Wednesday 19 April 2017

కాంగ్రెసు ముక్త భారత్ అంటే కాంగ్రెసును బయటెక్కడా కనిపించకుండా తనలోకి లాక్కొవడమా?

          మొదటిసారి ఈ "కాంగ్రెస్ ముక్త్ భారత్!" అన్న నినాదం మోదీగారి నోటినుంచి వచ్చినప్పుడు నేను ఎగిరి గంతేశాను!అసలు మోదీ అమ్నస్సులో ఈ నినాదం ఎప్పుడు పుట్టిందో!స్కూలు రోజుల నాడు పుట్టిన ఈ లక్ష్యంతోనే ఆవేశపడి ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రధాని అయ్యాడా?లేక అనుకోకుండా ప్రధాని ఈ మధ్య కొత్తగా పుట్టిన వెర్రా ఇది!ఎందుకంటే,ఒకానొకప్పుడు ఈ రకమైన భావజాలం ఉన్నవాళ్లని గాంధీని చంపిన దేశద్రోహులుగా ముద్రవేసి వారి మాతకి విలువ లేకుండా చేసిన కలాంలోనూ,లోక్సభలో కేవలం 2 సీట్లు మాత్రమే ఉండి బిక్కుబిక్కుమంటున్న కాలంలోనూ,అద్వానీ గారు రదహయాత్రతో అప్రతిహతంగా రామబహ్క్తులను భాజపా అవిపుకు వోటుబ్యాంకుగా మారుస్తున్న కాలంలోనూ,వాజపేయి గారు కాంగ్రెసుకి అఖిల భారత్ భ్రష్టాచారీ కాంగ్రెసు అని పేరు మార్చుకోమని చురకలు వేసినప్పుడు గానీ ఎవరికీ తట్టని కొత్త వూహ కదా ఇది!

          హఠాత్తుగా అద్వానీ కేసు ముందుకు రావడంలో పైకి కనబడుతున్నది నిజమని మీరు నమ్ముతున్నారా?నాకైతే రివర్స్ గేరులో హిందువుల్ని రెచ్చగొట్టడానికి భాజపా ఆడుతున్న నాటకం అనిపిస్తున్నది!ముస్లిములని వోటుబ్యాంకుగా ఉపయోగించుకోవాలనుకున్న కాంగ్రెస్ పారీ,హిందూ వ్యతిరేక భావజాలపు కమ్యునిష్టు పార్టీ ఏమాత్రం బలంగా లేవు.ముస్లిం మతపెద్దలు మొదటినుంచీ సయోధ్య వైపుకే మొగు చూపుతున్నారు.రాజకీయంగా తాము కగజేసుకోకుండా ఇరుపక్షాల మతపెద్దల్నీ ఒక్కచోట కూర్చోబెడితే చాలు!అయితే.ముస్లిములు పరిహారం అడుగుతారు - 1000 కోట్లు కావచ్చు,లేక 3000 కోట్లు కావచ్చు!అది ఇవ్వకుండా రప్పించుకోవాలనే ఎఉగడలతోనే హిందూ మతతత్వ శక్తులు పావులు కదుపుతున్నాయి

          ప్రతి ఒక్క చతుర్యుగం తర్వాత జలప్రళయం జరిగే లెక్కని చూసుకున్నా యుగాల వెనకటి రాముడి ఆనవాళ్ళక్ ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు అసాధ్యం.మసీఎదును సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు దుర్మార్గమే.అది ఒప్పుకుని ముస్లిములతో స్నేహపూర్వకమైన చర్చల ద్వారా గుడి కట్టడం మర్యాదస్తులైన ప్రతి ఉక్కరూ కోరుకుంతూన్నారు.కానీ భజపాను శాసించే శక్తులు మర్యాదకి కాకుండా సమర్ధతకి పెద్దపీట వేస్తున్నాయి - అదే గుడి కట్టడానికి అసలైన ప్రతిబంధకం. 

          కానీ అక్కడ అసలు సయోధ్య ద్వారా కాకుండా హిందువుల్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టి తమకి నిరంకుశామైన అధికారం సాధించుకోవాలని భాజపా వ్యూహం.అది ఫలిస్రే దేశం మళ్ళీ రాజుల కాలంలోకి వెళ్ళీపోవడం ఖాయం - నిజంగా అది జరుగుతుందా?ప్రపంచ స్థాయిలోనే భాజపా అతి పెద్ద రాజకెయ పార్టీఅ ని అంకెల ద్వారానే సష్టంగా తేలిపోయింది.ఇది హఠాత్తుగా జరిగినదీ కాదు,దానంతటదిగా జరిగిపోయిందీ కాదు.ఎప్పటినుంచో కమలమే సకలం కావాలి,కాంగ్రెసు ముక్త భారతాన్ని సాధించాలి అనే వ్యూహం పనిచెయ్యడం ద్వారానే జరిగింది.కానె ఆ వ్యూహం ఇదివరకు కాంతెసు ఆ స్థాయికి రావడానికి ఉపయోగంచిన పద్ధతియే కదా!వ్యాపించటానికి కాంగ్రెసు పద్ధతినే పాటిస్తే కాంగ్రెసుని అనుకరించినట్టే కదా!భాజపా కూడా అచ్చం కాంగ్రెసులాగే మారిపోయినట్టే కదా!సీసా మీద లేబుల్ మార్చినంత మాత్రాన జిన్ను రమ్ము అవుతుందా?

