Wednesday 21 September 2016

మనకు మనం ముందుగా యుద్ధాన్ని కోరుకోకూడదు, యుద్ధం వస్తే వెనుకాడకూడదు - అదే రాజనీతి!

     పాకిస్తాన్ పుట్టుకే పరమ అసహ్యకరంగా జరిగింది.హిందువులూ ముస్లిములూ వేరు వేరు అనే ద్విజాతి సిద్ధాంతం అప్పటి అవసరం కోసం పుట్టించిన వికృత సిద్ధాంతమే తప్ప దానికి సరైన పునాది లేదు.పై స్థాయిలో పాకిస్తాన్ కోరుకున్నవాళ్ళు బేరసారాల కోసం తెరిచిన కొత్త దుకాణానికి తగిలించిన ఆపద్ధర్మపు లేబుల్ అది.దాన్ని బుజాన మోసిన వాళ్ళకి కూడా అది అబధ్ధమని తెలుసు.దేశాన్ని సమైక్యంగా ఉంచి స్వతంత్రం ఇస్తే ఢిల్లీలో తాము కాలుపెట్టలేమని తెలిసిన సింధ్ ప్రాంతపు వ్యాపార/పారిశ్రామిక వర్గాలు తమ ప్రాభవం కోసం ఆడిన పులిజూదం పాకిస్తాన్ యేర్పాటు.

     తెలివితక్కువ వాళ్ళంతా గాంధీ పెత్తనం కింద ఆయన తెల్ల్లారగట్ట తన కోమటిబుర్రకి పొడిచిన బతికుండి బలుసాకు తినడానికి మాత్రం పనికొచ్చే పిచ్చిప్లానుల్ని అణ్వస్త్రాల కంటే బలమైన ఆయుధాలుగా వర్ణించి చెప్తుంటే వాటితోనే ఇంగ్లీషువాళ్ళు దడుచుకుని స్వతంత్రం ఇచ్చేస్తారనుకుని మొదటి నాల్రోజులూ దెబ్బలు తినడం, తర్వాత మూకుమ్మడి అరెస్టులతో జైళ్లలో దైరీలు రాసుకోవడం,మధ్యే మధ్యే ఆచమనం అన్నట్టు గుండ్రబల్ల ముచ్చట్ల కోసం లండన్ ప్రయాణాలతో శత్రువుని భయపెట్టడానికి బదులు వినోదాన్ని పంచుతూ అక్షరాలా వాళ్ళ మాటల్లోనే "గాంధీ అనేవాడు రాజకీయ రంగంలో ప్రభావశాలిగా ఉన్నంతవరకు మనం ఇక్కణ్ణుంచి వెళ్ళాల్సిన ఆవసరం లేదు" అని ధీమాగా ఉంటున్నా ఆఖరి నిముషాల వరకు గాంధేయవాదం యొక్క బలహీనతల్ని తెలుసుకోలేకపోయారు.

     అసలు గాంధీకీ కాంగ్రెసులో ఉన్న మిగిలిన మితవాదులకీ మనసులో ఉన్నది ఇంగ్లీషువాళ్ళ దోపిడీ నుంచి ప్రజల్ని విముక్తం చెయ్యటం కాదు - అధికారాన్ని ఇంగ్లీషువాళ్ళ నుంచి స్వదేశీ రాజవంశీయులకీ జమిందార్లకీ శాంతియుతంగా బదలాయింపు చెయ్యటమే!అతివాదులు దీనికి భిన్నంగా మొదట్లో కొంతకాలం ఆలోచించినా వాళ్ళంతట వాళ్ళే సర్దుకుపోయారో మితవాదుల బలం పెరగడం వల్ల బలహీనపడిపోయారో తెలియదు గానీ వాళ్ళు కూడా దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చెయ్యడం తగ్గించేసి తమ వ్యక్తిగతమైన కీర్తిప్రతిష్ఠల కోసమే ఆలోచించటం మొదలుపెట్టారు.ప్రజల్ని ఇంగ్లీషువాళ్ళు చేస్తున్న అన్యాయాల మీద సొంతబుద్ధి ఉపయోగించి తిరగబడేటట్టు తయారుచేస్తే ఇంగ్లీషువాళ్ళతో పాటు స్వదేశీరాజులకి కూడా నష్టమే కాబట్టి వాళ్ళని ఉద్రేకంతో హింసకి మళ్ళనివ్వకుండా ఉంచటం కోసం గాంధీ అమోఘమైన తెలివితేటలతో అహింసాయుత పోరాటం అనే ఒక దుష్టసమాసం చుట్టూ ఒక గందరగోళపు సిద్ధాంతం అల్లితే దానివల్ల లాభం పొందేవాళ్ళంతా గాంధీని మహాత్ముణ్ణి చేసి జనం మీదకి వొదిలారు.

     ఈయనగారి ప్రధమశిస్యుడికి కమ్యూనిజం అంటే వెర్రిప్రేమ,హిందూమతం అంటే పిచ్చికోపం.గురువుగారేమో భావి భారతంలో చాతుర్వర్ణం ధగధ్ధగాయమానంగా ప్రకాశించాలని కలలు కంటుంటే శిష్యులుంగారు దాని ఉనికినే అసహ్యించుకుని కూకటివేళ్ళతో సహా పెకలించాలని ప్రయత్నిస్తూ ఉందేవాడు.దీనికి తోడు ఇంగ్లీషువాళ్ళమీద పోరాడటానికి ఏకోన్ముఖమైన లక్ష్యం,శాస్త్రీయమైన విధానం అంటూ ఏదీ లేకపోవటంతో ఎవడు కాస్త గట్టిగా ఇంగ్లీషువాళ్ళని తిడుతూ మాట్లాడగలిగితే వాడికి దేశభక్తుడి ముద్ర వేసి పార్టీలోకి లాక్కుని నాయకుల సంఖ్యని పెంచేశారు.పార్టీలో సొంత ప్రాభవం కాస్తంత తగ్గగానే వేరే దుకాణం తెరవడం, కొంతకాలం రెండు దుకాణాల్లోనూ హడావిడి చెయ్యటం. మళ్ళీ పార్టీలో ప్రాభవం పెరగ్గానే రెండో దుకాణం మూసెయ్యటం - ప్రజల్ని కదిలించే కార్యక్రమాలు లేనప్పుడు ఆ కాలంలో జరిగిన వ్యవహారాలు ఇవే!ఇక ప్రజల్ని కదిలించే కార్యక్రమాల సంగతి చూస్తే - చరఖా తిప్పటం,ఉప్పు చెయ్యటం,బట్టలు తగలెయ్యటం,జెండాలు ఎగరెయ్యటం,దెబ్బలు తినటం, జైలు కెళ్ళటం,కల్లుపాకల దగ్గిర పాటలు పాడటం,వేదికలెక్కి భారతీయులంతా కలిసి ఉమ్మేస్తే ఇంగ్లీషువాళ్ళు కొట్టుకుపోతారని కబుర్లు చెప్పటం!

     తర్వాత కాలంలో ముదిరి ఇప్పటికీ సమస్యలు సృష్టిస్తున్న చాలా సిద్ధాంతాలు ఈ గందరగోళం వల్ల తమ వ్యక్తిగతమైన రాగద్వేషాల్ని సమాజమంతటికీ టోకున రుద్దెయ్యడానికి వందివార్చినవే - సామ్యవాదం,జాతీయవాదం,బ్రాహ్మణాధిపత్యం,దళితవాదం,ఇంకా ఇంకా ఎన్నెన్నో!ఆయా వ్యక్తుల ఓపికని బట్టి కొన్ని మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతే కొన్ని ఇప్పటికీ ప్రముఖంగా ఉండి భారతీయ సమాజాన్ని గ్రూపులుగా విడగొట్టి అంతర్గత విభేదాలకు కారణమవుతూ ఉన్నాయి.

     హిందువుల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి కుటుంబీకులు గనక కాంగ్రెసునీ గాంధీని నమ్మి ఇట్లా గందరగోళంలో ఉంటే కొందరు డబ్బున్నవాళ్ళు,తెలివైనవాళ్ళు భారతదేశపు ముస్లిములని విదేశీయుల మతాంతరీకరణ దుష్టవ్యూహాలకు ప్రభావితులై హిందూమతం నుంచి వేరుపడి మొఘల్ సామ్రాజ్యపు దుర్మార్గాలకు అవశేష ప్రతిరూపంగా ముద్రవేసి వారితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా హిందువుల సౌభాగ్యం కోసమే కృషి చేసే ఉద్దేశంతో హిందూమహాసభ అనే ప్రత్యేక దుకాణం తెరిచారు.అప్పట్లో డబ్బున్నవాళ్ళు రాజులూ జమీందార్లూ,తెలివైనవాళ్ళు బ్రాహ్మణులూ కోమట్లూ గనక అది బ్రాహ్మణమతస్థుల/హిందూ మతతత్వ వాదుల గుంపు అనే లేబుల్ తగిలించెయ్యడానికి పనికొచ్చింది.అటువైపున అప్పటివరకు విశాలహృదయంతో మొత్తం భారతీయసమాజపుసంక్షేమం గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడుతున్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ హిందీ ఉర్దూ తగాదాలో తన మాట చెల్లలేదన్న చిన్న కారణానికే తన కులీనకుటుంబసహజమైన అహంతో కడుపు రగిలిపోయి హిందువుల్నీ ముస్లిముల్నీ ఇక ఎంతమాత్రం కలిసి ఉండనివ్వకూడదని తీర్మానించుకుని తనకున్న అన్ని వెసులుబాట్లనీ ఉపయోగించుకుని ద్విజాతి సిద్ధాంతం అనే మాటని ప్రచారంలోకి తీసుకొచ్చి ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ద్వారా చదువుకున్న పొలిటికల్లీ మోటివేటెడ్ ముస్లిముల బృందాన్ని తయారుచేసి దేశంమీదకి వొదిలాడు.హిందువులకి భిన్నంగా వాళ్లకి తమకి కావలసింది ఏమిటో అది యెట్లా సాధించుకోవాలో పూర్తి స్పష్టత ఉన్న ఐకమత్యం ఉంది.

     భారతీయ ముస్లిములలో మొదటినుంచీ రెండురకాల ధోరణులు ఉండి వారిలో ఒకింత గందరగోళం ఉండేది.దీనికి కారణం మతాంతరీకరణ అన్నది మూడు విధాలుగా జరగటమే!అహ్మద్ ఖురేషీ అబధ్ధాలు చెప్పడం,మోసం చెయ్యడం,బెల్లించడం - బెదిరించదం అనేవి తన జీవితకాలంలో తను పాటించి తన మతాన్ని వ్యాపింపజేసి తన అనుయాయులకీ అదే ప్రవచించాడు.బలవంతంగా లొంగినవాళ్ళకి తమ పాత మతం పట్ల మమకారం ఉంటుంది, వాళ్ళలో ఎవరూమూర్ఖంగా హిందూమతాన్ని ద్వేషించి అరాచకంగా ఉండరు.సూఫీల ద్వారా హిందూమతంలోని కింది కులాల నుంచి మారినవాళ్ళలో పొమ్మనకుండా పొగబెట్టినట్టు తాము మతం మారాల్సిన పరిస్థితిని కల్పించినందుకు కొంత అక్కసు ఉంటుంది.కానీ ఈ రెండు రకాల వాళ్ళూ సామాన్యులే గనక బతుకుతెరువు కోసం అల్లాడిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళంతట వాళ్ళు హిందువులతో గొడవలు పెట్టుకునే వాళ్ళు కాదు.మొఘల్ సామ్రాజ్యం సుస్థిరం కావడంతో అప్పటి ప్రభుత్వంలో ప్రాపకం కోసం పూర్తి తెలివితో వుండి మతం మారిన వాళ్ళు మాత్రం మహా ప్రమాదకారులు.హిందువుల్లో తాము ప్రాచీన కాలపు రాజవంశానికి చెందినవారం అని చెప్పుకునేవాళ్ళలో ఎంతటి అహంభావం,ఎంతటి క్రౌర్యం,ఎంతటి పెత్తందారీతనం ఉంటాయో వీళ్ళలోనూ అవన్నీ అంత ఎక్కువగానూ ఉంటాయి.సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలాంటి కులీన కుటుంబపు ముసల్మాన్.ఇప్పటికి మీకు అర్ధం అయి ఉండాలి రెండురకాల ముస్లిములు ఎవరో - రాజకీయ ముస్లిములు,సామాజిక ముస్లిములు!

     సామాజిక ముస్లిములు మొదట్లో చాలా ఎకువగానే ఇంగ్లీషువాళ్ళ మీద జరుగుతున్న పోరాటంలో పాల్గొన్నారు,అరమరికలు లేకుండా హిందువులతో ఎన్నో ఉద్యమాలలో కలిసి పనిచేశారు.తొలిదశలో ఇంగ్లీషువాళ్ళ మీద హిందువుల కన్నా ముస్లిములే వీరోచితంగా పోరాడినారన్నది వాస్తవం!వినడానికి నమ్మలేని నిజంలా అనిపించినా సామాజిక ముస్లిములు రాజకీయ ముస్లిముల ప్రభావంలోకి వెళ్ళడం హిందూమతతత్వవాదుల మూలంగా కాకుండా హిందూ ముస్లిం ఐక్యత కోసం పరితపిస్తున్నానని చెప్పుకున్న గాంధీ వల్లనే జరిగింది!గాంధీ ప్రతిపాదించిన అనేక రకాల తమాషా పనుల్లో ఒకటయిన విదేశీవస్త్రబహిష్కరణ ముస్లింల పొట్ట కొట్టింది.రవీంద్రనాధ్ ఠాగూర్ తన ఘరె బైరె నవలలో చరిత్ర ఈ విషాదకరమైన మలుపు ఎట్లా తీసుకుందో కళ్ళకు కట్టినట్టు వివరించి చూపించాడు.అది ఇలా జరిగింది:దొరసానులు తమ అవసరాల కోసం ముస్లిములకి టైలర్లుగా తరిఫీదు ఇచ్చి పనిచేయించుకునేవాళ్ళు. ఈ ముస్లిం టైలర్లు  ఆ విద్యతో స్వదేశీ రాణుల్ని కూడా మెప్పిస్తూ ఉండేవాళ్ళు.ఆ రకంగా వాళ్లకి సంపాదన బాగుండేది.అసలే విదేశీవస్త్రబహిష్కరణ మూలంగా ఉపాధిని కోల్పోయి కడుపు మండినవాళ్ళ మీదకి అడపాదడపా ఉత్సవాల చందాదార్లు పోయిపడి వాళ్ళింకా బాగానే ఉన్నారనుకుని మొండిగా వేధిస్తూ ఉండటంతో వాళ్ళు కాంగ్రెసుకి దూరమై రాజకీయ ముస్లిముల వెనక చేరాల్సి వచ్చింది.

     రాజకీయ ముస్లిముల కందరికీ భారతదేశపు చరిత్రలో మొగలాయీల కాలం అంటే ఎక్కువ ప్రీతి ఉండటమూ,ఆనాడు ప్రభువులమై మేము హిందువుల్ని పరిపాలించాం అని గొప్పగా చెప్పుకోవటమూ,మళ్ళీ అలాంటి అధికారాన్ని అనుభవించాలని ఉవ్విళ్ళూరటమూ అన్నీ వారి లోపాయికారీ మాటల ద్వారానూ,రచనల ద్వారానూ,ప్రసంగాల ద్వారానూ తెలుస్తూనే ఉండేది.అయినా వాటిని తిప్పికొటకుండా వారికి కొమ్ములు మొలిపించారు.ఆఖరికి టర్కీ ప్రజలు తమని క్రూరంగా అణిచిపారేస్తున్న నిరంకుశుడైన ఖలీఫాని పదవీచ్యుతుణ్ణి చేసుకుని ఆనందిస్తుంటే ఇక్కడి ముస్లిములు యా అల్లా అంటూ అక్కడికి వెళ్ళి ఏమి సాధించారు?వాళ్ళు మా గొడవ మా ఇష్టం పోవోయ్ పీరుసాయిబూ అంటే చెవులు దులుపుకుని వచ్చారు!దానికి గాంధీ ఎందుకు వంత పాడాడు - బుజ్జగించి దగ్గిరకి తీసుకోవటానికి కాదా!ఆఖరికి విడిపోవటం ద్వారా ఏర్పడబోయే పొరుగు దేశానికి రాజ్యాంగబద్ధమైన అధినేత కాబోతున్న జిన్నా బహిరంగంగా కాలకేయుడు మాహిష్మతీ రాజ్యపు ప్రజల్ని రక్షణగా పెట్టుకున్నంత ధీమాగా ఇక్కడ మీమీద దాడి జరిగితే పాకిస్తానులో హిందువుల్ని నరుకుతాను అని చెప్పినా అప్పటి మన నాయకులకి ముస్లిం మతస్థులకు అతనొక్కడే ఏకైక ప్రతినిధిగా కనిపించి గౌరవించారంటే అప్పటి హిందువుల పరిస్థితి ఎట్లా ఉందో వూహించుకోవచ్చు!ఇప్పటికీ కొందరు రాజకీయ  విశ్లేషకులకి అతను గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు.

     అప్పటి భారతదేశపు రాజకీయ ముఖచిత్రం ఇంత సంక్లిష్టంగా ఉండటం వల్లనే మన దేశానికి స్వతంత్రం ఆ రకంగానే వచ్చింది.అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల అది అలా తప్ప మరొకలా జరిగడానికి ఆస్కారమే లేదు.దూరదృష్టి లేని ఆనాటి రాజకీయ నాయకులు ప్రజలు అత్యంత కీలకమైన ఎన్నికలో తమ అభిప్రాయాన్ని అంత విస్పష్టంగా చెప్పినా ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుందా తమ వ్యక్తిగత ప్రాభవాల కోసం ప్రజల్ని పావులుగా చేసి సజీవ చదరంగం ఆడుకున్నారు - అందుకే ప్రపంచంలో ఏ కాలంలోనూ ఏ దేశంలోనూ జరగనంతటి భయంకరమైన ప్రజల మార్పిడి ఇక్కడ జరిగింది!

     జిన్నా అంత ధీమాగా నేను భారత్ అంతర్గత విషయాల్లో కలగజేసుకుంటాను అని చెప్పినా మనం పొరుగున ఏర్పాటు చేసుకుంటున్నది సానుకూలంగా వ్యవహరించే మిత్రదేశాన్ని కాదు పక్కలోబల్లెం లాంటి క్రూరమైన శత్రుదేశాన్ని అని గ్రహించకుండా ఎంతో ఉత్సాహంగా పాకిస్తాన్ యేర్పాటుని స్వాగతించిన ఆనాటి మేధావులు అందరూ ఇన్ని దశాబ్దాల రక్తసిక్తమైన దేశచరిత్రకి సమిష్ఠిగా బాధ్యులే!అనాటినుంచీ ఈనాటివరకూ అమాయకులైన సామాజిక ముస్లిముల్ని గోమాయువులైన రాజకీయ ముస్లిముల అధిపత్యపు పడగనీడ నుంచి విడదీసి ప్రధానజీవనస్రవంతిలోకి తీసుకురావాలనే ఇంగితజ్ఞానం లేనివారే అడ్డూ అదుపొ లేకుండా ఈ దేశాన్ని పరిపాలించారు.ఉద్యమకాలం నాటి బ్రతిమిలాట ధోరణినే రాజ్యాంగబద్ధమైన గణతంత్రపాలనలోనూ కొనసాగించారు.దీనివలన ఎక్కువగా నష్టపోయంది కూడా సామాజిక ముస్లిములే - వారిప్పటికీ మటన్ కొట్లకీ సైకిల్ రిపేరు షాపులకే పరిమితమై ఉన్నారు!వారిలో ఎవరయినా చదువుకున్నవారు ఉంటే వివేకవంతులు సాటి హిందువులతో కలిసిమెలిసి జీవిస్తూ ప్రశాంతంగా బతుకుతున్నారు,అది లేనివారు రాజకీయ ముస్లిముల ప్రభావానికి గురై ఉగ్రవాదులుగా మారి దేశాన్ని మరోసారి పరాధీనం చెయ్యాలని చూస్తున్నారు.మార్చినవారు తమ కడుపులో చల్ల కదలకుండా సుఇఖంగానే బతుకుతున్నారు - మారినవారు మాత్రం అన్యాయంగా హతమారిపోతున్నారు!

     దేశాధినేతలు స్థూలంగా దిశానిర్దేశాలు మాత్రం చేస్తే దానికి తగ్గట్టు తమ మేధస్సుని ఉపయోగించి దేశభక్తి కలిగిన విదెశాంగ శాఖలోని అధికారులు ఇన్ని దశాబ్దాలుగా మన దేశాన్ని ప్రపంచవేదిక మీద సమున్నతంగానే నిలబెట్టారు.ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో తండ్రి మార్గానికి కొంత భిన్నంగా వెళ్ళి ధృఢత్వానికి మళ్ళించటం వల్ల ప్రపంచ రాజకీయ వేదిక మీద భారత్ ఎన్నో సంచలన విజయాల్ని సాధించింది.అయినా మౌలికంగా మెతకదనం ఉంటూనే ఉండేది.సమస్యలూ అట్లాగే ఉన్నాయి.పొరుగుదేశపు ధోరణిలో శాశ్వతమైన మార్పు లేదు.కానీ వాజపేయి కాలంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన గతకాలపు మార్గానికి పూర్తి భిన్నమైన వీదెశాంగ విధానం పొరుగుదేశానికి తప్పనిసరిగా తన ధోరణిని మార్చుకోవాల్సిన అవసరాన్ని కలిగించింది - మార్పు కనపడింది కూడా!కానీ ఆ ప్రభుత్వం ఎక్కువకాలం సాగకపోవటం,మళ్ళీ పాతపార్టీ అధికారంలోకి రావటం మళ్ళీ పాత విధానానికి మళ్ళటం జరిగింది - మళ్ళీ కధ మొదటి కొచ్చింది!

     కానీ ఇప్పుడు రెండేళ్ళ క్రితం తన వ్యక్తిగత ప్రతిభతో అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసుకున్న మోదీ అధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం ఈసారి మళ్ళీ వెనక్కి తిరగడానికి వీల్లేని విధంగా విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చివెయ్యడానికి నిశ్చయించుకోవడంతో భారతదేశం పాకిస్తానుకు గట్టి జవాబు చెప్పాలని చాలాకాలం నుంచి కోరుకుంటున్నవారికి ఆనందం కలుగుతున్నది.నిజమే,ఈసారి విదేశాంగ విధానం మళ్ళీ పాతపార్టీ అధికారంలోకి వచ్చినా చచ్చినా వెనక్కి వెళ్ళలేనంతగా మారిపోయింది.ఒకప్పుడు పాకిస్తానుకు శాంతికోసం ప్రతిపాదనలు పంపటం,వాళ్ళు వాటిని బుట్టదాఖాలా చేస్తుంటే ఓపిగ్గా మళ్ళీ మహజర్లు పంపటం,అంతర్జాతీయ వేదికల మీద సన్నాయినొక్కులు నొక్కటం భారత్ వంతుగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళింది.మన ప్రధాని పాకిస్తాను నుంచి చైనా వరకూ ఎవరికయినా సరే ఇప్పుడు హెచ్చరికలే తప్ప విజ్ఞప్తులు చెయ్యటం లేదు - శభాష్!

     నిన్నటి రోజున జరిగిన యూరీ ఘోరం దేశంలో శాంతికాముకుల్ని కూడా యుద్ధభాష మాట్లాడిస్తున్నది!ఆఖరికి పాతపార్టీ అధినేత్రి కూడా జాతి అంతరాత్మ మీద జరిగిన దాడి అనేసింది.ఇక కొత్తపార్టీ వాళ్ళు వూరుకుంటారా?పంటికి పన్ను కాదు,దవడనే తీసెయ్యాలి అంటున్నారు.సైనికపాటవం దృష్ట్యా పాకిస్తాన్ భారతదేశం కాలిగోటికి కూడా సరిపోలదు.కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరి కాదు.స్వతంత్రభారతప్రప్రధమప్రధాని ఆత్మీయుడని భావించి ఐక్యరాజ్యసమితి ముచ్చటపడి ఇచ్చిన వీటోపవర్ని కూడా దఖలుపరిస్తే దాన్ని తీసుకున్న మరుక్షణం నుంచీ భారత్ ఎదుగుదలనీ అడ్డుకోవడానికే తన శక్తియుక్తుల్ని ఉపయోగిస్తున్న మిత్రద్రోహి కమ్యునిష్టు చైనా వెన్నుదన్నుగా ఉంది.ఇస్లామిక్ రాజ్యం కోసం చేసే రక్తదాహపు జెహాదు ఒకరిది,వర్గరహితసమాజం కోసం చేసే రక్తదాహపు సాయుధపోరాటం ఒకరిది - నీచత్వంలో ఒకరిని మించినవారు ఒకరు!వాళ్ళతో కయ్యానికి దిగితే వాళ్లకి దీటుగా మనం కూడా కొన్ని క్రూరమైన పనులు చెయ్యాలి.ఒకవేళ సర్వశక్తులూ కంద్రీకరించుకుని పోరాడి యుద్ధంలో గెలిచినా అటువైపు వాళ్ళు ఎలాగూ ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు మనకి వీలయినంత ఎక్కువ నష్టాన్నే కలిగిస్తారు.గెల్చినా ఓడినా తక్కువ నష్టంతో యుద్ధాన్ని ముగించడమే అసలైన రాజనీతి.

