Tuesday 8 November 2016

హిందువుల దేవాలయాలు అంటే విగ్రహాలూ గోడలూ మాత్రమేనా?వాటిలో ఉన్న ఈనాటివారిని మించిన సైన్సు ఎవరికీ కనపడదా!

శ్రీ గురుభ్యో నమః

     ప్రాచీన కాలంలో ఎక్కడైనా ఒక ఆలయం కట్టాలంటే ఎంతో పరిశోధన జరిగేది.కట్టాలనుకున్నవాళ్ళు కూడా భక్తిశ్రద్ధలతో అప్పటికి సంపాదించిన సమస్తం దానికే ఖర్చుచేసి నిర్మించేవాళ్ళు.ఎందుక్నటే ఆలయం అనేదాని ఆ కట్టినవాడికి సప్తసంతానాల్లో ఒకటిగా చెప్పారు గనక!సనాతన ధర్మం ప్రకారం వివాహం యొక్క మొదటీ ఆఖరి పరమార్ధం శృంగారం కానే కాదు - సంతానం కోసమే!మళ్ళీ సంతానం కూడా ఇవ్వాళ్టిలా ముసలితనంలో అక్కరకొస్తారనే స్వార్ధం వల్ల కూడా కాదు. తాము  ధర్మబద్ధంగా అప్పటివరకూ సంపాదించిన జ్ఞానాన్నీ సంపదనీ క్షేమంగా తర్వాత తరానికి అందించి పిల్లల మీద ఆధారపడి ఉండకుండా వానప్రస్థం అన్న నాలుగో ఆశ్రమం పేరుతో దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు - ఇందులో ముసలితనంలో అక్కరకొస్తారనే స్వార్ధం ఎక్కడ ఉంటుంది!ఇంకా ముందుకు చూస్తే సంతానం అంటే ఇవ్వాళ్టివాళ్ళలా లక్షలు కోట్లు ఖర్చు చేసయినా సరే,సంవత్సరాల తరబడి డాక్టర్లని బాగు చేసయినా సరే మా దేహాల నుంచే రప్పించుకోవాలి అనే పట్టుదల కూడా ఉండేది కాదు.ఎట్టి పరిస్థితుల్లోనూ  ఇద్దరిలో ఎవరికీ పిల్లలు పుట్టరని తెలిస్తే దత్తత తెచ్చుకునేవాళ్ళు,ఎవరో ఒకరికి సంతానయోగ్యత ఉంటే పరస్పరాంగీకారంతో దేవరన్యాయం లాంటివి పాటించేవాళ్ళు,అదీ కుదరకపోతే తమ యావదాస్తినీ వినియోగించి సప్తసంతానాల్లో ఒకటైనది గనక ఒక ఆలయం కట్టి సరిపెట్టుకునే వాళ్ళు!

     వూరికే ఒక గుడి కట్టేస్తే ఏమి లాభం?ఆ గుడి పదికాలాల పాటు భక్తులను రప్పించుకుంటే గదా తన యశస్సు నిలబడేది!అందుకోసం ఆలయనిర్మాత తను నిర్మించే ఆలయానికి ఒక ప్రత్యేకత కోసం తపించేవాడు - ఆ తపన వల్లనే ఆధ్యాత్మికత, సౌందర్యం, శాస్త్రీయత, ప్రజాక్షేమం కలబోసి ఆలయాలను నిర్మించేవారు.ఆలయయంలో ఉన్న ప్రత్యేకతని తెలుసుకుని ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులకు కనీసపు సౌకర్యాలు కలిగించాలన్నా ఆలయాలకి ఆదాయం అవసరమే కదా!కస్టమరుని మోసం చెయ్యని వ్యాపారం కూడా తప్పు అంటే మనిషి ఒక్క క్షణం కూడా బతకలేడు.నువ్వు కోరుకున్నవి అన్నీ నీ చుట్టుపక్కలే ఉంటే ఫరవాలేదు.మరి దూరంగా ఉన్నవాటిని నీకు దగ్గర చేసినవాడు లాభం తీసుకోకూడదా!నిజానికి అప్పట్లో చావు ఎక్కడబడితే అక్కడ కనబడుతూ ఉండేది.ఎంత ధనవంతుడైనా వూరికి మశూచికం సోకితే దరిద్రుడిలాగే ఎగిరిపోతున్నప్పుడు ఇంత సంపాదించి నేనేం చెసుకుంటాను అనే ప్రశ్న తప్పకుండా వొస్తుంది.అలా ప్రాణం విలువ తెలిసినవాళ్ళు గనకనె ప్రతి ఆలయంలో అన్నదానం చెయ్యటం లాంటి ధార్మికదృష్టి ఉండేది. రోగాల్ని నియంత్రించుకుని ప్రాణభయం పోయిన ఇవ్వాళ్తి కాలంలో అనుకంప తగ్గింది - ఎంత విచిత్రం!రాం కుమార్ అనే ఒక టెనేజి కురాడు అనే ఒక టీనేజి కురాడు కేవలం తన పక్కలోకి రానన్నాదని ఒక ఆడపిల్లని కొని వందల మంది తిరిగే చోట వేట కొదవలితో నరికేశాడు.కనీసం భయపడి పారిపోకుండా తాపీగా నడుచూంటూనే అక్కణించి తప్పించుకున్నాడు. నేను చేసింది తప్పు కాదు, నన్నెవరూ ఆపలేరు, నన్ను పట్టుకోవడం అసాధ్యం అని అంత ధీమా వాడికి ఎట్లా వచ్చింది?తీరా పోలీసులు చుట్టుముట్టినప్పుడు తనని తనే ఎందుకు చంపుకోవాలని ప్రయత్నించాడు?మళ్ళీ అన్ని ఆధారాలు కనబడుతున్నా మొండిగా నేను చెయ్యలేదు అని వాదించటంలో ఉన్న లాజిక్ ఏంటి?"నేను మాత్రమే బాగుండాలి!నా ప్రాణమే విలువనది!నా సుఖం కోసం ఇతరుల్ని పీడించినా తప్పు లేదు!నన్ను వ్యతీరెకించినవాళ్లని, నా కోరిక తీర్చనివాళ్ళని చంపటం న్యాయమే!" అన్న ధోరణి అది. ఇలాంటివి చాలా జరుగుతున్నా ఈ ఒక్క ఉదాహరణనే నేను ఎందుకు తీసుకున్నానంటే అక్కడ అంత స్పష్టంగా కనబడే ఈ ధోరణి దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఉంది - పర్సెంటజి తేడా, అంతే!

     వాడంటే కురాడు,పెద్దల బుద్ధి కూడా అలానే నడుస్తున్నది గదా!ఇవ్వాళ ఆలయాలు కడుతున్నవాళ్ళే ప్రాచీనుల మాదిరి స్థల ప్రాముఖ్యం చూసుకోకుండా ఎక్కడబడితే అక్కడ కట్టేసి వాటిని ఆర్జనామార్గాలుగా చేసుకుంటున్నారు.ఆలయవాస్తులోని అతి ముఖ్యమైన సూత్రం ఆలయగోపురం నీడ మనుషులు కాపురముండే ఏ ఇంటిమీదా పడకూడదు, అలా పడితే ఆ గృహానికి అరిష్టం అనేది.అంటే, ఆలయాలు జనావాసాలకి కొంచెం దూరంగా ఉందాలి అని అర్ధం. మరి ఇప్పుడు ట్రాఫిక్ మధ్యలో కూడా కట్టేసి తొలగించబోతే ఆలయాన్ని కూల్చడం సనాతన ధర్మానికి హాని అని బెదిరించడం ఏమిటి?

     ఈ పూర్వరంగం అంతా అర్ధమయితే గానీ ఇక్కడ చెప్పబోయే విశేషాలు అర్ధం కావు.అందుకే ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చాను.ఇప్పుడు కొని ప్రాచీనకాలంలో కట్టిన ఆలయాలలోని ఆధునికులకి కూడా సాధ్యం కాని వైజ్ఞానిక విశేషాల్ని గురించి చెబుతాను.ఈ పోష్టు కేవలం హైందవధర్మం యొక్క విశిష్టత మీద గౌరవం ఉండి దాని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవాళ్ళ కోసమే రాశాను.అందుకే ఇంతవరకూ పెట్టగూడదనుకున్న మోడరేషన్ కూడా పెట్టాను.కాబట్టి మీ అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పవచ్చును.వీలున్నంతవరకూ చదివిన వారు తమ ప్రతిస్పందన కూదా తెలియజేస్తే ఇతరులకీ ఉత్సాహంగా ఉంటుంది!మీకు నచ్చితే దీనికి ఎంత ప్రచారం కలిగిస్తే అంత ఫలితం ఉంటుంది.

ద్వాదశ జ్యోతిర్లింగాల వెనక ఫిబినోసి సీక్వెన్సు ఉంది.


     శివుని ప్రతిరూపాలుగా భావించే మొత్తం 64 జ్యోతిర్లింగాలలో ఒక పన్నెండు అతి విశిష్ఠమైనవి.. భూమిపై నివసించే సమస్త జంతుకోటికీ ఆకాశంలో కనిపించే నక్షత్రాలు,గ్రహాల నుంచి నిరంతరం వెలువడుతున్న విద్యుత్ తరంగాల నుండి ఉద్భవించే జ్యోతిరూపమైన శక్తి  ఈ 12 లింగాల ద్వారా సమతౌల్యతను పొంది భూమిని ఆవాసయోగ్యంగా నిలబెట్టాయి.అందువల్లనే సాధారణమైన ఆలయాలలో వలె వీటికి లింగప్రతిష్ఠలు గానీ ప్రాణప్రతిష్ఠలు గానీ లేకపోయినా సృష్టి ఉన్నంతకాలం జ్యోతిశ్శక్తి వెలువడుతూనే ఉంటుంది.

     ఈ 12 జ్యోతిర్లింగాల స్థాపనలో దాగున్న సైన్సును పరిశీలించి చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. మ్యాధ్స్ సబ్జెక్టులో ఏ కొంచెం పరిచయం ఉన్నవారికైనా ఫిబోనసి సీరిస్ గురించి తెలిసుంటుంది. ఈ సీక్వెన్సులోని ప్రతి సంఖ్యా దానికి ముందరి రెండు అంకెలను కలపితే వస్తుంది - 0,1,1,2,3,5,8,13,21,34... ఇలా వీటిని ఆధారం చేసుకొని గ్రాఫ్ గీసుకుంటూ పోతే ఫిబోనసి గ్రాఫ్ ఏర్పడుతుంది. ఇది ఓ బిందువు నుండి సర్పిలాకారంగా తిరుగుతూ క్రమంగా కేంద్రం వద్ద పరిసమాప్తం అవుతుంది.
     మన ఇండియా మ్యాపును తీసుకొని మన దేశంలోని జ్యోతిర్లింగాలను దానిపై గుర్తించి ఉత్తరాఖండ్ లోని కేదారి నాథ్ నుండి మొదలుపెట్టి ప్రతి జ్యోతిర్లింగాన్ని టచ్ చేసుకుంటూ వృత్తాకారపు రేఖలతో ఒక్కొక్కటిగా కలుపుకుంటూ పోతే - అది వైద్యనాథ్, రామేశ్వరం, సోమనాధ్..శ్రీశైలం మీదుగా సాగి సాగి మహారాష్ట్రలోని ఘృష్టీశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఆగుతుంది. ఇప్పుడు మనం పూర్తి చేసిన స్పైరల్ షేపును చూస్తే - ఇదే ఫిబోనసి సీరిస్ గ్రాఫ్!
     ఈ క్లూ కనుక్కున్నది మెల్విల్లె అనే అమేరికన్ కాస్మాలజిస్టు.కనుక్కున్న పెద్దమనిషికి ఆ రహస్యం తెలుసుకోవటానికి రోజులు,వారాలు బహుశా కొన్ని నెలలు పట్టి ఉండొచ్చు.కానీ వాటిని ఒక మనిషి ఇండియా మ్యాపు మొత్తాన్ని ఎదురుగా పెట్టుకుని చుక్కలు పెట్టేసి ఇక్కడిక్కడ ఈఈ గుడులు కడితే ఇట్లా  ఫిబ్బినోస్సి సీక్వెన్స్ వచ్చేస్తుంది అని ఒకేసారి కట్టెయ్యలేదు.ఒకో గుడి ఒకో కాలంలో కడుతూ మొత్తం పన్నెండూ కట్టేశాకనే సీక్వెన్సు గ్రాఫ్ పూర్తి అయ్యింది.అదీగాక ఇవన్నీ స్వయంభూ లింగాలు,అంటే ముందుగా ఇక్కడొక ఆలయం కట్టాలని న్ర్ణయించుకుని శిల్పులతో చెక్కించి ప్రతిష్ఠ చేసినవి కావు!అవి అంతకు ముందే వ్యక్తమయి ఉంటే స్థలాన్ని వెతికి కనుక్కోవాలి, లేదా అవి స్వయంవ్యక్తం అయ్యేవరకు ఎదురు చూడాలి, వ్యక్తం అయ్యాక వాటినుంచి ఏవైనా సిగ్నల్స్ వస్తే వాటిని పట్టుకుని అక్కడ ఆలయనిర్మాణం చెయ్యాలి - తల్చుకుంటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి!అప్పుడు మహామేధావులైన మనవాళ్ళు ఏమి చేసారో మన కోడిమెదడుతో వూహించలేము గానీ వీటిల్లో ఏ పద్ధతి ఫాలో అయినా మొత్తం దేశమంతటా ఉన్న ఆలయ నిర్మాణాలు చేసేవాళ్ళ మధ్యన ఒక నిరంతర సమాచార ప్రవాహం ఉండి తీరాలి!ఎక్కడ ఏ ఆలయం కట్టాలన్నా మొత్తం దేశంలో ఉన్న అన్ని ఆలయాల గురించిన మొత్తం సమచారం కూలంకషంగా తెలియాలి,తెలుసుకునేవాళ్ళు,జ్ఞానాన్ని పంచుకునేవాళ్ళు!వాస్తవం ఇట్లా ఉంటే ఒక అలయంలో ఉన్న వింత మరొకదానిలో ఉండకపోవటానికి మన వెర్రి చరిత్రకారులు చేసిన విశ్లేషణ ఏమిటో తెలుసా, ఒక రాజ్యంలో ఎవరయినా శిల్పి ఒక అపురూపమైన ఆలయం నిర్మిస్తే మరొక చోట అలాంటిది కట్టకుండా అతన్ని చంపేసేవాళ్ళట!