          తమిళనాట జయలలిత మరణం తర్వాత జరిగిన,జరుగుతున్న,జరగబోతున్న సంఘటనల వెనక భాజపా ప్రమేయం అందరికీ తెలిసిన విషయమే - అది కాంగ్రెసు నీచమైన శవరాజకీయమే!నిన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆదిత్యనాధ్ తప్ప మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావటం కాంగ్రెసు మార్కు రాజకీయం ద్వారా కాదని యే భాజపా అభిమాని అయినా గుండెల మీద చెయ్యేసుకుఇ చెప్పగలడా!కాంగ్రెస్ ముక్తభారత్ అంటే బయటెక్కడా కాంగ్ర్సెసుని కనబడకుండా చేసి అద్దంలో చూసుకుంటే తనలోనే కాంగ్రెస్ కనబడేటట్టు తయారుకావడం అనుకుంటున్నాడా మోదీ!


అద్వానీ కేసుకీ రాముడ్ గుడికీ లంకె పెట్టి హిందువుల్ని రెచ్చగొట్టడం అమానుషం!

21 comments:

  1. కాంగ్రెస్ ముక్త భారత్ నిజంగా జరిగేనా? ఒకవేళ సాధ్యమయినా వాంఛనీయమా?

    నెహ్రు/గాంధీ కుటుంబ ముక్త భారత్ కోరుకొవడం సబబు కావొచ్చును (కోరుకున్న వారి దృక్పధము ప్రకారం). అయితే కొన్ని కోట్ల మంది భారతీయులు సమర్తించే సంస్థ (లేదా ఆలోచనా ధార) మనకు ఇష్టం కాదు కనుక క్షణాలలో సమిసి పోతుందని భావించడం అవివేకం.

    ReplyDelete
  2. హరిబాబు, రామజన్మభూమి గురించి మీరు రాసినది చదివితే మీరొక మంచి హిందువును లేక హిందువులు చాలా మంచి వారని అన్యమతాలవారిచేత అనిపించుకోవాలనే ఉద్దేశం కనపడుతున్నాది. హిందువులు చర్చ జరపలేదనటానికి, ముస్లీంlu ఎవరు ముందుకువచ్చారు?

    మీరు గత చరిత్ర లో నుంచి చూస్తున్నారు కనుక బిజెపి పనులు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినవే అని అంట్టున్నారు. ఎన్నికలప్పుడు నమో కాంగ్రెస్ ముక్త్ భారత్ ను ప్రజలకు వాగ్దానం చేశాడు. ఆయన ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకొవటానికి చేస్తున్న ప్రయత్నం అంటాను.

    ReplyDelete
    Replies
    1. @UGSRIRAMమీరొక మంచి హిందువును లేక హిందువులు చాలా మంచి వారని అన్యమతాలవారిచేత అనిపించుకోవాలనే ఉద్దేశం కనపడుతున్నాది.

      hari.S.babu
      హిందువులు తమకు తామే గొప్పవాళ్ళమని చెప్పేఉకుని మిగతావాళ్ళ ఒపుదలతో సంబందం అక్కర్లేకుండా ఒంటిస్తంభ ఏడలో కూర్చుని ఒంటిచేతిచప్పట్లతో ముస్రిసిపోవాలా!తమ చంకల్లో మట్టిని తామే దులుపుకుంటూ కూర్చోవాలా?మధ్యయుగాల్లో ఆ డప్పు క్ట్టుకుని ముస్రిసిపోయి ఆ తర్వాత ఉద్ధరించింది యేమిటి?సాగరయానం నిషిద్ధమని చెప్పి తలుపులు మూసుకున్నందువల్ల కాదా పరాధీనత ప్రాప్తించింది?18 సార్లు ఒక గుఇని దోచుకెళ్ళినందుకు వాణ్ణెవణ్ణో తిడితే అంతటితో అయిపోతుందా?బుద్ధిలో చురుకుదనం ఒజ్కడికయినా ఉంటే "వీళ్ళెవరు?ఎక్కణించ్ వస్తున్నారు?వీళ్ళని ఆపడం యెట్లా!" అని 10వ సారీ నంచైనా ఆలోచించేవాళ్ళు కదా!