     సాహితీసమరాంగణసార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల మనస్తత్వంలో ఒక వైకల్యం ఉంది.తల్లికి సంబంధించిన న్యూనత వల్ల అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందేది.దానిమూలంగానూ కావచ్చు,దానితో సంబంధం లేకుండానూ కావచ్చు హఠాత్తుగా మూర్ఖమైన కోపం వస్తూ ఉండేది.ఆ కోపంలో తీసుకున్న ప్రమాదకరమయిన నిర్ణయమే అప్పాజీకి కన్నులు పెరికించే శిక్ష!నిజానికి రాజు సర్వాధికారి గనక సాక్ష్యాలు బలంగా ఉన్నా తిమ్మరుసుకి అంత క్రూరమైన శిక్ష వెయ్యనక్కర లేదు.ఈ విపరీతపు మనస్తత్వానికి సాక్ష్యం కటకం మీద దండయాత్ర విషయంలో స్పష్టంగా కనబడుతుంది.అతను మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఒక చాకలి బట్టలు వుతుకుతూ "నెల్లూరు నాది,చిత్తూరు నాది - కాదని వాదుకు వస్తే కటకం కూడా నాదే అంటాను" అని పాడటం విన్నాడు.దాంతో అప్పటికే కటకాన్ని గెలవాలని చాలాకాలం నుంచి పోరుతున్నా పడనివ్వడం లేదని తిమ్మరుసు మీద అలిగి రాజభవనం నుంచి అదృశ్యమయ్యాడు.రాజుగార్ని సభకి తీసుకువళ్ళడానికి వచ్చిన తిమరుసు వెంటనే రాజుకి నలతగా ఉందని సభకి కబురు పంపించి చారుల్ని పంపిస్తే ఎక్కడో దూరంగా ఉన్న ఒక కోవెల్లో పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడట.తన మూర్ఖపుకోపంతో అనాలోచితంగా చేసిన ప్రమాదకరమైన పని అది - శత్రురాజ్యపు గూఢచారులు ఇతన్ని కనిపెట్టి ఉంటే!ముందు జాగ్రత్తగా కొంతమంది సైనికుల్ని పంపించి కాపలా ఏర్పాటు చేసి తనూ ఆనవాళ్ళు తెలియకుండా అక్కడికి చేరుకుని అడిగితే తన అలుగుడుకి కారణం చెప్పాడు.అప్పుడు తిమ్మరుసు ఈ రాజనీతినే చెప్పాడు,"నాయనా,ప్రాణాలు బలిపెట్టే సైనికులు ఉన్నారు గదా అని మూర్ఖంగా ఒకడికి పదిమందిని బలిపెట్టుకోగూడదు.ఆ అపనిలోనే అన్నిట్నీ ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తున్నాను.అయినా ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి.నేనూ యుద్ధానికి సిద్ధమే" అని.

     తిమ్మరుసు పాటించినది చాణక్యనీతియే!యుద్ధం ఎందుకు,ఎక్కడ,ఎప్పుడు,ఎలా చెయ్యాలి అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు.ఎందుకు చెయ్యాలి అన్నదానికి సమాధానం - లాభం!యుద్ధం మొదలైన దగ్గరి నుంచి గెలుపు సాధించేవరకు ఖర్చులు ఉంటాయి,వాటి సంగతి యేమిటి?గెలుపు అనేది మానసికావసరం కాకూడదు, గెలుపు వల్ల వచ్చే సంతోషంతో సరిపెట్టుకోకూడదు - ప్రయోజనం భౌతికంగా కనపడాలి!ఈసారి గెలిస్తే మన యుద్ధపు ఖర్చులు కూడా ముక్కుపిండి వసూలు చెయ్యాలి.భారత్ మీద యుద్ధం చేస్తే మన ఖర్చుల్తో పాటు వాళ్ళ ఖర్చులు కూడా మనమీదే పడతాయి అనే భయం వాళ్ళకి ఉండాలి.తొలిదెబ్బ మనం వేసి యుద్ధం మొదలుపెడితే ఇలాంటి అవకాశాలు మనకు రావు.

     కాబట్టి తిమ్మరుసులా చాణక్యనీతిని ఉపయోగించి నికృష్టపు చైనాని పాకిస్తాన్ పక్కనుంచి వేరుచెయ్యాలి.అమెరికా తరపున నిలబడి ఇరాక్ మీదకి మన సైన్యాల్ని పంపించడం వల్ల మిగిలిన ఇస్లామిక్ దేశాలు కూడా మనతో అంటీముట్టనట్టే ఉంటున్నాయి.దౌత్యరంగంలో ఆ లోపాన్ని సవరించుకోవాలి.ద్విజాతి సిద్ధాంతంతో పవిత్రభూమి పేరుతో ముస్లిముల కోసం ప్రత్యేక దేశంగా అవిర్భవిస్తే ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాలూ తమని అక్కున జేర్చుకుని సహాయం చేస్తాయని కలలు గన్న అప్పటి భారతీయ ముస్లిం మేధావుల అంచనాలను తల్లకిందులు చేస్తూ అప్పటినుంచీ ఇప్పటివరకూ పాకిస్తాన్ సాటి ముస్లిం దేశాలకి కూడా అంటరాని దేశంగా ఉంది - పొయెటిక్ జస్టిస్ అంటే అదే!ఇప్పుడు మనం తెలివితక్కువ ఎత్తులు వేస్తే  కధ అడ్డం తిరుగుతుంది - వారంతా పాకిస్తాన్ వైపుకి వెళ్ళినట్లయితే చాలా కష్టం.మన నాయకులు ఎంతగా సెక్యులరిజం అనే పదాన్ని వాడుతూ హడావిడి చేసినా ఇతరులు మాత్రం మనదేశాన్ని హిందూదేశంగానే చూస్తున్నారనేది వాస్తవం.సాక్షాత్తూ అప్పటి కాంగ్రెసు నాయకుడు ఒకరు "ఎటూ మతప్రాతిపదికన ముస్లిములు పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు గనక మన దేశాన్ని హిందూరాజ్యం అని ప్రకటించుదాం" అని సూచించాడు - ఎడ్వినా ప్రియుడు అందుకు ఒపుకోలేదు!కనీసం కాశ్మీరు విషయంలో లేని సమస్యని సృష్టించి వివాదాస్పదం చెయ్యకుండా వుంటే ఎంత బాగుండేది?

     చాణక్యుడు యుద్ధం ఎలా చెయ్యాలి అనేదానికి రెండు పరస్పర విరుద్ధమైన మార్గాలు సూచించి పరిస్థితిని బట్టి చేస్తే రెండూ సత్ఫలితాలనే ఇస్తాయని చెప్పాడు.ఒకటి తిమ్మరుసు కటకం మీద దాడి చేసినట్టు దౌత్యపరంగా శత్రువును ఏకాకిని చేసి శత్రురాజ్యం మీదకి దూకుడుగా వెళ్ళటం.అది భారతదేశానికి ఇప్పుడు పనికిరాదు.రెండవది శత్రువును చిన్న చిన్న సమస్యలతో చీకాకు పెట్టి రెచ్చగొట్టి తొలిదాడి చెయ్యక తప్పనీ పరిస్థితిని కల్పించి మనకు అనుకూలంగా ఉండేచోటికి రప్పించుకుని ఎదురుదాడితో లొంగదియ్యటం - ప్రస్తుతానికి మనకి ఇదే తగినది.విదేశాంగ వ్యవహారాలకి సంబంధించి ప్రస్తుత ప్రధాని వాడుతున్న భాష ఇప్పటివరకు సమతూకంగానే ఉంది - ఆయన కొంతకాలం అలా ఉండటమే శ్రేయస్కరం!

     వెనకటి తరం నాయకులు చేసిన తప్పులు ఇవ్వాళ స్పష్టంగా కనబడుతున్నందువల్ల వారిని విమర్శించడం ఎవరయినా చెయ్యగలరు.కానీ మనం తీసుకునే నిర్ణయాలు వ్యతిరేక ఫలితాల్ని ఇస్తే ముందరి తరాల్ని ప్రభావితం చేస్తాయి - వారు మనని విమర్శించకుండా జాగ్రత్తపడాలి.డెబ్బయ్యేళ్ళ క్రితం ఒక అహంభావి,స్త్రీలోలుడు,డాంబికుడు తనగురించి తను ఎక్కువగా వూహించుకుని తీసుకున్న పొరపాటు నిర్ణయాల వల్ల మన గ్రహపాటు ఇలా తగలడింది!ఆ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ మనం కూడా కొత్తరకం తప్పులు చేస్తే మనకి స్వతంత్రం అనవసరం - మళ్ళీ యూనియన్ జాక్ చల్లని నీడలో "గాడ్ సేవ్ ద కింగ్" అని పాడుకుంటూ కమ్మగా బతికెయ్యటం మంచిది!

     అప్పటివాళ్ళు గాంధీకి అవతరపురుషుడి హోదా ఇచ్చేసి అతని తింగరి పనుల్ని కూడా మేధావిత్వం కింద పులిమేసి భజంత్రీల మాదిరి ప్రవర్తించడం వల్లనే ఈ దేశానికి ఇన్ని కష్టాలు వచ్చాయి.ఆయనగారి కోడిమెదడుతో ఆయన మొగలాయిలని చెప్పి ఎన్నుకున్న ప్రబుద్ధులు మోతీలాల్ కొడుకూ రత్తి మొగుడూ తమ పదవీలాలసతో అంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుంటే పటేల్ లాంటి పోటుగాళ్ళు తొక్కలో గాంధీకి తను ఇచ్చిన పిచ్చిమాటకి కట్టుబడి చూస్తూ ఉండిపోయారు.కాశ్మీరు సమస్య లేకుండా ఉండి ఉంటే పాకిస్తాను ఎట్లా అఘోరించినా మనం బేఫికర్ జబర్దస్తుగా ఉండేవాళ్ళం.మన మహామహా నాయకులనుకోనే వాళ్లనే బోల్తాకొట్టించి, వాళ్ళకు కనీసం ఆలోచించుకొనే అవకాశంకూడా కూడా లేకుండా చేసి, వారి బుర్రలు మొద్దుబార్చే వ్యూహాలతో కాంగ్రెసునూ గాంధీనీ ఒప్పించి ఆదరబాదరగా దేశాన్ని చీల్చి ఒక నెత్తుటిముద్దను చేతిలోపెట్టాడు మౌంట్ బాటన్. కాశ్మీర్ ముమ్మాటికీ మాదే, దాన్ని మేము ఎల్లకాలమూ కాపాడుకొంటాము అని నిక్కచ్చిగా చెప్పాల్సింది పోయి చేష్టలుడిగిన నాటి ప్రధాని “నెహ్రూ పండితుడు” మౌంట్ బాటన్ చెప్పినట్లల్లా తలాడించి. ఇప్పుడు జరిగింది విలీనమే కాదు – ఆ తరువాతెప్పుడో ప్రజలు తీర్పు చెప్పేదాకా అది ఎటూ తేలేది కాదు – రాజు అడిగాడు కాబట్టి ఇప్పుడు సైన్యాన్ని పంపుతున్నాము – మామూలు పరిస్థితి పునరాద్ధరించగానే సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తాం – కాశ్మీర్ ను పరాయి రాజ్యాంగానే చూస్తాం – అంటూ, అర్థంలేని వ్యాఖ్యలు చేశాడు. – నెహ్రూ స్వయంగా తన వేలితోనే కాశ్మీర్ కంటిని పొడిచాడు. ఎవరయినా సలహా ఇచ్చినా వినేవాడు కాదు,ఎంతసేపూ హిందూరాజు హరిసింగుని ద్వేషించి తన కిష్టమైన సాయిబు షేక్ అబ్దుల్లా కోసం తపించిపోయాడు.కాశ్మీరు సమస్యను నాకన్నా గొప్పగా ఎవరూ పరిష్కరించలేరు అనేవాడు - అసలు లేని సమస్యని సృష్టించిందే తనూ తన మిండగాడూ!

     అసలు మన దేశం గురించి మనవాళ్ళతో ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా మనం ఎవణ్ణి ఇక్కణ్ణుంచి పొమ్మని తరుముతున్నామో వాడు చెప్పినట్టు వినడం దేనికి?బహుశా  మొగుడి మాట వినకపోతే పెళ్ళాం పక్కలోకి రానివ్వదని భయపడ్డాడేమో!కాశ్మీర్ సమస్యకు ఎవరినైనా నిందించవలసి వస్తే అగ్రతాంబూలం నెహ్రూకే ఇవ్వాల్సి ఉంటుంది.కానీ మిగిలిన వారి పాత్ర కూడా ఏమంత తక్కువ కాదు.నాటి కాశ్మీర్ రాజు “హరిసింగ్” పితలాటకంతో, "మౌంట్ బాటన్” కుత్సిత బుద్ధితో, “నెహ్రూ” ఆశ్రిత పక్షపాతంతో, మతిలేని నిర్ణయాలతో, సోవియట్ ఒత్తిళ్లకు లొంగిన “శాస్త్రి” సంతకాలతో, “ఇందిరా” చేసుకొన్న సిమ్లా రహస్య ఒప్పందాలతో, “వాజ్ పేయి” మెతకవైఖరితో  పరిష్కారం అనేది కనీసం కలలోకూడా ఊహించని జటిలమైన అంశంగా “కాశ్మీర్ సమస్యను” మార్చివేశారు.అసలు కాశ్మీర్ పై ఈనాటికీ మన విధానమేమిటో మనకే తెలియని అస్తవ్యస్త పరిస్థితి నెలకొని ఉంది. ఎంతసేపూ మనం సరైన రీతిలోనే చేస్తున్నట్లు ప్రపంచాన్ని ఎలా నమ్మించాలన్న సందిగ్ధంలోనే ఎన్నో తడబాట్లు, తొట్రుపాట్లు, దిద్దుబాట్లు, భంగపాట్లతోటే 7దశాబ్దాలు గడిచిపోయాయి.

=> కాశ్మీర్ విషయంలో ముందునుండీ న్యాయం మన పక్షానే ఉంది. 
=> పాకిస్థాన్ ముందునుండీ అన్యాయంగానే వ్యవహరింసూ ఉంది. 
=> కాశ్మీర్ మనది మాత్రమే అని చెప్పడానికి మనది తిరుగులేని కేసు. 
=> పాకిస్థాన్ దగ్గర అసలు కేసే లేదు.

     ఇకనైనా మిత్రుడే తొలిశీల వూడగొట్టేసిన పనికిరాని పంచశీలని తుంగలో తొక్కి తిరుగులేని చాణక్యుడి షాడ్గుణ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుని దేశప్రజలు గుండెలమీద చెయ్యి వేసుకుని నిద్రపోయేలా సరిహద్దుల్ని క్షేమంగా ఉంచాలి.ప్రస్తుతం కాశ్మీరును పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కూడా భారత ప్రభుత్వానికి సానుకూలంగానే స్పందిస్తున్నారు గనక స్థిమితంగా వ్యవహరించి దౌత్యపరంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రపంచవేదిక మీద ఏకాకిని చెయ్యాలి.ప్రాచీన కాలపు రాజనీతిజ్ఞులు రాజ్యపరిపాలనకు 1. రాజ్యం,  2. మంత్రి, 3. స్నేహితుడు(మిత్రరాజ్యాలు), 4. ధనాగారం, 5. రాష్ట్రం(ప్రజలు), 6. దుర్గము, 7. సైన్యము అనే విభాగాలని చెబితే చాణక్యుడు రాజ్యం రాష్ట్రం అనేవాటిని కలిపేసి ఆరు అంశాలకి కుదించాడు.ధనాగారాన్ని ఎప్పుడూ నిండుగా ఉంచుకోమన్నాడు.ఇప్పటి కాలానికి ఫారిన్ ఎక్స్చేంజి రిజర్వ్స్ వస్తాయి.షాడ్గుణ్యం అనేది దీనికి భిన్నమైనది.అది సరిహద్దు రాజ్యాలతో వ్యవహరించాల్సిన విధానాలకి సమబంధించిన నిర్దేశకాలతో నిండి ఉంటుంది.సరిహద్దు రాజ్యం పూర్తిగా బలహీనమయితే అటువైపున ఉన్న బలమైన రాజ్యం దానిని ఆక్రమించి మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనేది చాణక్యుడి హెచ్చరిక.ఈ విషయంలో మనం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లనే చైనా ముత్యాలసరం అనే చక్రవ్యూహంతో మనని అష్టదిగ్బంధనం చేసిపారేసింది.మన వెనకటి తరంవారు ముళ్ళకంప మీద విలువైన బట్టను వేశారు,మనం దాన్ని చిరిగిపోకుండా బయటికి లాక్కోవాలి.మన తర్వాతి తరంవారికి కొత్త సమస్యల్ని సృష్టించకూడదు.


ఒక హిందూరాజ్యం ఒక ముస్లిం రాజ్యాన్ని కబళిస్తున్నది అనిపించుకోకూడదు!

252 comments:



  1. మనకు మనం యుద్ధానికి
    కనకన మన కూడదోయి కవ్వింపు గనన్
    తను మన మీదకు వచ్చిన
    అనుమతి అసలు వలదోయి ఆయుధము గొనన్ !

    ReplyDelete
  2. hari babu garu koncham dose ekkuvaindemo....

    ReplyDelete
  3. Here is a detailed analysis of consequences "If India decides go for a war with Pakistan"

    https://www.facebook.com/drsubramanianswamy/photos/a.118146701658320.18858.107229389416718/820016674804649/?type=3

    ReplyDelete
    Replies
    1. A very good link. India should take action but not in a hurry. The strike must have its impact for long and useful. It is china which is fighting but not Pak. proxy war going on. The strike must stop the progress of China to Arabian waters. So many thing should not be discussed in open, it is my opinion.

      Still I v to read the post

      Delete
  4. చక్కటి వ్యాసం ఆండీ.. చాలా బాగా వ్రాశారు..

    ReplyDelete
  5. If India has to hit terror factories in Pakistan, be ready for a war with China!

    http://kiranasis.blogspot.in/2016/09/if-india-has-to-hit-terror-factories-in.html?m=1

    ReplyDelete
  6. If you have been perplexed during past three years as to why Muslims from India and other nations are radicalised in favour of the Islamic State, Maulana Azad's speech gives a clear insight into the historical Muslim mind. And he was not a 'sanghi', or a Zionist, or even an Islamophobe


    http://www.firstpost.com/india/global-islamism-jihadism-and-maulana-abul-kalam-azad-my-defence-lawyer-2981062.html

    ReplyDelete
  7. There's no such thing as a moderate Muslim - Omair Ahmad

    http://www.dailyo.in/politics/dhaka-attack-bangladesh-muslims-islam-isis-terrorism-omar-mateen-european-enlightenment/story/1/11536.html

    ReplyDelete
  8. వాడెవడో ఉగ్రవాది అన్నది నిజంచేసేశాడు మన ప్రియతమ ప్రధాని(ఇలా అనకపోతే ప్రధానినే అవమానించారు అని ఎగబడతారు మళ్ళీ. వీళ్ళ బతుకు చెడ). సినిమాల్లోనే మనం వీరత్వం చూపిస్తాం అని ఒప్పేసుకున్నారు మన ఆశా దీపం.

    ReplyDelete
    Replies
    1. నువ్వేమి చెప్పాలనుకొంట్టున్నావు? ఇలా అజ్ణాతంగా అర్థం కాని వ్యాఖ్యలు రాయటం ఎందుకు?

      Delete
    2. @Anonymous26 September 2016 at 04:32
      నిజమే,కొంచెం స్పష్టంగా మీ అభిప్రాయం చెప్పవచ్చును కదా,అన్యాపదేశపు అర్ధంకాని సుత్తి దేనికి?

      Delete
  9. భారతదేశం తనకైతాను యుద్దానికి వెళ్ళే అవకాశం లేదు. అలాగని ఎంతకుముందు ప్రభుత్వాల్లాగ చేతులుముడుచుకుని కూర్చోదు. ప్రస్తుత ప్రభుత్వ చర్యల సత్తా బయటికి తెలియాలంటే కనీసం ఒక సంవత్సరం అన్నా ఆగాలి. అమెరికా లాంటి దేశమే లాడెన్ కోసం ఎంతో ఓపిక ప్రదర్శించింది. పాకిస్తాన్ ని కనీస వనరుల కోసం అల్లాల్లాడేలా చేయాలి. ఇక పాకిస్తానోడే యుద్దానికొస్తే అది వేరేసంగతి.

    ReplyDelete
    Replies
    1. పిచ్చోడు చేతిలో రాయిని ఎప్పుడైనా విసరొచ్చు. నువ్వు నీవైపునుంచి కవ్వించకపోయినా రాయి పడదని గ్యారంటీ లేదు. మనం గమ్మునున్నా ఆపిచ్చోడు పదేళ్ళ తరువాతైనా రాయి విసరడా? తెలివైనోడు పిచ్చోడిని నాలుగు పీకైనా రాయిని లాక్కుంటాడు. మన సైన్యం దెబ్బకి ఈపాటికే వాడిపిచ్చి పెరిగుండాలి. మనం అన్న్నిటికీ సిద్దపడే ఉండాలి.

      Delete
  10. Pls read this article

    National Hero of Sindh, Maharaja Daahar

    Maharaja and his family were Hindu Brahmins, ruling overages secularly and in a civilized manner and never let their religion interfere in state affairs. In the times of Maharaja Daahar himself, his minister for finance was an Arab Muslim called Muhammad Ilafi, governors of various counties/provinces were Buddhists. Buddhism had deep roots in Sindhi society in his times as well.

    http://industribune.net/blog/news/196

    ReplyDelete
    Replies
    1. అహ్మద్ ఖురేషీ అనబడు ఆఖరి ప్రవక్త మక్కావాసులు బహిష్కారం శిక్ష విధిస్తే వచ్చి సింధ్ ప్రభువు ప్రాపకంలో బతికి బట్టకట్టాడని అంటారు.అప్పుడు సింధ్ ప్రభువు ఆదరించకపోయి ఉంటే ఆకలికి అల్లాడి చచ్చిపోయి ఉండేవాడు!ఇస్లాం అనే మతం ఎక్కడ ఉండేది?

      Delete
    2. హరిబాబు గారు, ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. బాహుబలి లో ప్రభాస్ "నేనేవరిని?" అని ప్రశ్నించినట్లు, పక్కదేశాల వాళ్ళు ప్రశ్న వేసుకొని వాళ్ల మూలాలు వెతుకొంట్టున్నారు. వాళ్లంతా గుర్తించిందేమంటే వారికి అరబ్బుల సంస్కృతి కి ఏ సంబంధం లేదని.

      సింధ్ లో వారిని పాలించిన హిందూ బ్రాహ్మణ రాజును జాతీయ హీరోగా ప్రకటించుకొన్నారు. నేడు అక్కడ ఏ హిందువు వాళ్లని ప్రభావితం చేసే స్థితిలో లేడు. హిందువుల మెప్పుకోసం వాళ్ళు అలా రాయలేదు. నిజాయితిగా వాళ్లు వాళ్ల చరిత్రను మధించి చేసుకొన్న విశ్లేషణ వారిని ఆకంక్లుషన్ కు దారితీసింది.

      ఇక మనతెలుగు మేధావులు, వాళ్ళకి పూర్తి విరుద్దం గా చరిత్రను వక్రీకరిస్తూంటారు. నిత్యం పేపర్లలో అబద్దాలను కుప్పలతెప్పలుగా అలుపెరగకుండా రాస్తూ, విశ్లేషణలు చేస్తు వాస్తవాలను దాచేస్తూంటారు. దీనివలన ఎంతో నష్టం ఉన్నా అదే పాట ఏళ్ళు పూళ్ళు పాడుతూంటారు.ఆంధ్రజ్యోతి,సాక్షి పేపర్ లు ఇటువంటిఅవస్థవాలను రాసే మేధావులను ప్రోత్సహించటం లో అగ్రస్థానం లో ఉంటాయి. ఐలయ్య గారి పుస్తకాల సంగతి చెప్పనవసరంలేదు. సింధ్ సమాజం గురించి ఆయన రాసినది, వాస్తవంగా సింధ్ లో జరుగుతున్నదానిగురించి పక్కన పెట్టి విశ్లేషిస్తే, కళ్ళుతిరిగే నిజాలు బయటపడతాయి. 2014లో పాకిస్థాన్ లో సింధీలు మాది 5000 సంవత్సరాల సంస్కృతి అని ప్రపంచానికి చెప్పటం కోసం సింధ్ పండగ ను జరుపుకొన్నారు. దానికి షబాన అజ్మి కూడా హాజరయ్యింది. మరిన్ని వివరాల కొరకు గూగుల్ సర్చ్ చేయండి.

      https://www.geo.tv/latest/91697-sindh-festival-to-bring-mohenjodaro-makli-back-to-life-bilawal

      Delete
    3. మా సంస్కృతి కి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. మా సంస్కృతి వేరు అరబ్బుల సంస్కృతి మాది కాదు అని అంటే అర్థమేమిటి? పరోక్షం గా మేము ఒకప్పుడు హిందువులమనే చెప్పుకోవటం. ఆ సంస్కృతే మిగతావాటితో పోలిస్తే ఉత్తమమని ఒప్పుకోవటం కదా!

      Watch these two videos also.
      https://www.youtube.com/watch?v=nmzz4Mg6OJE

      https://www.youtube.com/watch?v=FH2AkwXCBa8

      Delete
    4. ఈ రోజు ఐలయ్యగారి ఆర్టికిల్ ఒకటి ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. కింద కంచి ఐలయ్య షెపర్డ్ అని ప్రింట్ చేశారు :) :)

      Delete
    5. Watch this video

      If India gives us shelter, we’ll remember it for 1,000 years: Ahmar Mustikhan


      http://www.timesnow.tv/newshour-shorts/video/if-india-gives-us-shelter-we%E2%80%99ll-remember-it-for-1000-years-ahmar-mustikhan/49553

      Delete
  11. How the BJP turned a small band of non-resident Indians into a global PR machine

    http://qz.com/790858/from-babri-to-balochistan-the-rise-of-the-overseas-friends-of-the-bjp-as-narendra-modis-global-megaphone/

    ReplyDelete
    Replies
    1. Internationalise Pak villainy: Kautilya’s principles of realpolitik must replace idealism in India’s Pakistan policy

      Baijayant 'Jay' Panda is a BJD Lok Sabha MP.

      http://blogs.timesofindia.indiatimes.com/toi-edit-page/internationalise-pak-villainy-kautilyas-principles-of-realpolitik-must-replace-idealism-in-indias-pakistan-policy/

      Delete
  12. పాక్ పై సర్జికల్ దాడులు - మూగబోయిన "జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ" బ్లాగు

    దాడులు జరిగింది పాక్ పై ఐతే, షాక్ తగిలింది బ్లాగరుకా?

    ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా, తనదైన శైలిలో వార్తలను రాసే "జాఅంవావి" బ్లాగు నిన్నటి నుంచి మూగ పోయింది. పాక్ పై సర్జికల్ దాడులు జరిగాయనే వార్త బయటకు పొక్కడంతో, దాని మీద ఎటువంటి పోస్ట్ రాయకుండా అజ్ణాతంలోకి వెళిపోయిన బ్లాగరు ప్రవర్తనతో పాఠకులు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. ఈ సంఘటనపై

    ఆ బ్లాగు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో పాఠకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

    దయచేసి ఆ బ్లాగరు తన విలువైన విశ్లేషణ చేయగలరని ఆశిస్తూ..

