Saturday 6 February 2021

వినరా సుందరయ్య కూతురు మొగుడా - రష్యన్ విప్లవం అసలు చరిత్ర చెబుతాను!

ప్రపంచం నలుమూలల ఉన్న శ్రామిక జనులకి పెట్టుబడి దారులు వాళ్ళని ఎలా దోచుకుంటున్నారో కళ్ళకి కట్టినట్టు చూపించి వాళ్ళని సాయుధ పోరాటం చేసి పెట్టుబడిదారుల్ని చంపటానికి సిద్ధం చేసి  "శ్రామికవర్గనియంతృత్వం" అనే ఒక మహోజ్వల భవిష్యత్తు వైపుకి నడిపించి ఇక దోపిడీకి ఆస్కారం లేని ఆ నవలోకం నిరంతరం కొనసాగే ప్రణాళిక రచించిన విప్లవ సిధ్ధాంత ప్రవక్త అని మనం అనుకుంటున్న కార్ల్ మార్క్స్ నిజానికి అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం యొక్క  చెప్పులు నాకుతూ బతికిన కుక్క లాంటి వాడు!నేటి కాలపు లండన్ నగరం నిన్నటి సామ్రాజ్యవాదపు దొమ్మరితనం నుంచి ప్రజాస్వామ్యపు  తింగరితనం అలవాటు చేసుకున్న వృద్ధ వేశ్య అయితే 1850ల నాటి కాలపు లండన్ నగరం అప్పుడప్పుడే అంతర్జాతీయ సేతుక(सेतुकः/బంక్) సమూహం వూది రాజేసిన నిప్పు లేని పొగ లాంటి సామ్రాజ్యవాదం యొక్క వాసనల స్పర్శ తగిలి మెల్లమెల్లన విచ్చుకుంటున్న పువ్వులా కనబడుతూ నేర్చుకున్న కామకళని వినియోగించి రసికశ్రేష్ఠుల్ని అలరించడానికి ఎదురు చూస్తున్న తడిపొడి తపనల తొలకరి మొటిమల సొగసుల మోహపు ముసుగుల కుర్ర లంజ లాంటిది!

నేను వాడిన మోటుమాట ఇబ్బంది అనిపించిన సుకుమారులు చార్లెస్ డికెన్సు అదొక వైభవోజ్వల శకం అదొక వల్లకాటి అధ్వాన్న శకం అంటూ చూపించిన లండన్ ఇదే అని తెలుసుకుంటే ఇబ్బంది కొంత తగ్గుతుంది.Queen Victoria తన కుర్రమొగుడు Prince Albert పుణ్యాన మంది సొమ్ము తిని బలవడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని మనిషి పిల్లల్ని కనడానికి ఏడాదికో ఈత ఈనుతున్న కాలం అది.నేతి బీర కాయలో నెయ్యి ఉండటం ఎంత నిజమో రాజరికపు కుటుంబాల్లో ప్రేమ, అదీ సుకుమారమైన మనోధార్మిక శృంగార లాలిత్యం ఉండటం అంత నిజమా అన్నట్టు అప్పటి కాలపు Saxe-Coburg and Gotha లాంటి చిన్న జర్మన్ సంస్థానం నుంచి అక్కడ రాజ్యార్హత లేని రెండో కొడుకు అప్పటికే ప్రపంచ ఖ్యాతి గడించిన తేనెపట్టు లాంటి విండ్సర్ వంశంలోకి పోతుటీగలా  చొచ్చుకు రావడానికి దూరపు బంధుత్వమూ రాజకీయ సమీకరణలే కారణం.

నిజానికి బ్రిటిష్ రాజవంశపు వారసత్వం ప్రకారం రాజకుమార్తెని పెళ్ళాడిన రాజకుమారుడు రాణి గారి భర్త మాత్రమే అవుతాడు తప్ప సింహాసనం ఎక్కి రాజు కావటం అసంభవం.అయితే, సంపదలో తక్కువ అయినప్పటికీ చురుకుతనం ఎక్కువ జర్మన్ కుర్రోడికి - అసలు రాణిని వేవిళ్ళ కాన్పుల బాలింత వేషంలో ఫిక్స్ చేసి తను రాజు అయిపోయాడు.మొదటి పిల్ల పుట్టినప్పుడు తాళాల గుత్తిని తీసుకోవడంతో మొదలైన దూకుడు తన వ్రాతబల్లను రాణి గారి వ్రాతబల్లకు దాదాపు ఆనించడమూ రాణిగారి ఆంతరంగిక సేవకుల్ని మార్చడమూ రాణిగారికి వచ్చిన ఉత్తరాలకి తను జవాబులు ఇవ్వడమూ ముఖ్యమైన అతిధులకీ రాణిగారికీ మధ్యన జరిగే సంభాషణల్లో మాటలు అందిస్తున్నట్టు కనిపిస్తూ రాణి కన్న ముందు తనే మాట్లాడెయ్యటమూ జరుగుతూ జరుగుతూ పదో పిల్ల పుట్టిన 1850 నాటికి పెళ్ళాన్ని వంటింటి సామ్రాజ్యానికి మాత్రమే రాణిని చేసి మొగుడు అసలు సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు అయిపోయాడు.