      రాజుల కాలంలోనే ఎప్పుడూ పూర్తీధ్కారం లేదు - ఇప్పుడెందుకు బీజపీకి కాంగ్రెస్ ముక్త్ భారత్ అవసరమయ్యింది?రాజు అసమధుడైనా నియనత అయ్నా తిరుగుబాట్లు జరిగేవి - ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి అపరిమితమయిన అధికారం దేనికి?చట్టసభలో ప్రత్పక్షం బల,గా లేనప్పుడే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి,ఇలాంటప్పుడు కళ్ళు మూసుకుంటే పూర్తిగా నియంతృత్వమే దక్కుతుంది - తస్మాత్ జాగ్రత్త.

      Delete
    2. * సాగరయానం నిషిద్ధమని చెప్పి తలుపులు మూసుకున్నందువల్ల కాదా పరాధీనత ప్రాప్తించింది*

      సముద్రయానం చేయకుండానే ప్రపంచ దేశాలతో వర్తక వాణిజ్యాలు ఎలా చేశారు? వాంకోవర్ లో దేవాలయాలు ఎలా కట్టారు? ఆలోచిస్తే ఈ సముద్రయానం నిషిద్దం అనేది నిజం కాదని తెలుస్తుంది.

      రామజన్మ భూమి సమస్య ఇప్పటిది కాదు, శతాబ్దం అవుతున్నా సమస్య పరిష్కారానికి మిగతావాళ్ళ ముందుకొచ్చింది లేదు. వాళ్లలా నీలిగుతూంటే, చర్చలు ఎవరి తో జరపాలి? అందుకని వారిని పట్టించుకోకుండా వదిలేస్తే వారేమి చేయగలరో అది చేసుకొంటారు లేండి.

      కాంగ్రెస్ ముక్త్ భారత్ 2014 ఎన్నికల ముందు నుంచి ఉన్న నినాదం. అదేమి ఈ రోజు మొదలైంది కాదు. నేడు బిజెపి పరిస్థితి మెరుగ్గా ఉంది కనుక ఆనినాదం ప్రతిపక్షం అనేదే లేకుండా చేయటానికి వేసిన ఎత్తుగడలా అనుకొంటే చేయగలిగేదేమి ఉంది?

      Delete
    3. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి అపరిమితమయిన అధికారం దేనికి?

      గెలుపోటములు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం బిజెపి గాలి వీస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో లబ్ది పొందాలి. అంతేగాని పాపం, ప్రతిపక్షమే లేకుండా పోతున్నాదనే విచారణ అనవసరం. భవిషత్ లో బిజెపి వారిలో వారే కొట్టుకొని వేరే పార్టి పెట్టుకోవచ్చు. ఎవరు చూడోచ్చారు?

      Delete

    4. Saeed Naqvi : "Being the other : The Muslim in India "

      https://www.youtube.com/watch?v=dviThpWKVQU

      Delete
  3. ఊహాగానం మరీ ఎక్కువ చేస్తున్నారేమో! :) డిగ్గీ రాజాగారూ బి.జె.పి లో చేరచ్చు, ఎవరు చూడొచ్చేరు :)

    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ, ఎమర్జెన్సీ ముఖ్య విలన్ సంజయ్ గాంధీ భార్యా కొడుకులే భాజపాలో చేరగా డిగ్గీ రాజా ఎంత?

      సమస్య కేవలం కొందరు నాయకుల చేరిక కానే కాదు. అందరికి మల్లే భాజపాకు ఒక నేపధ్యం, ఒక చారిత్రిక విలక్షణత & కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాలానికి అనుగుణంగా మార్పులు చేతులు ఉండడం సహజమే అయినా అవి పార్టీ యొక్క విశిష్ట గుణాన్ని మార్చడం జరిగితే ఆ పార్టీ తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది.

      కాంగ్రెస్ మీద పోటీ వలన భాజపా "కాంగ్రెసీకారణ" జరిగితే అది వారికే కాదు దేశానికే నష్టం. రెండు (లేదా ఎక్కువ) పరస్పర విరుద్ధ భావజాలాలు పోటీ ప్రజాస్వామ్యానికి శుభకరం. అందరూ ఒకటే తేడా కేవలం నాయకత్వ చిత్తశుద్ధి & పటిమే అవుతే జనానికి హానికరమే.

      ఇప్పటికే స్వాతంత్య్ర సమరానికి మారుపేరయిన కాంగ్రెస్ ఒక కుటుంబ ఆధిపత్యానికి కొమ్ము కాసే మరయంత్రంగా మారింది. అలాగే సామాజిక న్యాయం లేదా/మరియు అస్తిత్వ పోరాటాలు ఆధారంగా ముందుకు వచ్చిన శక్తులు శానా వరకు కొందరు వ్యక్తులు లేదా కుటుంబాల జేబు సంస్థలయ్యాయి.