    ReplyDelete
    Replies
    1. Witing for His Master's Voice

      Delete
    2. నువ్వన్నది నిజమే! చైనా నాకెందుకీ గొడవ, మీలో మీరు చూసుకోండి అని పక్కకు తప్పుకొంది. అందువలన బ్లాగరు
      సార్ దగ్గర సమాచారం లేదు. ఆయన ఇండియా సమాచారాన్ని నమ్మడు. పాకిస్థాన్ షాక్ నుంచి తేరుకోలేదు. పాక్ ఏజెన్సిల నుంచి ఇంకా సమాచారం వచ్చినట్లు లేదు.

      వచ్చినా ఆ సమాచారంలో మాత్రం కొత్తగా ఎమి ఉంట్టుంది? సమాచారం లో భావం కూడా రాసే రచయితను బట్టి మారిపోతుంది. ఆయన సమాచారం రాలేదని ఇలా ఖాళీ గా కూచుంటే ఎలా? పాఠకులకు ఎదో ఒకటి వండివార్చాలి గదా?

      ఈలోపుగా ఆయనకు అలవాటైన ఆవు వ్యాసం రాయోచ్చు. యుద్దం లో చనిపోయిన వారంతా పేద,అణచివేత వర్గాల వారని,
      రాజ్యం కర్కశంగా అణచివేసిందని,అమాయకులని కితాబులిస్తూ,
      భారతదేశాన్ని అవమానిస్తూ, చైనాను కీర్తిస్తూ,
      మోడిని తిట్టిపోస్తూ,హైందవ విషనాగు అంట్టూ హిందువులను ద్వేషిస్తూ ఒక పోస్ట్ రాసేయొచ్చు.

      Delete
    3. wait! wait!! you will see a much better story than that including so many things which even Pak cannot dream of

      Delete
  13. Hats off to Indian army for the surgical operation and success.

    ReplyDelete
  14. Wow!38 for 17,exact double score!!LA Jawab kaa muqablaa?!

    ReplyDelete
    Replies
    1. Not just double- more than double,yes!

      Delete
    2. Not just double- more than double,yes!

      Delete
    3. This would have been done long back, any how it is done now,well done

      Delete
    4. పాక్ మీద చేసిన దాడిలో ఎంతమంది చనిపోయారో నిర్దిష్టమైన లెక్క ఏం లేదనుకుంటా. ఈ 38 అనే నెంబర్ భూటాన్‍లో దాడి చేసినప్పటిది. మీడియా కన్‍ఫ్యూస్ ఆయ్యిందనుకుంటున్నా.

      Delete
  15. Wow!38 for 17,exact double score!!LA Jawab kaa muqablaa?!

    ReplyDelete
    Replies
    1. ఇంతకీ హాఫీజ్ సైయ్యిద్ ఉన్నాడా? పోయాడా? ఉంటే, మీడీయా ముందు కనపడలేదేమి? ఒక పెద్ద దేశం అనామకులను చంపటానికి, ఇంత పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేస్తారా?

      Delete
    2. ఈ సర్జికల్ స్ట్రయిక్ అనేది ఆపరేషన్ పరంగా కాస్త పెద్దదే కావచ్చుగానీ (గీతదాటమని మనమే మడిగట్టుకున్నాం కాబట్టి), అటాక్‍గా చూస్తే చిన్నదే. దాడి మొత్తం బార్డర్‍ నుంచి మూడు కిలోమీటర్ల లోపలున్న వాటిపైనే. హఫీజ్ సైయ్యద్ అంత పక్కనే ఉండబోడు. ఇంతకన్న లోపలికి చొచ్చుకుపోవచ్చు కానీ దానికోసం మన సైనికుల ప్రాణాలు మరింత రిస్క్‌లో పెట్టాలి.

      మోడీ ప్రధాని కాకమునుపు ఎన్ని స్టేట్‍మెంట్స్ ఇచ్చినా, ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్నాక అన్ని సాధకబాధలు తెలుస్తాయి. అందుకే ఆవేశపడకుండా పాకిస్తాన్‍కి అన్ని వైపులా బిగించే కార్యక్రమంలో ఉంది భారత ప్రభుత్వం. ఈ బిగింపులకే దారికి రావచ్చు, లేదూ ఇంకా మొండికేస్తే మనం అటాక్ చేసినా దానికో అంతర్జాతీయ సమర్దింపు దొరుకుతుంది. నిజానికి పాక్‍ విషయంలో చేయాల్సిన, భారత ప్రభుత్వం చేయాలనుకుంటున్న అసలు అటాక్ ఇదే. మొన్న జరిగిన సర్జికల్ స్ట్రయిక్, ఆవేశపడుతున్న మీడియాని సోషల్ మీడియాని శాంతపరచటానికి మాత్రమే. మోడీ ప్రధాని ఐతే యుద్దం ప్రకటించేస్తాడని, అప్పుడెప్పుడో ఆణ్వాయిధాలు లేక ముందు ఇందిరా హయాంలో జరిగినట్టు మన సైన్యం గీత దాటెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేస్కుంటుందని ఆశించిన అభిమానులందరూ నిరాశపడ్డారు, వ్యతిరేక మీడియా ఎకసెక్కాలు పోయింది. ఆర్థికంగా, దౌత్యపరంగా, నీళ్ళ దగ్గరా అన్ని వైపులా బిగించే పని చాలా సమయం తీస్కుంటుంది. ఆలోపున మీడియానీ, సోషల్ మీడియాని శాంతపరచటానికి ఈ చిన్న సర్జికల్ స్ట్రయిక్. పనిలో పనిగా పాక్‍కి, అంతర్జాతీయ సమాజానికి ఒక మెసేజ్, మేము కట్టుకున్న మడి విప్పేశాంరోయ్ అని చెప్పటానికి.

      Delete
    3. అనామక,
      నేను ఆలోచన రేకెత్తించటానికి వేసిన ప్రశ్న అది. నువ్వు రాసిన విషయాలు,విశ్లేషణలు నాకు తెలియక కాదు. మీరు రాసిన దానిలో చాలా వాటి తో ఏకిభవించను. ముఖ్యంగా మీడియా కోసం, అభిమానుల కోసం మోడి యుద్దం చేశాడు అనటం. ఇటువంటి గాలి మాటలు పేపర్లలో రాజ్ దీప్ సర్దేశాయ్ రాస్తాడు. Don't follow him. మా బంధువులలో ఏర్ ఫోర్స్ లో ఉన్నత పదవిలో పనిచేసినవాళ్ళు ఉన్నారు. I know how it works.
      ___________

      *సైన్యం గీత దాటెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేస్కుంటుందని ఆశించిన అభిమానులందరూ నిరాశపడ్డారు*

      ఈ మాట విని రెండోసారి ఉలికిపడ్డా. మొదటి సారిగా ఎప్పుడు ఉలిక్కి పడ్డానంటే, 5-6 ఏళ్ల క్రితం యుట్యుబ్ లో ఎదో పాకిస్థాన్ టివి లో జరిగిన చర్చను మొదటిసారిగా చూసాను. అందులో ఒకతను మన దేశంలో ప్రభుత్వం ఇలాగే నడుస్తూంటే, ప్రజలకు ఏ ఆప్షన్ లేదు వాఘా బార్డర్ కు పోయి భారతదేశాన్ని మనలను వాళ్ల దేశంలో శరణార్ధులుగా అనుమతించమని వేడాల్సిందే అని చెప్పుకొంట్టు పోయాడు. ఆ మాటలు విని అదిరి పడ్డాను. కారణం దేశ విభజన సమయంలో డిల్లీ లో కాందిశీకులు వచ్చినపుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు.

      130 కోట్ల జనభాతో, మనదేశంలో ఎన్నో లోపాలు ఉన్నా, ముందో వెనుకో వాటిని సరిదిద్దుకొంట్టు,సర్దుకుపోతూ , కిందా మీదపడుతూ నెట్టుకొస్తున్నాము. సుమారు 20కోట్ల పాకిస్థాన్ స్వాధీనం చేసుకొని? ఎమీ చేసుకొంటాం. వీళ్ళ భారాన్ని ఎవరు ఎత్తుకొంటారు?

      మనదేశానికి ఆ కోరికే ఉంటే బంగ్లాదేశ్ గెలిచిన తరువాత వాళ్లని మనమే పాలించేవారం. పాకిస్థాన్ స్వాధీనం చేసుకోవాలనే ఊహ భారతపాలకులకు కాని, భారతీయులకు గాని కలలో కూడాలేదు. పదే పదే దొంగదెబ్బలు కొడుతూంటే, సైన్యం దాడులు చేయవలసి వస్తున్నాది. వాళ్ళు మంచి గా ఉంటే, తగవులెందుకు?

      భారత దేశం వారి అంతరంగిక విషయాలలో సహాయం చేయాలని ఆదేశ రాజకీయ నాయకులు,మేధావులు అర్ధిస్తున్నారు. ఒకప్పుడు నవాజ్ షరిఫ్ ఇలానే అడిగాడు. ఇప్పుడు భుట్టో కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. మహా ఐతే మన ప్రభుత్వం వాళ్ళ కోరికను మన్నిస్తూ చేయదగిన సహాయం చేస్తుంది.

      Murtaza Bhutto sought India’s support
      September 21, 2016
      http://www.thehindu.com/news/international/south-asia/fathers-killers-enjoy-high-office-in-pakistan-says-fatima-bhutto/article9131365.ece

      Delete
    4. America Support India After Strike

      https://www.youtube.com/watch?v=CpQM2fgLzSw

      Delete
    5. This is the New India BY Alyssa Ayres

      http://blogs.cfr.org/asia/2016/09/29/this-is-the-new-india/

      Delete
  16. మీడియా కోసం అభిమానుల కోసం మోడీ యుద్దం చేసాడని నేనట్లేదు. ఇప్పుడు జరిగింది అసలు యుద్దం కాదు. జస్ట్ చిన్న సాంపిల్ అంతే. పూర్తిస్థాయి యుద్దమైనా, లేక దౌత్యమార్గాల్లో ఇరుకునపెట్టడమైనా, ఈ రెండు మార్గాల్లో దేన్ని ఎంచుకున్నా అది లాంగ్‍టర్మ్ ప్రాసెస్. ఉరీ ఘటనతో ఆగ్రహం చెందిన జనాలని శాంతింపచేయటానికి ఈ చిన్నదాడి. ఇక్కడితో జనము, చనిపోయిన సైనికుల కుటుంబాలు శాంతిస్తాయి. ప్రభుత్వం లాంగ్‍టర్మ్ లక్ష్యాల మీద ప్రశాంతంగా దృష్టి పెట్టొచ్చు.

    పాకిస్తాన్‍ని స్వాధీనం చేస్కోని మనమే వాళ్ళని కూడా పాలించటమని నా వాఖ్యలో లేదు. గత రెండు యుద్దాలలో జరిగినట్టు మన సైన్యం వాళ్ళ నగరాలని అదుపులోకి తీస్కుంటూ వెళ్ళి యుద్దంలో గెలవటం అని. చాలామంది దృష్టిలో ఉన్న యుద్దం అదే. అఫ్‍కోర్స్, మీరు చెప్పినట్టు కలగంటున్నవారు లేకపోలేదు. RSS వారి అఖండ్ భారత్ కలలో మీరు చెప్పినట్టే ఊహిస్తున్నారు. పైన మీరు చెప్పిన కారణాలు వాళ్ళకి వెలుగుతున్నట్టు లేదు.

    ReplyDelete
    Replies
    1. పాకిస్థాన్ లో ఉండేవి నాలుగు రాష్ట్రాలు. సింధ్ లో భుట్టో కుటుంబ సభ్యులు, యం.క్యు.యం. అల్తాఫ్ హుసైన్ వీళ్ళు భారతదేశ సహాయం చాలా సార్లు కోరారు. బెలుచిస్తాన్ వాళ్ళు కోరుతున్నారు. నార్త్ వెస్త్ ఫ్రంటైర్ కు చెందిన పస్థూన్ ల నాయకుడు సరి హద్దు గాంధి అనబడే ఖాన్ ఆబ్దుల్ గఫర్ ఖాన్ దేశ విభజన సమయంలో, భారతదేశం లో ఉండాలని కోరుకొన్నారు. వాజ్పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ కు చాలా అండగా ఉన్నాడు. వాజ్ పాయ్ మనుషులను గుర్తించే స్థితిలో లేకున్నా, ఇప్పటికి వాజ్ పాయ్ మీద గౌరవం, అభిమానంతో నవాజ్ షరీఫ్ భారతదేశం కు వచ్చినపుడ్డల్లా ఆయనను చూసి పోతూంటాడు.

      ఇలా ప్రతి ఒక్క రాజకీయ పార్టివారు భారతదేశ మద్దతు అవసరమైనపుడ్డల్లా తీసుకొంట్టున్నారు. భవిషత్ లో యురోప్ యునియన్ లో వలే ఆరాష్ట్రాలతో రవణాను పునరుద్దిస్తే
      అఖండ్ భారత్ కల వాస్తవ రూపం దాల్చినట్టే.

      http://timesofindia.indiatimes.com/india/Nawaz-Sharif-accepts-Kargil-was-a-backstab-for-Atal-Bihari-Vajpayee/articleshow/51032439.cms

      Delete
    2. Ambani intervened with Clinton in 2000 to save Sharif's life, claims Gadkari

      "Before that programme, Dhirubhai met Clinton and requested him to use his good relations with Musharraf to save Sharif's life, for it was feared that Musharraf would get rid of Sharif like how Zia-ul-Haq got rid of Zulfiqar Ali Bhutto. Dhirubhai said Sharif was his friend and that he should be allowed to live. He also told Clinton that Sharif was as good as his own countrymen because India and Pakistan were one before partition. Both his sons, Mukesh and Anil, were present then,” Gadkari said at a book release function on Sunday.

      http://www.rediff.com/news/report/ambani-intervened-with-clinton-in-2000-to-save-sharifs-life/20130520.htm

      Delete
  17. చాలా తక్కువ పరిమితిలో జరిగిన సైనిక చర్య. ఐనా ప్రాధాన్యం సంతరించుకుంది. కారణాలు, పాక్ కు భారత విదేశీ వ్యవహారాలలో మార్పొ౦చ్చిందని చెప్పడం. దాని మూలంగా పాక్ గంగవెఱ్ఱులెత్తి ప్రపంచ దేశాల దగ్గరకు మద్దతుకోసం పరుగులు పెట్టడం, పాక్ కు ఆర్ధిక దిగ్బంధం ఎలా ఉంటుందో చెప్పడం, నీటి రూపంలో.ఇక ముందు కూడా ఇటువంటివి జరుగుతాయనే హెచ్చరిక ఇవ్వడం, అన్యాపదేశంగా. ప్రపంచ దేశాలలో పాక్ పట్ల ఏకాభిప్రాయం తీసుకురావడం.పొరుగుదేశాలలో పాక్ కి ఉన్న విలువేంటో తెలియజేయడం. సార్క్ దేశాల సదస్సుకు రామని మిగిలినదేశాలు చెప్పడం, ఇది పెద్ద చెంపపెట్టు. చాలా ముఖ్యమైనది చైనా వ్యవహారం. బలూచ్ లో జరుగుతున్న హననాన్ని ప్రచారం చేయడం. బలూచ్ వారికి మద్దతివ్వడం మూలంగా ప్రస్థుతానికైనా చైనా తన అరేబియాకు నిర్మిస్తున్న రోడ్ గురించి పునరాలోచనలో పడటం. ఇక్కడ పని చేసే ఒక చైనీయునికి ఇద్దర్ని కాపలా పెట్టాల్సి వస్తోందట. ఇక వియత్నాం తో భారత్ స్నేహం మూలంగానూ, బలూచ్ మూలంగానూ చైనా పాక్ కి దూరంగా ఉండిపోయింది. స్వప్రయోజనాలే ఏ దేశానికైనా ముఖ్యం. చైనా ను సమస్యకు దూరంగా ఉంచగలగడం పెద్ద విజయం, ఇదంతా దౌత్య విజయం. ఇక మామూలుగా పాక్ కివంత పాడే అమెరికాను దూరం చేయగలగడం మరో విజయం. ఇన్నిటి సందర్భంలో సైనికుల వీరత్వం బాగా రాణించింది. పాక్ కి మానసికంగా పెద్ద దెబ్బ తగిలింది. భారత విదేశాంగ నీతికి జవానుల ధైర్య సాహసాలకు జేజే లు.

    బయట శత్రువులను సైనికులు చూసుకోగలరు, అంతః శత్రువులతోనే చాలా ఇబ్బందులొస్తాయి, తస్మాత్ జాగ్రత!

    ReplyDelete
  18. హరిబాబు గారూ!
    సారంగ ఎడిటర్ పేరు మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రయిక్స్ జరగగానే ఈ రోజు ఆ పత్రికలో ‘‘నిన్ను ఓడించే యుద్ధం’’ అంటూ ఓ కవిత వ్రచురింతమయింది. అంటే, ఉగ్రవాదులపై దాడిచేయగానే ’’యుద్ధం అమానుషం‘‘ అని కన్నీళ్ళు కార్చే తత్త్వం అన్నమాట. దానికి జవాబుగా నా మిత్రుడొకరు ఈ క్రింది టపా వ్రాసారు. అది వాళ్ళు ఎప్పటికీ ప్రచురించకపోవచ్చు. అందుచేత, ఆ మహా మానవతా బృందం మీ పాఠకులలో ఎవరైనా వుంటే చదువుతారని ఇక్కడ వ్రాస్తున్నాను
    ....శ్రీనివాసుడు
    ***********************************************
    నరసింహారావు K.
    ఈ కవితను ఊరీలో 20 మంది భారత సైనికులని చంపిన వెంటనేగానీ, పఠాన్ కోట్ దాడి తరువాత గానీ, కార్గిల్ యుద్ధం తరువాతగానీ, ముంబై దాడుల తరువాతగానీ, భారత పార్లమెంట్ ఉగ్రమూకల దాడి తరువాత గానీ వ్రాస్తే సమంజసంగా వుండేది. అప్పుడున్న స్పందనా రాహిత్యం సర్జికల్ స్టయిక్స్ జరిగిన తరువాత ఎందుకు లేదూ అనేదే ప్రశ్న.
    1989 నుండి 2002 వరకూ కష్మీర్ లో మాత్రమే పాక్ ఉగ్రవాద దాడుల వల్ల 4600 భారత సైనికులు, 13500 పౌరులు, 16000 ఉగ్రవాదులు చనిపోయారు. అప్పుడు లేదా ’’నిన్ను ఓడించే యుద్ధం‘‘
    యుద్ధాన్ని ఏ సంఘపరివారో, మాటల మోళీనో కోరుకుంటున్నారు అనేది ఒక తప్పుడు అవగాహన. బి.జె.పి. నే యుద్ధం కోరుకునేదయితే కార్గిల్ యుద్ధం తరువాత అనేక నెలల సరిహద్దుల్లో సైన్యం ఎందుకు పడిగాపులు కాసేదో చెప్పగలరా?
    పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికులు దాడి చేయగానే సామాన్య పౌరుల పట్ల ఎంత జాలి, ఎంత వేదనా కలిగేయో ఈ కవిత చూస్తేనే అర్థమవుతుంది.
    ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం, ఆ దేశానికి మతపరంగా మద్ధతునిస్తున్న ఇక్కడి అంతః శత్రువులు గురించి ఇప్పటికైనా చర్చకి అవకాశమిస్తే తెలియజెప్పడానికి సిద్ధంగా వున్నాం.
    అంత అవకాశం లేదనుకుంటే,
    Tufail Ahmad is a former journalist with the BBC Urdu Service and Director of South Asia Studies Project at the Middle East Media Research Institute, Washington DC.
    అతడి పేరును టైప్ చేస్తే ఈ విషయం గురించి అతడు చాలానే వ్రాసాడు. చదివి తెలుసుకోవచ్చు.
    లేదా,
    మతోన్మాదాన్ని సమర్థించని ఇస్లామ్ గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైటు ని చూడవచ్చు. మత ఉగ్రవాదం భారతదేశాన్ని ఎలా కబళించబోతుందో తెలుసుకోవచ్చు.
    http://newageislam.com/

    ReplyDelete
    Replies
    1. @ శ్రీనివాసుడు గారు,
      మీ నిరసన తెలిపే లిస్ట్ లో ఆంధ్రజ్యోతి పేపర్ లో ఎడిటోరియల్ వ్యాసాలు రాసే కె. శ్రీనివాస్ ను కూడా చేర్చండి. ఈ వారం "ప్రమాదం పొంచిన వేళ, గాంధీకి ఒక నివాళి!" అని, క్రితం వారం కూడా ఇటువంటి దే రాశారు. K.శ్రీనివాస్ గారు గాంధిని అడ్డుపెట్టుకొని సూక్తులు వల్లిస్తున్నారు. ఈ సూక్తులేవో ఆయన పాకిస్థాన్ వాళ్లకి చెపితే బాగుంట్టుంది.

      Delete
    2. తప్పకుండా శ్రీరామ్ గారూ!
      అలాంటివాళ్ళు బోలెడంతమంది వ్యాఖ్యా ప్రపంచంలో విచ్చలవిడిగా వీరవిహారం చేస్తున్నారు.
      దురదృష్టమేమంటే వారిలో ఎవ్వరూ హేతుబద్ధమైన, వాస్తవికమైన సప్రమాణికమైన చర్చ చేద్దామనే ఆలోచన కూడా చేయరు.
      దాదాపు రెండు నెలల క్రితం కె. శ్రీనివాస్ కష్మీర్ సమస్య గురించి కూడా వ్రాసాడు. దానిలో ఏం చెప్పేడంటే కష్మీరీ పండిట్లు వెళ్ళిపోవడానికి కారణం జగ్ మోహన్ అట. ఇంతకన్నా దౌర్భాగ్యమైన వ్యాఖ్యనిి నేనెక్కడా చూడలేదు. అలాగే, మరో మహా మేధావి ఐలయ్య, వాడు రెండు మూడు రోజల క్రితం అదే పత్రికలో ఏం వ్రాసేడంటే కష్మీరీ పండిట్లు గుడారాల్లో బ్రతకడానికి అలవాటు పడిపోయారట. అలాగే కొనసాగాలనుకుంటున్నారట. బ్రాహ్మణ ద్వేషంతో అతడు చేసిన ఆ రేసిస్ట్ వ్యాఖ్యను ప్రచురించిన ఆ పత్రికపై కష్మీరీ పండిట్లు పరువునష్ఠం దావా కూడా వేయవచ్చునేమో.
      అలాగే, ఇంకొక విషయం నేను చెప్పదలచుకున్నదేమంటే సారంగ పత్రికలో కొన్నేళ్ళుగా వందలకొద్దీ వారాలుగా ప్రచురింపబడిన వేలాది వ్యాసాలు, కవితలు, అభిప్రాయాలు, కథలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ముస్లిం ఉగ్రవాదాన్నిి గురించి లేదు, దాన్ని ఖండించలేదు. కనీసం ప్రస్తావించను కూడా లేదు. ఒకే ఒక్క వ్యాసం పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఒక సూఫీ గాయకుడిని చంపినప్పుడు "ఆ జోలెలో వున్నది రక్తమేనా?' అని ప్రచురించారు. చాలా వింత అయిన విషయమేమంటే ఆ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యలు నాలుగు. అంటే, ఆ పత్రిక చదివేవారు, వ్యాఖ్యలు చేసేవారు, ఆ పత్రికలో వ్రాసేవారు కూడా ఇస్లాం ఉగ్రవాదం అనేది లేనేలేదనే ఒక భయంకర భ్రమలోనో, ఘోరమైన ఆత్మవంచనలోనో బ్రతుకుతున్నారని అనిపిస్తోంది. ‘‘కేవలం హిందూ ఉగ్రవాదం, ఫాసిజం అని వ్రాసే రేసిస్టు ప్రతిక అది’’ అని భావించవలసివస్తోంది.
      అదొక్కటే కాదు, ఇంకో గోబెల్స్ జాతీయ అంతర్జాతీయ వ్యాఖ్యల విశ్లేషణ కూడా వుంది. దాని ఎడిటర్ కమ్ రైటర్ లాంటి ఇడియలాజికల్ రేసిస్టును నేనెక్కడా చూడలేదు. మీరు కొద్ది రోజుల క్రితం ఆ బ్లాగులో జరిగిన చర్చ గురించి లంకెని ఇచ్చారు. అప్పుడు ఆ పత్రిక ఒకటి వున్నదని నాకు తెలిసింది. కొంత పరిశోధన చేస్తే అతడి హిందూ వ్యతిరేక వ్రాతలపైన కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ లో కేస్ కూడా నమోదయిందని తెలిసింది.
      ఇలాంటి పత్రికలు, మేధావులు, బ్లాగులు, మహా మానవతావాదుల ఉష్ట్రపక్షి నైజాలను ముక్కలు ముక్కలుగా ఖండిస్తూ సత్యాన్ని ప్రజలకు తెలిపే ప్రయత్నం నిరంతరాయంగా చేస్తున్నందకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. మీరిస్తున్న అనేక వందల లంకెలు నా అవగాహనా పరిధిని ఎంతో పెంచాయి.
      కొన్నేళ్ళ క్రితం రియాక్షనరీ యరమణ ‘యోగా’ను వెక్కిరిస్తూ తన బ్లాగు పిపీలికం లేదా పనిలేక లో వ్రాసిన వ్యాసాన్ని ఖండిస్తూ మీరిచ్చిన యోగా గురించిన లంకెలు నిజంగా అత్యద్భుతం. నేను ఆ వ్యాసం చదివినప్పుడే వాటిని నకలు తీసుకుని వుండవలసింది. కొద్దిగా బద్దకించాను. ఇంతలో ఆ బ్లాగుకు తాళం పడింది.
      కొసమెరుపేమంటే మీరిచ్చిన లంకెలని అతడు చదివివుంటే యోగాని గురించి ఎంతో బాగా అర్థంచేసుకునేవాడు. కానీ, రెండేళ్ళ తరువాత మళ్ళీ వెక్కిరిస్తూ ఇంకో వ్యాసం తన బ్లాగులోనే వ్రాసుకున్నాడు. అంటే, మన మేధావుల భావదారిద్ర్యం ఏ స్థాయిలో వుందో నాకప్పుడు అర్థమయింది.
      మీకు అవకాశముంటే ఆ యోగాని గురించి అప్పటి మీ వ్యాఖ్యలు, లంకెలు అన్నీ తెలియజేయగలరు
      ....మప్పిదాలతో

      Delete
    3. దేశమంటేనూ, దేశీయమైనదంటేనూ నచ్చని కొంతమంది మానసిక రోగంతో బాధపడుతున్నవాళ్ళు,ఏం చేద్దాం?

