ఇలా అయాచిత మందలబ్ధికి పాత్రులు గాని వారు గ్రౌండ్ నుంచి మంద నిర్మాణం చేసుకుంటారు. ఈ మంద నిర్మాణానికి ప్రధానంగా అనుసరించే విధానాలు రెండు - “మేపడం”, “రేపడం”

    “మేపడం” ద్వారా మంద నిర్మాణం చెయ్యడమూ, ఆ మందని నిర్వహించడమూ చాలా ఖర్చు, కష్టంతో కూడుకున్న పని. కారణాలనేకం. మనకంటే ఎక్కువగా మేపే యజమాని దొరికితే మంద చీలిపోవచ్చు. మందని కాపాడుకుంటూ ఉండడం కోసం అక్రమ వ్యాపారాలు చెయ్యాల్సి ఉంటుంది. ఆ క్రమంలో పోటీదారులు/శత్రువులు ఎక్కువ కావడం జరుగుతుంది. చట్టానికి దొరికిపోవడమో, పాపర్ అయిపోవడమో జరిగితే మేత మరిగిన మంద మరో దూరపు కొండల నున్నని యజమానిని వెదుక్కుంటూ చెల్లాచెదురు అయిపోతుంది. అప్పుడు భాగ్యమూ, మందా రెండూ పోగొట్టుకుని వాస్తవ అర్ధంలో మందభాగ్యుల్లా మిగిలిపోవలసి వస్తుంది. ఇలాంటి మందల యజమానుల్లో ముఖ్యంగా ఫ్యాక్షనిస్టులూ , అక్రమ వ్యాపారూలూ , మాఫియా డాన్ లూ ఉంటారు.

    “మేపడం” తో పోలిస్తే “రేపడం” ద్వారా మంద నిర్మాణం చాలా తేలికైనది, సురక్షితమైనది. పోటీ కూడా ఎక్కువే. ఏదో ఒక కామన్ సెంటిమెంట్ ని రగిలించి జనం మధ్యనుండి ఒక మందని బయటికి లాగాలి. చిన్నప్పుడు లెక్కల్లో Greatest Common Factor (గరిష్ట సామాన్య భాజకం) లాంటి వేరుతీత ఇది. ముందు దేశం మొత్తాన్ని మందగా చేసి దానికి యజమాని కావచ్చా అని ఆలోచించాలి. కుదరకపోతే నెక్స్ట్ బెస్ట్ – సౌత్ ఇండియా వరకు ఏమైనా మంద కట్టొచ్చా, కుదరకపోతే తెలుగువారు అందరినీ భాష అనే సెంటిమెంట్ తో మంద కట్టొచ్చా అని చూడాలి. అదీ కుదరకపోతే “తెలంగాణా” అని గానీ “ఆంధ్ర” అని గానీ ప్రాంతం సెంటిమెంట్ తో మంద కట్టొచ్చా అని చూడాలి. అలా అలా అలా drill down చేసుకుంటూ వెళ్లి "అసాధ్యమనిపించిన వాటికంటే చిన్నవాటిలో సాధ్యమైనంత పెద్ద" మందని నిర్మించుకోగలిగే సెంటిమెంట్ ని వెదికి పట్టుకోవాలి. ఈ విధమైన డివిజన్ vertical డివిజన్ అన్నమాట. ఇలాంటిదే horizontal గా కూడా చెయ్యొచ్చు. అన్ని ప్రాంతాల్లో, బాషలలో ఉన్న ఒక కులం వాళ్ళందరిని లేదా ఒక ఒక మతం వాళ్ళందరినీ కలిపి మంద కట్టొచ్చా అనేది చూడాలి. అది కూడా కుదరకపోతే hybrid డివిజన్ – ఒక్క రాష్ట్రంలో ఉన్న ఒక్క కులం వాళ్ళు , రెండు రాష్ట్రాలలోని మూడు కులాల వాళ్ళు మొదలగునవి. ఈ విధమైన మంద నిర్మాణదక్షతకి ఉదాహరణలు కోకొల్లలు – ప్రస్తుత రాజకీయ నాయకులూ, రాజకీయాలని ప్రభావితం చెయ్యగోరే కుల, మత సంఘాల వారూ.