      ఇక సంఘటనా శక్తే ఆయుధంగా ఏర్పడ్డ భాజపా కూడా వ్యక్తిపూజకు ఆలవాలమైతే హరిబాబు పేరుకున్న నియంతృత్వం ఎంతో దూరం కాదు.

      Delete
    2. ఏ బ్లాగులోనూ తమతో చర్చించలేదు,గుర్తించి ఉంటారు. శలవు

      Delete
  4. #అయ్యా_వెంకయ్యనాయుడు_గారు

    కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మరియు ప్రజల మధ్య పోరాటం చెయ్యగల చరిత్రకల్గిన నేతగా ఆంధ్రాలో ప్రతి మండలాన్ని , మండలాల్లో ఉన్న పల్లె పల్లెని సందర్శించిన రాజకీయ యోధునిగా, కమ్మూనిస్టుల చేత కూడా శభాష్ అని అనిపించుకున్న గొప్ప వాగ్దాటి కల్గి, ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ బీజేపీ సాధారణ కార్యకర్తగా మొదలైన నీ రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యే పదవి నుండి ఎంపీ గా ఎదిగావు. దేశంలోనే అందునా దక్షిణ భారతం నుంచి వచ్చినప్పటికీ మహామహులైన ఉత్తరాది నేతలను కాదని ఏకంగా భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యావు. పార్టీకి మీరందించిన సేవలకు గుర్తింపుగా పార్టీ నియమావళిని కూడా సవరించి మూడో సారి మిమ్ములను రాజ్యసభకు ఎన్నిక చేసి పార్టీ మీ ఋణం తీర్చుకుంది. అదేవిధంగా పార్టీ మిమ్ములను రెండు సార్లు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నత పదవులను కల్పించి అందరికన్నా గొప్పగా సత్కరించింది.
    అయినా మీరేమీ చేశారు పార్టీకి..... ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి పార్టీని ఎంతో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది అధికారంలోకి తేవలసిన మీరు ఏమి చేశారు. అప్పటి టిడిపి సీనియర్ నాయకుడు ఉప్పెంద్ర ను ఖైరతాబాద్లో ఓడించి ఎన్టీఆర్కే వణుకు పుట్టించిన అలె (టైగర్) నరేంద్రను పార్టీలో ఎదగనియ్యకుండా చేశావు. ఇంద్రసేనారెడ్డిని, బద్దం బాలిరెడ్డిని, రామచంద్ర రెడ్డిని, చలపతి రావు మొదలైన నేతలను, అదేవిధంగా ద్వితీయ స్థాయి నాయకులను, కార్యకర్తలను పార్టీలో ఎదగనియ్యకుండా నిరాశ నిసృహలలో పడేశావు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చే నాన్-కమ్మ నాయకులను అడ్డుకుంటున్నావు. ఎక్కడ నీ ఉనికికే ప్రమాదం అవుతుందోనని వారిని దూరం పెట్టావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు. పాతిక సంవత్సరాలు గడుస్తున్నా పార్టీని ఎదగనియ్యకుండా, నాయకులను ఎదగనియ్యకుండా నీ అనుచరులతో పార్టీని నింపి మీ "జాతి" పార్టీ తెలుగుదేశంకు గులాం చేస్తూ, మీ జాతి నాయకుడు ఎన్టీఆర్, చంద్రబాబు నీడలలో సేదతీరుతూ జాతీయ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీకి "బి" టీంగా తయారు చేశావు.