      Delete
    4. శ్రీనివాస్ గారు,

      ఆ బ్లాగు మూసివేశారనే విషయం తెలియదు. యోగా గురించి అప్పట్లో ఎంతో కష్టపడి వివరాలు సేకరించాను,ఆ వివరాలు అన్ని అక్కడ పోస్ట్ చేశాను. ప్రస్తుతం అవి నాదగ్గర లేవు. నేనిచ్చిన సమాచారం మీ అవగాహన పరిధిని పెంచాయంటే సంతోషించాను. ఇంత క్రితం కొంతమంది ఇలా చెప్పిన వారు ఉన్నారు. కాని వాళ్లు సోషల్ మీడియా వారు కాదు. నాకన్నా వయసులో అనుభవంలో చాలా పెద్దవారు. బ్యురోక్రాట్లు, ప్రొఫెసర్ లు, సుప్రీం కోర్ట్ లాయర్ గా పనిచేసేవారు.

      నా పై యు.జి. ప్రభావం చాలా ఎక్కువ. ఆయన ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా మోటివేట్ చేస్తారు. బహుశా నన్ను ఇలా మోటివేట్ చేశారని భావిస్తాను.


      *కానీ, రెండేళ్ళ తరువాత మళ్ళీ వెక్కిరిస్తూ ఇంకో వ్యాసం తన బ్లాగులోనే వ్రాసుకున్నాడు*

      మేధావులు సైన్స్ గురించి మాట్లాడేది,దాని పై ప్రేమ ఉండి కాదు. వాళ్ల ఐడియాలజిలో సైన్స్ భాగం.దానిని ఉపయోగించుకొని అవతలి పక్షాన్ని ఇరుకున పెట్టటానికే. మీరెన్ని సాక్షాలిచ్చినా వారు నిష్పక్షపాతంగా బేరీజు వేయకపోగా, మనమేదో మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నాం అనుకొంటారు. నిజానికి సైంటిఫిక్ టెంపర్ లేనిది వారికే!

      Delete
    5. ఆబ్దుల్ కలాం చనిపోయి ఒకరోజు కూడా కాలేదు. ఆయన పై వ్యతిరేకంగా వ్యాసం రాసి, ప్రచూరించి, పెద్ద ఎత్తున విమర్శిస్తూ చర్చలు జరిపిన సారంగ ఎడిటర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆబ్దుల్ కలాంను విమర్శించాలనుకొంటే ఒక పదిరోజులు తరువాత చేయవచ్చుకదా. అక్కడ రాసే ఏప్రముఖ రచయిత కూడా వారి పనికి అభ్యంతరం చెప్పలేదు. వీళ్ళు మానవత గురించి మాట్లాడితే దెయ్యాలు వేధాలు వల్లించినట్ట్లు ఉంట్టుంది.

      Delete
    6. సైన్స్ ఐడియాలజి లో భాగమైనపుడు, సైన్స్ లో నూతన సిద్దాంతాల ఆవిష్కరణలు ప్రభుత్వాలు ఎలా నిరాకరిస్తాయో రష్యా ఒక ఉదాహరణ. రష్యా ప్రభుత్వం కాలనుగుణం గా సైన్స్ లో వచ్చే నూతన ఆవిష్కరణలు, వాళ్ళ ఐడియాలజి కి అడ్డువస్తే దానిని ఎలా అడ్డుకొనిందంటే ...

      Marxian concepts, which are based on dialectical materialism and historical materialism, are increasingly found to be incongruous with the philosophical thoughts deriving from modern scientific enquiry.

      Communists suppressed all ideas and opinions that were not theirs. Many talented writers and scientists fled Russia. In the name of ideological hegemony, they hunted down scientific theories and the scientists behind them.

      Two examples from genetics are enough. CPSU repudiate Gregory Mendel who was the exponent of genetics and declared that it was a pseudoscience.

      As a result, Russia is one of the most backward countries in genetics. Marx’s worship of Charles Darwin and Stalin’s perverted view of genetics, and political partialities prevalent among the Russian scientists were responsible for this.

      Under the cover of communist ideology, genetic studies were removed from Soviet curricula and books on the subject were confined to flames. Genetics thus died out in Russia.

      A country which was rich in natural resources, had to depend upon even India for food.

      http://sanjeev.sabhlokcity.com/Misc/apostate%20on%20communism-sabhlok.doc

      Delete
  19. >>వాడెవడో ఉగ్రవాది అన్నది నిజంచేసేశాడు మన ప్రియతమ ప్రధాని
    I am taking this back. Sorry to Modi

    ReplyDelete
    Replies
    1. ఉగ్రవాది ఏమన్నాడు? మన ప్రియతమ ప్రధాని ఏవిధంగా నిజంచేసేశాడు? అర్థమయ్యే విధంగా రాయి.

      Delete
  20. శ్రీరామ్ గారూ!
    ఆ బ్లాగు ప్రయివేట్ బ్లాగ్ గా మార్చారట. దాని యజమానిని అనుమతి కోరి మాత్రమే దాని లోకి ప్రవేశించగలం. మీకేమైనా అతడు అవకాశమిస్తే దానిలోకి ప్రవేశించి మీ వ్యాఖ్యలు అన్నింటినీ మీరు సేకరించుకోవచ్చు.
    ...శ్రీనివాసుడు

    ReplyDelete
    Replies
    1. ఆ బ్లాగులో చాలా రోజుల క్రితమే కాపీ & పేస్ట్ ఆప్షన్ తీసేశారు.కనుక నా వ్యాఖ్యల్ లింక్ లు నేను కాపి చేసుకోలేను.

      Delete
    2. కాపీ&పేష్ట్ సౌకర్యం లేకపోయినా వ్యాఖ్య లింకును కాపీ చేసుకోవటానికి ఇబ్బంది ఉండదండీ.

      Delete
    3. శ్యామలీయం గారు, ఒక బ్లాగును ప్రైవేట్ బ్లాగు గా మారిస్తే మీ దగ్గర వ్యాఖ్య లింక్/ టపా లింక్ ఉన్నా అది ఒపెన్ కాదు. బ్లాగు అడ్మిన్ పబ్లిక్ గా మార్చాలి. అప్పుడే అది ఒపెన్ అవుతుంది.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. శ్రీనివాసుడు గారు,
      ఐలయ్య గారికి పురుషొత్తం,బాలగోపాల్,హరగోపాల్,కన్నాభిరాన్ లతో విభేదాలు ఉన్నట్లు ఉన్నాయండి. ఆయన బ్రాహ్మణ వ్యతిరేకతకి అదొక కారణం అయ్యుండచ్చు. ఈ ఇంటర్వ్యూను చూడండి.

      The making of Prof. Kancha ilaiah Osmania University
      (Watch 41 min onwards)
      https://www.youtube.com/watch?v=tmu98HWqQPE&t=4097s

      Delete
  21. హరిబాబు గారు,

    హిందూ పురాణాలలో ఆధారంగా ఆఫ్రిక ఖండంలో నైలు నది పుట్టిన స్థానాన్ని గుర్తించారు.

    An aspect of ancient Hindu geographical knowledge

    JH Speck,who discovered the source of River Nile in Africa,made use of a map baased on ancient Puranic Geography.

    Speck labels Africa as "Cush-Dwip" based on Hindu Puranic "Kushadwipa"

    The seven Dwipas(continents?) are mentioned in Vishnu Purana. Kusha Dwipa stands for Africa

    We also remember the Tamil-Brahmi inscription found in Quseir-al-Qadim(Egypt) dating c.100 BCE

    It could be said JH Speke was right in his assessment that Indians knew of interior African geography before Europeans did

    A hardcore anti Hindu historian such as DD kosambi is forced to admit that Speke used Puranas to discover Nile

    https://twitter.com/TrueIndology/status/775798991162269696

    ReplyDelete
  22. సగం దరిద్రం వొదిలింది. హిందు మతం నిన్న మొన్నటిది అని ఇంకా అనుకునే వాళ్ళకి ఇకనైనా కళ్ళు తెరుచుకోవాలి.
    ఇక ఆఫ్రికా నుంచి వీళ్ళే వొచ్చి భరత దేశంలో స్థిరపడేంతవరకు, ఇక్కడ మనుషులెవ్వరూ లేరని, కాబట్టి ఇక్కడి వాళ్ళని ఆక్రమించుకున్నారు అనే ప్రెశ్నే లేదని.. భారతదేశం హిందూ దేశమే అని కూడా నిరూపించగలిగితే మిగితా సంగం దరిద్రం కూడా వొదిలిపోతుంది.

    ReplyDelete
  23. 'యోగాసనాలు.. కొన్ని భీకర సందేహాలు' అంటూ నేనో బ్లాగ్‌పోస్ట్ రాశాను.

    https://www.facebook.com/ramana.yadavalli.1/posts/1191221807606199

    ReplyDelete
    Replies
    1. చాలాకాలం తరువాత, చాలా వ్యాఖ్యల తరువాత వ్యాసాలు వ్రాయడమే గాకుండా సమాధానం కూడా వ్రాసినందుకు ధన్యవాదాలు యడవల్లి రమణ గారూ!
      ఇక మీరు ఫేస్ బుక్ పోస్టులో వ్యక్తం చేసిన అభిప్రాయాలని పరిశీలిద్దాం.
      మొదటగా, **నేను సరదాగా యోగా గురించి వ్రాసేను** అన్నారు. మీరు ఆ పోస్టుతో బాటు ఆ వ్యాసం కూడా చదివేవాళ్ళ ముందు వుంచితే అది సరదాగానా, ప్రతిచర్యగానా అనేది ఎవరైనా చెప్పగలరు. అది చదవకుండా ఎవరైనా ఏమి చెప్పగలరు? నాకు తెలిసినంతలో మీ మొత్తం బ్లాగు కెరీర్ లో భారతీయ సనాతన ధర్మం నుండి సంక్రమించిన ఏ విషయాన్నయినా మీరు సకారాత్మక దృక్పథంలో చూసిన ఒక్కగానొక్క సందర్భం కూడా నాకు కనబడలేదు. అలాంటప్పడు మీరు సరదాగా వ్రాసేరో లేక మానసిక ప్రతిచర్యగా వ్రాసేరో ఆ పోస్టు చెప్పకుండా ఎలా చెప్పగలం?
      మీ తర్కం ప్రకారమే మీకొచ్చిన భీకర సందేహాల్లాంటివే చదివేవారికి కూడా వస్తాయి.
      మీ డాక్టర్లందరూ కలసి చెప్పిన అభిప్రాయాలను సరిచూసుకోడానికి వ్యాఖ్యాతలు ఇచ్చిన ఏవైనా కొన్ని లంకెలు ఎవరైనా చదివారా? చదివి మీ స్పందన ఎందుకు వ్రాయలేదు?
      ఎందుకంటే యడవల్లి రమణ అనే వ్యక్తి ఒక శాస్త్రీయ దృక్పథం కలిగిన వైద్యులు, సంఘంలోని మిగతా వారిని తన మాటలతో అభిప్రాయాలతో ప్రభావితం చేయగలినవారు కాబట్టి. అలాంటి వ్యక్తి అశాస్త్రీయంగా యోగాని గురించి మాట్లాడితే అదే నిజం అనుకునే అమాయకులు కూడా వుంటారని చెప్పడానికే.

      నా వరకు వస్తే నేనొక స్వేచ్ఛా జిజ్ఞాసిని. ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ కరడుగట్టిన భావజాలాన్ని నేను అనుసరించను, సంప్రదాయాలని, ఆచారాలని పాటించను. కానీ, ఏ సంస్కృతి, సంప్రదాయాల పట్లనైనా నాకేమీ ఏవగింపు, వ్యతిరేకతా లేనేలేవు. ఎందుకుంటే, ఆయా కాలాలలో సందర్భాలలో ఆయా మానవులు సమాజంలోనివారు తమతో తాము, ప్రకృతితో తాము ఘర్షణ పడకుండా ఏర్పరచుకున్న పద్ధతులు, సంప్రదాయాలు అవి అని భావిిస్తాను. అలాగే, ప్రతి మానవుడూ ఈ ప్రపంచంలోని అనేక రకాల సంస్కృతులు, సంప్రదాయాలకు వారసులే, వాటిని శాస్త్రీయంగా ఇప్పటి మన సమాజానికి అనుగుణంగా మార్చకోవడమే మనం చేయవలసింది. శరీరం విజ్ఞానం గురించి మీరు అభ్యసించిన, అభ్యసిస్తున్న పాశ్యాత్య వైద్యం చెప్పింది మాత్రమే పరమం కాదు, కాబోదు.
      ఈ ఒక్క విషయమే కాదు మీరు వ్రాసిన వ్యాసాల్లోని విషయాలన్నింటి గురించీ మీకన్నా అవగాహనతో చెప్పిన వారు బోలెడంతమంది వున్నారు.
      వాటిలో ఏ ఒక్క విషయం గురించి అయినా మీకు ఆసక్తివుంటే చర్చించడానికి సిద్ధంగా వున్నాం. సత్యశోధన, జిజ్ఞాస అనేది మీలో కూడా వుంటే, మీ వ్యాసాలన్నింటిలో చెప్పిన ఏ విషయం గురించి అయినా, ఈ బ్లాగులోనే కాదు, ఏ బ్లాగులోనయినా, ఏ సమయంలోనయినా మీతో సంభాషించడానికి సిద్ధంగా వున్నాను.
      .....శ్రీనివాసుడు

      Delete
    2. రమణ గారూ!
      చాలాకాలం క్రితం పెహ్లాజ్ నిహలానీ గురించి మీ వ్యాసానికి నేనొక స్పందన వ్రాసేను. దానికి మీ నుంచి జవాబు లేదు. మీరు నిజంగా సత్యాన్వేషులే అయివుంటే ఆ వ్యాఖ్యలో నేను చెప్పిన చర్చని చూసి మీ భావాలని సరిచేసుకునేవారని నా భావన.
      ఆ వ్యాఖ్యని నేను క్రింద ఇస్తున్నాను.


      ‘‘‘
      రమణ యడవల్లి గారూ!
      మీకు కొంత సమాచారం ఇవ్వదలచుకున్నాను.
      **సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. **
      మీరేం భయపడకండి. ఈ యాక్ట్ లో చెప్పినదాని ప్రకారం సెన్సార్ చేస్తే ఏ ఒక్క సినిమా కూడా బయటకి వచ్చేది కాదు. అలా చేయకపోబట్టే ఇన్ని సినిమాలు వస్తున్నారు.
      సెన్సార్ బోర్టే లేకపోతే ఏం జరుగుతుందో టివి 5 లో సినిమా పరిశ్రమకు చెందినవాళ్ళే ఉడ్తా పంజాబ్ గురించి చర్చించారు. దాని మొదటి భాగం లంకెనిస్తున్నాను. అది చూసి మీకు ఆసక్తిగా వుంటే రెండో భాగం కూడా ప్రక్కనే వుంటుంది.
      https://www.youtube.com/watch?v=0eTx3j0foSU&index=10&list=PL25CA6D9F04411D40
      ఒక Extreme End కి వెళ్ళిపోయిన వాళ్ళని గురించి వ్రాసే వ్యంగ్యంలో మనం కూడా Extreme End కి వెళ్ళనక్కరలేదు.
      కొంత సంయమనంతో కూడా వ్యంగ్యం వ్రాయవచ్చు.
      ప్రజలందరూ మన స్థాయిలోనే మానసిక పరిణతి కలిగివుంటారనుకోవడం పొరబాటేమో ఆలోచించండి.**
      http://magazine.saarangabooks.com/2016/06/16/%E0%B0%AA%E0%B1%86%E0%B0%B9%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%9C%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B9%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8D-%E0%B0%AF%E0%B1%81/

      ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
      ఇదంతా నేనెందుకు వ్రాస్తున్నానంటే అభిప్రాయాలని, ఒక సంఘటనలోని వివిధ పార్శ్వాలని సమగ్రంగా చూడగలిగినప్పడే మనకి సత్యం గోచరిస్తుంది. ఏదో ఒక భావజాలంతోనో, మానసిక ప్రతిచర్యతోనో స్పందిస్తే అది మనకీ, సమాజానికీ మంచిది కాదు. ఈ విషయం అందరికీ సంధించినదే, మీకో, నాకో ప్రత్యేకించినది కాదు.
      మీకు నా వివరణ అర్థమయి, సమంజసమనిపిస్తే మీరు వ్రాసిన ఏ విషయం గురించి అయినా, మీకు నచ్చిన బ్లాగులో, మీకు నచ్చిన సమయంలో సంస్కారయుతంగా చర్చిండానికి సిద్ధం. ఎందుకంటే, నాకున్న అవగాహన ప్రకారం మీరు వ్రాసిన ప్రతి వ్యాసమూ నకారాత్మకంగానే విషయాన్ని చూపించింది కాబట్టి.
      ..మప్పిదాలతో,
      శ్రీనివాసుడు.
      తోకచుక్క: మీరు యోగాని గురించి కొన్నేళ్ళ క్రితం వ్రాసిన వ్యాసాన్నీ, దానికి కొనసాగింపుగా వ్రాసిన చిన్న వ్యాసాన్నీ రెండింటినీ మీ ఇష్టం వచ్చిన చోట ప్రచురించి చర్చకు వస్తారని ఆశిస్తున్నాము. అప్పుడే చర్చ సరిగ్గా జరుగుతుంది.

      Delete
    3. బోడిగుండుకీ మోకాలుకీ ముదిపెట్టినట్టు తను ట్రెడ్మిల్ గురించి రాస్తే విమర్శించనివాళ్ళు యోగాసనాలని విమర్శించితే సహించలేకపోవడానికి గల ఒకేఒక కారణంగా యోగాసనాలని విమర్శిస్తే బ్లాస్ఫెమీగా తలిచే సున్నితమనస్కుల వీరహిందూమతాభిమానంగా తేల్చేశారు డాక్టర్ యడవల్లి వెంకటరమణ అనబడు ఆధునిక వైద్యవిద్యలో నిష్ణాతుడైన ఒక వైద్యశిఖామణి - అదీ వీరి శాస్త్రీయత.

      తను ప్రాక్టీసు పెట్టటానికి తనకు ఉపయోగపడుతున్న పరిజ్ఞానంలో ఉన్న శాస్త్రీయత ఎంత?తను వేళాకోళం ఆడుతున్న యోగాసనాలలోని అశాస్త్రీయత ఎంత?

      తను సర్దాగనే రాశానంటూనే కొసమెరుపులో అందులో ఉన్న పొరపాటు అభిప్రాయాలను చెప్పినవారికి యోగాసనాల్ని విమర్శిస్తే సహించలేని సున్నితత్వం అంటగట్టెయ్యటం నిజంగా సరదాయేనా?

      Delete
    4. "యోగాసనాల గూర్చి సర్దా విమర్శల్ని కూడా blasphemous గా భావించే ఈ సున్నిత మనస్కులు - యోగాసనాలకీ, మతానికీ అస్సలు సంబంధం లేదని వాదిస్తారు, అదీ కొసమెరుపు!"

      What this sentence reveals:యోగాకీ మతానికీ సంబంధం లేదని వాదించేవాళ్లని కొసమెరుపుగా చెప్పడం అంటే ఉంది అని ఈయన తీర్మానించినట్టు మనం అర్ధం చేసుకోవాలి,అవునా కాదా?అలా సంబంధం ఉందటం వల్లనే తనని ఈ హిందూవీరాభిమానులు విమర్శిస్తున్నారు అని ఆయనకి అర్ధం అయింది.నిజంగా చదివితేనే వొచ్చిందా ఈయనకి డిగ్రీ?

      Delete
    5. కమ్యునిస్ట్ లు ప్రపంచ సంపద అంతా పంచాలి అంటారు కదా! మరి కామ్రేడ్ రమణ గారేమిటి, ఆయన రాసిన టపాలను బంగారు ఆభరణలలా ఎవ్వరి కంట కనపడకుండా దాచి పెట్టుకొన్నారు? సరదాగా రాసిన బ్లాగు లో అంత గొప్ప విషయం ఎముంది? వ్యాఖ్యాతలే ఎంతో సమాచారం సేకరించి ఆయన కిచ్చారు. ఇంత పొసెసివ్ వ్యక్తిత్వంగల ఈయన రోజు సమాజం మారాలని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తారే?

      Delete
    6. చాలా మంచి ప్రశ్న వేశారు. మనది కాకపోతే అందరు అన్ని పంచాలనే చెపుతారు. తనదాక వస్తే పరిస్థితివేరు కదా! ఆయన బ్లాగును చదివిన వారికి, వ్యాఖ్యలు రాసిన పాఠకులకు ఏ విలువ లేనట్లు, నా బ్లాగు నా ఇష్టం అని ఏకపక్షంగా మూసి పారేశాడు. నియంత మనస్థత్వం గల వారు ప్రజాస్వామిక విలువల గురించి సుద్దులు చెప్పటమే విచిత్రం.

      Delete
    7. ఓం అనేది ప్రతి ఒక్క మతస్తులు తమదిగా గౌరవించే ఒక పదం. దాన్నియోగా చేసేటప్పుడు తలుచుకోవడంలో తప్పులేదు కానీ, కొంతమంది పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బాబాలు, బాబీలు ఓం కాకుండా తమపేరు తలుచుకుంటేనే దానివల్ల వుపయోగంవుంటుందని చెబుతుడటంవల్లే ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి

      Delete
  24. శ్రీరామ్ గారూ!
    ఈ వ్యాసాలు చూడండి.
    Is Uri the beginning of the end for Pakistan?

    http://indiafacts.org/uri-beginning-end-pakistan/


    Dr Benkin, You might be interested to know that two revered sages of India predicted the breakup of Pak into 5 parts. Please read it here along with other pertinent facts about the India-Pak problem. https://kitturd.wordpress.com/...

    Bookmark the permalink.
    Extracts from Sri Aurobindo and the Mother on India -guidelines for the new government




    ReplyDelete
    Replies
    1. @ Sreenivasu & Hari baabu,

      https://www.youtube.com/watch?v=gCTB2m5woCU


      http://www.huffingtonpost.ca/tarek-fatah/bachman-muslim-brotherhood_b_1707362.html


      Delete
    2. ఎమ్బీయస్‌: హిల్లరీ తప్పిదాలు

      http://telugu.greatandhra.com/articles/mbs/mbs-hillary-thappidalu-73989.html

      Delete
  25. హరిబాబు గారు మరియు యూజీ శ్రీరామ్ గారికి,
    Remembering K Balagopal అనే బ్లాగ్ వుంది.
    http://balagopal.org/?cat=10
    దానిలో ఈ ప్రకటన వచ్చిింది.
    ఈ నెల 9 తేదీన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పై కార్యక్రమం జరగబోతోంది. ఉమర్ ఖాలీద్ అనే దేశద్రోహి భారత్ కీ బరబాత్ తక్ జంగ్ లగేగీ అనే దేశద్రోహి The patriotism of defending difference and dissent అనే విషయంపై మాట్లాడబోతున్నాడు.
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice
    Archive for the ‘English’ Category
    Balagopal 7th Memorial Meeting
    UMAR KHALID, Bhagat Singh Ambedkar Students Organisation The patriotism of defending difference and dissent
    KY RATNAM, Centre for Ambedkar Studies, UOI Caste discrimination in educational institutions
    MANISH KUNJAM, Adivasi Mahasabha The continuing outrage in Bastar
    ZAMIR AHMED, JK Coalition of Civil Society Why is Kashmir bleeding again?
    Remembering Salago a(10 am to 4 pm, 9 October 2016 Sundarayya Vignana Kendram, Hyderabad
    "The essence of human rights is the notion of equality in human value and worth."

    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘

    నేను ఆ బ్లాగు వారికి ఈ వ్యాఖ్య పంపించాను. కానీ వాళ్ళు ఇంతవరకూ ప్రచురించలేదు. మీ అందరికీ కూడా ఆ సందేహం తెలియాలనే ఉద్దేశంతో వ్రాస్తున్నాను.
    .....శ్రీనివాసుడు

    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    ఆర్యా,
    1) బాలగోపాల్ గారు నాలుగు లక్షల మంది కష్మీరీ పండిట్లు గుడారాల్లో పడి దుర్భరజీవితం గడుపుతుంటే ఎప్పుడయినా వారి సమస్యకోసం మాట్లాడారా? ఏదైనా వ్యాఖ్య చేసారా?
    2) మీ బ్లాగువారు కష్మీరీ పండిట్ల కడగండ్ల గురించి ఈ వెబ్సైట్లలో వున్న విషయాన్ని ఏనాడైనా పట్టించుకున్నారా? వారికి మానవ హక్కులు వర్తిస్తాయా?
    http://ikashmir.net/index.html

    http://kashmiris-in-exile.blogspot.in/

    3) ఉమర్ ఖాలీద్ ను పిలుస్తున్నారు కదా. అలాగే కష్మీరీ పండిట్ల ప్రతినిధిని ఎవరినైనా పిలిస్తే సమంజసంగా వుంటుంది కదా? సుశీల్ పండిట్ గురించి మీరు వినేవుంటారు. ఆతడిని పిలిస్తే కష్మీరీ ముస్లింల చేత జాతి నిర్మూలనకు గురవుతున్న (ethnic cleansing) కష్మీరీ పండిట్ల గొంతు కూడా మీరు వినవచ్చు.

    https://twitter.com/neelakantha?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor

    The truth about Hindu genocide in #Kashmir from an educated and civilised Muslim, Barrister Bhashani.

    http://indianexpress.com/article/india/india-news-india/do-not-hand-over-burhan-wanis-body-to-the-family-says-kashmiri-activist-sushil-pandit-2903327/

    Do not hand over Burhan Wani’s body to family: Kashmiri activist Sushil Pandit



    ReplyDelete
    Replies
    1. శ్రీనివాసుగారు,

      బాలగోపాల్ వివిధ సంధర్బాల్లో రాసిన ఆర్టికల్స్ సంకలనం "నిగాహ్" అనే పుస్తకంలో "గుజరాత్‍ని కాశ్మీర్‍తో పోల్చటం సబబేనా" అని ఒక ఆర్టికల్ ఉంది. నేను చదివినవాటిల్లో దీంట్లో బాలగోపాల్ కాశ్మీరీ పండిట్ల స్థితిగతుల గురించి తన అభిప్రాయం చెప్పారు. ఇంకా ఎక్కడైనా విస్తారం చెప్పారేమో తెలీదు. కుదిరితే పరిశీలించగలరు.