     ఒక ఆలయం నిర్మించడం అంటే చీకట్లో ఒక్కడే కూర్చుని చేసే రహస్య భాగోతమా?ప్లాను గీసుకోవాలి,మేస్త్రీలకి పనులు అప్పగించాలి,కట్టేటప్పుడు తేడాలు వస్తే ప్లాను మార్చి కరెక్ట్ చేసుకోవాలి,అసలు తనకి సాధ్యం కాని సమస్య వస్తే వేరేచోట ఉన్న సీనియర్లని అడగాలి - ఇదంతా కట్టాక చంపేస్తారనే భయం ఉన్నవాడు చెయ్యగలిగిన పనులా!ఏ దేశంలోనూ ఏ జాతిలోనూ తమ దేశపు వెనకటి కాలంలోని వాళ్ళ గురించి ఇంత బూతులు రాసినవాళ్ళు లేరు - వీళ్ళ కన్నా ఇంగ్లీషువాళ్ళే నయం! 

చాయా సోమేశ్వరాలయం మిస్టరీ వీడటానికి ఇన్నేళ్ళు పట్టింది!

     సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోళులు (నల్లగొండ/నీలగిరి చోళులు) పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్బుతం.

     ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. ఛాయా సోమేశ్వర ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న చిన్న మండపాలు .... వీటి చుట్టూ మూడు గర్భగుడులు ఉన్న దేవాలయం ఉంటుంది. దీనినే 'త్రికూటాలయం' అంటారు.ఈ ఆలయానికి పడమర ఉన్నటువంటి గర్భగుడిలో శిలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చల ఛాయ, సూర్యుని స్థానముతో సంబంధం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పడడం ఈ ఆలయం సంతరించుకున్నటువంటి అద్భుతం. ఆ నీడ ఏ వస్తువుది అన్న విషయము కూడా ఇంతవరకూ అంతు చిక్కలేదు.

     దేవాలయం గర్భగుడి గోడపై గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్ధానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్ధానాన్ని మార్చుకోదు అనేది ఇప్పటివరకూ ఎవరికీ అంతుచిక్కని విషయం. అలనాటి నిర్మాణకౌశలం, శిల్ప నైపుణ్యం మరియు శాస్త్ర సిద్ధాంతాల మేళవింపుకు ప్రతీకగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు.

     ఆలయ మధ్యభాగంలో చతురస్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే, తూర్పు, పడమర, ఉత్తరాన మూడు గర్భగుడులు కలిగి ఉంది. అయితే మూడు గర్భగుడులు కూడా ఒకేరీతిగా ఉన్నప్పటికీ కేవలం పడమటి గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయను తిలకించగలము. ఆలయ శిల్పి నీడలను ఏర్పరచడానికి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణము చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం జరిగింది.

     అలాంటి పరిస్థితిలో సూర్యుని స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయ శిల్పి ఉద్దేశ్యము ప్రకారం ఛాయ నిశ్చలంగా ఉండాలంటే తూర్పు లేదా పడమర ఛాయలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని కలిపే తలము, తూర్పు నుండి పడమరకు సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉంటుంది. సూక్ష్మంగా వివరించాలంటే, పడమటి గర్భగుడి ముందు ఉన్నటువంటి కీలకమైన నాలుగు స్తంభాల నీడలు కలిసి ఏకఛాయలాగ ఏర్పడతాయి. ఈ ఛాయను మనము వెన్నెలకాంతిలో కూడా వీక్షించవచ్చు. ఏకనిశ్చలఛాయ ఏర్పాటులో అయిదు ప్రధానాంశాలు కీలకపాత్ర పోషిస్తాయి అవి ....

1 స్తంభాల మధ్య దూరం 

2 స్తంభాల నుండి గర్భగుడి వెనుక గోడ దూరం 

3 స్తంభాల నుండి కాంతిలోనికి ప్రవేశించే మార్గాల దూరం 

4 కాంతి జనకం (సూర్యుడు) ప్రయాణించే దిశ 

5 స్తంభాలతో కాంతి జనకాల స్థానం చేసే కోణం

     ఆలయానికి రాళ్ళతో కూడిన పునాదిని ఎంచుకోవడం ద్వారా శిల్పి భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాస్తవానికి పూర్వం గ్రామాలలో, పట్టణాలలో వివిధ కార్యాలకు అంటే వివాహాలకు, కచేరి, పండుగలు, మతకృత్యాలు మొదలైన వాటికి ఆలయాలే కేంద్రంగా ఉండేవి. కాబట్టి రాజులు వాటికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి నిర్మించేవారు. ఆలయాలకు భక్తులను రప్పించడానికి శిల్పులు ఏదో ఒక ప్రత్యేకతతో ఆలయాలను నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి నిశ్చలఛాయను అనుసంధానించారు.

     ఈ మధ్యనే సూర్యాపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పీజీకాలేజిలో పనిచేస్తూ సివిల్సుకి ప్రిపేర్ అవుతున్న శేషగాని మనోహర గౌడ్ మాయా,మంత్రం,మోసం,దగా లాంటివి ఏమీ లేకుండా కాంతిశాస్త్ర పరిజ్ఞానంతో సాధించవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపించారు.ఆరేడేళ్ళ క్రితం స్నేహితుడు ఈ ఆలయానికి తీసుకెళ్ళి చూపించి ఎలాగూ నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా,ప్రయత్నుంచి చూడమన్నాడు.అప్పట్నుంచీ ఆ గుడి మొత్తాన్నీ అబ్జర్వ్ చేసి ధర్మోకోల్ మోదల్ కట్టి కొవ్వొత్తుల్ని స్తంభాలుగా వాడి చీకటిగదిలో టార్చిలైటుని సూర్యుడిగా వాడి ఎట్టకేలకు అదే ఎఫెక్టుని సాధించి మిస్టరీని చేదించగలిగాడు.

     ఇందులోని అసలైన ట్రిక్కు కాంతి పరిక్షేపణం(Light Diffusion) అనే దృగ్విషయాన్ని ఉపయోగించుకోవటం.కాంతి విశ్వాంతరాళంలో ప్రయాణించేటప్పుడే కాదు భూమి వాతవరణంలో ప్రయాణించేటప్పుడు కూడా కొంచెం వంగుతుంది.ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు యొక్క ఉపరితలం మీద కూడా ఆ వస్తువుకి ఉండే గురుత్వాకర్షణ వల్ల ఆ వస్తువు వైపుకి కొద్దిగా వంగుతుంది.ఇది మెకాలే పండితుడి ద్వారా దేహం మాత్రం భారతదేశపు తిండి తింటూ పెరిగి బుద్ధిలో మాత్రం ఆంగ్లేయుల వలె ఆలోచించే విధంగా మార్చబడిన పరదెశపు బానిసలకి వారి యజమానులు చెప్పాకనే తెలిసింది గానీ మన దేశపు ఆలయ శిల్పులకీ ఆ ఆలయాల్ని సందర్శించే భక్తులకీ ఎప్పుడో తెలుసు!

అరసవిల్లికీ తిరువనంతపురానికీ మధ్యన ఉయ్యాల వూగుతున్న సూర్యదేవుడు.

     అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికీ బెంగుళూరు గావి గంగాధరస్వామి ఆలయానికీ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయానికీ ఒక విచిత్రమైన సంబంధం ఉంది.సూర్యగమన సిద్ధాంతం ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలకు తెలుసు.ఆ సూర్యగమన సిద్ధాంతం ఆధారంగా ఆలయవాస్తుని నిర్ణయించి చేసిన నిర్మాణాలు కావడం వల్లనే ఈ మూడు ఆలయాల మధ్య ఒక సారూప్యత ఏర్పడింది.సూర్యుడు రాశి మారే ప్రతి సమయంలోనూ ఒక సంక్రాంతి వస్తుంది. ప్రతి నెలా ఒక మాససంక్రాంతి వస్తుంది,అయితే కొన్ని ప్రత్యేకమైన సమయాలలో సూర్యకిరణాలు ఆలయంలోని అర్చామూర్తులపై ప్రసరించే విధంగా నిర్మించడం అప్పటి మనవారి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.అందువల్లనే ఈ మూడు ఆలయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

     అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యుని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. మార్చి 9 నుండి 12 వరకు(మేష సంక్రాంతి),అక్టోబరు 1 నుండి 3 వరకు(తుల సంక్రాంతి) ఉదయ సంధ్యలోని తొలి సూర్యకిరణాలు ఈ స్వామివారి పాదాలను తాకుతాయి. బెంగుళూరు గావి గంగాధరేశ్వరస్వామి ఆలయంలో కేవలం మకరసంక్రాంతి నాడు మాత్రమే స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి.తుల సంక్రాంతి నాడు తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయగోపురంలోని అన్ని ద్వారాల గుండా సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఆలయాన్ని నిర్మించారు.

     ఈ మేష, తుల సంక్రాంతులలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి.ఇలాంటి ప్రత్యెకమైన రోజులలో ఆ రోజుకు సంబంధించిన విశేషాన్ని తెలిపే విధంగా ఈ ఆలయాలని నిర్మించటానికి శిల్పులకూ స్థపతులకూ కాలమానం, కాంతిశాస్త్రం, వాస్తుజ్ఞానం అన్నీ తెలిసి ఉండాలి - అన్నింటికన్నా ప్రజలకి శాస్త్రీయతని పరిచయం చెయ్యాలనే ఉత్సాహం ఉండాలి!

చిదంబరం గొప్పదనాన్ని కీర్తిస్తున్నది హిందూమతతత్వవాదులు మాత్రమే కాదు!

     చిదంబరం, కాంచీపురం, శ్రీకాళహస్తి - ఈ మూడూ పంచభూతలింగ క్షేత్రాలు.సమస్త ప్రకృతికి ఆధారభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే ఈ పంచభూతాలలో భాగమై కనిపించని పరమేశ్వర తత్వాన్ని గ్రహింపజేయడానికా అన్నట్టు ఈ మూడు క్షేత్రాలూ ఉన్న స్థలాలలోని విశేషాన్ని గమనిస్తే మన పూర్వీకులు ఏ ఆలయాన్నీ ఏ విధమైన ప్లానూ లేకుందా ఎక్కడో ఒకచోట కట్టేద్దాం అనుకుని హడావిడిగా కట్టెయ్యలేదని తెలుస్తుంది. అలాగే దేశంలోని అనేకమైన ఆలయాలు దేశంలోని ఇతర ఆలయాలతో సంబంధం కలిగి ఉండటాన్ని గమనిస్తే ఆనాటికే వారిలో ఆధ్యాత్మికంగా ప్రజలని ఏకం చెయ్యాలనే తపన ఎంతగా ఉందో తెలుసుకోవచ్చును. పృధ్వీలింగమైన కంచి ఏకాంబరేశ్వర లింగం, ఆకాశలింగమైన చిదంబరం నటరాజ మూర్తి, వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వర లింగం ఉన్న ప్రదేశాల్ని గూగుల్ మ్యాపులో చూస్తే ఒకే సరళరేఖలా 79 డిగ్రీల 41 నిమిషాల లాంగిట్యూడ్ మీద ఉన్నాయి!

     మానవశరీరంలోని నవరంధ్రాలకు ప్రతీకగా చిదంబరం ఆలయానికి నవద్వారాలు ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మానవుడు ఒకరోజు చేసే ఉఛ్చ్వాసనిశ్వాసాల మొత్తం 21600(15X60X24=21600), ఈ ఆలయం పైకప్పు సరిగ్గా 21600 బంగారు పలకలతో తాపడం చేసి ఉంటుంది. ఈ 21600 పలకలను 72000 బంగారు మేకులు పట్టి ఉంచుతున్నాయి. అది మానవుని దేహంలోని నాడుల సంఖ్యకు సమానం.మన శరీరంలో ప్రసరిస్తూ కంటికి కనబడకుండా అంతర్లీనమై ఉన్న జీవశక్తియే అసలైన చిదంబర రహస్యం!ప్రాచీన కాలం నుంచి ఇలాంటి సత్యాలు ఎన్నెన్నో ఒకటొకటిగా తెలుస్తూ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి.

     పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిది సంవత్సరాలు పరిశోధించి చిదంబరం నటరాజస్వామి విగ్రహం ఉన్న స్థలం భౌమఅయస్కాంతక్షేత్రం యొక్క కేంద్రస్థానంలో ఉందని తేల్చిచెప్పారు.ఇదే విషయాన్ని తమిళ శాస్త్రవేత్త తిరుమూలార్ అయిదువేల యేళ్ళ క్రితమే నిరూపించినట్లు తెలుస్తున్నది. చిదంబరంలోని తిరుమందిరం తనలో ఇముడ్చుకున్న శాస్త్ర సాంకేతికమైన విషయాల్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం సామాన్యులకే కాదు శాస్త్రవేత్తలకి కూడా చాలా కష్టం - దాదాపు అసాధ్యం!