    ReplyDelete
  5. 2014 ఎన్నికల్లో 15 రోజుల వ్యవధిలోనే వచ్చిన కామినేని శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చి బాబు దగ్గర మంత్రిని చేశావు. ఆసలు కామినేని పార్టీ టిక్కెట్టుకు అర్హుడా కాదా అని కూడా ఆలోచించకుండా టికెట్ ఇచ్చి నీ కూలతత్వాన్ని బయటపెట్టుకున్నావు. అదే కామినేని పార్టీ కోసం పనిచేయకుండా నీ కనుసన్నలలో టిడిపి ఉపనేతగా అనంతపూర్ జిల్లా ఇంచార్జి మంత్రి గా చంద్రబాబు సేవలో తరిస్తున్నాడు. అది నీ చలువే కదా. జాతీయ నాయకునిగా ఎదగమని పార్టీ నిన్ను ఆదేశిస్తే "కమ్మ"ని జాతికి నాయకునిగా ఎదిగావు. పార్టీలో ఇతర కులాలను, ఆ కులాలల నాయకులను ఎదగనియ్యకుండా అందరిని తెలుగు దేశం పార్టీకి బంట్రోతులు అనే విధంగా తయారుచేసావు. అదేవిధంగా గతంలో నీవు జాతీయ స్థాయిలో భారతీయ యువమోర్చ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు రాష్ట్ర యువమోర్చ అధ్యక్షునిగా పనిచేసిన నీ ప్రియ శిష్యుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చంగల్రాయుడుని ఇటీవలే బాబు సేవలో తరించామని టిడిపిలో చేర్పించావు. సొంత పార్టీని అభివృద్ధిలోకి తేకుండా తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి తెచ్చావు. ఇది నీకు న్యాయంగా ఉందా వెంకయ్య ? టిడిపి ఫై ప్రతిపక్షపార్టీలు విమర్శనాస్త్రాలు సందించినప్పుడల్లా ఢిల్లీ నుంచి హటాహుటిగా విజయవాడలో ప్రత్యక్షమై ఎదురుదాడి చేస్తూ చంద్రబాబు మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నావు. సొంత పార్టీ మీద చంద్రబాబు కానీ, వారి మంత్రులు కానీ, జలీల్ ఖాన్, బోండా లాంటి టిడిపి నాయకులు విమర్శలు చేసినప్పుడు ఏమి పట్టనట్లు ఈ వైపే చూడలేదు. 18 కోర్ట్ స్టేలతో అవినీతి, అసమర్థ పాలనను కొనసాగిస్తున్న చంద్రబాబును ఓటుకునోటు కేసులో అరెస్ట్ కాకుండా కేసీఆర్ దగ్గర బ్రోకర్ పనులు చేసి బాగా కాపాడావు. బాబుకు 18 కోర్ట్ స్టేలను ఇచ్చిన మీ జాతి న్యాయమూర్తులను ఎందుకు నిలదియ్యలేకపోతున్నావు. న్యాయ వ్యవస్థను నిస్సుగ్గుగా వాడుతున్న బాబు 18 కోర్ట్ స్టేలను ఎత్తివేసి విచారణకు ఎందుకు పట్టుబట్టలేకపోతున్నావు. జగన్ ఎంత అవినీతిపరుడో బాబు కూడా అంత అవినీతిపరుడు. ఇద్దరికీ శిక్షలు పడాలి. ఆ దిశగా ఎందుకు ప్రయత్నం జరుగలేదు.
    విజయవాడలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన హిందూదేవాలయాల కూల్చివేత, గోశాలల కూల్చివేతను అడ్డుకోలేకపోయావు. వందల కోట్ల సదవర్తి భూకుంభకోణాన్ని చూస్తూ ఉండిపోయావు. అమరావతి చుట్టూ 55 వేల ఎకరాల భూములను టిడిపి నేతలు చేజిక్కుంచుకున్న ఏమి అనలేకపోయావు. నిస్సుగ్గుగా ప్రతిపక్షనేతలను అవినీతి సొమ్మును వలవేసి పశువులకన్నా హీనంగా టిడిపి పార్టీ కొనుగోలు చేస్తూ , మంత్రి పదవులను ఇచ్చినప్పటికీ ఏమి మాట్లాడలేకపోయావు. అమరావతిలో ఉండి పాలన చేయవలసిన ముఖ్యమంత్రి హైద్రాబాద్లో తన అవినీతి సొమ్ముతో వందల కోట్లు ఖర్చుపెట్టి భవనాన్ని నిర్మించుకున్న దానిపై ఏమి మాట్లాలేకపోయావు. విశాఖ హుదూద్ తుపాన్ కేంద్రనిధులు దుర్వినియోగం జరిగినప్పటికీ నోరెత్తలేకపోయావు. కేంద్రం ఇస్తున్న నిధులను ఏ విధంగా ఖర్చుపెడుతున్నాడు అనికూడా బాబును ప్రశ్నించలేకపోతున్నావు. చివరికి కేంద్ర కమిటీ వేల కోట్లలో నిధుల దుర్వినియోగం జరింగింది అని చెప్పినప్పటికీ ఇంక్విరికి అవకాశం ఇవ్వకుండా బాబును బాగా కాపాడావు. సినీ నటుడు శివాజీ, పవన్ కళ్యాణ్, చలసాని శ్రీనివాస తో బాబు నరేంద్రమోడీ మీద విమర్శనాస్త్రాలు చేయించినప్పటికీ నీవు ఏమి మాట్లాడలేక పొయ్యవు. వందల కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ విమానాలలో తిరుగుతూ, అనవసర విదేశీ పర్యటలను చంద్రబాబు ఖర్చు చేసినప్పటికీ ప్రశ్నించలేకపోయావు. లక్షల కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయి, బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఉదరకొడుతున్న బాబు ఎచ్చులను విమర్శించలేకపోయావు.