      Delete
    2. శ్రీనివాస్ గారు, మీవలన ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం చదివిన వార్తలను,చూసిన వీడియోలను మళ్ళి ఈ రోజు వెదికాను. కాష్మిర్ అంశం అరిగిపోయిన గ్రాం పోన్ రికార్డ్ లా తయారైంది. అటువంటి మీటింగ్ లు రెండు వేలు పెట్టుకొన్నా ఎమీ ప్రభావం ఉండదు. మీరోక సారి ఆ మీటింగ్ లకి వెళ్ళితే హాజరయ్యే వారిని చూడండి. అందులో కొత్తవారు ఎవ్వరు ఉండరు. జిలేబి కి ఎమీ తోచక తన బ్లాగులో తానే వ్యాఖ్యలుగా పద్యాలు రాసుకొన్నట్లు. పాత వాళ్లే (సీనియర్ సిటిజన్స్) మళ్ళి మళ్ళీ హాజరౌతారు. వారి సంఖ్య కూడా పెద్దగా ఉండదు. పేపర్లో వచ్చే పోటోలు చూడండి. స్టేజ్ మీద ఉపన్యాసం ఇచ్చే వారినే ప్రచూరిస్తారు, హాజరైన వారిని ప్రచూరించరు. కారణం కొన్ని సార్లు సభికుల సంఖ్య కన్నా ఉపన్యాసలిచ్చే వారి ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.
      -------
      పాకిస్థాన్ డిప్లమాట్, మంత్రులు కాష్మీర్ సమస్య ను అంతర్జాతీయ మద్దతు కూడ గట్టడానికి వేళ్ళి ఎమి చేస్తారంటే తిని,తాగితందనాలాడి,షాపింగ్ చేసుకొని వస్తారు. వారి దేశస్థుల మాటల్లోనే వినండి.

      Indian Diplomats Vs Pakistani Diplomats

      https://www.youtube.com/watch?v=T5bdG0JW9Tc

      Pakistan sending 22 members in world on Kashmir issue for enjoy
      https://www.youtube.com/watch?v=znFkiBMrKW4

      Kashmiri Hindu Pandits on Kashmir Issue - Bilatakalluf with Tahir Gora Ep80
      https://www.youtube.com/watch?v=VH9AReyoK5A

      Delete
    3. నేను మీతో ఏకీభవించడంలేదు శ్రీరామ్ గారూ! కష్మీరీ పండిట్ల గురించిగానీ, ముస్లిం తీవ్రవాదం గురించి గానీ, గల్ఫ్ దేశాల్లో భారతీయులు దయనీయ పరిస్థితి గురించిగానీ ఒక్క వ్యాసం, మాట కూడా ప్రచురించని ఆంధ్రజ్యోతిలాంటి దినపత్రికలు కోకొల్లలుగా వున్నాయి. అవి ఏకపక్షంగా ప్రచురించే వ్యాసాలు చదివి చదివి విజ్ఞులు కూడా కష్మీర్ సమస్య గురించి పూర్తి తప్పుడు అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు. దానిని తీసుకువెళ్ళి సీమాంతర ఉగ్రవాదానికి ముడిపెడుతున్నారు. ఈ పేజీలోనే పైన నేను ఇచ్చిన కష్మీర్ గురించిన వివరాలలో ఒక్కదానిని కూడా ఆ పత్రిక ఇవ్వడంలేదు, ఆ మరణాల గురించి మాట్లాడడంలేదు, పండిట్ల సమస్య గురించి కనీసం ఒక్క వ్యాఖ్య కూడా ప్రచురించడంలేదు. ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ జరగగానే "పాలకులు యుద్ధోన్మాదులు" అని నిరంతర వ్యాస పరంపర మొదలైంది. కేంద్రంలో ఎవరి పాలన వున్నా వీరి వలన పాకిస్తాన్ ని అరికట్టే ఒక్క పని కూడా ప్రభుత్వం చేయలేకపోతోంది. దానికి తోడు ఈ మానవ హక్కుల, పౌర హక్కుల, ఉదారవాద, లౌకిక శక్తులు ఇలాంటి మీటింగ్ లు. కనీసం ఒక్క వివేకవంతమైన స్వరమైనా వీరు చేస్తున్న ఈ పొరపాటు పనికి వ్యతిరేకంగా నోరు విప్పడంలేదు. ఉగ్రవాదాన్ని, సీమాంతర చొరబాట్లను, దేశాన్ని అస్థిరతపరచే శక్తులను అడ్డుకోవడానికి చేసే యుద్ధానికి వీరు వ్యతిరేకంగా చేసే ప్రచారంవలన ప్రజలలో ఏకాభిప్రాయం సాధించడం చాలా కష్టమైపోతోంంది. ఉచ్చల గుంటలో చేపలు పట్టే మనస్తత్త్వం వున్న కాంగ్రెస్, ఆప్, జెడియు లాంటి రాజకీయ పార్టీలు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయా అని సైనికుల ఆత్మవిశ్వాసాన్ని, నిజాయితీనీ శంకిస్తూ తమ రాజకీయ ప్రయోజనాలకోసం నిర్లజ్జగా మాట్లాడుతున్నాయి.

      మీరిచ్చిన అల్తాఫ్ హుస్సేన్ వీడియో అద్భుతంగా వుంది. పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశాలలో ఇస్లాం గురించి మనదేశంలో కంటే ధైర్యంగా, స్వేచ్ఛగా విమర్శించడం నిజంగా ఆశ్చర్యకరం.
      ఇక పాకిస్తాన్ పంపించిన 22 మంది ’బాహుబలులు‘ అంటే దౌత్యవేత్తలు ఏం సాధిస్తారో చెప్పిన వీడియో బాగుంది.
      Modi is not Congress, He wiil strike again if required: Pak Media
      https://www.youtube.com/watch?v=ieAcGq02EGI

      Pakistan Media talking about Hafiz Saeed and His Terror Outfits
      https://www.youtube.com/watch?v=UifQMsLe-2U

      Delete
    4. హసన్ నిసార్ చెప్పిన ఈ అద్భుతమైన మాటలు వింటే మన దేశంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని యుద్ధోన్మాది అంటున్న సమస్త ప్రగతిశీల శక్తులూ, పత్రికలూ, ఉదారవాదులు, మానవతాపూర్తులు బుద్ధితెచ్చుకుంటారేమో, ఇది నిన్నటి అతి తాజా వీడియో.
      Hassan Nisar Best Speech about India Pakistan Latest
      https://www.youtube.com/watch?v=Mdgmbi9ZpO4&spfreload=5

      నాకు వీలయితే ఈ వ్యాసాన్ని వ్రాసి భారతదేశంలోని ప్రతి ముస్లిమ్ కూ, ప్రతి రాజకీయ పార్టీకి పంపించాలని వుంది.

      ఇది భరత్ వర్ష్ అనే సైట్ ది. దానిలోని వీడియోలు చూడండి.
      https://www.youtube.com/channel/UCrWLZy9zeMt27fYpCpeSJgg/videos

      ..శ్రీనివాసుడు

      Delete
    5. ఇది నిన్నటి అతి తాజా వీడియో

      అది తాజ వీడీయోగాదండి. రెండేళ్ళ క్రితం పాకిస్థాన్ లో ఎన్నికలు జరిగే ముందు ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా ఆయన అమెరికా, కెనడా లకి వెళ్ళాడు. ఇది కెనడా లో ఇచ్చిన ఉపన్యాసం. ఎమి అనుకోక పోతే మీరు పాకిస్థాన్ పై లింక్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ దేశం పై ఈ యుత్యుబ్ వీడియొలే కాదు, పుస్తకాలు కూడా చదివాను.

      Delete
    6. నిజమేనండీ, నేనే పొరపాటు పడ్డాను. భరత్ వర్ష్ వారు పాత వీడియోను తిరిగి నిన్న లోడ్ చేసినట్లున్నారు. దాని ప్రచురణ నిన్నటి తేదీతో వుంది గనక నేను తాజా వీడియో అని చెప్పాను.
      మీరు చెప్పిన విధంగానే మీకు పాకిస్థాన్ గురించి సంపూర్ణ అవగాహన వుంది గనక మీకు ఆ లింకులుగానీ, సమాచారంగానీ భవిష్యత్తులో ఇవ్వబోను.

      Delete
  26. Chiranjeevi Y3 October 2016 at 21:28
    సగం దరిద్రం వొదిలింది. హిందు మతం నిన్న మొన్నటిది అని ఇంకా అనుకునే వాళ్ళకి ఇకనైనా కళ్ళు తెరుచుకోవాలి.
    ఇక ఆఫ్రికా నుంచి వీళ్ళే వొచ్చి భరత దేశంలో స్థిరపడేంతవరకు, ఇక్కడ మనుషులెవ్వరూ లేరని, కాబట్టి ఇక్కడి వాళ్ళని ఆక్రమించుకున్నారు అనే ప్రెశ్నే లేదని.. భారతదేశం హిందూ దేశమే అని కూడా నిరూపించగలిగితే మిగితా సంగం దరిద్రం కూడా వొదిలిపోతుంది.


    Can someone answer for this? I was looking at UG Sriram sir for the answer

    ReplyDelete
    Replies
    1. *భారతదేశం హిందూ దేశమే అని కూడా నిరూపించగలిగితే *

      భారతదేశం హిందువులది కాక అమెరికా వాడిదా లేక బ్రిటిష్ వాడిదా లేక గల్ఫ్ దేశాల వారిదా? హిందువులు, భారతదేశానికి చెందిన వారని ఎవరికి నిరూపించుకోవాలి? ఎందుకు నిరూపించుకోవాలి? నిరూపించుకొని ఎమి చేయాలి? హిందువులు భారతదేశం చెందినవారు కాకపోతే ఈ 80కోట్ల మంది ఏ దేశనికి చెందినవారో ప్రశ్నలువేసిన వాళ్ళే చెప్పాలి.

      మేధావి అంటే నోటికొచ్చింది వాగడం కాదు.చేతికొచ్చింది రాయటం కాదు. మేధావి అంటే సెన్సిబుల్ గా నిజాలను తార్కికంగా వ్యక్త పరచాలి. అటువంటి వారిలో హసన్ నిసార్ ఒకడు. ఒక ఇంటర్వ్యు లో హసన్ నిసార్ "ఈ మిర్జా ఎవ్వడు? ఎప్పుడు వచ్చాడు? ఈ భూమి బ్రాహ్మణ,దళిత,శూద్ర,ఖత్రి (ఖన్నా/క్షత్రియులు)లది అని చెప్పాడు. ఇదెందుకు రాస్తున్నానంటే ఆయన పాకిస్థాన్ లో కూచొని ఉంటే, హిందువులకు మద్దతుగా మాట్లాడమని హిందువులు ప్రలోభ పెట్టలేదు కదా! నిష్పక్ష పాతంగా చరిత్ర చదివిన తరువాత హిందువైనా,ముస్లిం అయినా అదే అభిప్రాయనికి వస్తారు.

      ఎప్పుడో చూసిన ఈ విడియో వెదకటనికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది.Pls watch video (1:34 min on wards)
      https://www.youtube.com/watch?v=S0CF9Z8B19I

      హిందూ సంస్కృతికి 5000వేల సంవత్సరాల పైగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఏ దేశ సంస్కృతికి ఇంత చరిత్ర ఉందో చెప్పమనండి? పట్టుమని 300 సంవత్సరాల వెస్ట్రన్ సివిలైజేషన్ వాళ్ళు మనలను బేరీజు వేసేవారా?

      జోగేందర్నాథ్ మండల్ డి కాస్టిఫై చేసుకొని, నాకు హిందు మతంతో సంబంధం లేదు. పాకిస్థానే మాత్రుదేశంగా భావించి వెళ్ళాడు. అక్కడ మేము కాష్మీర్ సమస్య గురించి మాట్లాడుకోవాలి నువ్వు హిందువు గనుక బయటపోయి కూచో అని కేబినేట్ సమావేశం నుంచి బయటకు పంపారు. అప్పుడు నా మూలాలు హిందూమతంలోనే ఉన్నాయని అర్థమయ్యి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన వేరే మతస్థుడై ఉంటే ముష్రాఫ్ లా గల్ఫ్ లో సెటిల్ అయి ఉండేవాడు గదా!


      ఏ మాత్రం సెన్స్ ఉన్నా ఇలాంటి తలాతోకాలేని వాదాలు చేయారు. అడ్డుగోలుగా వెర్రి ప్రశ్నలు వేయటం తప్పించి, ఇందులో ఎమైనా సబ్జెక్ట్ ఉందా? హిందువుల పై ఈర్షా, అసూయలతో మూర్ఖంగా చేసే ఈ పెడసర వాదనను పక్కన పడేయండి. ఇటువంటి వ్యాఖ్యలను blog లో తీసి అవతల పారేయాలి.

      ఇటువంటి వాటికి సమాధానం ఇవ్వటం సమయం వృథ. ఇక నుంచి ఇటువంటి ప్రశ్నలను పట్టించుకోను. మీరు నన్ను సమాధానం ఇవ్వమని అడగవద్దు.

      Delete
  27. Dear hari babu sr we are waiting for your article on surgical strick...when it will be come.......?

    ReplyDelete
    Replies
    1. అతడు సినేమాలో తమికెళ్ళ భరణి అంటాడు చూడు, వాడేందిరా చాలా శ్రద్దగా కొట్టాడు అని, అలా మోడి చాలా శ్రద్దగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేశాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు. ఆ దెబ్బకి పాకిస్థాన్ వాళ్లతో పాటు మనదేశంలో వారి మద్దతు దారులందరికి గట్టిగా తగిలింది. వాళ్ళిప్పుడు గావు కేకలు పెడుతున్నారు. అమెరికా ఎన్నికలు జరిగేలోపే కొట్టటం మాస్టర్ స్ట్రోక్. అంతర్జాతీయా రాజకీయాలు తెలిసినవారికి హిలరి, జాన్ కెర్రి పాకిస్థాన్ కు గట్టి మద్దతు దారులని తెలుసు. వాళ్ళు కిక్కురు మనలేదు. హిలరి పాక్ కు మద్దతుగా ఒక్క మాట తూలి ఉంటే ట్రంప్ గారు హిలరి కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తప్పెట వేసేవాడు.

      Delete
  28. Without clear info, Haribabu never post any article

    ReplyDelete
  29. సర్జికల్ స్ట్రైక్ మీద ఇప్పుడు సామన్యుడికి కూడా సందేహాలొచ్చేస్తున్నాయి. అక్కడ పాకిస్తాన్ విదేశీ జర్నలిస్టులనికూడాతెసుకెళ్ళి చూపిస్తింటే, ఇక్కడ వీడియోలు బయటపెట్టకూడదంటూ నాటకాలు వేస్తున్నారు. ఏమైనా అంటే, వళ్ళకి వొచ్చిన్ ఏకైక పాట(పాకిస్తాన్ వెళ్ళిపో) పాడేస్తున్నారు. అది నిజ్జంగా జరిగివుంటే, దాంతర్వాత పాకిస్తాన్ ఇంకా ఎక్కువగా దాడులు ఎందుకు పెంచుతోంది? పాకిస్తాన్ నోరు మూపిద్దాం, వీడియోలు కనీసం ప్రతిపక్షంలో ముఖ్యమైనా వాళ్ళకైనా చూపించమంటే, వాళ్ళు, వాళ్లవెంట కళ్ళుమూసుకోని తిరిగే సైకోగాళ్ళకెందుకు ఎక్కడో కారం పూసినట్టు ఎగురుతున్నారు? వీళ్ళు ఏం చెప్పినా నోట్లో వేలేసుకోని వినాలి లేకపొతే పాకిస్తాన్ వెళ్ళిపొవల్సిందేనా?

    ReplyDelete
    Replies
    1. No need to go pakistan,you can read CNN STIMG REPORT and report is a first hand report of gulaam Anbar,A Pakistani government employee of higher designation!

      Delete
    2. No need to go pakistan,you can read CNN STIMG REPORT and report is a first hand report of gulaam Anbar,A Pakistani government employee of higher designation!

      Delete
  30. హరిబాబు గారూ? మీకు ఇంకా మీడీయా మీద నమ్మకం వుందా?

    ReplyDelete
    Replies
    1. మీకు మీడియా మీద నమ్మకం లేదు,భారత సైన్యం మీద నమ్మకం లేదు,ప్రధాని మీద నమ్మకం అంతకన్నా లేదు. పాకిస్థాన్ మీద అపారనమ్మకం ఉందని తెలుస్తూనే ఉంది. మాత్రుదేశాన్నే నమ్మలేని మూర్ఖులకు ప్రపంచంలో ఎవ్వరు భరోసా కలిగించలేరు.

      మీరు పాకిస్థాన్, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ,ఆప్, యన్.సి.పి. పార్టి లు ఎలా చెప్పితే అలా నమ్మండి ఎవ్వరు వద్దన్నారు? ఇక్కడ చేరి నస పెట్టటం ఎందుకు?

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. Dear anon,
      Do you think modi called naval and asked to strike in uri to get popularity?I think you are believing Pakistan who cleared everything before calling friendly media to harp it's tune and CNN is a biased chanel!
      Please avoid nonsensical arguments,if you don't like surgical strike whole together also just keep quite.

      Delete
    4. Dear anon,
      Do you think modi called naval and asked to strike in uri to get popularity?I think you are believing Pakistan who cleared everything before calling friendly media to harp it's tune and CNN is a biased chanel!
      Please avoid nonsensical arguments,if you don't like surgical strike whole together also just keep quite.

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. Pls read naval as navaz,Damn this autofill in mobile text tool?!

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. Hassan Nisar explained: Why 50% Pakistanis want to leave country
      https://www.youtube.com/watch?v=bUEKpxeQFPo

      https://www.youtube.com/watch?v=w4o6MDE-WPk

      Delete
  31. Dear Haribabu,
    Did I say that I don't like surgical strike? Did I say that attacking on Uri is fake or not done by terrorists?

    My question is Pakistan is trying some thing to prove surgical strike is fake. Why our dear govt hiding videos from everyone? It's not even trusting President by not showing it to him..

    Not only CNN.. 100% media is biased.. Do you think the CI is a fool giving answers for all those questions just like a school kid? If yo trust it's true.. Why they revealed that officers name but not killed soldiers names? Because even a normal person also can easily find the truth with the revealed names..

    Why did govt say they will prove the strike by showing videos to public in the beginning and how did it changed by the time of reveling? and in which way it's harm to army?

    Finally why you did not oppose when UG sriram called all the Modi opposition parties and persons are pakistan friends? Let me know if that call is correct

    ReplyDelete
    Replies
    1. Dear anon,
      America has killed bin Laden who is hiding in Pakistan with Pakistani support!Even pak military also was unaware of that strike,and now you are saying that Pakistan is more trutful than India - joke of the century:-)

      Delete
  32. Interesting turn. Even Haribabu also pointing out untold things.

    ReplyDelete
    Replies
    1. What intold things I said here?I am little not confused!

      Delete
  33. మొడీకి వ్యతిరేకులంతా భారతీయులు కారని, పాక్ సపోర్టర్లు అనే మీరంతా 4 సంవత్సరాల క్రితం వరకు ఏం పీకుతున్నారు? అంతకుముందంతా అడివిజాతి జంతువులు సడ్డణ్గా మొడీ అధికాంలోకి రాగానే మీరు భారతీయులైపొయ్యరన్నమాట. అంత క్లియర్గా అన్నొనిమస్ అడిగాక కూడా అర్ధం కానట్టు ఏం నటిస్తున్నారు మీ ఇద్దరూ.

    ReplyDelete
    Replies
    1. What you are crying here!why you are getting crazy?what is your so called four years syndrome tells about?

      I told you to post nonsense and come up with some brainy stuff.

      After the strike analysts guess out 5 alternatives and the first thing it would do is strike didn't happen and pal followed it.

      NOW SOME canons are believing pak govt and disbelieving Indian goby and still barking like truth lovers!

      Delete
    2. Former colleague exposes Kejriwal’s sleazy affair at Thiruvananthapuram Guest House on Nov 18, 2008

      http://kbforyou.blogspot.in/2016/10/my-stint-with-kejriwal-wising-up-to.html

      http://nationalviews.com/about-swati-maliwal-biography-facts-background

      Delete
  34. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  35. https://www.facebook.com/permalink.php?story_fbid=1241971079199850&id=100001609082353

    ReplyDelete
  36. పాకిస్తాన్ మీద ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఇండియాలో పుట్టిన వాళ్ళు ఇంతగా డౌటు పడుతూ ఇంతగా ఎందుకు వెర్రెత్తి పోతున్నారు?

    నేనేదో untold thing కూడా చెప్పేసి కొత్తగా మాట్లాడుతున్నానని కూడా అంటున్నారు,ఏంటి మీ ఉద్దేశం!
    న్ లాడెన్ చావు అబద్ధమా?ఆయనింకా బతికే ఉన్నాడనా?లేక అమెరికా పాకిస్తాన్ ఒప్పుదలతోనే పాకిస్తానుకు చెప్పి చేసిందా?అకక్డ నేను మరొక విషయం ఏదీ టచ్ చెయ్యలేదే?

    భారత్ మీద వెయ్యేళ్ళ జిహాద్ ప్రకటించినప్పుడు అది అబద్ధమనీ బియాస్డ్ మీడియా కుట్ర అనీ ఎందుకు అనిపించలేదు?

    డెబ్భయ్యేళ్ళుగా సందు దొరికినప్పుదల్లా ఉగ్రవాదుల్ని పంపించడం కూడా బియాస్డ్ మీడియా కుట్రయేనా?

    భింద్రన్వాలే స్వర్ణ దేవాలయంలో ఆయుధాలు పోఎగేసినప్పుడు సైఉన్యం ఏమి చేస్తుంది అని అడుగుతున్నవాళ్ళకు అతన్ని ఎగదోసింది అప్పటి ప్రధాని ఇందిర అని తెలియదా?

    ఇవ్వాళికివ్వాళ సర్జికల్ స్ట్రైక్ జరిగిన వెంఠనే పాక్ మీడియా కూడా నిజమేనని అకడి ప్రభుత్వాన్ని ముఖం చెల్లని స్థితికి తీసుకెళ్ళటం కూడా అబద్ధమేనా?

    నాలుగు రోజులు కష్టపడి అన్నీ తుడిచేసి కే శ్రీనివాసు లాంటి గొట్టాంగాళ్ళని తీసుకెళ్ళి చూపించి వాళ్ళతో తన పాట పాడిస్తే నమ్ముతున్నవాళ్ళు ఇంకా మేము నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నామని బూకరిస్తున్నారు,సిగ్గు లేదూ!

    గులాం అక్బర్ స్కూలు పిల్లాడిలాగా అట్లా ఎందుకు చెప్తాడు అని అంటున్వాళ్ళకి కామన్ సెన్స్ అయిన ఔందా? 66 స్టింగ్ ఆపరెషన్ వాళ్ళు ఏం చెప్పి అడిగారు?అయ్యా,మేము ఫాలానా చానల్ నుంచి అడుగుతున్నాం అని అడిగారా? అప్పుడున గందరగోళంలో పై అధికారి రిపోర్టు అడుగుతున్నట్టు భ్రమంపజేస్తే ఇచ్చిన రిపోర్టు అది,అవునా కాదా?


    ఈ దేశప్రజలో మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని డ్రాకులా అనటంలోనే తెలుస్తుంది మీరు ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డారో మీ ఎజెండాకి కట్టుబడ్డారో!

    కళ్లముందు చిన్న యాక్సిడెంట్ జరిగితేనే చూడలేక వాంతులు చేసుకునే సామాన్యజనం ముందు యుద్ధ దృశ్యాల్ని చూపించటం అవసరమా?ఉరీ దాడి జరగ్గానే జాతి అంతరాత్మ మీద జరిగిన దాడి అని ఘోషించినవారూ,స్ట్రైక్ జరిగిన వెంఠనే చప్పట్లు కొట్టిన వారూ రెండు రోజులోనే మాట తిప్పేశారే - ఇప్పుడు వీదియోలు చూసి వీరు చేసే ఘనకార్యం ఏమిటో తెలియని అజ్ఞానులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ?

    ఈ దేశం మెద వెయ్యేళ్ళు జెహాద్ చేస్తానని ప్రగల్బ్భాలి పలికి మూడు సార్లు యుద్ధానికి మూడుసార్లూ తోక ముడుచుకు పోయిన దేశం గొప్ప మొనగాడు దేశమట!తను పుట్టి పెపెరిగిన మాతృదేశం అబద్ధాల కోరట!మళ్ళీ మళ్ళీ అంటాం,మీలాంటోళ్ళని పాకిస్తానుకి పార్శిల్ చెయ్యాల్సిందే. అక్కడ జరిగిన ఒక్కదానికే రిజల్టు మీలాంటోళ్ళకి ఎంత కళు బైర్లు గమ్మించిందో మీ కామెంట్లలో తెలుస్తూనే ఉంది,ఇక్కడ వెయ్యికి పైన జరగాలి,జరుగుతాయి,ఏం పీక్కుంటారో పీక్కోండి - బస్తీ మే సవాల్!

    కనీసం ఉరీ దాడి పాకిస్తాన్ చెసిందని అయినా నమ్ముతున్నారా?లేకపోతే పాకిస్తాన్ చెప్పిన భారత్ తన సైనికుల్ని తనే చంపుకుంది అన్న మాటనే మీరూ నమ్ముతున్నారా?

    ReplyDelete
  37. >>కళ్లముందు చిన్న యాక్సిడెంట్ జరిగితేనే చూడలేక వాంతులు చేసుకునే సామాన్యజనం ముందు యుద్ధ దృశ్యాల్ని చూపించటం అవసరమా?

    Simply awesome. Superb.. 1000 marks out of 100..