మార్కోపోలో కన్నా ముందే మనవాళ్ళకి ఆఫ్రికానర్స్ గురించి తెలుసు


     నిశితంగా పరిశీలిస్తే మహాబలిపురం అంతరిక్ష పరిశోధనలకు చాలా అనువుగా ఉంటుంది.ఇస్రో కూడా ఇలాంటి వాతావరణంలోనే ఉంది..ఇక్కడి దేవాలయాలు కూడా శిల్పకళ వల్లనే ప్రత్యేకమైనాయి తప్ప పుణ్యక్షేత్రాలుగా వీటికి ప్రాధాన్యత అంతగా లేదు.అప్పటి పల్లవరాజు అంతరిక్ష పరిశోధనలు జరిపించాడనేటందుకు గణేశరధంలో చాలా ఆధారాలు కంబడుతున్నాయి.పూర్వం ఇక్కడ ఏ ఆలయమూ లేదు.కేవలం యాభై సంవత్సరాల క్రితమే గణేశమూర్తిని ప్రతిష్ఠించి పూజాదికాలు ప్రారంభించారు.ఇక్కడి గోపుర శిల్పాలలో దేవతామూర్తులు లేకపోగా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక రాకెట్ లాంచింగ్ వెహికిల్,రాకెట్ లాంటి రూపాలు కనిపిస్తాయి.అవన్నీ ఇప్పుడు మనం ఇస్రోలో చూస్తున్న రాకెట్ లాంచింగ్ సిస్టం మాదిరిగానే ఉన్నాయి. గణేశరధం సమీపంలో ఉన్న ఒక ఖచ్చితమైన వృత్తాకారపు తొట్టి కూడా రాకెట్ లాంచింగ్ కోసం ఉపయోగపడే విధంగానే ఉంది.ఆలయం పైభాగంలో త్రిశూలంలా కనిపించే ఆకారం నిజానికి తలమీద రెండు కొమ్ములతో అలంకరించబడిన హెల్మెట్ ధరించిన ఒక మానవ శిరస్సు - ఇలాంటి హెల్మెట్ ధరించిన రూపాలు ఏ హిందూ దేవాలయపు శిఖరకలశంలోనూ మనం చూడము.ఈజిప్ట్ పిరమిడ్లలో కనిపించే స్ఫింక్స్ రూపాలను పోలిన సగం మానవ ఆకారం సగం సింహం ఆకారం కలిసిన సింహికలు కూడా ఇక్కడి శిల్పాలలో కనబడుతున్నాయి. గోపురం మీది శిల్పాలలో ఒక చోట యూరప్ జాతీయుడి ముఖం మరొకచోట ఆఫ్రికా జాతీయుడి ముఖం స్పష్టంగా గోచరిస్తాయి.

     మార్కోపోలో మన దేశానికి రావడానికి పూర్వమే ఈ శిల్పాలలో ఇతర దేశీయుల రూపాలు కనబడడం చూస్తే అప్పటికే మన దేశస్థులకు ఇతర భూఖండాల వారితో సంబంధాలు ఏర్పడిన విషయం నిర్ధారణ అవుతున్నది.ఇక్కడ మరొక విశేషం శ్రీకృష్ణుని వెన్నముద్ద అని పిలిచే ఒక వింత రాయి.

     సుమారు 20 అడుగుల పొడవు,వెదల్పు,ఎత్తు గల ఈ రాయి అసలే ఏటవాలుగా ఉన్న కొండమీద భూతలంతో 40 డిగ్రీల కోణంలో వాలిపోయి కిందవున్న రాతినేలను కేవలం రెండు చదరపు గజాల మేర మాత్రమే తాకుతూ నిలబడి చూపరులకు ఆశ్చర్యాన్నీ భయాన్నీ కలిగిస్తున్నది.చూడటానికి ఆనించినట్టు కనబడుతున్న ఈ 250 టన్నుల బరువైన రాయి పెనుగాలులకి కూడా కదలకుండా నిలబడి ఉండటం నిజంగా అద్భుతమే! క్రీ.శ 1908లో ఆర్ధర్ లాలీ అనే బ్రిటిష్ అధికారి ఇది చాలా అపాయకరంగా ఉందని తొలగించడానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులను కట్టి ఏడు ఎనుగులతో లాగించాలని చూసినా దానిని కదిలించలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ఒక కధనం ఉన్నది. ఇలాంటి రాళ్ళు పెరూలోని మాచుపిచులోనూ, కొన్ని మెక్సికన్ నగరాలలోనూ, ముఖ్యంగా గ్రహాంతరవాసులకి సంబంధించిన కధలు ప్రచారంలో ఉన్నచోటనే కనపడుతున్నాయి.


ఒకానొకప్పుడు సోమనాధ లింగం గాలిలో తేలుతూ ఉండేదని మీకు తెలుసా!

     13వ శతాబ్ధపు అరబ్ భూగోళశాస్త్రవేత్త జకారియా అల్ క్వాజ్విని వ్రాసిన "వండర్స్ ఆఫ్ తింగ్స్ క్రియేటెడ్ అండ్ మార్వెల్స్ ఆఫ్ తింగ్స్ ఎగ్జిస్టెడ్" వ్రాతల సారాంశం కింద ఇవ్వబడింది. ఇది సోమనాధ్ ఆలయ వివరణ మరియు దాని ధ్వంసం గురించి వివరిస్తుంది. ‘సోమనాధ్: భారతీయుల చేత పవిత్రక్షేత్రంగా భావించబడి సముద్రతీరాన ఉపస్థితమైన క్షేత్రం సోమనాధ్. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం. ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత. హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధానదైవమఇన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగరూపంలో నిలిచి ఉండడం ఒకవేళ ముసల్మాన్ కాని నాస్థికుడు కాని ఎవరికైనా ఒక వర్ణించ లేని అద్భుతం. చంద్రగ్రహణ కాలంలో లక్షకంటే అధికులైన హిందువులు ఇక్కడకి పవిత్రయాత్రార్ధం రావడం ఆనవాయితీ.

     ఎప్పుడైతే సుల్తాన్ యామిను డి దౌలా మహ్ముద్ సుబుక్తిజిన్ భారతదేశం మీద మతపరమైన దండయాత్ర చేసాడో ఆయన సోమనాధ్‌ను స్వాధీనపరచుకొని ధ్వంసం చేయడానికి గొప్ప ప్రయత్నం చేసాడు. అందువలన హిందువులు ముహమ్మదీయులుగా మారతారని విశ్వసించబడింది. ఫలితంగా వేల మంది హిందువులు బలవంతంగా ఇస్లామ్ మతానికి మార్చబడ్డారు. ఆయన అక్కడికి 416 ఎ హెచ్ (ఎ డి 1025 డిసెంబర్)లో వచ్చాడు. రాజు ఈ లింగరూపాన్ని చూసి విస్మయం చెందాడు. తరువాత ఇక్కడి నిధులను మళ్ళించడానికి పడగొట్టడానికి అదేశాలు జారీచేసాడు. అక్కడ గొప్ప ప్రముఖల చేత ఆలయానికి దానంగా ఇవ్వబడిన అనేక స్వర్ణ మరియు రజత విగ్రహాలు, ఆభరణాలతో నిండిన పాత్రలు కనుగొనబడ్డాయి. ఆలయంలో కనుగొనబడిన వస్తువుల విలువ 20 వేల దినార్లకు పైబడి ఉంది.’ - ఈ విధంగా మొత్తం హిందువుల ఆలయాల నుంచి ఎంత స్థాయిలో సంపద కొల్లగొట్టారో తెలుసుకుంటే హృదయమున్న ప్రతివారికీ భారతదేశం మీద అపారమయిన జాలివేస్తుంది!

     ఒక విదేశీయుడు,అదీ వాళ్ళ మతస్థుడే వాళ్ళు చేసింది మతయుద్ధమే అని ఢంకా బ్జాయించి చెప్తుంటే మన ప్రగతిశీల చరిత్రకారులు మాత్రం "అబ్బెబ్బే!వాళ్ళు ఆలయాల్లో ఉన్న సంపదని దోచుకుపోవడానికే వచ్చారు,అవి మతయుద్దాలు కావు కావు కావు కావు.హిందూ రాజులు మాత్రం యుద్ధాలు చెయ్యలేదా?వాళ్ళూ అంతే!" అని దోచుకున్న పరాయివాళ్ళని సపోర్టు చేస్తూ వాళ్ళ చేతుల్లో దెబ్బతిన్న సొంతవాళ్ళని దబాయించడం చూస్తుంటే  వాళ్ళు అందరు మనుషుల్లాగే పుట్టి పెరిగినవాళ్ళేనా,లేక చిన్నప్పట్నించీ అశుద్ధం లాంటిది ఏదయినా తిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదని ప్రమాణం చేసుకుని అబద్ధాలు మాత్రమే చెప్పి ఎదటివాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనే దుగ్ధతో పెరిగి అలా తయారయ్యారా అని నాకు అనుమానంగా ఉంది.

     అన్నిసార్లు కొల్లగొట్టినా అతి తక్కువ కాలంలోనే మళ్ళీ అంత సంపద సృష్టించగలిగిన హిందువులు ఆలయాల్ని రక్షించుకోవటంలోనూ అన్యాయానికి గురికాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవటంలోనూ మాత్రం పూర్తిగా వెనకబడిపోయిన వివేకశూన్యులు - ఇప్పటికీ బుద్ధి రాని మొద్దురాచిప్పలు!

     ఒకనాడు తరగని సిరిసంపదలతో తులతూగి మొత్తం రాజ్యాన్ని కూడా ఒంటిచేతి మీద పోషించగలిగిన ఆలయాలు ఇవ్వాళ అందులో పనిచేసే పూజారులకి జీతాలు కూడా ఇచ్చుకోలేని  దుస్థితికి దిగజారడానికి కారణం ఏమిటి?ఇవ్వాళ మనం భక్తిగా కళ్ళు విప్పార్చి చూస్తున్న చాలా దేవాలయాల్లోని అర్చామూర్తులలో ఎన్ని అసలువో ఎన్ని నకిలీవో ఎవరికయినా తెలుసా!అన్ని ఈతర మతాలకి సంబంద్జించిన ఆలయాల్ని పూర్తి అటాన్మస్ స్టేటస్ ఇచ్చి వారి వారి మతస్థుల అధీనంలో వదిలేసి హిందువుల ఆలయాల్ని మాత్రమే ఎందుకు ప్రభుత్వనిర్వహణలో ఉంచవలసి వచ్చింది?ఆలయాల్ని పరిరక్షించడానికి అని చెప్తే జీతాలు ఇవ్వకపోవడాన్ని చూసినా అర్చామూర్తులు స్మగుల్ అవడం చూసినా అది అబద్ధం అని తెలిసిపోదా?ప్రభుత్వం తరపున ఆలయాల మీద పడి తింటూ పేను పెత్తనం వెలగబెడుతున్న ఎండోమెంట్ అధికార్లకి అందుతూనే ఉన్నాయిగా, మరి పూజారులకి జీతాలు ఇవ్వడానికి ఏడుస్తున్న ప్రభుత్వాలు వాటిని ఏమి రక్షిస్తున్నట్టు?మిగతా అన్ని శాఖలకి సంబంధించిన వాటినీ కాస్త మెయింతెనెన్స్ అకష్తమైతే చాలు వేఅలమేసి మరీ ప్రైవేట్ సెక్టారుకి అప్పగించగెసిన వాళ్ళు అబ్కారీ శాఖనీ ఎండోమెంట్సు శాఖనీ వదలటం లేదు, ఎందుకని?

     ఎక్కడ విగ్రహాల స్మగ్లింగ్ కేసు బయటపడినా ఆలయానికి సంబంధించిన ఎండోమెంట్స్ ఉద్యోగికి ఖచ్చితంగా సంబంధం ఉంటున్నది!వీళ్ళు ఒక అలయంలో డ్యూటీకి దిగిన మరుక్షణం నుంచీ అర్చామూర్తి వీళ్ళకి బెల్లం ముక్కలా కనపడుతుంది కాబోలు!తిరుమలలో జరిగుతున్న వూవహారాలు చూస్తుంటే హియ్యర్ స్వామి సన్యాసి గాబట్టి క్లబ్బు అని సరిపెట్టేశాడు గానీ వీఐపీలకి పక్కలేసే బ్రోతల్ హౌవుసు స్థాయికి దిగజార్చారు దొంగ నా కొడుకులు!ఇవ్వాళ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే:

"దొంగలంజకొడుకులు అధికారం పల్లకీని ఎక్కారు,
దొంగలదోపిడి గాడిదగత్తర బతుకిచ్చి ప్రజల్ని బోయీల్ని చేశారు -
డెబ్బయ్యేళ్ళ తర్వాత పోలిస్తే వీళ్ళకన్నా ఇంగ్లీషోళ్ళే నయమనిపిస్తున్నారు - చీచీ!"

     లేకపోతే ఎంటిది?లెక్క పెట్టి శిశుపాలుడి కంటే పది తప్పులు ఎక్కువ చేస్తూ కూడా సరిచేసుకుంటాం అని చెప్పి కూడా దున్నపోతుల్లా చలనం లేకుండా ఉన్నారంటే "ఈ కలియుగంలో వైకుంఠవాసుడు స్తంభాన్ని చీల్చుకుని వస్తాడా పెడతాడా?ఎన్ని తప్పులు చేసినా మనల్ని శిక్షించగలిగిన వాడెవడూ లేడు!" అనే ధైర్యం కాదూ వాళ్ళది.ఇవ్వాళ ఈ భూప్రపంచంలో దేవుడు లేని చోటు ఏదయినా ఉందంటే అది తితిదే వారి బోర్డు కార్యాలయమే!అది విస్తరించి గర్భగుడి వరకూ వెళ్ళిందంటే గోవిందో గోవిందా!!

     మామూలు భక్తులు అంత కష్టపడి దూరాభారం అనుకోకుండా వస్తుంటే ఒక సెకను సేపయినా చూడనివ్వరు,మొండిగా నెట్టేస్తారు,వీఐపీలని మాత్రం గంటల తరబడి కూర్చోనిస్తారు - పూజార్లు పాలేర్ల మాదిరి వీఐపీల గుమ్మాల దగ్గిర పడిగాపులు పడటం!ఇది నిజంగా దేవాలయమేనా?ఎప్పుడూ అక్కడ తిరిగే మనుషుల్ని కూడా నీతిగా ఉంచలేనప్పుడు అక్కడున్న మూలవర్ ఉత్త బొమ్మే కదా!భక్తి అంటేనే ఇంద్రియ నిగ్రహం.మరి తప్పులు చేస్తున్నాం అని ఒప్పుకుని సరిదిద్దుకుందాం అని లెక్చర్లు కూడా దంచి మన్నుతిన్నపాముల్లా పడిఉండటం అంటే బద్ధకమా?నిర్లక్ష్యమా?పొగరా?