    *****

    ఇప్పుడు ప్రశ్న-

    ఈ సంసృతి వల్ల మంద యజమానికి కీర్తి కండూతి, అహం తుత్తి తీరుతుంది. కాని మందలో సభ్యులకి ఏమి మిగులుతుంది?

    సమాధానం:

    అడుక్కుతినడంలో ఉన్న అలౌకిక ఆనందం, గుంపుగా కలిసి ఆవేశపడడం వల్ల కలిగే తన్మయం – దీనినే మందానందం అనీ, మందోన్మాదం అనీ అనొచ్చు.

    *****

    మరో ప్రశ్న –

    అవసరమైంది మంద అయినప్పుడు, కులం, మతం, ప్రాంతం, భాష కాకుండా వేరే ప్రాతిపదిక ఎందుకు తీసుకోరు – ఉదాహరణకి పొట్టి వాళ్ళు అందరూ, నల్లని వాళ్ళు అందరూ, పేద వాళ్ళు అందరూ, వికలాంగులు అందరూ ..

    సమాధానం:

    వీళ్ళని మందగా కలిపి ఉండడం కష్టం. ఎందుకంటే మందకి ఉన్న ఒక మానసిక అవసరం ఏమిటంటే మరొక వ్యతిరేక మందని కలిగియుండడం. ఇలాంటి మందకి వ్యతిరేక మందని చూపించడం కుదరదు. ఎందుకంటే పోట్టివాళ్ళకి పొడుగు వాళ్ళందరిమీదా కోపం రాదు.. కొందరు పొడగరిలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అలాగే నల్లని వాళ్ళింట్లోనే కొందరు తెల్లని వాళ్ళు, పేద వాళ్ళ కుటుంబంలోనే కొందరు ధనవంతులు, వికలాంగులు కాని వారు వికలాంగుల కుటుంబ సభ్యులుగా ఉంటారు. అదే గనక ప్రాంతం, మతం, కులం, భాష అయితే దాదాపుగా బంధు మిత్రులు అదే మందలో ఉంటారు కాబట్టి బంధుమిత్రులు కాని వారిమీద ద్వేష బంధం రగిలించి మంద మానసిక అవసరం తీర్చడం తేలిక. మన మందని మనం తయారుచేసుకోవడం ఎంత ముఖ్యమో , మన మంద విరుచుకు పడడానికి అనువుగా వ్యతిరేక మందని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం.

    ** అందరికీ మందాభివందనాలు **

    ReplyDelete
  15. అద్భుతం.. ఇంత టాలెంట్కి అవకాశం కల్పించిన హరిబాబుకు జోహార్.. హెల్త్ డ్రింకుల్ని తీసుకురండి.. పార్టీ చేసుకుందామ్మ్

    ReplyDelete
  16. Latest post by Ram Karnam about mundus & co.

    ==== మధ్యలో వేలాడే మడత బ్యాచ్ - 3 ===

    “కుల వివక్ష మీద అవగాహన” అనే దృక్పధంలో మనుషులని విశ్లేషిస్తే వివిధ రకాలుంటారు.

    కొందరు నగరాల్లో పుట్టి కుల వివక్ష అనేది తెలియకుండా పెరిగి .. తెలియకుండానే చనిపోతుంటారు.

    మరి కొందరు కుగ్రామాల్లో పుట్టి ఎల్లకాలం కుల వివక్ష పాటిస్తూనో , అనుభవిస్తూనో బతికి అక్కడే చనిపోతారు.

    మూడో గ్రూపులో మెజారిటీ ఉంటారు. పల్లెల్లో పుట్టి పట్టణాలకో, నగరాలకో వెళ్లి సెటిల్ అయ్యేవాళ్ళు .