    ReplyDelete
  38. సామాన్యుడిగా నాకొచ్చిన సందేహాలుతీర్చమంటే,, పాకిస్తాన్ కి పార్శెల్ చేస్తానంటున్నావ్? ప్రతి వాజెమ్మ సవాల్ శవాల్ అంటమే మొడీ ని చూసుకోని. యేమన్నవ్? మెజారిటీప్రజలు ఎన్నుకొన్నారా? మరి ఇందిరాగాంధీని గూడా అప్పుడు మెజారిటీ ప్రజలే ఎన్నుకొన్నారు. మరి విమర్శిస్తావెంటీ? ఇప్పుడూ మోడీ కాంగ్రేస్ లాంటి దద్దమ్మలు వున్నారు కాబట్టే గెల్చాడు.... నెక్ష్ట్ కూడ గెలుస్తాడు.. అది మాఖర్మ... కాంగ్రెస్స్ కంటే ఇంకా పెద్ద దద్దమ్మని అని మొడీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుణ్ణాడు.. తాన అనుచరులు ఎన్ని మర్డర్లు, రేపులు చేసినా వాటిగురించి ఒక్క మాటకూడా మాట్లాడక పోవటమే మోడీ డ్రాకులా అనేదానికి ప్రూఫ్.

    ReplyDelete
    Replies
    1. నువు సామాన్యుడివా?ఒళ్ళు కొవ్వెక్క్యి మాట్లాడుతున్నావు,తమాషా అనుకుంటున్నావా?అటుపక్క పాకిస్తాన్ మీదీయా జరుగిన వెంఠనే వాళ్ళ గవ్ర్నమెంటునే నిలద్ఫీస్తున్నట్టు విన్నాక కూడా నీకు దౌట్లు వస్తున్నాయంటే ఏంటి అర్ధం?నేను ఇందిరాగంధీని విమర్శించినా దని బాబుని విమర్శించినా వాళ్ళు చేసిన తప్పుల్నే ఎత్తి చూపించి ఏకిపారేశాను - నీకూ ఇతర గొట్టాంగాళ్ళకీ ఆ దమ్ముందా?ఏం తప్పు చేశాడు మోదీ - చెప్పి అప్ప్పుడు అనాలి డ్రాకులా కాదు అంతకు పదింతలు బూతుమాట వాడినా నేను కాదు నన్ను మించ్జిన గయ్యాళి వెదహ కూడా నోరు మూస్తాడు.నేను మీకు చేసిన చాలెనిజి కూడా అదే - అది అర్ధం చేసుకోకుండా ఎందుకు సొల్లు వాగుతావు,ఫో ఫో!ఇక్కద్ అగోల చేసే బదులు "మాదా కవళం" అని అరిస్తే నాలుగు ముద్దలు జోలెలో పడతాయి.

      పోటుగాడిలా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు అని నీకు నువ్వు రుజువులూ సాక్ష్యాలూ చూపించలేని యేడుపు ఆపి దయచెయ్యి.

      Delete
    2. భారత ఆర్మిని,దేశ ప్రధాని మాటల పై నమ్మకం లేకుండా, మీరు నోటి కొచ్చింది వాగటం. చేతికొచ్చింది ఫేసు బుక్ లో రాయటం. ఎర్రి ప్రశ్నలు వేయటం. తిక్క విశ్లేషణలు చేయటం. మోడి పేరు వింటే చాలు గంగవెర్రులెత్తటం, మీ కుళ్ళు బుద్ది చూపించుకొంట్టూ ఆయనను నీచంగా మాట్లాడటం.

      మీకు పాకిస్థాన్ చరిత్ర తెలియదు. అది చేసిన దుర్మార్గాలు అంతకన్నా తెలియవు. చరిత్రను విస్మరించే వెధవలందరు, మేధావుల ముసుగేసుకొని, శాంతి గురించి సుద్దులు చెప్పటం, నిజాలెవరైనా మాట్లాడితే, వాడిని దిగొచ్చాడు దేశభక్తుడు అని ఎగతాళి చేయటం. ఈ ప్రపంచంలో పాకిస్థాన్ నమ్మే వెధవలు మీరొక్కరే. మీ తెలివిని చూసి దేశ ప్రజలు ఛీ కొట్టారు. కనుకనే మీ ఎర్ర, దాని అనుబంధ పిల్ల ఉద్యమాలు అన్ని కాలగర్భం లో కలసి పోయాయి.

      ఒక్కసారి పాకిస్థాన్ వాళ్ళు అప్పర్ హాండ్ సాధిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంట్టుందొ మీకు తెలియదు. మూడేళ్లక్రితం హిందిలో ఒక సినేమా వచ్చింది. అది బంగ్లాదేశ్ పోరాటానికి సంబంధించిన సినేమా. ఆ సినేమా ట్రైలర్ చూడు.

      https://www.youtube.com/watch?v=2_yoHnffSyE

      https://www.youtube.com/watch?v=eqCKLuHdpWw

      'The Bastard Child' is a film on East Pakistan's struggle for freedom-Director
      (14:52-15:28)
      https://www.youtube.com/watch?v=CPQQCCa6_dY

      Delete
    3. @ Haribaabu watch this series (5 parts)

      Crisis of the State - India's External Security" By Bharat karnard

      https://www.youtube.com/watch?v=fM29AABwtU8

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. అజ్ణాత, ఈ విడియోలు చూసి వాస్తవాన్ని గ్రహించు. చాటడంత వ్యాఖ్యలు రాసి, మళ్ళి సమాధానాలు ఇవ్వలేదని ఆరోపణలు చేస్తూ సమయం వృథా చేసుకోవద్దు.

      Hassan Nisar True Nature of Pak Society
      https://www.youtube.com/watch?v=i_acOBxiT9E

      American Military Expert Ralph Peters says the bitter truth

      https://www.youtube.com/watch?v=Bi5PPvTJ-xI
      https://www.youtube.com/watch?v=gaGltDn8eNg
      https://www.youtube.com/watch?v=gQhwDj5KWNU
      https://www.youtube.com/watch?v=WQjbO9AdvkY

      Delete
    6. Srinivasu & Haribaabu,

      A Date Bengal Should Not Have Forgotten

      Mookerjee successfully turned Jinnah’s argument for partition of India on its head for the partition of Bengal.

      Mookerjee and leaders of the Hindu Mahasabha and Bengal Congress lobbied successfully for retaining Calcutta within India. They also successfully defeated a diabolical plan hatched by Suhrawardy for an independent and united Bengal.

      http://swarajyamag.com/politics/a-date-that-bengal-should-not-have-forgotten

      Delete
  39. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  40. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  41. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. ఆ విడీయోలు చూసి నువ్వు వెనకేసుకొచ్చే వారేలంటివారో తెలిసి నీకు పిచ్చి పట్టి ఉంట్టుంది. నీకు చాలా రోజుల క్రితమే రాశాను మానసిక వైద్యుడి దగ్గరకి పోయి చూపించుకో అని.

      నా వ్యాఖ్యలన్ని దేశ పాలసిని సమర్ధించేవే! వాటితో నువ్వు విభేదిస్తూంటే ఈ దేశ ఆలోచన విధానం తో సరిపడ లేదనేది తెలుస్తున్నాది. కనుక ఆలోచించుకోవాలసింది నువ్వే!

      Delete
  42. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  43. అబ్బాయ్! నీకింకా అర్ధం అవ్వట్లా.. మొడి ని సమ్ర్ధించనివాల్లనంద్ర్నీ ఈ దేశం నుంచి తరిమెయ్యడమే వీల్ల పని

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. హరిబాబు, సీరియస్ గా చర్చిస్తే, ఓటమిని ఒప్పుకోలేక కామేడి కి దిగిపోయాడు. ఈ మతి భ్రమించి రాసే వాళ్ల వ్యాఖ్యలను తొలగిస్తారని ఆశిస్తాను.

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
  44. U G! నీ పిచ్చి లాజిక్ ల దెబ్బకి వీడికికూడా పిచ్చెక్కినట్టుంది

    ReplyDelete
  45. పాక్‌లో నలుగురిలో ఒకరికి ఆ సమస్యలు!
    Sakshi | Updated: October 10, 2016 08:48 (IST)
    పాక్‌లో నలుగురిలో ఒకరికి మానసిక సమస్యలు!

    ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ప్రతి నలుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా సుమారుగా 19.3 కోట్లు. అందులో 5 కోట్ల మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు అగాఖాన్ యూనివర్సిటీ మానసిక విభాగపు చైర్మన్ డాక్టర్ ఆయేషా మియాన్ తెలిపారు. దాదాపు 3.5 కోట్ల మంది వయోజనులు, 2 కోట్ల మంది చిన్నారులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు.

    మానసిక రుగ్మతలతో బాధపడేవారి ప్రవర్తన హింసాత్మకంగా ఉంటుందనీ, సమాజహితానికి ఏ మాత్రం పాటుపడలేరని ఆయేషా వివరించారు. మానసికంగా అనారోగ్యంగా ఉండేవారి విషయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం తగినంత తోడ్పాటు అదించాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్య పట్ల మీడియా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఆమె కోరారు. అక్టోబర్ 10న ‘వరల్డ్ మెంట్ హెల్త్ డే’ను పురస్కరించుకుని మానసిక సమస్యలపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుందని డాన్ పత్రిక వెల్లడించింది.

    ReplyDelete
  46. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
    4. This comment has been removed by a blog administrator.

      Delete
    5. ముయ్యెహే! నీ మోడీ సాంగు. ఎప్పుడూ అదే సొల్లేనా? పనీ పాటా లేదా?
      మోడీ తప్పుంటే చెప్పమని ఈ బ్లాగ్ ఓనర్ ఛాలెంజ్ చేసాడు కదా? చెప్పే దమ్ము లేదా?

      Delete
    6. This comment has been removed by a blog administrator.

      Delete
    7. నీ కళ్ళూ చెవులూ రెండూ దొబ్చాయా? ఏంటి నువ్వడిగేది? పాకిస్తాన్ పేరెత్తిన్నప్పుడే నీ స్థాయి అర్థమైంది. చెవి కోసిన మేకలా బ్లాగులో సొల్లునింపుతూ మోడీ మోడీ అని కేకలు పెడతావేం? నీళ్ళ పంపు దగ్గర ఆడోళ్ళే నీకంటే చాలా నయం. నీళ్ళొచ్చినప్పుడే కొట్టుకుంటారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఈ బ్లాగుకు పట్టిన చీడపురుగులా పెతోడి మీదా మోడీ, మోడీ ని పడిపోతావేం? హరిబాబు అడిగిన దానిలో మీనింగే లేకపోతే ఈ బ్లాగులో మొరగడం దేనికి? బయటకి పోయి మొరుగు. పెతిదానికీ నీ పాకిస్తాన్ ఫ్యామిలీ సాంగ్, మోడీ సాంగ్ వేయకుండా మందులు వేసుకుని క్యూర్ చేసుకో.

      Delete
    8. This comment has been removed by a blog administrator.

      Delete
    9. This comment has been removed by a blog administrator.

      Delete
    10. This comment has been removed by a blog administrator.

      Delete
  47. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. నీ చెత్తవాగుడు ఆపు. హరిబాబు విసిరిన సవాల్ కు సమాధానం లేదు. మళ్ళీ మళ్ళీ తిక్క రాతలు రాస్తున్నావు.

      Haribaabu Cud u pls delete his comments?

      Delete
    2. ఆహా .. మొట్టమొదటిసారి నీ ఫామిలీ సాంగ్ లేని మెస్సేజ్ చూసాను

      Delete
  48. నిన్ను వ్యతిరేకించిన వాళ్ళందరికీ పాకిస్తాన్ దేశభక్తి అంటగట్టినప్పుడు అది పరమ నీచ చెత్త వాగుడు అనిపించలేదా?

    ReplyDelete
    Replies
    1. '''''''''''''''''
      నేనేదో untold thing కూడా చెప్పేసి కొత్తగా మాట్లాడుతున్నానని కూడా అంటున్నారు,ఏంటి మీ ఉద్దేశం!
      న్ లాడెన్ చావు అబద్ధమా?ఆయనింకా బతికే ఉన్నాడనా?లేక అమెరికా పాకిస్తాన్ ఒప్పుదలతోనే పాకిస్తానుకు చెప్పి చేసిందా?అకక్డ నేను మరొక విషయం ఏదీ టచ్ చెయ్యలేదే?

      భారత్ మీద వెయ్యేళ్ళ జిహాద్ ప్రకటించినప్పుడు అది అబద్ధమనీ బియాస్డ్ మీడియా కుట్ర అనీ ఎందుకు అనిపించలేదు?

      డెబ్భయ్యేళ్ళుగా సందు దొరికినప్పుదల్లా ఉగ్రవాదుల్ని పంపించడం కూడా బియాస్డ్ మీడియా కుట్రయేనా?

      భింద్రన్వాలే స్వర్ణ దేవాలయంలో ఆయుధాలు పోఎగేసినప్పుడు సైఉన్యం ఏమి చేస్తుంది అని అడుగుతున్నవాళ్ళకు అతన్ని ఎగదోసింది అప్పటి ప్రధాని ఇందిర అని తెలియదా?

      ఇవ్వాళికివ్వాళ సర్జికల్ స్ట్రైక్ జరిగిన వెంఠనే పాక్ మీడియా కూడా నిజమేనని అకడి ప్రభుత్వాన్ని ముఖం చెల్లని స్థితికి తీసుకెళ్ళటం కూడా అబద్ధమేనా?

      నాలుగు రోజులు కష్టపడి అన్నీ తుడిచేసి కే శ్రీనివాసు లాంటి గొట్టాంగాళ్ళని తీసుకెళ్ళి చూపించి వాళ్ళతో తన పాట పాడిస్తే నమ్ముతున్నవాళ్ళు ఇంకా మేము నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నామని బూకరిస్తున్నారు,సిగ్గు లేదూ!

      గులాం అక్బర్ స్కూలు పిల్లాడిలాగా అట్లా ఎందుకు చెప్తాడు అని అంటున్వాళ్ళకి కామన్ సెన్స్ అయిన ఔందా? 66 స్టింగ్ ఆపరెషన్ వాళ్ళు ఏం చెప్పి అడిగారు?అయ్యా,మేము ఫాలానా చానల్ నుంచి అడుగుతున్నాం అని అడిగారా? అప్పుడున గందరగోళంలో పై అధికారి రిపోర్టు అడుగుతున్నట్టు భ్రమంపజేస్తే ఇచ్చిన రిపోర్టు అది,అవునా కాదా?


      ఈ దేశప్రజలో మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని డ్రాకులా అనటంలోనే తెలుస్తుంది మీరు ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డారో మీ ఎజెండాకి కట్టుబడ్డారో!

      ఈ దేశం మెద వెయ్యేళ్ళు జెహాద్ చేస్తానని ప్రగల్బ్భాలి పలికి మూడు సార్లు యుద్ధానికి మూడుసార్లూ తోక ముడుచుకు పోయిన దేశం గొప్ప మొనగాడు దేశమట!తను పుట్టి పెపెరిగిన మాతృదేశం అబద్ధాల కోరట!

      కనీసం ఉరీ దాడి పాకిస్తాన్ చెసిందని అయినా నమ్ముతున్నారా?లేకపోతే పాకిస్తాన్ చెప్పిన భారత్ తన సైనికుల్ని తనే చంపుకుంది అన్న మాటనే మీరూ నమ్ముతున్నారా?

      నేను ఇందిరాగంధీని విమర్శించినా దని బాబుని విమర్శించినా వాళ్ళు చేసిన తప్పుల్నే ఎత్తి చూపించి ఏకిపారేశాను - నీకూ ఇతర గొట్టాంగాళ్ళకీ ఆ దమ్ముందా?
      '''''''''''''''''
      ఇంత సూటిగా పాయింట్ బై పాయింట్ టచ్ చేస్తూ అడిగిన అని ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ జవాబు చేప్పకుండా అడ్డమైన సొల్లు రాస్తున్నప్పుడు కూడా మీకు మీరు రాస్తునంది పరమనీచచెత్తవాగుడు అనిపించలేదా?

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. "దొబ్బెయ్యండి" అని నీకు అర్ధమయ్యే భాషాలో చెప్తేగానీ ఎక్కదా నీకు?సొల్లు రాయడం తప్ప నువు జవాబు చెప్పిందొఇ ఎక్కడ?చెత్త కామెంట్లు తీసేస్తానని నేను ఎప్పుడో చెప్పాను,గుర్తు లేదా?నేను అడిగింది ఏమిటి?ఉరీలో దాడి కూడా పాకిస్తాన్ చెపినట్టు భారత్ ప్రభుత్వమే చేసింది అని నువు అనమ్ముతున్నవా?ఉరీ మీద దాడి,సర్జికల్ స్ట్రైక్స్ - ఇవన్నీ మోదీ సొంతంగా తన వెధవాయిత్వాన్ని (అదేమిటో ఎప్పుడో ప్రూవ్ చేసేసుకున్నాడు అని వాగటం తప్ప ఏ నా బట్టా సాక్ష్యాలతో చెప్పి తగలడితేనా!) కప్పెట్టుకోవటానికి చర్సినట్టు వాఫడం కూడా సరయిన జవాబేనా?

      Delete
    4. మొడీ కనిపిస్తే పబ్లిక్గా పొర్లు దండాలు పెట్టేసిన మీడీయాని నువ్వు నమ్ముతున్నావా?

      పాకిస్తాన్ ఆధికారుల్ని నమ్ముతున్న నువ్వు.. వాళ్ళ ప్రధాని దాడులు అబద్దమన్నదాన్ని కూడా నమ్ముతున్నావా?

      మొడీ విస్వసనీయతని ప్రశ్నిస్తే.. మనమీద మనమే దాడి చేసుకున్నామా అని అడిగే నీకున్న విస్వసనీయత ఏంటి?

      రక్తం చూస్తేనే వాంతులు చేసుకుంటారు కాబట్టే ప్రజలకి వీడియోలు చూపించట్లేదు అనే నీకు ప్రజలంత చీప్గా ఎందుకు కనిస్తున్నారు?

      ఇప్పటికి కూడా వీడియోలు ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం(అస్సలవి వుంటేకదా) మాకు లేదు అనే డిక్టేటర్లు హిందు గవర్నమెంటు కాకుంటే ఇలాగే వెనకేసుకొఛ్ఛే వాడివా?

      ముందు వీటికి పాయింటు బై పాయింటు చెప్పు.

      ఎప్పటిలాగే నా ముందు మెస్సేజిని డిలీట్ చేసి నువ్వంటో ఎంటో చూపిచుకున్నావ్..

      Delete
    5. ఇప్పటికి కూడా వీడియోలు ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం(అస్సలవి వుంటేకదా) మాకు లేదు అనే డిక్టేటర్లు హిందు గవర్నమెంటు కాకుంటే ఇలాగే వెనకేసుకొఛ్ఛే వాడివా?


      బస్తీమే సవాల్.. దీనికి సమాధానం చెప్పు

      Delete
    6. దొబ్బేయ్, పాకిస్తాను, ఫో ఫో , నా బట్ట అనే పదాలు ఉపయోగించ కుండా దీని ఒక్కదానికి సమాధానం చెప్పు చూద్దాం

      Delete
    7. Q1.మొడీ కనిపిస్తే పబ్లిక్గా పొర్లు దండాలు పెట్టేసిన మీడీయాని నువ్వు నమ్ముతున్నావా?

      A1.డెబ్భయ్యేళ్ళుగా సందు దొరికినప్పుదల్లా ఉగ్రవాదుల్ని పంపించడం కూడా బియాస్డ్ మీడియా కుట్రయేనా?

      Q2.పాకిస్తాన్ ఆధికారుల్ని నమ్ముతున్న నువ్వు.. వాళ్ళ ప్రధాని దాడులు అబద్దమన్నదాన్ని కూడా నమ్ముతున్నావా?

      A2:గులాం అక్బర్ స్కూలు పిల్లాడిలాగా అట్లా ఎందుకు చెప్తాడు అని అంటున్వాళ్ళకి కామన్ సెన్స్ అయిన ఔందా? 66 స్టింగ్ ఆపరెషన్ వాళ్ళు ఏం చెప్పి అడిగారు?అయ్యా,మేము ఫాలానా చానల్ నుంచి అడుగుతున్నాం అని అడిగారా? అప్పుడున గందరగోళంలో పై అధికారి రిపోర్టు అడుగుతున్నట్టు భ్రమంపజేస్తే ఇచ్చిన రిపోర్టు అది,అవునా కాదా?భారత్ మీద వెయ్యేళ్ళ జిహాద్ ప్రకటించినప్పుడు అది అబద్ధమనీ బియాస్డ్ మీడియా కుట్ర అనీ ఎందుకు అనిపించలేదు?

      Q3.మొడీ విస్వసనీయతని ప్రశ్నిస్తే.. మనమీద మనమే దాడి చేసుకున్నామా అని అడిగే నీకున్న విస్వసనీయత ఏంటి?

      A3:ఇవ్వాళికివ్వాళ సర్జికల్ స్ట్రైక్ జరిగిన వెంఠనే పాక్ మీడియా కూడా నిజమేనని అకడి ప్రభుత్వాన్ని ముఖం చెల్లని స్థితికి తీసుకెళ్ళటం కూడా అబద్ధమేనా?

      నాలుగు రోజులు కష్టపడి అన్నీ తుడిచేసి కే శ్రీనివాసు లాంటి గొట్టాంగాళ్ళని తీసుకెళ్ళి చూపించి వాళ్ళతో తన పాట పాడిస్తే నమ్ముతున్నవాళ్ళు ఇంకా మేము నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నామని బూకరిస్తున్నారు,సిగ్గు లేదూ!

      Q4.రక్తం చూస్తేనే వాంతులు చేసుకుంటారు కాబట్టే ప్రజలకి వీడియోలు చూపించట్లేదు అనే నీకు ప్రజలంత చీప్గా ఎందుకు కనిస్తున్నారు?

      A3:బాబూ,మా దేశంలో బతకలేకుండా ఉన్నాం,పర్మిషనిస్తే చాలు కాందిశీకులుగా అయినా పడిఉంటాం అన్న పాకిస్తానీ మేధావుల విన్నపాలూ,పాకిస్తాన్ అంతర్గత వ్య్వహారాల్లో కలగజేసుకుని మాకు సాయం చెయ్యందని అడిగిన భుట్టో కుటుంబం అభ్యర్ధనలూ నమ్మలేని నిన్ను మాన్వమాత్రుడు నమించగలడా?ఇవేవీ నమలేనివాడివి వెడియో చూసి ఏం పీకుతావు?యుదహ్ దృశ్యాలంటే దీపావళి బంబుల మాదిరిగా ఉంటాయనుకున్నావా?నెత్తుటి ముద్దలూ,ఖందఖండాలుగా పడి ఉన్న దేహాలొ ఉంటాయి - నీకు చూసే కక్కుర్తు ఉందని అందరూ అంత భీబత్సకక్కుర్తిలో ఉండరు. ఈ దేస ప్రజల పట్ల చిన్నచూపు ఉంటే గింటే నీకే ఉన్నట్టుంది.ఇట్లాంటి "ప్రజలు నాకు చీపుగా కంపించటం" లాంటి చెత్త కబుర్లు చెప్పకు.

      Q5.ఇప్పటికి కూడా వీడియోలు ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం(అస్సలవి వుంటేకదా) మాకు లేదు అనే డిక్టేటర్లు హిందు గవర్నమెంటు కాకుంటే ఇలాగే వెనకేసుకొఛ్ఛే వాడివా?

      A5:భారతసైన్యం సర్జికల్ స్ట్రైక్ చెయ్యటం ఇదే మొదటిసారి కాదు,అది తెలుసా నీకు?శరద్ పవార్ స్టేట్మెంటు "గతంలో మేము కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేశాం" అనటం చూదలేదా?"మేము కూడా" అంటే అర్ధం ఏమిటి?ఇదివరకుజరిగిన సర్జికల్ స్ట్రైక్ మీద రాని అనుమానాలు నీకు ఇపుడెందుకు వస్తున్నాయి - అకక్డ నీకు నచ్చని ప్రభుత్వం ఢిలీలో ఉన్నది కాబట్టి నువు విమర్శిస్తున్నావా?నీకు నచ్చిన గవ్ర్నమెంటు ఉంటే వెనకేసుకొచ్చేవాడివా?

      Now ball is in your court - I always encourage serous argument!

      Delete
    8. నువ్వు నేను అడ్గిన వాటికి సమాధానాలు చెప్పావనే అనుకుంటున్నావా?

      Delete
    9. మొదట ప్రశ్నలు అడిగింది నేను!కాబట్టి నేనొ నిన్ను అదే అడుగుతునాన్ను "నువ్వు నేను అడ్గిన వాటికి సమాధానాలు చెప్పావనే అనుకుంటున్నావా?" అని.

      నువు అడిగిన చివరి ప్రశ్నని బట్టి నువు అన్నింటినీ తీసుకెళ్ళి మోదీకి ఎందుకు తగిలిస్తున్నావో ఇదివరకటి సర్జికల్ స్టరికుని నమ్మి ఇప్పటి సర్జికల్ స్ట్రైకుని నమ్మకపోవడానికి కారణం యేమిటో ఎవరికయినా తేలిగ్గానే అర్ధం అవుతుంది!నేను దాన్ని తిరగేసి అడిగింది అందుకే - ఇంకా అర్ధం కాలేదా?

      Delete
    10. >>మొదట ప్రశ్నలు అడిగింది నేను!

      సరిగ్గా కళ్ళజోడు పెట్టుకోని చూడు.. ఏవరి ప్రశ్న ముందో తెలుస్తుంది.. నువ్వు నామెస్సేజిలన్నీ డిలీట్ చేసి నేనే ముందు నేనే ముందు అని చిన్నపిల్లాడిలా సంబరపడుతున్నావ్

      Delete
    11. @ Haribabu/boothula anonymous/UG Sriraam

      ఇప్పటికి కూడా వీడియోలు ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం(అస్సలవి వుంటేకదా) మాకు లేదు అనే డిక్టేటర్లు హిందు గవర్నమెంటు కాకుంటే ఇలాగే వెనకేసుకొఛ్ఛే వాడివా?


      బస్తీమే సవాల్.. దీనికి సమాధానం చెప్పు

      Delete
    12. Anonymous12 October 2016 at 00:16

      Cooment1:Haribabu Suranenii8 October 2016 at 08:18
      Dear anon,
      Do you think modi called naval and asked to strike in uri to get popularity?I think you are believing Pakistan who cleared everything before calling friendly media to harp it's tune and CNN is a biased chanel!
      Please avoid nonsensical arguments,if you don't like surgical strike whole together also just keep quite.

      comment2:Haribabu Suranenii10 October 2016 at 00:14
      పాకిస్తాన్ మీద ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఇండియాలో పుట్టిన వాళ్ళు ఇంతగా డౌటు పడుతూ ఇంతగా ఎందుకు వెర్రెత్తి పోతున్నారు?