     ఇవ్వాళ తిరుమలేశుడి భక్తులకి రెండే రెండు దార్లు - చిన జియర్ స్వామిలాగే తిరుపతి వెళ్ళకుండా ఉండటం,వెళ్తే "ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా?ఉంటే మిమ్మల్నెందుకు మార్చలేకపోతున్నాడు?" అని నిలదీసి అడగటం.ఆయనే చూసుకుంటాడులే అనుకోవటానికి ఆలయాలు కట్టమని ఆయన అడిగాడా?మనం తిరుగాడుతున్న ఈ భూమండలంతో పాటు అనేకానేక పాలపుంతల్నీ కృష్ణబిలాల్నీ అనంతకోటి వ్శ్వాల్నీ కుక్షిలో దాచుకున్న బ్రహ్మాండ నాయకుడు తన సృష్టిలో ఏ వంతులో ఉందో తెలియని ఈ పిసరంత భూమి మీద కట్టిన గవ్వకు సాటిరాని ఈ గుడిలో ఏదో అనర్ధం జరిగినట్టు పరిగెత్తుకురావల్సిన అవసరం ఆయన కేమిటి?మన నిష్ఠ కోసం మన నమ్మకం కోసం మన సాధన కోసం  మనం కట్టుకున్నవి గనక మనమే బాగు చేసుకోవాలి.అసలైన దరిద్రం ఏంటటే, మనం ఇంత గట్టిగా సంప్రదాయం పాటించమనీ జరుగుతున్నాయని వాళ్ళే ఒప్పుకున్న అనాచారాల్ని ఆపమనీ ఒత్తిడి పెట్టాల్సి వస్తున్నది హిందూమతం అంటే ఏంటో తెలియని నాస్తికుల్ని కాదు, తాము పాటించి మనకి పాటించమని చెప్పాల్సిన ఆలయనిర్వహణలో ఉన్నవాళ్ళని - ఇంతకన్నా నికృష్టం ఎక్కడైనా ఉంటుందా?

     అన్ని చోట్లా ఇలాగే ఉంది కాబట్టి అన్ని ఆలయాల్నీ ప్రభుత్వం పెత్తనం నుంచి లాగేసుకుని మనమే నడుపుకోవాలి.హిందువుల సామాజికార్ధికాధ్యాత్మిక విషయాలన్నీ ఆలయంతో పెనవేసుకుని ఉన్నాయి - అవి పరహస్తగతం కావడం వల్లనే అణగారిపోయింది దేశం!  మైనారిటీల హక్కులి రక్షించటానికి మెజార్టీ ప్రజల హక్కుల్ని భక్షించాలా - ఇదేమి సెక్యులరిజం?ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ఒప్పుదలతో అధికారం చేపట్టి అందరి సౌభాగ్యం కోసం కృషి చెయ్యటం అనే నిర్వచనం ఉందని తెలిసి కూడా మెజారిటీ ప్రజల్ని మతతత్వవాదులు,జాత్యహంకారులు అని తిటిపొయ్యటం ఇక్కడే చూస్తున్నాం - ఎదవ సెక్యులరిజం!ఆరోజున ఒప్పుకున్నవాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారో తెలియదు గానీ ఈరోజున హిందువులు తమ ఆలయాల్ని ప్రభుత్వ పెత్తనం నుంచి లాక్కోవటానికి అంతర్యుద్దం చ్గేసినా తప్పు లేదు. ఎప్పటికయినా సాధించాల్సింది అదే గానీ ప్రస్తుతం అంత సాహసం చెయ్యలేం అనుకుంటే కనీసం చిన జియర్ స్వామికి మద్దతుగా నిలబడినా చాలు.


స్వస్తి
-----------------------------------------------------------------------------------------------------------------
P.S:పైన చెప్పిన ఆలయాల గురించి మరింత ఎక్కువగా తెలుసుకుని ప్రయోజనం పొందాలని అనుకుంటే శ్రీకృష్ణ తెలుగు క్యాలెండర్ అనే యాండ్రాయిడ్ యాప్ మీ మొబైల్ ఫోనులో గానీ యాండ్రాయిడ్ ద్వారా పనిచేసే ఎందులో అయినాసరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

48 comments:

  1. Really nice information summarized with good explanation. Thank you for the good read, Hari garu.

    ReplyDelete
  2. 750 Year Old Sundial at Konark, India - Moondial too?

    https://www.youtube.com/watch?v=K9RF9lLBIMs

    Samkhya : The arithmetic of nature's evolution




    http://the-redpill.blogspot.in/2010/04/samkhya-arithmetic-of-natures-evolution.html

    మేరు పర్వతం – మనిషి అంతరంగం

    http://tinyurl.com/o8csfal

    ReplyDelete
    Replies

    1. Nikola Tesla and Swami Vivekananda
      _____________________________________

      Nikola Tesla, the great scientist who specialized in the field of electricity, was much impressed to hear from the Swami his explanation of the Samkhya cosmogony and the theory of cycles given by the Hindus. He was particularly struck by the resemblance between the Samkhya theory of matter and energy and that of modern physics.
      Swami Vivekananda, late in the year l895 wrote in a letter to an English friend, “Mr. Tesla thinks he can demonstrate mathematically that force and matter are reducible to potential energy. I am to go and see him next week to get this new mathematical demonstration. In that case the Vedantic cosmoloqy will be placed on the surest of foundations. I am working a good deal now upon the cosmology and eschatology of the Vedanta. I clearly see their perfect union with modern science, and the elucidation of the one will be followed by that of the other
      Tesla apparently failed in his effort to show the identity of mass and energy.Swamiji seems to have sensed where the difficulty lay in joining the maps of European science and Advaita Vedanta and set Tesla to solve the problem. It is apparently in the hope that Tesla would succeed in this that Swamiji says “In that case the Vedantic cosmology will be placed on the surest of foundations.” Tesla apparently failed to show the identity of energy and matter. If he had, certainly Swami Vivekananda would have recorded that occasion. The mathematical proof of the principle did come until about ten years later when Albert Einstein published his paper on relativity. What had been known in the East for the last 5,000 years was then known to the West
      The meeting with Swami Vivekananda greatly stimulated Nikola Tesla’s interest in Eastern Science. The Swami later remarked during a lecture in India, “I myself have been told by some of the best scientific minds of the day, how wonderfully rational the conclusions of the Vedanta are. I know of one of them personally, who scarcely has time to eat his meal, or go out of his laboratory, but who would stand by the hour to attend my lectures on the Vedanta; for, as he expresses it, they are so scientific, they so exactly harmonize with the aspirations of the age and with the conclusions to which modern science is coming at the present time
      ___________

      పూర్తి వివరాల కొరకు ఈ క్రింది వెబ్సైట్ చూడవచ్చు.
      http://www.teslasociety.com/tesla_and_swami.htm

      Delete
  3. స్థూలమైన విశ్వానికి సూక్ష్మ రూపం వ్యక్తి. అయితే ఈ స్థూల-సూక్ష్మ రూపాల స్వరూపం మాత్రం ఒక్కటే. ఈ అద్వైత స్వరూపాన్ని మనకే దర్శనం చేయించేవి ఆలయాలు

    ఆలయ నిర్మాణం చేబట్టే ముందు, ఆలయం నిర్మించబోయే ప్రదేశంలో మహాత్ముల చరిత్రలు పఠనం, పవిత్ర ఆధ్యాత్మిక ధార్మిక గ్రంధాల అధ్యయనము, మహాత్ముల ఆశీస్సులు, సామూహిక జప ధ్యానాలు కొంతకాలం పాటు జరగాలి. నిత్యా సత్సంగ స్వాధ్యాయ ప్రవచనాల పట్ల ఆ ప్రాంతంలో స్థానిక ప్రజలకు శ్రద్ధాసక్తులు కలగాలి. ఆలా జరుగుతుంటే క్రమంగా ఆ కేంద్రమే దేవాలయంగా పరిణితి చెందుతుంది. ఇది సాధించకుండా, దేవాలయ నిర్మాణానికి పూనుకుని, చందాలు దండిగా దండి, దండగ చేయటం నిషిద్ధ కార్యమే అవుతుంది. ఇదే ఆగమశాస్త్రాలలో ఆలయ నిర్మాణానికి ముందు చేయవలెనని చెప్పబడ్డ స్థలశోధన స్థలశుద్దిలోని ఆంతర్యం.

    తన పట్ల, దైవం పట్ల, సాటి మానవులపట్ల సరైన అవగాహనను సమాజంలో కల్పించటానికి ప్రయత్నించక ఆలయాలు నిర్మిస్తే ఆ దేవాలయ రాతి కట్టడాలు స్వార్థం తో కరుడు గట్టిన మనిషి హృదయాలకు ప్రతీకలుగా మాత్రమే నిలుస్తాయి. ఉన్నత సంస్కారాలనే విద్యాప్రణాళికతో ఆత్మవిద్యకు బళ్ళుగా మన పెద్దలు రూపొందించిన ఈ గుళ్ళు, కులాల కుళ్లుకు మతాల మళ్ళుకు లోగిళ్ళు కారాదు.

    మేలుకొలుపు- బాలభోగం దగ్గరనుండి, ఆరగింపు-పవళింపు సేవల దాకా షోఢశోపచారాలు జరిపించడం మాత్రమే కాదు దైవం పట్లే శ్రద్ధ వహించడమంటే. దైవం ధర్మ స్వరూపం స్వాధ్యాయప్రవచనాలతో కూడిన ధర్మ ప్రచారానికి సంస్కరణకు దేవాలయం సాధనం కావలి. లేకపోతే ఈ నాడు మనం చూస్తున్నట్టు దేవాలయాలు ధనిక స్వాముల అధికారపాటవా ప్రదర్శనశాలగా కుళ్ళు కూలతత్వపు కురుక్షేత్రాలుగా, అసంతృప్త ముఠారాజకీయవాదుల అధికార పునరావాస కేంద్రాలుగా, యాత్రాస్థలాలుగా, మూఢాచారాల మత్తుమందించే మతం బ్రాండు పానశాలలుగా సినీ గీతాల జ్యూక్ బాక్సులుగా పెళ్ళిమంటపాలుగా మొక్కుబళ్లు తీర్చే క్షౌరశాలలుగా మారక తప్పవు.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. నువ్వే సైంటిఫిక్ అంటావ్, నువ్వే చంద్రుడు ప్రతిష్టించాడంటావ్.
    విదేశీయుడు మనం గొప్పవాళ్ళమని చెప్పాడంటావ్. మనం విదేశీయుల్ని గొప్పోళ్ళంటే తట్టుకోలేవ్.
    వాటిల్లో ఆఫ్రికన్, యూరోపియ కలలు కనిపించాయి కాబట్టి మనకు వాళ్ళతో సంబంధాలున్నాయంటావ్. మనం అక్కడనుంచే వొచ్చాం కాబట్టి మనకు వాటిమీద నాలెడ్జి వుందంటే తట్టుకోలేవు.
    ఏం రాసినా రెడీ మేడ్ భట్రాజులెలానూ వున్నారు కాబట్టి, శభాసో శభాసు

    ReplyDelete
    Replies
    1. Do you have any clarity in your own comment?
      Why do you confuse about spiritual matters and unnneccesorily jumble quite unrelated topics!

      Delete
    2. @Anonymous11 November 2016 at 03:49
      నువ్వే సైంటిఫిక్ అంటావ్....కాబట్టి మనకు వాటిమీద నాలెడ్జి వుందంటే తట్టుకోలేవు.

      haribabu:First mind your language,manners less brute!

      Delete
    3. @haribabu:First mind your language,manners less brute!

      అర్ధం కాని వాడు తిరిగి తిరిగి అడుగుతాడు. చాతగానితనం వొప్పుకోలేని వాడు ఇలాంటివాటికి దిగజారతాడు.

      Delete
    4. @Anonymous11 November 2016 at 04:20
      అర్ధం కాని వాడు తిరిగి తిరిగి అడుగుతాడు. చాతగానితనం వొప్పుకోలేని వాడు ఇలాంటివాటికి దిగజారతాడు.

      haribabu:ఒకవైపున చంద్రుడి వ్యాసార్ధం కొల్వడమూ చంద్రుడికీ భూమికీ మధయ ఉన్న దూరం డెసిమల్ పాయింట్లతో సహా లెక్క కటటమూ ఇకద క్రీస్తు పూర్వమే జరిగుందనేఎ అదే సమయంలో క్షీరసాగర మధనంలో చంద్రుడిఊ,లక్ష్మీదేవీ పుట్టుకొచ్చారనే కధలు చెప్పుక్ని ఆనందించదమూ - ఎక్కడ కల్పనకు పెద్దపీట వేసి ఆహ్లాదం పొందాలో ఎక్కద వాస్తవాన్ని గౌరవించి ప్రయోజనం పొందాలో తెలుసుకోవదమూ జరిగిందని తెలిస్తే మళ్ళీ మళ్ళీ తింగరి ప్రశ్నలు వెయ్యాల్సిన అవసరం ఉండదు.

      వ్యక్తిగతంగా గానీ సంస్కృతి పరంగా గానీ ఏనాడూ నేను విదేశీయులని అవమానించలేదు,అయినా వాళ్లని పొగిడితే నువ్వు ఒప్పుకోవు అని అనడం ఏంటి?నేను చెప్పిన విషయాల్లో అబద్ధం ఏమైనా ఉందా?నిజాలు చెబితే ఒప్ప్పుకోలేని మనస్తత్వంలో ఉన్నది ఎవరు?

      Delete
  6. @haribabu:ఒకవైపున చంద్రుడి వ్యాసార్ధం కొల్వడమూ చంద్రుడికీ భూమికీ మధయ ఉన్న దూరం డెసిమల్ పాయింట్లతో సహా లెక్క కటటమూ ఇకద క్రీస్తు పూర్వమే జరిగుందనేఎ అదే సమయంలో క్షీరసాగర మధనంలో చంద్రుడిఊ,లక్ష్మీదేవీ పుట్టుకొచ్చారనే కధలు చెప్పుక్ని ఆనందించదమూ - ఎక్కడ కల్పనకు పెద్దపీట వేసి ఆహ్లాదం పొందాలో ఎక్కద వాస్తవాన్ని గౌరవించి ప్రయోజనం పొందాలో తెలుసుకోవదమూ జరిగిందని తెలిస్తే మళ్ళీ మళ్ళీ తింగరి ప్రశ్నలు వెయ్యాల్సిన అవసరం ఉండదు.