అవిడ కూడా కొన్ని తలనొప్పులు తగ్గినందుకు ఆనందించి ప్రజల ముందు సంసారపక్షమైన స్త్రీత్వం అనే బొమ్మ కనపడి “happy domestic home” పేరున తనకు మైలేజి రావడం చూసుకుని సర్దుకుపోవడం వల్ల మనోడు ఇక అచ్చుమచ్చు కనకపు సింహాసనమున కూర్చుండబెట్టిన శునకము వలె రెచ్చిపోయాడు.రాణి గారి ముందు ఎవడూ కుర్చీలో కూర్చోవడానికి వీల్లేదు - కుర్చీలు తీయించేశాడు.Lord Salisbury అనే ఒక ఎక్కువసేపు నిలబడలేని వాడికీ Benjamin Disraeli అనే ఒక రాణిగారికి మరీ ఇష్టమైన వాడికీ తప్ప ఇంకెవ్వడికీ కుర్చీ లేదు.Gladstone అనే వాడికీ వయస్సు ఎనభయ్యేళ్ళు, అయితే వాడు తనకి నచ్చలేదు,కుర్చీ ఇవ్వలేదు.

మనవాళ్ళు చెప్తారే నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిదని, అద్గదీ వాడి అవస్థ.కాకపోతే కుర్రతనంలోనే అంత వెర్రి పుట్టి 1850 నాటికి రాణికి పిచ్చెక్కించేశాడు - 1861 నాటికి తనే చచ్చేశాడు, 42 యేళ్ళ వయస్సుకే!.చిన్న రాజ్యం నుంచి పెద్ద్ద రాజ్యం లోకి వచ్చిన అదృష్టాన్ని రంగేళీరాజాలా అనుభవించడం కూడా తెలియక ఆత్రగాడికి బుద్ధిమట్టం అన్నట్టు తనకి చాతకాని పెత్తనం పేరున సగం వెర్రెక్కించుకుని అనాకారి పిల్లల్ని పుట్టిస్తూ పెళ్ళానికి పూర్తి పిచ్చెకీంచిన అప్పటి కుర్ర రాజుని గురించి Mary Bulteel అనే ఒక అంతఃపుర దాసి, "His way of giving orders and reproofs was rather too like a master of a house scolding servants to be pleasant for those who were bound to listen in silence,It implied something of the cold egotism which seems to chill you in all royalties. Such reserve in so young a man was unpleasant " అని అనేసింది, పాపం!

రాజకుటుంబం అలా పిచ్చెక్కి చస్తుంటే Lord Palmerston అనే సగం రోగిష్టి వెధవ బ్రిటిష్ రాజకీయాల్ని సామ్రాజ్యవాదం వైపుకి ఉరకలు పెట్టిస్తున్నాడు.తండ్రి ఐరిష్ జాతీయుడు.తన ఐర్లాండు రాజరికాన్ని ఘనత వహించిన బ్రిటిష్ సామ్రాజ్యపు గొడుగు కిందకి తెచ్చి ఇక్కడి House of Commons సీటు సంపాదించుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. తండ్రి ఫెయిల్యూర్ మొదట కొడుక్కీ అడ్డుపడింది గానీ చాకచక్యం గలవాడు కాబట్టి అంచెలంచెల మోక్షం అన్నట్టు ఎక్కువకాలం foreign secretary  హోదా వెలగబెట్టి రెండు విడతలు ప్రధానమంత్రి కూడా అయ్యాడు.అప్పటికే తనను తను mistress of the seas అని చెప్పుకున్న బ్రిటిష్ గడసానిని సామ్రాజ్యవాదపు వేశ్యరికానికి అలవాటు చేసిన జార చోర నేర వీర శిఖామణి వీడే!అవును, జారుడే - సాతానికి సైకోపాత్ Jeremy Bentham గాడికి అనుంగు శిష్యుడు, పక్కన ఆడది లేకుండా కనిపించేవాడు కాదు,ఇప్పుడు మనం గే అని పిలిచే మాయరోగం కూడా ఉన్నట్టుంది.Lord Firebrand అనేది పొలిటికల్ ఫ్యాన్స్ పెట్తుకున్న ముద్దు పేరు. వియన్నా స్కూలు పిల్లలకి వీడొక సూపర్ డూపర్ డాఫర్ హీరో - "if the devil has a son, that son is Lord Palmerston" అని లొల్లాయి పాటలు రాసుకుని పాటలు పాడుకుని పిచ్చ గంతులు వేస్తూ ఉండేవాళ్ళు.