      నేనేదో untold thing కూడా చెప్పేసి కొత్తగా మాట్లాడుతున్నానని కూడా అంటున్నారు,ఏంటి మీ ఉద్దేశం!
      న్ లాడెన్ చావు అబద్ధమా?ఆయనింకా బతికే ఉన్నాడనా?లేక అమెరికా పాకిస్తాన్ ఒప్పుదలతోనే పాకిస్తానుకు చెప్పి చేసిందా?అకక్డ నేను మరొక విషయం ఏదీ టచ్ చెయ్యలేదే?

      ఇవీ మొదట నేను కల్పించుకుని అడిగ్జ్ ప్రశ్నలు.వీటిల్లో ఏ ఒకదాని పట్టించుకుని జవాబు చెప్పీన్ ఏ కామెంటునీ నేను డెలిట్ చెయ్యలేదు.డెలిట్ చేర్సిన కామెంట్లని సాకుగా చెప్పి తప్పించుకోవాలనుకుంటే నీ ఇష్టం!

      నువ్వు అడిగిన ఆఖరి ప్రశ్నని బట్టి ఇదివరకు జరిగిన సర్జికల్ స్ట్రైక్ నిజమని నమ్మడానికీ ఇప్పుడు జరిగిన సర్జ్జికల్ స్ట్రైక్ మీద అనుమానాలు రావ్డానికీ నీకు నచ్చని మోదీ అధికారంలో ఉందటమేనని చిన్నపిల్లాడు కూడా తెలుసుకోగలడు.ఇంతటితో ఆపితే పూర్తిగా పరువు పోగొటుకోకుండా ఉండగలుగుతావు.

      Delete
    13. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, అధికారం వొచ్చాక నిస్సిగ్గుగా ఇవ్వమని ముఖాన చెప్పెట్టి కొట్టినట్టు చెప్పిన ఏ గవర్నమంటు చేసేవాటిని నేనే కాదు చేసేవాటిని అభిమానం వున్న వాళ్ళెవరూ నమ్మరు.

      Delete
    14. This comment has been removed by a blog administrator.

      Delete
    15. Anvesh Pr12 October 2016 at 00:41

      >>అభిమానం వున్న వాళ్ళెవరూ నమ్మరు

      నాకు అభిమానం మాత్రమే కాదు.. సిగ్గు శరం మానం మర్యాద కూడా వున్నాయి.. అందుకే నేను నమ్మను

      Delete
    16. This comment has been removed by a blog administrator.

      Delete
    17. @Anonymous12 October 2016 at 03:01
      అస్సలు మన మహర్షులకి యగ్నాలు చేసుకొడానికి మన దగ్గర ప్లేసు లేనట్టు అవతలి వాడి రాజ్యంలో యాగాల పేరుమీద జొరబెట్టి వాటిని రక్షించే నెపంతో వాళ్ళని ఆకరమించేటోళ్ళం.

      haribabu:నువ్వు దేని గురించి ఎత్తుతున్నావో నాకు యెలుసు.ఆ పకక్నే రావణుడి మంత్రిగా ఉన్నమారీచుడు కూడా తపస్సు చేసుకుంటున్నాడు.తపస్సు చేసుకునే మునులకి పోక్క రాజ్జ్యాలు ఉండవు.

      ఇవాళ జరుగుతునన్వాటికి సంబంధించి ముడ్డీ నోరూ తెలీదు,పురాణాల్ని ఎత్తుకుంటున్నావు.నీలాంటి వాళ్లనే "దొబ్బేయ్బండి" అని అన్నది .మూసుకుపోరా కుక్కా!

      Delete
    18. @Anvesh Pr12 October 2016 at 00:41
      ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, అధికారం వొచ్చాక నిస్సిగ్గుగా ఇవ్వమని ముఖాన చెప్పెట్టి కొట్టినట్టు చెప్పిన ఏ గవర్నమంటు

      haribabu:ఆఖరికి ఇదొక్కటి దొరికిందా నీకు?ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజీ అదీ ఇవ్వకపోయినా ఆంధ్రాకి ఏమీ కాదని మాలాంటివాళ్ళకి తెలుసు.మెడమీద తల ఉన్న ఆంధ్రావాడు ఎవ్వడూ వాటికోసం నీలా ఏడవలేదు.

      Delete
  49. Dear UG!
    నేను మొదటినుంచి మీ మెస్సేజ్లు ఫాలో అవుతున్నాను. అనానిమస్ ఎన్ని సార్లు అడిగినా దానికి ప్పాకిస్తాన్ కి లింక్ పెట్టి అస్సలు ఈ పోస్ట్ అంటేనే అసహ్యం పుట్టీంచారు. నీ మెస్సేజ్లు ఇంతకు ముందు వాటిల్లో కొడోఅ చూశాను. ఒక చోట గో రక్షకులు ఇంట్లోనుంచి ఒకడిని బయటకు లాగి కొట్టీ చంపిన దాని గురించి ప్రశ్నిస్తే, ఎక్కడో బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపారని గో రక్షకుల్ని వెనకేసుకొచ్చిన చరిత్ర నీది. అలాంటి నిన్ను నాన్ హిందు వ్యతిరేకి అనడంలో నాకెటువంటీ తప్పు కనిపించలేదు. ఇంకా నువ్వు నీ దేశభక్తి అనే ముసుగులో పురుగులా నటిస్తావో లేక భారతీయుడిగా జీవిస్తావో తేల్చుకో

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఎక్కడో బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపారని

      అనానిమస్ గా లేక అన్వేశ్ ,,,వంద పేర్లు పెట్టుకొనివచ్చినా, నువ్వు ఎన్ని సార్లు అడిగినా సమాధానం ఇవ్వవలసిన అవసరం నాకు లేదు.

      నా రాజకీయ అభిప్రాయాలు సుబ్రమణ్య స్వామివి ఒకటే. బంగ్లాదేశ్ ఎక్కడో లేదు. అమెరికా కన్నా చాలా దగ్గర. అదికూడా ఒకప్పుడు మన దేశంలోనిదే!

      @haribaabu,Could you pls delete above comment also.

      Delete
    3. ఒహో! బంగలాదేశ్ పక్కనుంది కాబట్టి, మనం గోరక్షకులు ఏం చేసినా అబ్బా ఎం చేశారు అంటూ వాళ్ళ సంకలు నాకుతూ కూర్చోవాలన్నమాట.

      >>అనానిమస్ గా లేక అన్వేశ్ ,,,వంద పేర్లు పెట్టుకొనివచ్చినా

      నీకు,బూతు అనానిమస్సు, హరిబాబు కు నాన్ హిందూ వ్యతిరేకతలో చాలా దగ్గర పోలికలున్నయ్. కాబట్టి మీ ముగ్గురూ ఒకటే అనొచ్చా? ఒక్కటి కాకపోతే, నువ్వు, బూతుల అనానిమస్సు ఎంత చండాలంగా సంభందం లేకుండా వాగినా.. అవి మాత్రమే ఎందుకు వుంటాయి. మీది తప్పు అనేవి మాత్రం క్షణ మాత్రం ఆలశ్యం లేకుండా ఎందుకు డిలీట్ అవుతాయి... మీముగ్గురూ.. హిందూ మతానికి పట్టిన చెద పురుగులు.. మోడీ ఓడిపొయ్యాక మీ ఫేసులు చూడాలి నా సామిరంగా.. మాడిపోయిన అట్లుకూడా అంత నల్లగా వుండవు.. మళ్ళీ మీ పిచ్చని ఇంకో మత, కుల పిచ్చగాడొచ్చేవరకు గల్ల పెట్టీలోనో, నశ్యం డబ్బాలోనె తాళం వేసుకోవడమే

      Delete
    4. భర్ఖాదత్ ఒక అంశం తీసుకొని యాగి చేయటం మొదలుపెడితే, పక్క చానల్స్ లో ఉన్న రాజ్ దీప్, సాగరిక ... ఆ గోల కు తాళంవేసి జాతీయ స్థాయిలో ఒక వార్తను హై లైట్ చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఆమె తీసుకొన్న ఒక అంశం గోరక్షకులది. దేశంలో బలహీనులపై దాడులు జరుగుతన్నాయి అని చెప్పటమే ఉద్దేశం ఐతే ఎన్నో వార్తలు రోజు పేపర్లలో వస్తూంటాయి. కాని వాళ్లకి కావలసింది బలహీనుల పై దాడులు ముఖ్యం కాదు. గో రక్షకులకు, హిందుత్వ కి సంబంధం అంటగట్టి, ఆ సాకుతో మోడిని ఇరికించాలను కోవటం. హిందూవులను తప్పుటోళ్ళుగా గోరంతలు కొండంతలు చేస్తూ ప్రచారం చేసి వారిని ఆత్మరక్షణలో పడేయటం.

      రోజు ఈ క్రింది వార్తలు లాంటివి ఎన్నో పేపర్లలో వస్తూంటాయి. ఈ ఇంగ్లీష్ మీడీయావాళ్లు మరి వాటిపై గో రక్షకుల పై జరిగిన దాడుల వలే,వీటి పై ఎందుకు యుద్దం ప్రకటించలేదు.

      1. Jharkhand Maoists kill 20-year-old girl who chose school over guns

      http://www.hindustantimes.com/india/maoists-kill-20-year-old-girl-who-chose-school-over-guns/story-O3OgKRbDvNVWlNDndc2ZKP.html

      2. 12 injured as Muslim men attack Dalit basti
      Both parties had altercation over ‘eve-teasing’

      http://indianexpress.com/article/cities/lucknow/12-injured-as-muslim-men-attack-dalit-basti/

      వీళ్ల ట్రిక్ లన్ని ప్రజలకి అర్థమై పోయాయి. వీళ్ల టివి షో లకి ఎమైనా విశ్వసనీయత ఉందా? అర్ణబ్ గాడి దెబ్బ ను తట్టుకోలేక రాత్రి 9 గంటల టైం స్లాట్ ముందుకు మార్చుకొన్నారు. వీళ్ల ప్రొగ్రాం లు చూసి చాలా నెలలైపోయింది. అర్నబ్ గాడు అతి చేస్తాడు. శాడిస్ట్ వెధవ. ఐతే వీళ్లలా 100% బయాస్డ్ గాదు.

      Delete
    5. నువ్వు గల్లపెట్టె ముందు కూర్చోని ప్లీజ్ డిలీట్ చెయ్యమనడం.. హరిబాబు జంధ్యం తిప్పుకుంటూ డిలీట్ చెయ్యడం.. భలే వుందిలే నీ సినిమా

      Delete
    6. >> అర్ణబ్

      ఏవరి మీదకైనా పిచ్చికుక్కలాగ్గా ఎగురుతూ, మొడీ పేరు వినిపిస్తేనే నీ లాగా పూనకం వొచ్చినట్టు బట్టలు చించుకోని పొర్లు దండాలు పెడతాదు. వాడేనా?

      Delete
  50. Anonymous12 October 2016 at 00:16

    Cooment1:Haribabu Suranenii8 October 2016 at 08:18
    Dear anon,
    Do you think modi called naval and asked to strike in uri to get popularity?I think you are believing Pakistan who cleared everything before calling friendly media to harp it's tune and CNN is a biased chanel!
    Please avoid nonsensical arguments,if you don't like surgical strike whole together also just keep quite.

    comment2:Haribabu Suranenii10 October 2016 at 00:14
    పాకిస్తాన్ మీద ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఇండియాలో పుట్టిన వాళ్ళు ఇంతగా డౌటు పడుతూ ఇంతగా ఎందుకు వెర్రెత్తి పోతున్నారు?

    నేనేదో untold thing కూడా చెప్పేసి కొత్తగా మాట్లాడుతున్నానని కూడా అంటున్నారు,ఏంటి మీ ఉద్దేశం!
    న్ లాడెన్ చావు అబద్ధమా?ఆయనింకా బతికే ఉన్నాడనా?లేక అమెరికా పాకిస్తాన్ ఒప్పుదలతోనే పాకిస్తానుకు చెప్పి చేసిందా?అకక్డ నేను మరొక విషయం ఏదీ టచ్ చెయ్యలేదే?

    ఇవీ మొదట నేను కల్పించుకుని అడిగ్జ్ ప్రశ్నలు.వీటిల్లో ఏ ఒకదాని పట్టించుకుని జవాబు చెప్పీన్ ఏ కామెంటునీ నేను డెలిట్ చెయ్యలేదు.డెలిట్ చేర్సిన కామెంట్లని సాకుగా చెప్పి తప్పించుకోవాలనుకుంటే నీ ఇష్టం!

    నువ్వు అడిగిన ఆఖరి ప్రశ్నని బట్టి ఇదివరకు జరిగిన సర్జికల్ స్ట్రైక్ నిజమని నమ్మడానికీ ఇప్పుడు జరిగిన సర్జ్జికల్ స్ట్రైక్ మీద అనుమానాలు రావ్డానికీ నీకు నచ్చని మోదీ అధికారంలో ఉందటమేనని చిన్నపిల్లాడు కూడా తెలుసుకోగలడు.ఇంతటితో ఆపితే పూర్తిగా పరువు పోగొటుకోకుండా ఉండగలుగుతావు.

    ReplyDelete
  51. @ ఫోబియా అనానిమస్ / బూతుల అనానిమస్ / మెంటల్ ఎనానిమస్ (మూడూ ఒకటే అని నా అనుమానం.
    నీ చివరి వ్యాఖ్యలకి నా సమాధానం నువ్వు చదువుకోలేదు. అందుకే మళ్ళీ ఇస్తున్నాను, చదువుకో.
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    నేను: పాకిస్తాన్ లో మెంటల్ కేసులు ఎక్కువయ్యయాంట.
    సైకో సైతాన్ :భౌ... భౌ. మా పాకిస్తాన్ ఫ్యామిలీని అంత మాటంటావా?
    నేను : నీ ఫ్యామిలీ ఏంటి సైకో? ఎందుకలా మొురుగుతున్నావు?
    సైకో సైతాన్ : నేనొక సైతాన్ ని. ఇప్పుడు కుక్క రూపంలో వున్నాను. నువ్వేది మాట్లాడినా నేను భౌ...భౌ. అంటాను.
    నేను : ఎందుకని?
    సైకో సైతాన్ : ఎందుకంటే నాకు మోడీ ఫోబియా వుంది, నువ్వు పాకిస్తాన్ గురించి మాట్లాడినా, సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మాట్లాడినా నేను మో.. భౌ..మో.భౌ... మనే మొరుగుతుంటాను.
    నేను : మరి నీ ఫ్యామిలీ పాకిస్తాన్ లో వుందన్నావు కదా? అక్కడికి వెళ్ళి మందులు తీసుకోకూడదూ?
    సైకో సైతాన్ : వాళ్లే నన్నికడికి పంపారు. ఇక్కడ ప్రశాంతంతా వుంది కదా, రెచ్చగొట్టి, ఇక్కడి వాళ్లందరిమీదా పిచ్చికుక్కలాగా బ్లాగుల్లో పడి అరచి గోల పెట్టమన్నారు....భౌ...భౌ...
    నేను : నీకు లియాఖత్ ఆలీ ఖాన్ తెలుసా?
    సైకో సైతాన్ : తెలియదు...భౌ...భౌ...
    నేను : అయితే, ఈ బ్లాగులోనో, ఈ పేజీలోనో నీలాంటివాళ్ళని ఏం చేయాలో ఆ పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి చెప్పాడు చదువుకో, పో.
    సైకో సైతాన్ : నేను ఎవరు ఏమి చెప్పినా వినను, చదవను, నా పని ఎవరేది మాట్లాడినా మోడీ భక్తులే అని వాళ్ళ మీద మొరగడం. ..భౌ...భౌ..
    నేను : సరే, నీ ఇష్టం. ఈ బ్లాగు ఓనరుగారు చాలా దయతో మోడరేషన్ ఆప్షన్ ఉపయోగించుకోవడంలేదు. ఆయన గనక అది పెడితే నీలాంటి స్పామ్ గాళ్ళందరూ ఒక్క ముక్క కూడా వ్రాయలేరు.
    సైకో సైతాన్ : (మనస్సులో ఇదేంట్రా బాబూ, నేను సైకో సైతాన్ గా మారినప్పటినుంచీ ఇలా చింతబరికెలతో బాదిన వాడు లేడు. ఈ హరిబాబు గారు ఎప్పడొస్తారో, ఈ కామెంట్లన్నీ ఎప్పడు డిలీట్ చేస్తారో. అప్పటి వరకూ నాకు వీపు పంబరేగడమేనా?)
    .....
    బయట కుక్కల అరుపులు విని నేను బయటకి వచ్చాను. అక్కడున్న కుక్కల గుంపు నన్ను గుర్రుగా చూస్తున్నాయి. ఏమిటి సంగతని అడిగాను.
    ‘‘మా కుక్కలతో ఆ సైకో సైతాన్ ని పోల్చొద్దు. మాకు చాలా అవమానం. పిచ్చి కుక్కలు కూడా వాడితో పోలికను ఒప్పుకోవు, ఖబడ్దార్ "

    నేను : అది సైకో సైతాన్ కుక్క రూపం. అంతేగాని నిజంగా కుక్క అని పిలిపించుకునేటంత అర్హత కూడా ఆ సైకో సైతాన్ కి లేదు.
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    .....మిస్టర్ అనాలిముచ్చూ.. ఎదుటివాటిమీద బురద జల్లాలనుకుంటే నువ్వు దానిలో మెడ వరకూ కూరుకుపోతావు. నీ పర్సనల్ గ్రడ్జెస్ ని బ్లాగుల్లో వ్యాఖ్యలుగా ఉపయోగించుకోవడం నీవు చేసే పెద్ద తప్పు. నేను పాకిస్తాన్ విషయం వ్రాస్తే నువ్వు తడుముకుని ఎవరో ఫ్యామిలీ అనడం రెండో తప్పు. నీకంటే బాగా మల్లీ ఫేసెటెడ్ గా వ్రాసే సత్తా లేకపోతే నేనసలు ఒక బ్లాగు ఓనర్నే అవగలనా? అందుకే, నా బ్లాగులో నీలాంటి స్పామ్ గాళ్ళను మోడరేషన్ స్టేజీలోనే ఏరేస్తున్నా. అది నీకు తెలుసా? నీవెన్ని పోస్టులు వ్రాస్తావో అంతకంటే ఎక్కువగానే వ్రాసి నీ మానాభిమానాలని తీయడం నాకు చిటికెలో పని. నువ్వు సొల్లు వ్రాసినట్లు ఇక్కడెవరూప మోడీ పరమ వీర భక్తులూ లేరు, మోడీ ఫోబియాగాళ్ళూ లేరు. ఈ బ్లాగును సక్రమమైన చర్చకు ఉపయోగించుకుంటే నీకూ, సమాజానికి మంచిది. విషయాన్ని చర్చిస్తానంటావా, హరిబాబు ఎప్పుడో ఛాలెంజ్ చేసాడు. అది చేయ్.
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘

    ఢీ పాకీస్తాన్ ఢాం : మనస్సులో (ఇలాంటి ఫోబియా కుక్కలు వున్నంతవరకూ, బ్లాగులో పడి పొర్లుతున్నంతవరకూ ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా నా వెంట్రుక ముక్క కూడా కదలదు)
    ****************************************************
    సైకో సైతాన్ : మనస్సులో (ఈ బ్తాగులో ఎవరు ఏం చెప్పినా మోడీ భక్తులని వాళ్ళని తిట్టి, నా ఫోబియా కుతి తీర్చుకునేటంతవరకూ, నేను ఎన్ని నాటకాలాడినా నా కుంటి వెంట్రుక ముక్క కూడా ఊడదు.)


    ReplyDelete
    Replies
    1. హరిబాబు: ఆహా.. చెవుల్లో అమృతం పోసినట్లుంది.. ఇవి కదా అచ్చ మైన తెలుగు పదాలు. ఇవి నేను అచ్చేసి భావి తరాలకి అందించుకుంటా.. అబ్బ అబ్బ.. ఎం చెప్పావ్ ఒక్క చెడ్డమాట కూడా వాడకుండా.. నా బ్లాగ్లోకం ఉన్న్నంత కాలం నీ మెస్సేజి ఇలానే జీవించుగాక

      Delete
    2. @Anonymous12 October 2016 at 01:01
      హరిబాబు: ఆహా.. చెవుల్లో అమృతం పోసినట్లుంది..

      haribabu:"దొబ్బెయ్యండి" అని నీకు అర్ధమయ్యే భాషాలో చెప్తేగానీ ఎక్కదా నీకు?సొల్లు రాయడం తప్ప నువు జవాబు చెప్పిందొఇ ఎక్కడ?చెత్త కామెంట్లు తీసేస్తానని నేను ఎప్పుడో చెప్పాను,గుర్తు లేదా?నేను అడిగింది ఏమిటి?ఉరీలో దాడి కూడా పాకిస్తాన్ చెపినట్టు భారత్ ప్రభుత్వమే చేసింది అని నువు అనమ్ముతున్నవా?ఉరీ మీద దాడి,సర్జికల్ స్ట్రైక్స్ - ఇవన్నీ మోదీ సొంతంగా తన వెధవాయిత్వాన్ని (అదేమిటో ఎప్పుడో ప్రూవ్ చేసేసుకున్నాడు అని వాగటం తప్ప ఏ నా బట్టా సాక్ష్యాలతో చెప్పి తగలడితేనా!) కప్పెట్టుకోవటానికి చర్సినట్టు వాఫడం కూడా సరయిన జవాబేనా?

      Delete
  52. ఏ వీడియోలు చూపించారని అప్పుదు బర్మాలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ నిజమని నమ్మారు?అప్పుదు నమ్మినవాళు ఇప్పుదెందుకు వీడియోల కోసం పట్టుబడుతున్నారు?

    బేవకూఫ్ కబుర్లు దొబ్బేవాళ్ళకి మర్యాదగా చెప్తే అర్ధం కాదు - దొబ్బేయండిరా!

    ReplyDelete
  53. Read this post and watch paki's interview. To know the difference.

    దళారి పాలకుల గుట్టు విప్పిన పాక్ రాయబారి

    http://tinyurl.com/hdsstpf

    Questions that expose Lies of Pakistan on Kashmir, Sindh, Balochistan India, Afghan. & US

    https://www.youtube.com/watch?v=0gkA5GpIFjc

    Senge H Sering from Gilgit Baltistan calls Pakistan a thief
    https://www.youtube.com/watch?v=_GEYR7QpuTw

    ReplyDelete
  54. "యూరి దాడి అనంతరం, LoC ని దాటి వెళ్లి భారత సైనికులు సెప్టెంబర్ 29 తేదీన ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించి పాక్ ప్రోత్సాహంలో ఉన్న టెర్రర్ నెట్ వర్క్ పైన దెబ్బ కొట్టామని టెర్రర్ లాంచ్ పాడ్ లను నాశనం చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినప్పటి నుండి...." అని తప్ప "సర్జికల్ స్ట్రైక్ జరిగిన నాటినుంది" అని అనలేకపోతున్నడు తెలుగువర్తల పండితుడు - పాపం ఎంత కష్తం వొచ్చిపడింది !

    https://teluguvartalu.com/2016/10/06/%E0%B0%A6%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%97%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D/

    ReplyDelete
    Replies
    1. @haribaabu

      బూతులు నీకొక్కడికే కాదు.. మాకూ వొచ్చు. నీకు దమ్ముంటే ఈ మెస్సేజి డిలీట్ చెయ్యకుండా వుంచు


      సైకో గాళ్ళ మీటింగులొ సంభాషన: ఇంతకు ముందు మన పూర్వికులు మనకు ఎదురు తిరిగిన రాజులకి ప్రజలకి రాక్షషులని ముద్ర వేసి చంపేటోల్లం. అస్సలు మన మహర్షులకి యగ్నాలు చేసుకొడానికి మన దగ్గర ప్లేసు లేనట్టు అవతలి వాడి రాజ్యంలో యాగాల పేరుమీద జొరబెట్టి వాటిని రక్షించే నెపంతో వాళ్ళని ఆకరమించేటోళ్ళం. అడవుల్లో వుండే కొండదేవతలని మన అమ్మోరు అవతారమని, మన దేవుళ్ళ భార్యలని ఆ ప్రజలని నమ్మించి వాళ్ళని మన కాళ్ళా కింద తొక్కిపెట్టాం. చదువున్న వాళ్ళకేమో వాళ్ళ రాజులు పూర్వ జన్మలో మన దేవుడి సేవకులని, తన చేతుల్లోనే చావాలని వాళ్ళే వరం కోరుకున్నారని, అందుకే వాళ్ళని చంపుతున్నమని చెప్పి మాయ చేసాం.. ఇప్పుడు మనల్ని కాదన్న వాళ్ళని, ఎదురుతిరిగిన వాళ్ళని పాకిస్తాను సపోర్టర్లు అనే ముద్దరేసి చావ గొడుతున్నాం.. కాలం మారినా మన తెలివితేటలతో వాడితోనే వాడిపక్కనే వాడి మనిషిలాగే నమ్మించి గొంతు కొయ్యటంలో తేడా మాత్రం చూపించట్లేదు. ఎంతైనా మనం మనమే

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ఇంకకు మునుపు నీపూర్వీకులు ఇట్లాంటి పిచ్చి కథలను నమ్మి, రగిలి పగిలి కమిలి అగ్రవర్ణ ఆధిపత్యం, బ్రాహ్మణిజం వందపేర్లతో వారీని తిట్టి ముస్లీం లీగ్ తో జట్టుకట్టారు. మతతత్వ హిందుస్థాన్ కన్నా సెక్యులర్ పాకిస్థాన్ లో పరిస్థితి చాలా బాగుంట్టుందని,వద్దని ఎందరు వారించినా తట్టాబుట్టా సర్దుకొని వేళ్ళారు. రెండేళ్లకే భారతదేశానికి తిరిగి వచ్చారు.

      చరిత్రలో జరిగిన అనుభవాలను మరచి పోయి, నువ్వింకా ఆ పిచ్చికథలే వల్లె వేస్తే నష్టం నీకే!