    ఈ మూడో గ్రూపులో - కులమేదైనా, మతమేదైనా పుట్టిన ప్రతి బిడ్డా చిన్నప్పుడే “కుల వివక్ష” అనేదొకటి సమాజంలో ఉందని గ్రహించి ఉంటాడు. తన స్నేహితుడి కోసం ఇంట్లో పెద్దోళ్ళని “కులవివక్ష” ఎందుకుండాలో నిలదీసిన వాడే అయి ఉంటాడు. స్నేహం కోసం కుల, మత హద్దులు నిర్దాక్షిణ్యంగా అతిక్రమించిన వాడే అయి ఉంటాడు. జేబులో దాచిన లడ్డు, ఇంట్లో చెట్టుకి కాసిన జాంకాయ దొంగతనంగా స్నేహితుడితో కలిసి సగం సగం తినే ఉంటాడు. కబడ్డీలోనో, ఖోఖోలోనో ఒకరినొకరు తన్నుకునే ఉంటారు. పెరిగే కొద్దీ జీవితం మోపే అనేక అనివార్య బాధ్యతల్లోనూ, సమాజం మోపే అనివార్య ఆచారాల్లోనూ లీనమయి ఎవడి కంఫర్ట్ జోన్ లో వాడు కుదురుకుని ఎవడి బతుకు వాడు బతుక్కుంటూ ఉంటాడు. కళ్ళెదురుగా వివక్ష కనిపిస్తే ఖండిస్తాడు. కనిపించకపోతే మరచిపోతాడు.

    ఇప్పుడు నాలుగో గ్రూపు ఉంది. దీన్నే మనం మధ్యలో వేలాడే మడతలు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం.

    ఈ నాలుగో గ్రూపు జన్యు లోపాలతో పుట్టి పెరిగే రోగిష్టి బిడ్డలు కావడం వలన పుట్టినప్పటినుంచీ మెదడులో ఒక ప్రత్యేక భాగం పిడచగట్టుకపోయి ఉంటుంది. చిన్నప్పుడు పెరుగు చేసినంత అలవోకగా లేదా గిటార్ వాయించినంత శ్రద్ధగా సమాజాన్ని అర్ధంచేసుకోలేరు. పుస్తకాలు పిడి వెయ్యడం, ఫ్లూట్ వాయించుకోవడం లాంటి ఆత్మానందపు అలవాట్లు తప్ప వేరేమీ తెలియకుండా పెరుగుతారు. అలాంటి రోగులకి నలభై ఏళ్ళు దాటాక ఆ పిడచగట్టుకపోయిన మెదడు భాగం కొంచెం కొంచెంగా విప్పారి వికసించడం మొదలయ్యి ‘కుల వివక్ష’ అనేది ఒకటి సమాజంలో ఉన్న సంగతి అర్ధమవుతుంది. దీనినే “నడమంత్రపు నాలెడ్జ్” అంటారు.

    అసలే కరుడుగట్టిన స్వార్ధపరులైన వీరు ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని తమ స్వార్ధానికి ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తారు. ఈ “కుల వివక్ష” అనేదానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే కారణమని విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీని ఊరించి ఏదో ప్రయోజనం (ఒక రకమైన బ్లాక్ మెయిల్ చేస్తూ ) ప్లాన్ చేస్తారు. మిగతా జనానికి నమ్మశక్యంగా ఉండడం కోసం నాస్తిక/హేతువాద/కుల నిర్మూలన వాద/దళిత వాద/ అంబేద్కర్ వాద సిద్దాంతాల మాస్క్ లని తగిలించుకుని ఊరేగుతుంటారు. తమాషా ఏమిటంటే ఈ మధ్యలో వేలాడే మడతలే వాళ్ళ బంధు మిత్రుల పట్ల కూడా అందరికంటే వివక్ష ఎక్కువ పాటిస్తూ ఉంటారు.. కాని అనాదిగా స్వతహాగా వివక్షకి గురిఅయిన వారిలాగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు.