    ReplyDelete
  6. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ తన కుల ఆస్థాన చైనా (శ్రీ చైతన్య + నారాయణ) స్కూల్స్, కాలేజెస్ పరీక్షా ప్రశ్నపత్రాలను లీక్ చేసి తమ విద్యాసంస్థల విద్యార్థులకు అడ్డగోలుగా సహాయచేస్తున్న టిడిపి వంకర ఆలోచనలను చూస్తూ వూరుకున్నావు. ఒక విద్యార్థి నాయకునిగా ఆంధ్రా యూనివర్సిటీలో ఎదిగిన నీవు విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కళ్లులేని కబోదిగా మారవు. గోద్రా అల్లర్ల సందర్భంగా మోడీ గారిని నరహంతకుడు అని విమర్శించినా మీ జాతి నాయకుడు చంద్రబాబును సమర్థిస్తున్నావు. సొంత పార్టీ నేతలను, ప్రధానిని అన్నేసిమాటలు బాబు నోటినుంచి వచ్చిన విని ఉరుకున్నవే.... నీకు సిగ్గుచేటు అనిపించలేదా ?. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే స్వీట్స్ పంచుకొని టిడిపి పార్టీ నాయకులూ తిన్న నీకు కనిపించలేదా ?. తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డు సభ్యడు శేఖర్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నాడని తెలిసి కూడా మీరు మాట్లాడలేకపోయారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, ఇసుకు కుంభకోణం, అగ్రిగోల్డ్ ఆస్తుల కుంభకోణం, పోలవరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రాత్రికే రాత్రి పెంచి దోచుకుంటున్న మీరు సైలెంట్ అయ్యారు. మీకేమైనా నోటి పక్షవాతం వచ్చిందా ఏమి ??. సొంత పార్టీకి ద్రోహం చేస్తున్నాడు వెంకయ్య అనే అపనిందను మూటకట్టుకోవద్దు. మీ రాజకీయ అనుభవంతో RSS భావజాలం అయినా కులతత్వాన్ని వదిలి పార్టీ కోసం పనిచేయండి. పార్టీ పరువును నిలపండి. అంతే కానీ కులతత్వ హిందూ ద్రోహిగా ముద్ర వేసుకోకండి. మీ కన్నా చిన్నవాడైన యోగి ఆదిత్యనాధ్ ను చూసి కొంతైన సిగ్గు తెచ్చుకొని పార్టీ కోసం పనిచేయండి.

    ReplyDelete
  7. * తమిళనాట జయలలిత మరణం తర్వాత జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న సంఘటనల వెనక భాజపా ప్రమేయం అందరికీ తెలిసిన విషయమే*


    యు.పి. లో బిజెపి గెలవటానికి అమిత్ షా వేసిన ఎత్తుగడలు చూసినవారికి, తమిళ రాజకీయాలలో బిజెపి ప్రమేయం ఉందంటే నమ్మగలమా? పేలవమైన దారితెన్నులేని, ఒక నాయకుడు లేని కప్పల తక్కెడ లా ఒక్కొక్కరు ప్రవర్తిస్తున్నారు. మీరన్నట్లు నిజంగా భాజప ప్రమేయమే ఉంటే అక్కడ రాజకీయాలు అంత గందరగోళం గా ఉంటాయా? అమిత్ షా అంత పొలిటికల్ మేనేజ్మెంట్ తెలియనివాడా? అతని ప్లానింగ్ ఇంత ఘోరాతి ఘోరంగా ఉంట్టుందా? నమ్మ బుద్దిగావటలేదు.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. బీజేపీకి రామాలయం కట్టే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. సీ బీ ఐని ఎగదోస్తున్నదెవరో తెలియదు గానీ లాలూ అన్నట్లు మోదీ వ్యూహం మాత్రం కాదు. బీజేపీకి 2019 లో గెలుపుపై ఎలాంటి సందేహమూ లేదు. అయోధ్య విషయం ఎత్తకుండానే ఎన్నికలకు వెళ్ళాలంటే ఏదో ఒక నాటకం ఆడాలి గదా? ఉమాభారతి మాటలను బట్టి జైలుకి వెళ్ళి హిందువుల మనసు గెలుచుకోవాలన్న ప్లాన్.ఏదో ఒకటి చేసాం అని చెప్పుకోడానికి పనికివస్తుంది.

    ఇకపోతే 1000 కోట్లతో బాబ్రీ స్థలం కొనాలన్నది పూర్తిగా నా ఆలోచన. బీజేపీ గానీ ఇతరులెవరూ ఆ సాహసం చేయబోరు.కోర్టుబయట సెటిల్మెంటుకి బీజేపీయే సిద్ధంగా లేదు. పీవీ,అద్వానీల్లా సాహసం చేసి రాజకీయ జీవితం కోల్పోడానికెవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ ముస్లిం లు బాబ్రీ స్థలాన్ని అమ్మకానికి/వేలానికి పెడితే కొనడానికి మన ఆస్థులు సరిపోవు.మనల్ని మనమే పణంగా పెట్టాలి.దేనికైనా సిద్ధపడి రామాలయం కట్టగలిగినంత ధైర్యం ఉన్న నాయకుడెవరున్నారు? పుట్టే ఉన్నాడా? పుట్టబోతున్నాడా?