    ఇంకా అర్ధంకాలేదా తింగరితనం అంటే ఇదే అని

    @వ్యక్తిగతంగా గానీ సంస్కృతి పరంగా గానీ ఏనాడూ నేను విదేశీయులని అవమానించలేదు,అయినా వాళ్లని పొగిడితే నువ్వు ఒప్పుకోవు అని అనడం ఏంటి?

    "ఒక విదేశీయుడు,అదీ వాళ్ళ మతస్థుడే వాళ్ళు చేసింది మతయుద్ధమే అని ఢంకా బ్జాయించి చెప్తుంటే మన ప్రగతిశీల చరిత్రకారులు మాత్రం "అబ్బెబ్బే!వాళ్ళు ఆలయాల్లో ఉన్న సంపదని దోచుకుపోవడానికే వచ్చారు,అవి మతయుద్దాలు కావు కావు కావు కావు.హిందూ రాజులు మాత్రం యుద్ధాలు చెయ్యలేదా?వాళ్ళూ అంతే!" అని దోచుకున్న పరాయివాళ్ళని సపోర్టు చేస్తూ వాళ్ళ చేతుల్లో దెబ్బతిన్న సొంతవాళ్ళని దబాయించడం చూస్తుంటే వాళ్ళు అందరు మనుషుల్లాగే పుట్టి పెరిగినవాళ్ళేనా,లేక చిన్నప్పట్నించీ అశుద్ధం లాంటిది ఏదయినా తిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదని ప్రమాణం చేసుకుని అబద్ధాలు మాత్రమే చెప్పి ఎదటివాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనే దుగ్ధతో పెరిగి అలా తయారయ్యారా అని నాకు అనుమానంగా ఉంది."


    ReplyDelete
    Replies
    1. Do yo think I am blindly criticizing any gentleman here?On the other side I am praising him for being impartial and recording truthabout his king in an unbiased attitude,I condemn only those Indian communists for telling lies and sabotaging history of their motherland!
      Do you think it also as spitting venom on some innocent fellow?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  7. @I condemn only those Indian communists for telling lies and sabotaging history of their motherland!

    Pt1: I need clarification in this.

    Only communists are saying this or you are calling one and all, who tell like this communists? Please broaden your view.

    Pt2:@ఎక్కడ కల్పనకు పెద్దపీట వేసి ఆహ్లాదం పొందాలో

    ఇవన్నీ కల్పనలనుకున్నప్పుడు ఈ గుడులతో పనేంటి? మన కల్పనలకతీతమైనదేమిటో వుంది వీటిల్లో. మీరు చెప్పిన ఫెబోనకి తియరీ ప్రకారం, వాటిని కల్పనలలో ఆనందించడానికి కాకుండా అలా చెయ్యడంలో సైంటిఫిక్ రీసన్ కనుక్కుంటే మన గొప్పతనం, దానితోబాటు వాటివల్ల వుపయోగం కూడా తెలుస్తాయి. అంతేగాని, అవి అలా వొచ్చాయి కాబట్టి మనకు సైన్సు తెలుసు అనడంలో ఏమాత్రం అర్ధం లేదు.

    వాత్సవాన్ని తట్టుకోలెనప్పుడో, ఒప్పుకోలేనప్పుడో కళ్ళు మూసుకోని కల్పనా జగత్తులోకి వెళ్ళిపోతాం/కళ్ళుమూపించి పంపుతాం.

    ReplyDelete
  8. Your ignorance is in very poor level.that's why you are I'm confusion and mocking me with "nuvvae chandrudu..." type silly logic!why because those western cultures from which you see thinking that persons without blind beliefs were born had "fantasy","fiction",science fiction" and so many legends like clash of the titans,do you know nythinganout them?Still their moviemaking are making films like Jack and the bean stalk,clash of the titans and so many. Do you think rowling invented all the fantastic creatures like unicorn and all?
    When the people you believe are so rational had such fantadies why do you spit that much venom here?
    We know where Stover line between these two things and we are living in unreasonable life style,you need motto have sympathize on us.
    Knowledge has levels,defeatededefinitely!even though you could understand basics of relativity with the introductory lessons in 10th standard, that's not all the content you know?
    Your problem is you don't want Tibetans the knowledge and Centro know every thing/or you are thinkingbthst you know every thing which is enough to mock haribabu.
    I KNOW WHAT YOU DID LAST SUMMER:-)

    ReplyDelete
  9. The question you are asking about clarification also is confusing- is it your signature style to think in such a meaningless way?I have emphasized on telling lies about a country/culture,I don't bother whether it is one's motherland or not.
    THAT means I am hating about telling lies.It Panthers in my statement and you need clarity because you could not decider it.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. @western cultures from which you see thinking that persons without blind beliefs were born had "fantasy","fiction",science fiction" and so many legends like clash of the titans

    I agree with u. since they are supporting fantasies, let's also do the same. I am convinced with your great way of convincing me/others Mr.Hari Babu

    ReplyDelete
    Replies
    1. So my dear friend,
      You could agree with us only after you were enlightened by me that westerners also supporting fantasies:-)
      And you are criticizing us before you knew that - why that blind inclination to western cultures?!

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  12. బాబుగారూ!
    సారంగలో ముందడుగు ఇది అనే వ్యాసంలో రచయిత్రి ముస్లిం పర్సనల్ లా బోర్డు గురించి చాలా గొప్ప ఔదార్యంతో పొగిడారు. ఆర్. ఎస్. ఎస్. ని తిట్టారు. (వ్యాఖ్యలలో)
    స్పందించవలసిన అగత్యం కనబడుదోంది. ఉపక్రమించగలరు.
    Hatred, Rigidity నిండిన ఈ వ్యాసాన్ని ఖండించగలరు.

    ’’ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడూ కూడా స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడలేదు, పని చేయలేదు, హిందూ కోడ్ బిల్ ని వ్యతిరేకించిన వారిలో జన సంఘ్ వారు ప్రముఖులు. ఈ హిందూ ఛాందస వాదుల వారసత్వాన్ని ఈ విషయంలో మనం ఇప్పటికీ కావాల్సినంత ప్రశించలేదు. వీరు ఇప్పటికీ గుళ్ళల్లో స్త్రీలు ప్రవేశించటాన్ని వ్యతిరేకించే ముఠాలని సమర్థిస్తారు; కుల పరమయిన వివక్ష ని బీఫ్ బాన్ పేరుతో ప్రోత్సహిస్తారు; కులాంతర, మతాంతర వివాహాలని రక రకాల పేర్లతో అడ్డుకుంటారు, లేదా అడ్డుకునే వారిని ప్రోత్సహిస్తారు.

    దీనికి భిన్నంగా ముస్లిం పెర్సనల్ లా బోర్డు కి చెందిన వారిలో, మరియు రాజకీయ నాయకులలో అనేక మంది ప్రగతి శీల మత పెద్దలు ఇది వరకు వున్నారు, ఉంటూనే వున్నారు. అత్యధిక ముస్లిం స్త్రీలకి తమ సమాజాలే, కుటుంబాలే పెద్ద దిక్కు, వారికి కావలసినంత చదువు, ఉద్యోగాలు ఇవ్వకుండా అట్టి పెట్టింది, వారి మతమో లేక వారి సమాజం కాదు, లౌకిక మని చెప్పుకున్న స్వాతంత్రానంతర భారత ప్రభుత్వం. కావాల్సినన్నిస్కూళ్ళు, కాలేజీలు పెట్టక, చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వక ఆ సమాజాల్ని మతపరమైన వివక్ష తో ఈ అరవయ్యేళ్ళ నుండి వెనక బడేటట్లు, ఆయా స్త్రీలకి ఏ దారులు లేకుండా చేస్తున్నది భారత ప్రభుత్వ విధానాలే. పైగా వారిపై భౌతిక దాడులు, వారి అస్తిత్వంపై దేశ భక్తి పేరుతో భావజాల పరమయిన దాడులు చేస్తున్నది ఆర్ ఎస్ ఎస్ మరియు వారి స్నేహితులే.

    భారతీయ ముస్లింల వంటి అణగదొక్క బడిన సమూహాన్నీ, ఆర్ ఎస్ ఎస్ ని ఒకే గాటన మనం ఎప్పుడూ కట్టకూడదు. ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన సత్యం ఏమిటంటే, ఏ సమూహాల నయితే మెజారిటీ సమాజాలు అణగదొక్కుతాయో వాటిలోని స్త్రీలు ఇంకా నిస్సహాయులుగా తయారవుతారని. జకియా సుమన్ కి ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ నుండి వ్యక్తమయిన వ్యతిరేకత ముస్లిం స్త్రీలని, వారి సమాజాలకి దూరంగా, వేరుగా ఉద్దరించాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్న అవకాశం వాద ప్రయత్నాల్ని ధిక్కరించటమే. అటువంటి ప్రయత్నాలు తమకి, తమ సమాజాలకు పనికిరావని, కేవలం మెజారిటీ సమూహాల చీత్కారానికి తమని గురి చెయ్యటానికి మాత్రం పనికొస్తాయని వారి ఆందోళన. దానిని అర్ధం చేసుకోవటానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే నా వ్యాసం.

    మన విమర్శ ముస్లిం స్త్రీల పోరాటాలకు, వారి జీవితాలని మెరుగు పరచు కోవటానికి చేస్తున్న ప్రయత్నాలకు సహాయ పడాలి అంటే మనం ఈ ‘హిందూత్వ వాదులు, ఇస్లాం వాదులు’ ఒకటే నన్న చట్రం నుండి చాలా త్వరగా బయట పడాలి. ఆర్ ఎస్ ఎస్ లో అందరూ ఒకలాగా ఆలోచించ వచ్చు కానీ, ‘ముస్లిం’ లలో మనం అభివృద్ధి నిరోధకులు అంటున్న వారిలో ఈ విషయాలపై లోతుగా, కానీ భిన్నంగా ఆలోచించే వారు చాలా మంది వున్నారు. ‘ముస్లిం’ ఆలోచనా పరులలోని ఈ భిన్నత్వాన్ని అర్ధం చేసుకోవాలి, ఆహ్వానించాలి. ఎంత వరకు ప్రయాణం చేస్తారో అంత వరకూ కలిసి ప్రయాణం చెయ్యాలి‘‘.

    http://magazine.saarangabooks.com/2016/11/10/%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%87%e0%b0%a6%e0%b0%bf/#comment-114980

    ReplyDelete
    Replies
    1. It is waste of time to argue with saaranga people!They won't even publish our comments,how could we fight?
      But they are losers anyway - I am with full of pity on them:-)

      Delete
    2. ఈ సారంగ అనేది సనాతనధర్మాన్ని అవహేళనచేయటం అనే ఎజండా కలిగియుందా అన్న అనుమానం‌ కలుగుతూ ఉంది. మనదేశంలో సనాతనధర్మాన్ని తూర్పారబట్టటం అనే ఎజండాతో‌ పనిచేసే వారికి మేథావులన్న ప్రసిధ్ధి ఉంది. మీరు ఏదో స్వధర్మాభిమానంతో ఒక్కముక్క మాట్లాడినా మీరు హిందూ ఉగ్రవాదులే అని వాళ్ళు నిరసిస్తారు మిమ్మల్ని. మానవహక్కులు మావోయిష్టులకు మాత్రమే వర్తిస్తాయన్నట్లుగోలచేసే మేథావులూ వీళ్ళూ అందరి ఎజండా ఒక్కటేనేమో. ఈదేశంలో అవ్యవస్థను నిర్మించటమూ అందుకు కృషిచేసేవాళ్ళని ప్రోత్సహించటమూ.

      Delete
    3. బాబు గారూ!
      బల్బీర్ పుంజ్ ఆంధ్రజ్యోతిలో నవంబరు 4 న "తలాఖ్ రద్దుతోనే రాజ్యాంగ స్వేచ్ఛ" అనే అనువాద వ్యాసం వ్రాసారు.
      http://epaper.andhrajyothy.com/989883/Andhra-Pradesh/04.11.2016#page/4/1
      దానికి సమాధానంగా మరుసటి రోజు ఈ రచయిత్రి "ముస్లిం వివాహ చట్లాలు మూడు తలాఖ్ లు" అనే వ్యాసం వ్రాసారు.
      http://epaper.andhrajyothy.com/991087/Andhra-Pradesh/05.11.2016#page/4/1

      దాని సారాంశమే వ్యాసంగా సారంగలో వ్రాసారు.
      దీనికి ఈ క్రింది సమాధానం సారంగలో ప్రచురించడమే ఒక గొప్ప వింత.
      సునీత గారూ!
      మీరు చెప్పిన విషయాల పట్ల కొంత భిన్నమైన అభిప్రాయం నాకున్నది.
      తమరు రాష్ట్రీయ సేివకా సమితిని గురించి గానీ, రాష్ట్రీయ ముస్లిమ్ మంచ్ గురించి గానీ వినియున్నారా?
      (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహిళా విబాగం) మరియు (ఆర్. ఎస్. ఎస్. ముస్లిం వింగ్)
      ఈ నవంబర్లొ జరిగిన ఈ మీటింగ్ గురించి మీకేమైనా తెలుసా? వారు ఏ తీర్మానం చేసారో తెలుసా?

      While the political atmosphere in the country is filled with issues like Triple Talaq and Uniform Civil Code (UCC), the Muslim Rashtriya Manch (MRM) took an initiative to hold a meeting between top RSS leaders and Muslim intellectuals on Thursday in Delhi to thrash out on these most contentious issues.

      The meeting was attended by RSS Sah-Sarkaryawah Dr. Krishna Gopal and Dattatreya Hosabale, and Indresh Kumar, senior RSS functionary, and patron of MRM.