    ఈ మధ్యలో వేలాడే మడత బ్యాచ్ కి నేనిచ్చే ఆత్మీయ సలహా ఏమిటంటే –

    అరె సొంబేరులారా,

    మధ్యలో ఎందుకు వేలాడడం? ఇన్ని ఫేక్ సిద్దాంతాలు, ఫేక్ రాద్ధాంతాలు, ఫేక్ వేదాంతాలు ఎందుకు మీకు? డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకుడిని అడిగెయ్యండి ఏమి కావాలో. ప్రతిపక్ష నాయకుడు అంత అమాయకుడు ఏమీ కాదు.. మీకు ఆవులించే ఆలోచన రాక ముందే పేగుల లెక్క కోసం ఫోన్ కెమెరా, calculator apps ఓపెన్ చేసి పెట్టుకుంటాడు. ఆయన్ని మీరు మాయ చేయలేరు. పబ్లిక్ గా ఆయన పార్టీకి ప్రచారం చేసి కావాల్సిందేదో అడుక్కోవడమే ఆరోగ్యకరం. ఆ విధంగా ముందుకు పొండి.

    ReplyDelete
  17. ll the Best



    A comment on this post మధ్యలో వేలాడే మడతలు సీరీస్ by హేతువాది నయా

    కుల వివక్ష ను ప్రతి సందర్బం లోనూ బూతద్దంలో వెదికి చూడగలిగే నేర్పరులు ఈ మడత భ్యేచ్చ్.(నా దృష్టిలో చిరిగిన చెడ్డీ భ్యాచ్). ఈ నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థలో వాస్తవానికి ప్రతికులమూ తన ప్రక్క కులానికి వివక్షా పూరితమైనదే, అయినా కూడా ఎవరిపనిలో వారు ఊంటారు,కులాల మద్య సామరస్యం పాటిస్తూ ముందుకు సాగుతారు.వ్యక్తిగతంగా కుల-ఇగో,ఫిగోలు ఎలా ఉన్నా కూడా, ఒకరి అవసరాలు ఒకరు గుర్తెరిగి సాదారణంగా గౌరవించుకుంటూ ఉంటారు. సిటీ వాతావరణం లో చాలామందికి కులం లేదా కుల దృష్టిలో అవతలి వ్యక్తిని ఎలా చూడాలి? లాంటి విశయాలు తెలీని వారూ ఉన్నారు(మన చెడ్డి బ్యాచ్ ని పంపిస్తే ఇలాంటివి లేనిపోనివన్నీ నూరిపోసి నేర్పించినా నేర్పిస్తారు) .
    వీరు చేసే ఆలోచనలు ఇలా ఉంటాయి.
    కుటుంబం ఉంటుంది,కుటుంబ విలువలూ ఉంటాయి, కానీ దేశం బ్రమ.
    కుటుంబ సభ్యులపై ప్రేమానురాగాలు ఉంటాయి, కానీ దేశంపై ప్రేమ వట్టి బ్రమ.
    `మాకు ఒక జాతీ,నీతి ఉంన్నాయి,కానీ దేశీయ జాతీయవాదం వట్టి భూటకం .
    సామాజిక విలువలూ ఉన్నాయి,కానీ ఓ దేశపౌరునిగా పౌరబాద్యతలూ,విలువలూ,బాద్యతలూ అవసరం లేదు.
    ......
    ఇలాగే ఉంటాయి చెడ్డీ బ్యాచ్ స్పీచులు,ఇందులో ఆరితేరిన మార్టిన్ బాబాయ్, సుబ్బిగాడు లాంటి ప్రముఖులు ఉన్నారు, వీటికి ఈలలూ,చప్పట్లూ ,అరుపులూ,కేకలు వేసే కండోమిస్టు సోదరులూ ఉన్నారు.
    వీరిపట్ల,వీరిబావజాలం పట్ల మిగతావారు జాగ్రత్తగా ఉండాలి.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...