      Delete
    4. బుర్ర పెట్టి చదువు మళ్ళీ.. నీకది పిచ్చి కతలాగే వుందా? అస్సలు మీరు రాసిన/చెప్పిన పిచ్చి కతల గురించి చర్చించే దమ్ము నీకు గాని, నువ్వు ఏం చెప్పినా గంగిరెద్దులా బుర్రకాయ వూపే హరిబాబుకిగానీ, హరిబాబు వెంట తోకలా తిరిగే బూతు మహారాజుకుగానీ వుంటే మొదలెడదాం

      Delete
    5. >>అగ్రవర్ణ ఆధిపత్యం, బ్రాహ్మణిజం వందపేర్లతో

      మరే. మీరు అప్పుడు సాదు జంతువులు, మా బుజాలు బుజాలు రాసుకు పూసుకు తిరుతూ వుండేవాల్లైతిరి. మీ అతి మంచి తనం చూసి మేము ఓర్వలేక మేము పక్కకి వెళ్ళిపొయాం. అదేకదా నువ్వు చెప్పేది?

      Delete
    6. >>మతతత్వ హిందుస్థాన్ కన్నా సెక్యులర్ పాకిస్థాన్ లో పరిస్థితి చాలా బాగుంట్టుందని,వద్దని ఎందరు వారించినా తట్టాబుట్టా సర్దుకొని వేళ్ళారు. రెండేళ్లకే భారతదేశానికి తిరిగి వచ్చారు.

      కొన్ని మదమెక్కిన కులాలవాల్లు పెనాల మీద మమ్మల్ని వేసి కాల్చుకుతింటుంటే, అక్కడేమైనా బతుకుబాగుంటూందని వెళ్ళారు.. తర్వతే కదా తెలిసింది వాళ్ళు మీకంటే నీచులు అని..

      Delete
    7. బాగు బాగు. ఆపొయ్యిల కంటే మేము మిమ్మల్ని వేపుకు తిన్న పెనాలే గొప్పవి కాబట్టి.. మేము సాదు జంతువులమని డిక్లేర్ చేసేసుకుటున్నామహో.........
      ఐ.. ఎవడ్రా వాడు కాదంది. తియ్యండ్ర కత్తులు కట్టెలు, ఈడ్వండ్రా వాడ్ని ఇంట్లోనించి బయటకి. ఇక వాడ్ని చంపటమేగా శ్రీ రామన్నయ్యా?

      Delete
    8. మీరు హిందువులను బ్లేం చేసింది చాలా విన్నాం. ఈ క్రింది వార్తలు చదువు. క్రైస్తవ మతం ఆర్గనైజేడ్. దానిలో ఎందుకు దళితులపై వివక్షత కొనసాగుతున్నాది? అది తెలిసినా వాళ్లని నీలదీసినట్లు ఎక్కడా వార్తలు రావు. కవితలు,కతలు,నవలలు రాయరు. ఎంత సేపు హిందూవులపై తిట్లు లంకించుకోవటమేనా? ఆలోచించుకో!

      Why do Dalits convert to Christianity? To break out of the Hindu caste system, you might say. Not completely true, as we found out in Harobele, just 60 km from Bengaluru. Christianity entered the region centuries ago

      Arogya Swamy (37), whose family left Hinduism and settled in Harobele three centuries ago

      The last time dalits tried to force their way into hotels and barber shops, he says, upper caste Catholics boycotted the establishments until the old order was restored.

      http://www.hindustantimes.com/india/dalit-catholics-continue-to-battle-upper-caste-aggression/story-6Cmvp1X3GT74iddi4qQLUJ.html


      http://christiandaily.com/article/catholic-church-in-india-slammed-by-critics-over-silence-on-kidnapped-dalit-bishop/54395.htm

      Delete
    9. నువ్వు దెశవిభజన కాలం నాటి సంగతి మాట్లాడావు కాబట్టి నేను కూడా అదే మాట్లాడాను. దాన్లో మైలేజి దొరకదని, ఆ విషయం వొదిలేసి నువ్వు మళ్ళి తిరిగి ఈ కాలం విషయం మాట్లాడుతున్నావు. ఇదైనా సీరియస్ గా డిస్కస్ చేసుకుందామా? హరి బాబు బి పి కేకలు, బూతు బాబు చెత్తవాగుడు కలవకూడదు.

      Delete
    10. అది తెలిసినా వాళ్లని నీలదీసినట్లు ఎక్కడా వార్తలు రావు. కవితలు,కతలు,నవలలు రాయరు.

      I agree with this

      Delete
    11. This comment has been removed by the author.

      Delete
    12. ఒకప్పుడు హిందూ మతంలో దురాచారలవలన మతం మారుతున్నారని క్రైస్తవులు గా మరిన వారు చెప్పుకోనేవారు.
      300 సంవత్సరాలైనా అగ్రవర్ణ క్రైస్తవులు దళిత క్రైస్తవులని నొక్కేస్తూంటే మేధావి వర్గం ఒక్క మాట మాట్లాడదు. ఒక కథ,కవిత,నవల రాయదు. అధిక భాగం దళితులు క్రైస్తవులుగా మారిపోయినా,ఇంకా హిందూ మతంపై విరుచుకుపడుతూంటారు. హిందూ దళితులు కన్నా ఎక్కువ క్రైస్తవ దళితులు హిందూమతాన్ని తీవ్రంగా విమర్సిస్తూంటారు. వారి వెనుకబాటుతనానికి, ఎవరినైనా ప్రశ్నించలంటే చర్చ్ ను,ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. హిందువులను ఎలా నిందిస్తారు?

      Delete
  55. >>బేవకూఫ్ కబుర్లు దొబ్బేవాళ్ళకి మర్యాదగా చెప్తే అర్ధం కాదు - దొబ్బేయండిరా!

    బి పి టాబ్లెట్లు ఇంట్లో మర్చిపొయి వొచ్చినట్టున్నావ్?

    ReplyDelete
    Replies
    1. నెత్తిన రూపాయి పెడితే అర్ధరూపాయి కూడా విలువ చెయ్యని నీకే నీ ప్రశ్నకి సమాధానం చెప్పలేదని అంత కాలతంటే, నీ లాంటీ పావల్లగాళ్ళ నాయకులు మాకు వీడియోలు చూపించాల్సిన అవసరం మాకు లేదంటే మోసం చేస్తుంటే మాకేంత కోపం రావాలి?

      Delete
  56. Harai baabu & Srinivas, Pls watch these two videos. Do not miss it.
    సూడో లని దుమ్ముదులిపాడు.

    Discussion On ‘War and Peace’ With Tarek Fatah & Others ~ Latest 2016

    https://www.youtube.com/watch?v=hhaJmjqCXFc

    https://www.youtube.com/watch?v=UFFv_t6R83Y

    ReplyDelete
  57. @Anonymous12 October 2016 at 08:41
    Comment:నువ్వు దెశవిభజన కాలం నాటి సంగతి మాట్లాడావు కాబట్టి నేను కూడా అదే మాట్లాడాను. దాన్లో మైలేజి దొరకదని, ఆ విషయం వొదిలేసి నువ్వు మళ్ళి తిరిగి ఈ కాలం విషయం మాట్లాడుతున్నావు. ఇదైనా సీరియస్ గా డిస్కస్ చేసుకుందామా? హరి బాబు బి పి కేకలు, బూతు బాబు చెత్తవాగుడు కలవకూడదు.

    haribabu:మొదట నేను పాయింట్ బై పాయింట్ ప్రశ్నలు అడిగి చేసిన చాలెంజికి ఒక్కడూ జవాబు చెప్పకుండా గంభీర్ గురించి ఎత్తుకుని యూగీస్రీ పేరుతో చెత్తకూతలు రాసిందీ,మోదెని తిటినవాళ్ళంతా దేశద్రోహులే అంటావా,మమలి పాకిస్తాన్ పంపించేస్తావా అని అడిగి చర్చని పాకిస్తాన్ వైపుకి మళ్ళించటం లాంటి బీపీ వాగుదు వాగింది మీరు!ఇప్పతి విషయాల్ గురించి ముడ్డె నోరూ తెలియని వళ్ళు రామాయణం గురించి అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి విమర్శలు చేస్తున్నారు.

    దానికి నా జ్వాబులోనే మళ్ళె మళ్ళీ అదే అంటాం అని మీ స్టెయిలుకి మళాను.మీకు మల్లే బూతులు వాగడమే కాదు శాస్త్రీయంగా విశ్లేషించగల దమ్ము కూడా ఉన్న చిచ్చ్రపిడుగుని నేను కాసుకోండి!

    Point1:ఏ వీడియోలు చూపించారని అప్పుదు బర్మాలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ నిజమని నమ్మారు?అప్పుదు నమ్మినవాళు ఇప్పుదెందుకు వీడియోల కోసం పట్టుబడుతున్నారు?

    Point2:"యూరి దాడి అనంతరం, LoC ని దాటి వెళ్లి భారత సైనికులు సెప్టెంబర్ 29 తేదీన ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించి పాక్ ప్రోత్సాహంలో ఉన్న టెర్రర్ నెట్ వర్క్ పైన దెబ్బ కొట్టామని టెర్రర్ లాంచ్ పాడ్ లను నాశనం చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినప్పటి నుండి...." అని తప్ప "సర్జికల్ స్ట్రైక్ జరిగిన నాటినుంది" అని అనలేకపోతున్నడు తెలుగువర్తల పండితుడు - పాపం ఎంత కష్తం వొచ్చిపడింది !

    My Analysis:పై రెండు పాయింట్లనీ పట్టుకుని చూస్తే సర్జికల్ స్ట్రైక్ జరగలేదు అనుకుంటే మనశ్శాంతిగా ఉండేది ఎవరికో,ఒప్పుకుంటే బీపీ పెరిగేది ఎవరికో అర్ధం అవుతుంది. ఇదివరకటి బర్మా సర్జికల్ స్ట్రైక్ మీద రాని అనుమానాలు ఇప్ప్పటి సర్జికల్ స్ట్రైక్ మీద ఎందుకు వెలిబుచ్చుతున్నారో అర్ధమయితే మిస్తరీ సగం తేలిపోతుంది!

    పాకిస్తాన్ మన దేశం మీదకి విడిపోయిన తెల్లారి నుంచీ సీమాంతర ఉగ్రవాదంతో చెలరేగిపోతూ దొంగచాతుగా ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి దేశం నడిమధ్యనే ఉగ్రవాద చర్యలు జరిపించటం అబద్ధమా?కాదు గదా!అవన్నీ నమినవాళ్ళు వాటికి జవాబు చెప్పడానికి మన దేశం చేసిన సర్జికల్ స్ట్రైక్ నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నారు?నమ్మితే, ఆ మాట ఒప్పుకుంటే ఆ క్రెడిట్ అంతా మోదీకి పోతుందని తెలుసు గనక,అవునా కాదా?
    TO BE CONTINUED

    ReplyDelete
  58. CONTINUED FROM ABOVE
    ఇవ్వాళ అంతర్జాతీఉయ తెలుగువార్తావిశ్లేషక్క్కుడు అమెరికా నడిబొడ్డున నిలబడి పాక్ విదేశాంగ శాఖ తరపున ఒక వ్యక్తి, ఆ దేశపు రాయబారి చేసిన ప్రకటనని ఉదహరిస్తూ "తెలిసే అన్నాడో,అన్యాపదేసంగా అనుకోకుండా వొదిలాడో" అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు.ఆ స్టేట్మెంట్ నేను ఎప్పుడో చదివాను.అ అది నాకు "అడుక్కునేవాడికి అరవయ్యారు ఇళ్ళు అన్నట్టు భారతక్కని ఇబ్బంది పెట్టటానికి నువు నాకు సాయం చెయ్యకపోతే నాకు ఇంకే దిక్కూ లేదనుకున్నావా?భారతక్కని ఇబ్బంది పెడితే బాగుండ్ననే చైనా అన్న ఉన్నాడు,రష్యా అన్న ఉన్నాడు.నేను పోయి వాళ్ళ పక్కన జేరుతా - వాళ్ళనుంచి వచ్చిన బిచ్చంతో బతుకుతా, ఏమనుకున్నావో - ఖబడ్దార్" అని ముష్టివాడు తనకి బిచ్చం వెయ్యను పొమ్మని కసిరికొట్టిన ఇంటివాడిని బెదిరించే ముష్టివాగుడులా వినిపించింది:-)

    తెలుగువార్తగారు అనుకున్నట్టు అన్యాపదేశంగా చెప్పినా కావాలనే చెప్పినా సాయం లేనిదే నాకు పూట గడవదు, సొంతంగా నేను భార్తక్కని ఏమీ చెయ్యలేను అని చెప్పుకుంటున్న ముష్టి ముదనష్టపు నికృష్ట దేశాన్ని వీరాధివేర మహాప్రతాప రాయగజకేసరిగా వూహించుకుని ఆ ముష్టి దేశం మీద సర్జికల్ స్ట్రైక్ చెయ్యడానికి దడుచుకుని అబద్ధాలతో నాటకమాడుతున్న పిరికి దేశంగా మాతృదేశాన్ని వూహించుకుంటే గానీ మనసుకి తృప్తి కలగడం లేదు వీళ్ళకి!

    పాకిస్తాన్ ఎప్పుడయితే అమేరికా పక్క వొదిలి చైనా,రష్యాల పకక్లోకి చేరిందో భావజాల సారూప్యము వల వీళకి నయనమనోహరిగా కనబడింది కాబోలు!తెలుగువార్తాపండితుడి ఆఖరి వాక్యం ఎంత హాస్యస్ఫోరకంగా ఉందో!ఆ ముష్టివాడి బెదిరింపులకి భయపడి అమెరికా మళ్ళీ పాకిస్తాను వైపుకి జరిగితే ఆ సమీకరణాన్ని బ్యాలెన్సు చెయ్యటానికి భారత్ చైనా,రష్యాల వైపుకి జరిగితే బావుంటుందని వూహించి ఆనందలోకాల్లో తేలిపోతున్నాడు,పాపం!

    ఈ శనిద్రాని కంతటికీ మొదలు జిన్నా పదవీలాలస!ఎప్పుదయితే బ్రితన్ సైన్యాని తమ దేశంలో ఉండటానికి అవకాశమిచ్చాడో అప్పుదే పాకిస్తాన్ ఓరిపాలనలో మిలిటరీ అద్గిపత్యం స్తిరపడిపోయింది.ఒక దేసపు సైన్యం మరొక దేశంలో ఉంతే సైన్యానికీ సైన్యానికీ మాత్రమే స్నేషం కుదురుతుంది.అందుకే ఇవ్వాళ నవాజ్ షరీఫ్ లాంటివాళ్ళకి సైన్యం ప్రమేయం లేకుండా సొంతంగా పరిపాలించడానికి వీలు కుదరడం లేదు.వ్యక్తిగతంగా ఉగ్రవాదాన్ని పెంచి భారతదేశాన్ని ఇబ్బందిపెట్టడం ఇష్తం లేనివాళ్ళు కూడా నిస్సహాయంగా ఉండిపోతున్నారు - అందుకే అది పాక్ అంతర్గత వ్యవహారం అని అనుకోకుండా భారత్ కలగజేసుకోవాలనే విజ్ఞప్తులు వారినుంచి వస్తున్నాయి!

    ఇవన్నీ అబద్ధాలు కానప్పుడు ఈ ఒక్క అసర్జికల్ స్ట్రైక్ విసహయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం గానె దుస్థితి గానీ భారతదేశానికి గానె మోదీకి గానీ లేవు గాక లేవు!సర్జికల్ స్ట్రైక నేది జరగడం వాస్తవం,పాకిస్తాన్ అంతర్జాతీయంగా ముకహ్మ్ చెల్లని స్థితిలో నిలబడటం వాస్తవం.ఆఖరికి నవాజ్ షరీఫ్ సైన్యానికి ఉగ్రవాదాని ప్రోత్సహించకుండా ఉంతే బాగుంటుంది,దాన్ని ఆపకపోతే ఇంకా పరువు పోగొట్టుకుంతాం అని సళా ఇచ్చినట్టు తెలుస్తున్నది,అది కూడా అబద్ధమే అంటే ఇంక చెయ్యగలిగింది లేదు - ఎవరి మానసికానాందం వారికి ముఖ్యం,అంతే!

    ఇంతటితో చర్చ ముగిస్తే మంచిది.నాకు ఆసక్తి పోయింది.మీరూ మీరూ బూతులు తిట్టుకుని మానసిక తృప్తి పొందుతానంటే నాకు అభ్యంతరం లేదు.కామెంట్లు డెలిట్ చెయ్యడానికి కూడా తీరిక లేని పనులు ముంచుకొస్తున్నాయి నాకు ఆఫీసులో.
    THE END

    ReplyDelete
  59. Has India scared Hafiz Saeed to death?


    Wanted terrorist Hafiz Saeed, who roams around openly in Pakistan, has reportedly called for building ties with India and declared the USA as the enemy of Pakistan.

    In the wake of surgical strikes carried out by the Indian Army in Pakistan-occupied Kashmir in the wee hours on September 29, which inflicted heavy casualties on terror launch pads, this is for the first time when Saeed has toned down his aggressive approach towards India.

    India Today reported Saeed as saying that the US is Pakistan's enemy and it is time for his country to shift its focus from the US to building the relationship with India.

    In a speech, the report said, the Jamaat-ul-Dawah terrorist openly mocked the US for its failure at capturing him. "There is a bounty worth crores on me but in the last five years the US could not achieve anything out of it," he was quoted as saying.

    Saeed also attacked the Pakistan government for its failure in resolving the Kashmir issue. He said the Pakistani Parliamentarians are the "real roadblocks" in Kashmir's freedom.

    Acknowledging the "pain" of Pakistan's international isolation, the 26/11 mastermind, however, said that India would understand the pain after freedom of Kashmir. "Instead of the US, you (government) should build ties with India. The US would block such an effort," India Today reported him as saying.

    Saeed's reported statements, if it is true, clearly show he is annoyed or scared to death by India's surgical strikes.

    On their part, the US has refused to respond to the comments by the terrorist. John Kirby of the US department of state was reported as saying by ANI that he is not going to "dignify comments of an avowed terrorist one way or other".

    ReplyDelete
  60. ఇక యూ జి శ్రీరాం గారైతే ఏం అడిగినా అర్ధం పర్ధం లేకుండా దానికి ఒక పాకిస్తాన్ వీడియో లింక్ ఇచ్చేసి మీకో సజెషన్ ఇచ్చేస్తారు నా రిప్లయ్ డిలీట్ చేసెయ్యమని. మీరు దాన్ని మహద్భాఘ్యం మహ్హాప్రభో అని డిలీట్ చేసేస్తారు (నిజంగానే చిచ్చరపిడుగే ఈ విషయంలో). ఈ డ్రామాలు చూసి చిరాకు బుట్టి మీరేంటో మీ బ్రైన్ నిండా పాకిస్తాన్ ఎంత నింపుకున్నారో అని చూపించడానికే ఆ సరదా స్కిట్ పెట్టాను, మీరేం మీరు పెంచుకునే ఒక బూతు కుక్కని ఉసిగొల్పి వాడి మెస్సేజీలల్లో యేం ప్రత్యేకత పవిత్రత మీకు కనిపించిందో గాని ఒక ఉగ్రవాది ఉగ్ర సాహిత్యం ఎంత పవిత్రంగా దాచుకుంటారో అలానే జాగ్రతగా ఉంచారు.. దానికితోడు ప్రజలకి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి కాబట్టి వీడియలు చూపిచలేదనే లాజిక్ మీకళ్ళకి మేరు పర్వతమంత గొప్పగా కనిపించిందేమో మీకు మీ అంతరింగిక మిత్రులు శ్రీరాం గారికి, ఆ బూతు కుక్కగారికి దాని గురించి అస్సలు మాట్లాడలేదు.. ఆహా! ఈ పిచ్చి రాజ్యంలో, ఈ పిచ్చగాళ్ళ మధ్య ఏమైనామాట్లాడాలంటే పిచ్చగాళ్ళకే అర్హత అని ఇప్పుడు అర్ధం ఐంది.

    ReplyDelete
    Replies
    1. నీ బ్రైన్ నిండా నింపుకున్నావుగా మట్టిని. మా ప్రధానిపై మాకు నమ్మకం ఉంది. పెడసరంగా మాట్లాడుతూ, పాకిస్థాన్ కు పోయి ఒకసారి కొట్టించుకొచ్చారు గదా! మీ ఎదవ వాదన విని మేము కొట్టించుకోవాలా? వెళ్లరా నాయనా, అంటే ఇక్కడే పడి ఎందుకు పొర్లాడుతున్నావు?

      Delete
    2. ఒరే బూతు కుక్కా... నువ్వు హరి బాబు ఒక్కడే అని అర్ధం ఐంది. ఇక నాటకాలు దొబ్బకుండా మూసుకోని కూర్చొ.

      Delete
    3. >> పాకిస్థాన్ కు పోయి ఒకసారి కొట్టించుకొచ్చారు గదా!

      ఎదురుగా వొచ్చి ఢీ కొనే దమ్ములేని కుక్కలు మీరు.. ఎదుటీవాడిని ఆక్రమ్మించుకొడాని వాల్ల పక్కనే జేరి వెన్ను పోట్లు పొడిచే మీ జాతిని కనిపెట్టలేక మాలో కలుపుకున్నందుకు మీరు మానెత్తికెక్కి తైతక్కలాడుతున్నారు.. మీకంటే నీచమైన కోర్కెలున్నవాళ్ళని దేవుళ్ళపేరు చెప్పి మా ఆస్తులు రాజ్యాలు దోచుకుంటున్నా అర్ధం చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఒక్కడొక్కడుగా అర్ధం చేసుకుంటూన్నార్లే .. ఇక మీకు వుందిరే.. మీరు నిర్నైంచుకోండి ఇక.. పాకిస్తాన్ పారిపోవాలా, ఆఫ్ఘనిస్తాన్ పారిపోవాలా అని

      సైకో గాళ్ళ మీటింగులొ సంభాషన: ఇంతకు ముందు మన పూర్వికులు మనకు ఎదురు తిరిగిన రాజులకి ప్రజలకి రాక్షషులని ముద్ర వేసి చంపేటోల్లం. అస్సలు మన మహర్షులకి యగ్నాలు చేసుకొడానికి మన దగ్గర ప్లేసు లేనట్టు అవతలి వాడి రాజ్యంలో యాగాల పేరుమీద జొరబెట్టి వాటిని రక్షించే నెపంతో వాళ్ళని ఆకరమించేటోళ్ళం. అడవుల్లో వుండే కొండదేవతలని మన అమ్మోరు అవతారమని, మన దేవుళ్ళ భార్యలని ఆ ప్రజలని నమ్మించి వాళ్ళని మన కాళ్ళా కింద తొక్కిపెట్టాం. చదువున్న వాళ్ళకేమో వాళ్ళ రాజులు పూర్వ జన్మలో మన దేవుడి సేవకులని, తన చేతుల్లోనే చావాలని వాళ్ళే వరం కోరుకున్నారని, అందుకే వాళ్ళని చంపుతున్నమని చెప్పి మాయ చేసాం.. ఇప్పుడు మనల్ని కాదన్న వాళ్ళని, ఎదురుతిరిగిన వాళ్ళని పాకిస్తాను సపోర్టర్లు అనే ముద్దరేసి చావ గొడుతున్నాం.. కాలం మారినా మన తెలివితేటలతో వాడితోనే వాడిపక్కనే వాడి మనిషిలాగే నమ్మించి గొంతు కొయ్యటంలో తేడా మాత్రం చూపించట్లేదు. ఎంతైనా మనం మనమే

      Delete
    4. >>మీకంటే నీచమైన కోర్కెలున్నవాళ్ళని దేవుళ్ళ

      బూతులు మాట్లాడకుండా, బి పి కేకలు పెట్టకుండా దీనిమీద చర్చచేసె దమ్ముందా నీకు?

      Delete
    5. >>వెళ్లరా నాయనా, అంటే ఇక్కడే పడి ఎందుకు పొర్లాడుతున్నావు?

      పిచ్చికుక్కలు గుంపుగా ఒక మూలపడి మాదగ్గరకి రావొద్దు కరుస్తాం అంటే.. ఎలా నమ్మేది? వాటి నడుములిరగొట్టాలంటే వాటిదగ్గరకి వెళ్ళాల్సిందేకదా..

      Delete
    6. ఇక్కడే కుక్కలా మొరుగుతూ పడుండు.

      Delete
    7. ఇతర కూలాలవళ్ళని, మతాలవాళ్ళని గోరక్షకులు ఎగబడి కొట్టిచంపుతుంటే నోట్లో ఎవేవొ పెట్టుకుని కూర్చునే నాయకులు, గోరక్షకుల దిస్టిబొమ్మని జె ఎన్ యు ల తగలబెడితే వెంటనే చ్చ్చరపిడుగు వేగంతో విచారణకి అదేశించింది.. ఎంతైనా జాతి బుద్ది జాతి బుద్దేకదా..

      Delete
    8. >>ఇక్కడే కుక్కలా మొరుగుతూ పడుండు.

      మాదెశం నుంచి మిమ్మల్ని కుక్కల్ని తరిమినట్టు తరిమిగొట్టబోతున్నాం. అన్నీ సర్దుకోని రేడీగావుండు ఇంకో అమాయకులుండే దేశం వెతుక్కోవడానికి

      Delete
  61. ఇక నీ పిచ్చ బి పి గురించి ఎంత చెప్పినా తక్కువే.. దొబ్బేయ్.. నా బట్ట.. బస్తీమే సవాల్..

    ఒకవేళ పాకిస్తాన్ ఈ రోజు బూకంపం వొచ్చి పూర్తిగా నాశనమైతే.. ఇక మా మీద పడి ఏడవాడానికి సాకు లేక ఉరేసుకోని చచ్చేటట్టున్నావ్

    ReplyDelete
  62. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తే, వాటిని డిలీట్ చేసేసి నువ్వెంత బేవకూఫ్ గాడివో నిరూపించుకున్నావ్. సిగ్గు లేని జన్మ.. థూ..

    ReplyDelete
  63. ఇక నడీబజారులో మీ బట్టలూడదీసి నిలబెట్టింది చాలు..ఇక మీ పిచ్చి రాజ్యం లో మీరే తానాలు మీరే తందానాలు.. మీ జబ్బలు మీరే చరుచుకుంటూ శునకానందం ఎంజాయ్ చేసుకోండి. శలవు

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...