      Prominent among the Muslim Intellectuals were former Aligarh Muslim University (AMU) VC Dr. Mehmood-ur-Rahman and ex-Registrar Shahrukh Shamshad, former Dean and Member of AIMPLB Prof. M. Shabbir, Head of Theology Department Dr. Jahid Khan and research students Jafar Darik, Maulana Kaukab Mujtaba, Maulana Suhaib Qasmi, Prof Dr Shahid Akhtar, Ranchi, Latif Magdum, Pune, Faruk Ahmed Khan, Jodhpur, S K Muddin, Jabalpur, former Nagpur University VC Dr. S. N, Pathan, and other MRM functionaries.
      ఈ వ్యాసంలో, పై వ్యాఖ్యలో మీరు ప్రస్తావించిన హిందూత్వ గురించి, మీరు ఆంద్రజ్యోతిలో వ్రాసిన వ్యాసం గురించి కూడా నాకు పూర్తి భేదాభిప్రాయం వున్నది.
      ముందుగా పై రెండు సంస్థల గురించి, తుఫైల్ అహ్మద్ అనే Director of the South Asia Studies Project at the Middle East Media Research Institute in Washington, D.C. గురించి, మరియు New ఏజ్ ఇస్లాం అనే వెబ్ సైట్ గురించి మీకు ఏ అభిప్రాయం వున్నదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దాన్నిబట్టి మీరు ఈ వ్యాసంలో, వ్యాఖ్యలో ప్రస్తావించిన అంశాల గురించి భిన్నమైన విషయాల గురించి మీకు ఆసక్తి వుంటే చర్చ జరపవచ్చు.

      మీరు ప్రస్తావించిన హిందూత్వ ప్రభుత్వం గురించి మీకున్న అభిప్రాయమే అచ్చంగా అదే భారతీయ మహిళా ముస్లిం ఆందోళన్ కు వున్నదా?

      ఒకవేళ నేను ప్రస్తావించిన సంస్థలు, వ్యక్తులు, వెబ్సైట్లు మీరింతవరకూ వినివుండకపోతే అది చదవండి. మీ దృష్టికోణానికి భిన్నంగావున్న మరికొన్ని వాస్తవాలని కూడా మీకు ఆసక్తి వుంటే చర్చిద్దాం. లేదా, మీకు ఇంతవరకూ తెలిసిన జ్ఞానమే సరిపోతుందనుకుంటే నా వ్యాఖ్యకు బదులు యివ్వవలసిన అవసరంలేదు.

      Delete
    4. * కావాల్సినన్నిస్కూళ్ళు, కాలేజీలు పెట్టక, చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వక ఆ సమాజాల్ని మతపరమైన వివక్ష తో ఈ అరవయ్యేళ్ళ ... ఆర్ ఎస్ ఎస్ మరియు వారి స్నేహితులే.*

      "మతపరమైన వివక్ష తో ఈ అరవయ్యేళ్ళ నుండి వెనక బడేటట్లు, ఆయా స్త్రీలకి ఏ దారులు లేకుండా చేస్తున్నది భారత ప్రభుత్వ విధానాలే. పైగా వారిపై భౌతిక దాడులు, వారి అస్తిత్వంపై దేశ భక్తి పేరుతో భావజాల పరమయిన దాడులు చేస్తున్నది ఆర్ ఎస్ ఎస్ మరియు వారి స్నేహితులే"

      చరిత్ర మరచి పోయి అభాండాలు వేస్తున్నారు. హిందువులు ముస్లింల అస్తిత్వం గుర్తించి వారికి రిసర్వేషనేమిటి, ప్రత్యేక దేశమే ఇచ్చారు. చాలా అమాయకంగా ఎమి ఎరగనట్లు, ఇంకా అస్థిత్వం అని మాట్లాడితే ఎలా? ఇటువంటి వ్యాసాలను ప్రచూరిస్తూంటే సారంగ పత్రికలో ఏడిటర్లకు కనీస చరిత్ర జ్ణానం ఉందా? అనే అనుమానం వస్తున్నాది.

      పాకిస్థాన్ లో రిసర్వేషన్ లు ఉన్నాయా? లేవే, అక్కడ కూడా ఎంతో మంది చదువులేక వెనుకపడి ఉన్నారు దానికి కారణం ఎమిటి? అక్కడ హిందువులు ఎవరు వారిని తొక్కేయలేదు కదా! అదే మనదేశానికి వస్తే విక్టిం హుడ్ కార్డ్ ప్రయోగిస్తూ RSS మరియు వారి స్నేహితులే అంట్టు హిందువులను నిందిస్తారా? వాళ్ళు చదువును నిర్లక్షం చేసి హిందువులపై అభాండాలు వేయటం అన్యాయం.

      కావల్సిన అన్ని స్కూల్స్,కాలేజిలు పెట్టటానికి దేశ విభజన అనంతరం భారత ప్రభుత్వం దగ్గర గల్ఫ్ దేశాల దగ్గర ఉన్నంత సంపద పోగుపడి లేదు. బ్రిటీషోడు పూర్తిగా దోచుకుపోగా, పాకిస్థాన్ కు కొన్ని కోట్ల రూపాయలు వాటాగా చెల్లించాము కదా!

      Delete


    5. https://www.youtube.com/shared?ci=ZGrmejAA8X8

      Delete
    6. If we took it granted as the whole truth which she is affirming in his para * కావాల్సినన్నిస్కూళ్ళు, కాలేజీలు పెట్టక, చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వక ఆ సమాజాల్ని మతపరమైన వివక్ష తో ఈ అరవయ్యేళ్ళ ... ఆర్ ఎస్ ఎస్ మరియు వారి స్నేహితులే.* cionress party which ruled from 1947 also will be the friend of RSS
      HOW RIDICULOUS STATEMENT?REALLY THEY ARE GOING MENTAL!

      Delete


  13. సారంగ నిగూఢ అజెండాని బట్టబయలు చేసిన శ్యామలీయం వారికి జేజేలు


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆకాశ సీతమ్మ గారూ!
      తమరెవరో బ్లాగు నగర పౌరులకెవ్వరికీ తెలియనివ్వకుండా నిగూఢంగా మీ వాచ్యకలాపాలు నిర్వహిస్తున్నారు కదా. ఇంతకీ మీరు శ్యామలీయం వారిని పొగుడుతున్నట్లా, తెగుడుతున్నట్లా? సారంగ బ్రతుకు, పక్షపాత ఎజెండా బ్లాగులోకంలో బహిరంగమే కదా? ఇప్పుడు శ్యామలీయం వారు క్రొత్తగా కనుక్కున్న విషయమేముంది?
      దీనికి కూడా సమాధానంగా ఏ.తె. పద్యం వ్రాస్తే మీ కంప్యూటర్ కీపాడ్ పగిలిపోవుగాక.
      ఇట్లు
      శంకామానసులైన తమ అనుయాయులు
      జాంగ్రీ, సున్నుండ, మైసూర్ పాక్, పాలకోవా, అరిసె, బొబ్బట్టు మొదలగువారు.

      Delete
  14. ఓ సరదా విషయం. ‘‘ట్రంప్ ఒక పాకిస్తాన్ అనాథ.’’
    ట్రంప్ గెలవగానే అతడిని రకరకాలుగా గోల చేయడం మొదలైంది. ట్రంప్ అమెరికాలో పుట్లలేదని, అతడొక అనాథ అని, పాకిస్తాన్లోని వజీరిస్తాన్ లో 19 జూన్ 1946 లో పుట్టాడని, చిన్నప్పుడు అతడి పేరు దావూద్ ఇబ్రహీం ఖాన్ అని, చిన్నప్పుడు అతడి విద్యాభ్యాసం మదరసాలో జరిగిందని, అతడి తల్లిదండ్రులు చనిపోయిన తరువాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసే అధికారి అతడిని లండన్ తీసుకువెళ్ళాడని, అక్కడ ఇప్పటి తండ్రి దత్తతకు తీసుకున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అతడి చిన్నప్పటి ఫోటోతో సహా ఈ వీడియోలో చూడండి.

    Conspiracy theorists claim Donald Trump is actually an orphan from Pakistan

    Read more: http://metro.co.uk/2016/11/13/conspiracy-theorists-claim-donald-trump-is-actually-an-orphan-from-pakistan-6254682/#ixzz4Q3LJeUfr

    http://metro.co.uk/2016/11/13/conspiracy-theorists-claim-donald-trump-is-actually-an-orphan-from-pakistan-6254682/

    ReplyDelete
  15. Hari babu garu, great information. Many thanks! _/\_

    ReplyDelete
  16. @హరిబాబు గారు టపా ఎప్పుడులాగే బావుంది. గుడికి వెళ్తే ఎంత సేపు చాలా మంది నా లాంటి వాళ్ళ దృష్టి - దర్శనం , మొక్కుబడి చెల్లించుకోవడం అన్నట్లే ఉంటుంది. ఇటువంటివి చదివితే చాలా విషయాలు దృష్టి లో పెట్టుకుని వెళ్తాము ఏదైనా ప్రదేశాలకి చూడడానికి వెళ్ళినపుడు.


    @శ్రీనివాసుడు/శ్రీ రామ్ గార్లు. సారంగ వారికి కావలసినది వాదోపవాదనలు. మన లాంటి పాఠకులని అక్కడికి రప్పించుకోవడానికి వ్రాసే వ్యాసాలు అవి. కొందరు కావాలని మెచ్చుకుంటూ వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. ఈ మధ్య నోట్ల మార్పిడి గురించిన వ్యాసం లో నేను పెట్టిన వ్యాఖ్య కి జవాబిస్తూ కె కె రామయ్య గారు స్పష్టం గా వ్రాసారు వారి బలహీనత ఏంటో . వారికి అనుకూలమైన వ్యాఖ్యలు ప్రచురిస్తారు. అనుకూలం గా లేకపోతే మోడరేషన్ అంటారు.

    ReplyDelete
  17. కల్లూరి భాస్కరం గారికి,
    విశ్వనాధ సత్యనారాయణ గాంధీగారిని అనుసరించి ఇంగ్లీషువాళ్ళ మీద పోరాడకపోవటానికి ఆయనలోని కరుడుగట్టిన మతచాందసవాదం ఒక్కటే కారణం అని తీర్మానించెయ్యడం ఎట్లా కుదురుతుంది?నవయుగ వైతాళికుడు అని పిలిపించుకున్న గురజాడ అప్పారావు గారు ఇంగ్లీషువాళ్ళ సహాయంతో మతచాందసాన్ని తుదముట్టించుకుని బాగుపడాలే తప్ప ఇంగ్లీషువాళ్ళ మీద పోరాడకూడదు అని స్వాతంత్ర్యోద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినారు కదా!

    ఆనాటి వాతావరణంలో మనము ప్రత్యక్షంగా లేనప్పుడు అప్పటివారి జ్ఞాపకాలని రిఫరెన్సులుగా తీసుకోవడం తప్ప మరోదారి లేదు,అవునా?ఎలాగూ స్వర్గం/నరకం నుంచి వచ్చి జవాబు చెప్పుకోలేరు గాబట్టి మన పాండిత్యాన్ని ఉపయోగించుకుని నిన్నటి వారిమీద తొందరపడి తీర్పులు ఇస్తే రేపు మనం స్వర్గం/నరకం నుంచి రాలేని స్థితికి వెళ్ళాక ముందు తరంవారు వారి పాండిత్యం ఉపయోగించుకుని మనమీద తీర్పులు ఇస్తే మనమూ జవాబు చెప్పుకోలేము కదా!

    Openion1: బ్రిటిష్ ప్రభుభక్తి పైనే కాంగ్రెస్ కట్టడానికి మొదట పునాదులు పడ్డాయి.అదే మొదట్నించి కాంగ్రెస్ మూలసూత్రంగా వస్తున్నది.బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగే ఎట్టి ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ ఒక్కనాటికీ ఆమోదించి ఉండలేదు.

    బ్రిటిష్ పరిపాలన ఇండియా ప్రజల బాగుకొరకే అని నేనిప్పటికీ విశ్వసిస్తున్నాను.మునుపు పోగొట్టుకున్న వైభవవిశేషములను తిరిగి సంపాదించుకొనడానికి ఈ పరిపాలన ప్రసాదించబడినదని తలుస్తున్నాను.కనుకనే దేశీయులంతా దేశశ్రేయానికి తోడ్పడే ఈ పరిపాలన పట్ల భక్తివిశ్వాసాలు కలిగిఉండటం తమ దేశంపట్ల తమవిధిని నిర్వర్తించడంగా తలంచుకోవాలని భావిస్తున్నాను.
    -1809:పండిత మాలవ్యా
    Openion2: బ్రిటిష్ పరిపాలనలో సుగుణమేదైనా ఉన్నదంటే అది ఆయుదహబలానికి సంబంధించినది ఒక్కనాటికీ కాదు.అది కేవలము వారి నైతిక విశిష్టతే,సందేహము లేదు.ప్రజల మానప్రాణధనాల్ని జాగరూకతతో కాపాడుటే ప్రభుత్వాల పరమధర్మం.నాగరికతా వాసన ఏమాత్రమున్నా ఉత్తమన్యాయం అందించవలసి ఉంటుంద్.బ్రిటిషువారు న్యాయపాలన మీదే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు కాబట్టి నాలుగుకాలాలపాటు ఇండియాప్రజల ఆరాభిమానాలకు పాత్రులయ్యారు,కాగలుగుతున్నారు.
    -1916:బాబు అంబికాచరణ్ మజుందార్
    Openion3: బ్రిటిష్ పరిపాలనలో సుగుణమేదైనా ఉన్నదంటే అది ఆయుదహబలానికి సంబంధించినది ఒక్కనాటికీ కాదు.అది కేవలము వారి నైతిక విశిష్టతే,సందేహము లేదు.ప్రజల మానప్రాణధనాల్ని జాగరూకతతో కాపాడుటే ప్రభుత్వాల పరమధర్మం.నాగరికతా వాసన ఏమాత్రమున్నా ఉత్తమన్యాయం అందించవలసి ఉంటుంద్.బ్రిటిషువారు న్యాయపాలన మీదే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు కాబట్టి నాలుగుకాలాలపాటు ఇండియాప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు,కాగలుగుతున్నారు.
    -1916:బాబు అంబికాచరణ్ మజుందార్
    TO BE CONTINUED

    ReplyDelete
  18. CONINUEING FROM ABOVE
    Openion4: Note one particular instance of
    gurajaaDa's intolerence on the patriots of the day and how he chose to threaten them in one of his
    English poems:

    “Lives of moderates all remind us

    We should wisely keep from crime

    Open sedition only finds us

    Shelter in a far off clime

    Let us then line up and speaking

    Speaking at a furious rate

    Not always some benefit seeking

    Learn to be loyal and to wait. “

    Even now, we will be living under the British, had we taken this masterpiece of advice
    Seriously.