    ఇతరేతర కారణాలతో వోటు వేస్తుంటే వొద్దని చెప్పలేను గానీ మాకు అధికారం ఇస్తే రామాలయం కదతామని ఆ పార్టీ ఇచ్చిన హామీని నమి వోట్లు వేస్తున్న రామభక్తులు మాత్రం అలాంటి ఆశ వదులుకోవటం మంచిది - బీజేపీకి వోటు వెయ్యకండి!కళ్ళముందు కనబడుతున్న దొంగనాటకాన్నే కనుక్కోలేనివాళ్ళు భవిష్యత్తును గురించి ఆశపడటం అనవసరం.మూడుకాలాలలొనూ సత్యము తానైనవాడు తను మాత్రమే చెయ్యాల్సిన పనికెసం రావలసిన చోటుకి రావలసిన సమయానికి రావలసిన విధంగా వస్తాడు - అయోధ్యలో రామాలయ నిర్మాణమే తన జన్మకారణంగా ఒక కారణజన్ముడు ప్రభవిస్తాడు!బహుశా ధర్మానికి ప్రతిరూపమైన రామచంద్రుని ఆలయనిర్మాణం రాజకీయ కుక్షింభరుల వల్ల కాక మానవోత్తముడైన స్థితప్రజ్ఞుడి చేతుల మీదుగా జరగాలని కాలనిర్ణయం కాబోలు!

    ReplyDelete
    Replies
    1. మీరెందుకు బిజెపి గురించి ఇంతగా ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. ఆంధ్రాలో,తమిళనాడు, కేరళలో ఆ పార్టి ప్రభావం శూన్యం కదా! సౌత్ లో రామభక్తులు ఓటేస్తే గెలిచే పరిస్థితిలో ఉందా ఆ పార్టి?

      Delete
    2. @UG SriRam
      మీరెందుకు బిజెపి గురించి ఇంతగా ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు.

      hari.S.babu
      నేను బీజేపీ గురించి ఆలోచించి తెలుసుకోవడానికి కొత్తగా ఏముంది?నేను రామాలయ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాను!దక్షిణాదిలో భాజపాకి వోట్లు పడాలంటే ముందు రామాలయం కట్టాలి.మర్యాదా పురుషోత్తముడైన రామాలయం మర్యాదస్తుల పద్ధతిలో కట్టడానికి ఇప్పటి మెజారిటీ చాలా ఎక్కువ.కానీ గోరక్షణ పేరుతో మనుషుల్ని పశువుల కన్న హీనంగా చూసే రౌడీమూకలకి ఇది మా పార్టీ ప్రభుత్వం అన్న ధైర్యాన్ని ఇవ్వడం తప్ప మర్యాదస్థులు మెచ్చే సనాతన ధార్మిక సహిష్ణుత నాకెక్కడా కనబడ్డం లేదు.ఏ హిందూ రైతూ తను పని చేయించుకునే ఎద్దుల్ని కొట్టడం లేదా?నా చిన్నతనంలో మా పనివాళ్ళు వాటి తోకల్ని మెలిపెట్టడం కూడా చూశాను నేను - వాళ్ళు గొల్ల కులస్థులు.మరి ఒక ముస్లిం వ్యవసాయదారుణ్ణి ఎందుకట్లా తరిమి తరిమి కొట్టారు?ఇదే మొదటిసారి కాదు గదా?రామాలయం కట్టాలంటే దక్షిణాది వాళ్ళు కూడా వోట్లు వెయ్యాలా?అంటే, ఉత్త్తరాది వాళ్ళ వోట్లు ఈ రౌడీపనులకి మాత్రమే సరిపోతాయా?

      నేను ఇప్పుడు ఇక్కడ ఇస్లాం గురించి అంత తీవ్రంగా ఎందుకు రాస్తున్నాను?సాక్ష్యం మ్యాగజైన్ దగ్గిర నేనే కాదు అక్కడ కామెంటు వేసిన ప్రతి హిందువూ "మీరు మీ మతం గురించీ మంచిని ఎంతైనా చెప్పుకోండి,దయచేసి మా మతం గురించి అబద్ధాలు చ్ప్పకండి!" అని మొత్తుకున్నా వినకుండా మొండిగా ఉండటం అవ్ల్లనే కదా!ఇప్పుడు రాస్తున్న విషయాలన్నీ "సచ్చా ముసల్మాన్ ఎవడూ రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించడు" పోష్టు రాసేటప్పటికే తెలుసు నాకు,అయినా సయోధ్యతోనే అయోధ్య సమస్యని పరిష్కరించుకోవటం మంచిదని అనుకున్నాను,ఇప్పటికీ అనుకుంటున్నాను,ఇకముందు కూడా అనుకుంటాను!