    నాకు రూఢిగా తెలిసిన రెండు వాస్తవాలు: గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్న దాదాభాయి నౌరోజి "Poverty and un-British Rule in India" అనే పుస్తకం రాసింది 1901లో. జలియన్ వాలా బాగ్ దురంతం జరిగింది 1919 ఏప్రిల్ 13న.
    ఈ రెండు వాస్తవాలూ అప్పటి కాలపు వాస్తవికమైన సామాజిక స్థితిని అర్ధం చేసుకోవడానికి పనికొస్తాయి. నౌరోజీ గారు చాలా విశ్లేషణాత్మకంగా మొత్తం ఆరు కారణాలతో ఆర్ధికపరమైన పరిజ్ఞానం గలవాళ్ళకి చదవగానే ఇంగ్లీషువాళ్ళు మన దేశపు ఆర్ధికవ్యవస్థ మీద ఎలా దాడి చేశారో సోదాహరణంగా వివరిస్తుంది.అయినా అప్పటి మేధావులాలో చాలామంది ఇంగ్లీషువాళ్ళని మంచివాళ్ళు అనే అన్నారు.మాలవ్యాని ఇక్కడ ముందే కరుడు అగ్ట్టిన హిందూమతతత్వవాది కింద జమకట్టేశారు,అయినపటికీ అబద్ధీకుడు మాత్రం కాదని నేను నమ్ముతున్నాను.మీరు నమ్మకపోతే అందుకు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. పైన ఉదహరించిన వ్యక్తుల్లో ఎవరికీ భవిష్యత్తులో ఎజెండాల కోసం తమ పులుముడు పాండిత్యంతో వెనకటి తరాల వారికి లేని దురుద్దేశాలు అంటగట్టేవారు తమను బద్నాం చెయ్యడానికి తమ మాటల్ని వాడుకుంటారేమో అనే భయాలు లేవు - అప్పటికింకా టైం మెషీన్ లాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. కాబట్టి తమ కళ్ళముందు తాము చూస్తున్న వాస్తవికమైన స్థితి గురించి నిర్భయంగా వెలిబుచ్చిన అభిప్రాయాలు అవి.ఇంకా వెనక్కి వెళ్తే 18వ శతాబ్దంలో కాశీయాత్ర చరిత్ర అనే యాత్రాస్మృతి గ్రంధం ద్వారా ప్రముఖులైన ఏనుగుల వీర్స్వామయ్య గారు కూడా ఆంగ్లేయుల సత్యనిరతి గురించి,ధర్మదృష్తి గురించి గురజాడ అప్పారావు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నారు.

    నౌరోజీ గారి పుస్తకం వీరిలో ఎవరూ చదవకపోవడానికి ఆస్కారం ఉంది.కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ పబ్లిష్ అయిందని తెలిసినా ఇవ్వాళ్టి తరంలో ఎంతమంది దాన్ని చదివారు?అంటే,నౌరోజీ గారి ఆర్ధికశాస్త్ర విశ్లేషణ పట్టించుకోకపోతే అప్పటివారిలోనే చాలామందికి ఇంగ్లీషువాళ్ళ పరిపాలన న్యాయబద్ధమైనదిగానే కనిపించిన స్థితిలో ఒక్క విశ్వనాధయే కాక ఇంకా చాలామంది పోరాటానికి దూరంగా ఉండి ఉంటారు కదా!

    అంటే,ఇంగ్లీషువారి పరిపాలనా కాలంలోని అన్ని దశలలోనూ చాలామంది మేధావులు ఇంగ్లీషువాళ్లని చాలా మంచివాళ్ళని విపరీతంగా పొగిడేశారు.అలాంటప్పుడు కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వకుండా విశ్వనాధ సత్యనారాయణ గాంధీగారిని అనుసరించకపోవడానికి పూర్తిగా ఆయనలోని మతచాందసవాద సంస్కృతియే కారణం అని ఎట్లా తీర్పు ఇవ్వగలిగారు?
    TO BE CONTINUED

    ReplyDelete
  19. CONTINUEING FROM ABOVE
    అప్పటి మేధావులేం ఖర్మ?స్వాతంత్ర్యం వచ్చాక గవర్నమెంటు వారు మన స్కూళ్ళలో రాసి చదివంచిన చరిత్ర పాఠాలు చదివి మా అమ్మాయే నన్ను అడిగింది "ఇంత మంచివాళ్ళ మీద అంత భీకరంగా పోరాడాల్సిన అవసరం యేంటి నాన్నా?" అని!మన చరిత్రని మనం అంత న్యాయంగా రాసుకుని అఘోరించాం,మీరేమో ఆ తక్కిరిబిక్కిరి చరిత్రనే ప్రామాణికంగా తీసుకుని అసలు పట్టుకోవాల్సిన సత్యాలను పట్టించుకోకుండా ఏమాత్రం పట్టించుకోనక్కర లేని విషయాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు.
    Statement1.లజపతి రాయ్, మాలవీయ హిందూ మహాసభతోనూ, కాంగ్రెస్ తోనూ కూడా అసోసియేట్ అయినవాళ్ళు. గాంధీతో కలసి పనిచేయడానికి వీళ్ళకు మొదట్లో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కాంగ్రెస్ కు ఉన్న ఒక ప్లాట్ ఫామ్ స్వభావం రీత్యా (ఆ స్వభావాన్ని గాంధీయే తీసుకొచ్చారా లేక దానికి ముందు నుంచీ ఉందా అన్నది ఇంకో పరిశీలనార్హమైన ప్రశ్న) గాంధీ హిందూవాదులతోనే కాక, సోషలిష్టులతోనూ, కమ్యూనిష్టులతోనూ కూడా పని చేశారు. వారితో ఒక ఈక్వేషన్ స్థాపించుకోగలిగారు.
    Analysis: గాంధీ 1914 వరకు దక్షిణాఫ్రికా లోనే ఉన్నాడు.దక్షిణాఫ్రికా నుంచి 1915లో భారతదేశంలోకి అడుగుపెట్టాడు.1906లో తిలక్ హిందూమహాసభ పెట్టినా తర్వాత అందులో పనిచేస్తున్నా తన కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు,పార్టీ సమావేశాల్లో పాల్గొంటూనే ఉండేవాడు.ఆనాతివారిలో దాదాపు అందరూ బహుళ సభ్యత్వాన్ని కలిగిఉండటం కాంగ్రెసు పార్టీ తొలినాళ్ళనుంచీ ఉన్నదే.అయినా మీరు బ్రాకెట్లో ఇప్పుడు పరిశీలించాలని అటున్నారు.కొంచెం కష్తపడితే సంవత్సరాలు,నెలలు,తేదీలతో సహా దొరికే సమాచారాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తెలుసుకోకుండా వాస్తవమైన చరిత్ర గురించి "ఏమో!" ,"కాబోలు!","బహుశా!" లాంటి మాటలు వాడటం శాస్త్రీయమైన విశ్లేషణ ఎంతమాత్రం కాదు,కహానీలు చెప్పడం అంటారు దాన్ని!
    2.గాంధీ ఛాందసవాద హైందవశక్తులతో జరిపిన పోరాటం మరో ఘట్టం. ఈ శక్తులనుంచి ఆయనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి.
    Analysis: గాంధీని చంపడం అనేది విభజన తర్వాత జరిగిన హిందూ ముస్లిం అల్లర్ల సమయంలో హిందువులు నష్తపోవడాన్ని చూసి చేసినట్టు గాడ్సే గురించిన పరిశోధకులు అందరూ తేల్చి చెప్పిన వాస్తవం. రాజకీయంగా గాంధీ ప్రో పాకిస్తాన్ వాదనలు చేశాడు ఇండియన్లదే,ముఖ్యంగా హిందువులదే తప్పన్నట్టు మాట్లాడేవాడు.ఇండియా పాకిస్తానుకి నష్టపరిహారం ఇవ్వాలని అన్నట్టూ ఇప్పించినట్టూ గుర్తు. గాంధీ చాతుర్వర్ణం గురించి హైందవేతరులు విమర్శిస్తుంటే "అబ్బెబ్బే, చాతుర్వర్ణం మంచిదే - ప్రతి వ్యక్తిలోనూ ఆ నాలుగూ ఉంటాయి,ఒక లక్షణం ఎక్కువ ఉండొచ్చు, అంతే!" అని సమర్ధించాడు. అణిచివేత/పెత్తనం ప్రాతిపదికన ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలకి ఒప్పుకున్న గాంధీ హరిజనుల మరియు ఇతర దళితుల దగ్గిరకి వచ్చేసరికి నన్ను చంపినా ఒప్పుకోనన్నాడు,ఎందుకని?భగత్సింగ్ మార్త్గాన్ని వ్యతిరేకించింది కేవలం అందులో ఉన్న హింసని చూసి కాదు,కమ్యునిష్టు సిద్ధాంతం పట్ల వ్యతిరేకత వల్ల.గాంధీ వేసిన ప్రతి అడుగూ మాట్లాడిన ప్రతి మాటా హిందూమతానికి విశ్వసనీయతని కలిగించి ఇతరులతో హిందూత్వానికి ఆమోదముద్ర వేయించుకోవడం కోసమే చేశాడు - అది వాస్తవం! అంబేద్కర్ చాలా స్పష్టంగా మిగిలిన అందరికన్నా గాందీయే ఎక్కువ హిందూమతత్వవాది అని అప్పుడే ప్రకటించేసిన ఇన్నేళ్లకి ఇప్పుడు మీరు గాంధీ హిందూమతత్వవాదం మీద పోరాడాడనీ,అందుకే మతత్వవాదులు గాంధీని చంపేశారనీ అంటున్నారు - నాకు మొదటిసారి మీమీద చాలా జాలివేస్తున్నది ఈ సూత్రీకరణ చదివాక!1925లో పార్టీగా అవిర్భవించిన నాటినుచీ గతితార్కిక చారిత్రక భౌతికవాదులు గాంధీ ఆదర్శవాదం ముసుగులో ఉన్న చాతుర్వర్ణ ప్రేమికుడు అంటూ గడిపి డెబ్బయ్యేళ్ళ తర్వాత ఇవ్వాళ కొత్తగా గాంధీ హైందవశక్తులతో పోరాడాడు అనటం,ఇవ్వాళ్టి హిందువులకి నీతులు చెప్పడానికి గాంధీ సూక్తుల్ని వాడటం విచిత్రంగా ఉంది!
    3.ఆ తర్వాత యాంటీ-నెహ్రూయిజం(గాంధీ-నెహ్రూ)వేళ్ళు ఎక్కడ ఏయే వర్గాలలో ఉన్నాయో, అందుకు కారణాలేమిటో అర్థమవుతుంది. ఈ యాంటీ-గాంధీ, నెహ్రూ శక్తులే ఆర్ ఎస్ ఎస్, బీజేపీలకు కోర్ బేస్ గా మారడంలో ఆశ్చర్యం ఏమీలేదు.
    Analysis: అప్పుడెప్పుడో క్విట్ ఇండియా ఉద్యమం రోజుల్లో గాంధీ మీద గూఢచర్యం చెయ్యటం దగ్గిర్నుంచి పార్టీ పెట్టిన తదాదిగా కమ్యూనిష్టులు నిన్నమొన్నటివరకూ గాంధీవాదం ఒక వెరిబాగుల సిద్ధానతం అని వెక్కిరించ్గటం అది ఫెయిల్ అయిపోతుంది,అయిపోయింది అని అనటం సంగతి యేంటి? మరో చారిత్రక తప్పిదపు అధ్యాయం మొదలవుతున్నదా!

    ReplyDelete
  20. CONTINUEING FROM ABOVE
    P.S:మూడు కాలాలలోనూ మారనిదే సత్యము, అన్ని వర్గాలూ తేలిగ్గా అర్ధం చేసుకుని పాటించగలిగినదే ధర్మము,ఒకే రకమైన నేరము చేసిన అందరికీ తారతమ్యాలు చూడకుండా శిక్ష వెయ్యడమే న్యాయము. ఈ మూడింటినీ సమాజం అనుసరించాలంటే మొదట వాటి గురించి చెప్పేవారు ఉండాలి. చెప్పేవారిలో వీటిపట్ల క్లారిటీ ఉండాలి.దురదృష్టవశాత్తూ మీ వ్యాసంలో వాటిలో ఏ ఒక్కటీ లేదు.ఏ ప్రతిపాదనకీ వాస్తవమైన సాక్ష్యాలు లేవు,కాబట్టి సత్యం లేదు.విశ్వనాధ లోని మత చాందసవాదం,గాంధీమార్గాన్ని అనుసరించకపోవటం అనే సంబంధం లేని విషయాలని సంబంధం ఉన్నట్టు నిరూపించాలనుకోవడం వల్ల ధర్మం లేదు.ముందువెనకలు చూసుకోకుండా విశ్వనాద మీద ఇచ్చేసిన ఏకపక్షపు తీర్పు నవయుగవైతాళికుడికీ తగులుతుండటం వల్ల న్యాయం లేదు.

    మీలో పదిచోట్ల నుంచి విషయాలు సేకరించి ఒకచోట గుదిగుచ్చగలిగిన పాండిత్యం ఎక్కువగా ఉండి గందరగోళానికి తావివ్వని శాస్త్రీయమైన విశ్లేషణ చెయ్యడానికి అవసరమైన జ్ఞానం తక్కువగా ఉనట్టు అనిపిస్తుంది నాకు.ముందుముందు ఆ లోపాన్ని సవరించుకుని ఎల్లరను శాస్త్రీయమైన విశ్లేషణలతో అలరించగలరని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  21. హరిబాబు గారూ!
    ఈ స్పందనని మీరు సారంగకి పంపించారా? ఒకవేళ మీరు పంపించినా వాళ్ళు ప్రచురించకపోయినట్లయితే మనం కల్లూరి భాస్కరం గారి బ్లాగుకు పంపిద్దాం.
    http://kbhaskaram.blogspot.in/
    ఇదివరకి నేను ఒకసారి అలాగే చేసాను. మన అభిప్రాయం భాస్కరంగారికి తెలియడం ముఖ్యం.
    ఆర్.ఎస్.ఎస్.ని విమర్శించడానికి విశ్వనాథని తీసుకురావడం ఎందుకో నాకూ అర్థం కాలేదు. అదీగాకా ఆర్.ఎస్.సుదర్శనాన్ని ఆర్. ఎస్. ఎస్. దర్శనం అని ఎగతాళి కూడా చేసేవారు అప్పట్లో.
    ....శ్రీనివాసుడు.