      ఎందుకంటే, వాళ్ళని నేను మనుషుల్లా చూస్తున్నాను గనక!ఇవ్వాళ వాళ్ళు ఇస్లాముని పాటిస్తున్నది మనలాగనే - తాతల నుచి పాటిస్తున్న వారసత్వం.నా పద్ధతిలో నిజాలు చెప్పి మార్చాలి,అది కుదరకపోతే వాళ్ళ మానాన వాళ్ళని వొదిలెయ్యాలి.సాక్ష్యం అభిలాష్ దుర్మార్గం చేస్తుంటే వ్యతిరేకించి గోరక్షకులు దుర్మార్గం చేస్తుంటే చోద్యం చూస్తూ నిలబడటం నిజమైన హిందూత్వం కాదు!

      P.S:మళ్ళీ చెబుతున్నాను,రామాలయం కట్టాకే దక్షిణాదిలో భాజపాకు బలం పెరగవచ్చు.లేదా పైన వాక్రుచ్చిన అనామక వ్యాఖ్యాత రిపోర్టు ప్రకారం వెంకయ్యనాయుడు మర్రిచెట్టులా పాతుకుని హవా హవాయిగా ఉన్నంతకాలం దక్షిణాదిలో భాజపాకి నిల్వ నీద రాదు.
      స్చస్తి!

      Delete
    3. హరిబాబు, బిజెపి పార్టి మధ్యాహ్న మార్తాండుడిలా దేశ వ్యాప్తంగా ప్రకాశించాలని నేను కోరుకోను. గెలిచిన చోట్ల గెలవని ఓడిపోయే చోట్లపోని.

      ఇక గోరక్షుల గోల ఈరోజే మొదలైనట్లు మీడీయాలో చూపెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి దానిలో పాల్గొనే వారు గుంపు గా ఉంట్టున్నరు అంటే అర్థమేమిటి? వాళ్ళు ఈ గోల మీడీయాలో పాపులర్ కాకముందు నుండి డబ్బులు వసూలు చేయటం కోసమో లేక మరేదైన వ్యక్తిగత కారణాలతో చేస్తున్నారనిపిస్తుంది. ఇదేమి అచ్చంగా గోవులను రక్షించటానికి చేస్తున్న గోల ఐతే కాదు. గోవులను రక్షించటమే లక్ష్యమైతే ఇతరులను కొట్టటమెందుకు, చంపటమెందుకు? గోవులను స్వాధీనం చేసుకొన్నాక మందలిస్తే సరిపోతుంది కదా!

      * సయోధ్యతోనే అయోధ్య సమస్యని పరిష్కరించుకోవటం ... ఇకముందు కూడా అనుకుంటాను!*


      మీరు అనుకొవచ్చు. వందేళ్ళ నుంచి ఆ వివాదం నలుగుతూంటే ఎవరైనా పరిష్కరించుకోవటానికి ముందుకు వచ్చాడా? ఇదొక్కటేనా కాష్మీర్ వివాదం పరిష్కారమైందా? తెలుగు బ్లాగుల్లో మొట్టమొదట సారిగా 7 ఏల్లక్రితం హసన్ నిసార్ వీడీయోలను చాలా ఏళ్ల క్రితం పరిచయం చేశాను. మీరు వాటిని చూసే ఉంటారు. ఆయన మాటలు,తరువాత వచ్చినె తారెక్ ఫతహ్ మాటలు విన్నప్పుడు ప్రజలలో మార్పొస్తుందనుకొన్నాను. చివరికి నాకర్థమైంది ఎమిటంటే ప్రజలలో మార్పురావలసిన వారిలో ఎమీ రాలేదు. సరికదా తారెక్ ఫతహ్ ను తన్నటానికి రంగంలొ దిగారు. అయోధ్య వివాదం సయోధ్య తో పరిష్కరించుకోవటానికి ఇప్పటివరకు చేయని ప్రయత్నం లేదు కదా! భవిషత్ లో సయోధ్యతో ఎలా పరిష్కరించుకోగలరు? అది ఒక పగటికల.

      Delete
  10. టెర్రరిస్టుల దాడి

    మోడీ రెస్పాన్స్: "పాక్ కి గట్టిగా బుద్ది చెబుతాం"



    మావొయిస్టుల దాడి

    మోడీ రెస్పాన్స్: "పిరికిపందల చర్య"


    గోరాక్షషుల దాడి

    మోడీ రెస్పాన్స్: "--------"

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం రెస్పాన్స్: ;-P ;-P ;-P ;-P

      Delete
  11. భారత దేశం కోడలు స్వెత్లానా (Stalin's daughter )

    https://www.facebook.com/photo.php?fbid=285667221903349&set=a.283241345479270.1073741828.100013802211740&type=3&theater

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...