    ReplyDelete
    Replies
    1. అయ్యో! చాదస్తమా!! ఇదీ ఆ తానులో ముక్కేనండీ !!!

      Delete
  22. @haribabu- "గాంధీజీ-హిందుత్వవాదం" అని ఒక పోష్టు పెట్టండి

    ReplyDelete
  23. This is also a good book to know british govt

    Rise of the Christian Power in India Hardcover – 31 Dec 2001
    by B.D. Basu (Author)

    https://archive.org/details/consolidationoft035043mbp

    ReplyDelete
  24. Not related to this post. This book was written by Pakistanis

    అణచివేయబడ్డ చరిత్ర. భారతీయ బానిస వ్యాపారం
    http://carpenters-son.blogspot.in/2011/07/1206-1526.html

    ReplyDelete
  25. బాబు గారూ!
    సారంగలో రూప్యములు అనే రచన నోట్ల రద్దు గురించి వచ్చింది. దానికి సమాధానంగా ఈ సమాధానాన్ని పత్రికవారు ఎంతో ఔదార్యంతో ప్రచురించారు.
    1) వెయ్యి, ఐదు వందల నోట్లు కూడా దాచుకున్న నల్లధనం లో భాగమే.
    2) భూముల రూపంలోనో, బంగారం రూపంలోనో దాచుకోవడానికి ముందుగా వాటిని కొనాలి కదా. అప్పుడు ఉపయోగించేది లెక్కలోకి రాని నల్లధనమైన ఆ నోట్లతోనే. ఏ రియల్ ఎస్టేట్ కొనుగోలులోనూ 10 శాతం మాత్రమే వైట్ మనీ. మిగతాది ఆ నల్లడబ్బే, ఆ నోట్లే, భవిష్యత్ లో ఆ బంగారం, ఆ భూములు కొనుగోళ్ళలో నల్లడబ్బు ప్రవాహాన్ని తగ్గించడానికి ఈ చర్య చాలా ఉపయుక్తం.
    4) అధికారంలో వున్నవాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఏది మాట్లాడినా నూటికి నూరుపాళ్ళూ బూటకమే, పూర్తిగా పేదల దోపిడీకే అనే అభివ్యక్తీకరణకు పరాకాష్ఠ.
    5) స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తెప్పించడం అనేది నల్లడబ్బు సమస్యకు వేరే పార్శ్యం. దానికీ దీనికీ ముడిపెట్టడం అనేది పైన చెప్పిన అభివ్యక్తీకరణలోనే మరొక కోణం.
    6) చలామణిలో వున్న నోట్లలో దాదాపు పది నుండి పదిహేను శాతం నకిలీ నోట్లే. గత ఆరేళ్ళలో 500 నోట్లు 70 శాతం, 1000 నోట్లు 110 శాతం చలామణి పెరిగింది.
    7) నగదుకు బినామీలు కావలెను; అనే దానిని తప్పించడం చాలా సులభం. నిజంగా దోపిడీకీ, పీడనకు గురవుతున్న అమాయక ప్రజలు అలా బినామీలుగా మారి బ్యాంకుల్లో నల్ల త్రాచుల డబ్బును మార్చకుండా వుండే విధంగా మహా రచయితలు వారిలో చైతన్యం తీసుకురావచ్చు.
    8) ఇదివరకి నోట్లు రద్దుచేసినప్పుడు నల్లధనం తరగకుండా పెరగడానికి కారణం దాని తరువాత తీసుకోవలసిన నిర్ణయాలను, చర్యలను తీసుకోకపోవడం. జనతా ప్రభుత్వం తరువాత కాంగ్రెస్ రావడం.
    9) విదేశీ బ్యాంకుల్లోని నల్లధనం కన్నా స్వదేశీ పుట్టలలో వున్న నల్లనాగులు వేయి రెట్లు. నకిలీ నోట్లలో వున్న నాగులు రెండు రెట్లు.
    10) బ్యాంకుల్లో తీసుకున్నరుణం ఇంకా ఇంట్లో దాచుకునే వున్నారంటే దాల్ మే కుచ్ కాలా హై. అది నిజంగా బ్యాంకుల్లో తీసుకున్న రుణమే అయితే బ్యాంకుకు ఆ వివరాలు చెబితే వెంటనే మార్చి ఇస్తారు.
    నిరంతర, పరమ అసహనం, నిత్య వ్యతిరేకత అనేదానికి మాత్రమే మన రచనలు పరిమితమయితే నిర్మాణం వుండదు, విధ్వంసమే వుంటుంది.
    మనం ఎంత నిరంతర పాలక పక్ష వ్యతిరేకులమయినా మన దృష్టిలో పీడనకు, దోపిడికీ గురవుతున్నవాళ్లు ఏ మాత్రమూ ఇబ్బంది పడకుండా మొత్తం విధ్వంసం జరగడం, క్రొత్త నిర్మాణం జరగడం అసాధ్యం అన్న విషయాన్ని గుర్తించడం ముఖ్యం. పాకిస్తాన్ లోని ప్రెస్సుల్లో వారానికి అచ్చంగా ఒక రోజు అచ్చయ్యే నకిలీ నోట్లు ఎన్ని వున్నాయో, అవి ఏయే మార్గాల ద్వారా మనదేశంలోకి వచ్చి రకరకాల అవినీతి, ఉగ్రవాద కార్యక్రమాలకు మూలకారణంగా మారుతున్నాయో మనకు తెలిస్తే నల్ల చెత్తా చెదారాన్ని ఊడ్చేయడానికి ఈ చర్య ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. కొంత అధ్యయనం చేస్తే నకిలీ నోట్ల వలన జరిగే అనర్థం తెలియడానికి అవకాశముంది.
    ఇప్పడు ఊడిస్తే భవిష్యత్తులో రాదు అనడానికి అవకాశం లేదు. ఎప్పటికప్పుడు ఈ నోట్ల ఉల్బణాన్ని, మనలోని అజ్ఞానాన్ని ఊడ్చుకోకపోతే నకారాత్మకత మాత్రమే మిగులుతుంది.
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    అయితే, దానికి స్పందనగా ఈ వ్యాఖ్య చేసారు.
    ” పాలకవర్గ ప్రలోభాలకు లొంగిపోతూ వారి ప్రయోజనాలకు ఊడిగం చేస్తూ కూడా తమ జీవిత విధానాల్ని తామే మల్చుకుంటున్నామనే దయనీయమైన అహంభావంతో ఉన్న ప్రజలు..” అంటాడు గోర్కీ. ” ధనికులను ప్రేమించమని పేదవారికి చెప్పడం, యజమానిని ప్రేమించమని కార్మికునికి చెప్పడం నా పని కాదు. నేనెవరినీ ఓదార్చలేను. ప్రపంచమంతా ద్వేష వాతావరణం నిండి ఉందనీ అది నానాటికీ చిక్కబడుతుందనీ అదీ ఒక విధంగా మంచిదేననీ నాకు స్పష్టంగా తెలుసు…” అని కూడా అంటాడు. – ఇదే విషయం బజరా ( లాంటి రచయితలకు )కు కూడా తెలుసు..- ఇది ’నెగెటివ్’ ఆటిట్యూడ్ ని నూరిపోయడం గా కొందరికి అనిపిస్తే, అలా ఎందుకనిపిస్తుందో కూడా తెలుసు…
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘

    ReplyDelete
  26. అయితే దీనికి సమాధానంగా నా మిత్రుడు పంపిన వ్యాఖ్యను ముందుగా ప్రచురించి, కొన్ని గంటల తరువాత తొలగించారు.
    ‘‘రచయిత నిత్య ప్రతిపక్షంగా వుండాలి. వున్నాను.‘‘
    ఈ నెగెటివ్ యాటిట్యూడ్ని ’’మేస్టారూ, పీకేసుకుందామా‘‘ లో నొక్కి వక్కాణించింది ఆ ‘‘కొందరు‘‘ కాదు, ఆ వ్యాసరచయితే. రచయిత సమాధాన వ్యాఖ్యలలో వెతుక్కుంటే అది మనకు దొరుకుతుంది. దయనీయమైన అహంభావంతో అనేకానేక ప్రభుత్వోద్యోగాలు చేస్తూ, ప్రగతిశీల ద్వేషాన్ని పెంపొందిస్తున్నవారు తాము గొంగట్లో అన్నం తింటున్నామని తెలిసికూడా పాలకవర్గ చర్యలనే ప్రతి వెంట్రుకనూ ఎత్తిచూపించి ద్వేషాన్ని చిక్కబరుస్తున్నామనుకునే భ్రమలో వున్నారని, నిజానికి అది వారి మానసికస్థితిలో మాత్రమే బలపడుతుందోనీ నాకు తెలుసు.
    ’’విలువలను పీకుసుకుంటున్న ఉపాధ్యాయులు‘‘ గురించి వ్రాస్తే అది **ఎంత నెగెటివ్ యాటిడ్యూడ్** అని మూకమ్మడిగా మీద పడినవారికి, బజరా గారిది "పిచ్చి ఆవేదన" గా కనిపించిన మహా మేధావులకి తమ అవగాహనను చెప్పినట్లయితే అర్థంచేసుకునే అవకాశం వుంటుంది.
    ఏ విమర్శనీ సహించలేకపోవడం కూడా అసహనం క్రిందకే వస్తుంది. అసహనంతో రూపొందిన ద్వేషంతో విధ్వంసమే తప్ప నిర్మాణం జరగదు. అవగాహనతో ద్వేషిస్తే అది నిర్మాణాత్మకంగా రూపొందుతుంది.
    ఎదుటివారు ఎందుకు మాట్లాడారో అర్థంచేసుకోవాలంటే, *నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్* అనే దృక్పథం మానుకుంటే‘‘రచయిత నిత్య ప్రతిపక్షంగా వుండాలి. వున్నాను.‘‘
    ఈ నెగెటివ్ యాటిట్యూడ్ని ’’మేస్టారూ, పీకేసుకుందామా‘‘ లో నొక్కి వక్కాణించింది ఆ ‘‘కొందరు‘‘ కాదు, ఆ వ్యాసరచయితే. రచయిత సమాధాన వ్యాఖ్యలలో వెతుక్కుంటే అది మనకు దొరుకుతుంది. దయనీయమైన అహంభావంతో అనేకానేక ప్రభుత్వోద్యోగాలు చేస్తూ, ప్రగతిశీల ద్వేషాన్ని పెంపొందిస్తున్నవారు తాము గొంగట్లో అన్నం తింటున్నామని తెలిసికూడా పాలకవర్గ చర్యలనే ప్రతి వెంట్రుకనూ ఎత్తిచూపించి ద్వేషాన్ని చిక్కబరుస్తున్నామనుకునే భ్రమలో వున్నారని, నిజానికి అది వారి మానసికస్థితిలో మాత్రమే బలపడుతుందోనీ నాకు తెలుసు.
    ’’విలువలను పీకుసుకుంటున్న ఉపాధ్యాయులు‘‘ గురించి వ్రాస్తే అది **ఎంత నెగెటివ్ యాటిడ్యూడ్** అని మూకమ్మడిగా మీద పడినవారికి, బజరా గారిది "పిచ్చి ఆవేదన" గా కనిపించిన మహా మేధావులకి తమ అవగాహనను చెప్పినట్లయితే అర్థంచేసుకునే అవకాశం వుంటుంది.
    ఏ విమర్శనీ సహించలేకపోవడం కూడా అసహనం క్రిందకే వస్తుంది. అసహనంతో రూపొందిన ద్వేషంతో విధ్వంసమే తప్ప నిర్మాణం జరగదు. అవగాహనతో ద్వేషిస్తే అది నిర్మాణాత్మకంగా రూపొందుతుంది.
    ఎదుటివారు ఎందుకు మాట్లాడారో అర్థంచేసుకోవాలంటే, *నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్* అనే దృక్పథం మానుకుంటే సాధ్యమవుతుంది.
    మనం ఏ వృత్తిలో వున్నామో వాళ్లకే చెప్పలేనంత ద్వేషం ప్రబలితే మిగిలేది నకారత్మకతే.

    ReplyDelete
  27. Bill Gates Illegally Tested Cancer Vaccine on 30,000 Indian Children

    http://www.neonnettle.com/news/1649-bill-gates-illegally-tested-cancer-vaccine-on-30-000-indian-children

    http://www.sundayguardianlive.com/investigation/3047-bill-gates-prescribes-costly-foreign-drugs-india%E2%80%99s-poor

    Controversial vaccine studies: Why is Bill & Melinda Gates Foundation under fire from critics in India?

    India Holds Bill Gates Accountable For His Vaccine Crimes

    http://vactruth.com/2014/10/05/bill-gates-vaccine-crimes/


    Judges demand answers after children die in controversial cancer vaccine trial in

    Read more: http://www.dailymail.co.uk/news/article-2908963/Judges-demand-answers-children-die-controversial-cancer-vaccine-trial-India.html#ixzz4TUNqI6cp

    http://articles.economictimes.indiatimes.com/2014-08-31/news/53413161_1_hpv-vaccine-cervarix-human-papilloma-virus

    ReplyDelete
  28. The letter, obtained by Bhopal activists, is important because it confirms what many have long suspected: that the US and Tata were complicit in allowing Union Carbide to evade responsibility for the world’s worst industrial accident

    http://www.dailypioneer.com/nation/revealed-henry-kissingers-role-in-bhopal-gas-deal.html

    http://www.heraldscotland.com/news/13192711.Revealed_30_years_on__secret_role_of_Henry_Kissinger_in_Bhopal_tragedy/

    The ugly face of Tata

    http://www.bhopal.net/the-ugly-face-of-tata/




    Target Tata

    http://indiatoday.intoday.in/story/assam-govt-mounts-pressure-on-tata-tea-to-come-clean-on-its-alleged-funding-of-ulfa/1/277398.html

    ReplyDelete
  29. Read below chapter

    1. The TATA Dynasty OPIUM AND STEEL

    http://tinyurl.com/jswksau

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...