శిష్యుడి వెకిలితనం గురించి చెప్పి గురువు గారి వెకిలితనం గురించి చెప్పకపోతే ఎట్లా?గౌతమ బుద్ధుడు ప్రజలకి దుఃఖం నుంచి విముక్తిని చూపించే పరిష్కారం కనుక్కోవడం కోసం అత్యంత కఠినమైన తపస్సు చెయ్యాల్సి వచ్చింది గానీ Jeremy Bentham గారు మాత్రం "Hedonistic Calculus" అనే కొత్తరకం లెక్కల పద్ధతిని చిటికెలు వేసినంత తేలిగ్గా కనిపెట్టేశాడు.అంత సులభతరమైన పరిష్కారం ఏమిట్ట అంటే, it would be acceptable to torture one person if this would produce an amount of happiness in other people outweighing the unhappiness of the tortured individual అట! వీడి లూసిఫర్ మతమౌఢ్యం ఎంత పిచ్చదంటే, ప్రఛ్చన్న లూసిఫర్ మతష్తుడు కదగభీమని చస్తే క్రైస్తవుల ఆచారం ప్రకారం పెట్టెలో పెట్టి పాతెయ్యడానికి వీల్లేని వీలునామా రాసి చచ్చాడు.తను పాఠాలు చెప్పే గదిలో తన శవాన్ని టాక్సీడెర్మీ చేయించి లోపల తులాదండ సూత్రాలతో కప్పీలూ గొలుసులూ బిగించి ఎప్పుడు చూస్తే అప్పుడు బతికుండి పాఠాలు చెప్తున్నట్టు కదిలేలా ఏర్పాటు చేసుకున్నాడు. ముచ్చట ఇప్పుడు జరగడం లేదు లెండి, కదిలితే పొడి అవుతుందని అనిపించేటంత పాతబడినప్పుడు జనాలు దాన్ని కదిలించడం ఆపేశారు గాబట్టి ఇప్పుడు వెళ్ళి చూస్తే మిడిగుడ్లతో మనవైపుకి తేరిపార చూస్తూ ఉంటుంది బంకమట్టి కెక్కువా బూడిదకుప్పకి తక్కువా అన్నట్టున్న వీడి ద్రేహం - భయపడతారా నవ్వుకుంటారా జాలిపడతారా అనేది మీ ఇష్టం!

ఆయన గారికి అత్యంత ఇష్టమైనవీ సంతోషాన్ని కలిగించేవీ  Free Banking, Free Love - చాలామంది రెండూ వేర్వేరు అంశాలు అనుకుంటారు గానీ అమ్మాయుల్నీ అబ్బాయిల్నీ రొమాంటిక్ యాంగిల్లో Free Love పేరుతో వెర్రెక్కించగలిగితే వాళ్ళు వీళ్ళు ఎకనమిక్ యాంగిల్లో ప్రతిపాదించే Free Banking మోసాన్ని కూడా ఒప్పేసుకుంటారు.అంత లెక్క ప్రకారం వీళ్ళు సిద్ధాంత రచన చేస్తారు గాబట్టే మాలాంటివాళ్ళు అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం యొక్క కుట్రలను ఎంత కష్టపడి ఎన్ని సాక్ష్యాలు సేకరించి ఎన్ని విశ్లేషణలు చేసి బయట పెట్టినప్పటికీ ప్రజలు నమ్మడం లేదు!

ప్రపంచపు స్థాయిలో లెక్కలు తీసినప్పుడు అయిదో వంతు మంది ప్రజలనీ నాలుగోవంతు భూమినీ శాసిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యం అన్నింటిలోకి బలమైనదే గానీ స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగీస్,డచ్, బెల్జియం వంటి ఇతర రాజరికాలు కూడా వాటి స్థాయిలో అవి బలంగానే ఉన్నాయి.ఇప్పుడు Jeremy Bentham, Lord Palmerston లాంటివాళ్ళకి పట్టిన దెయ్యమే లీషాప్ట్ పురెక్కించిన నూతన ప్రపంచ రాజ్యం.Lord Palmerston అనే వీడు ప్రాచీన కాలపు వెనెషియన్ రాజవంశాల వారసత్వం ఉన్నవాడు.అప్పటికి వీషాప్ట్ వీళ్ళకి ఇచ్చిన క్యాలెండరులో వాటర్లూ యుద్ధం ముగిసింది, ఫ్రెంచి విప్లవం వచ్చింది.ఇక బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పటి రోమన్ సామ్రాజ్యపు తరహా వైభవాన్ని ప్రపంచ స్థాయిలో సాధించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు

బ్రిటన్ ప్రపంచ ప్రభుత్వం నెలకొల్పాలంటే ఆస్ట్రియా, రష్యా, ప్రష్యా అనే దిగ్గజాలు కలవకూడదు,కలవనివ్వ కూడదు!లార్డ్ బైరన్ మనకి కృష్ణశాస్త్రి లాంటి భావుకుడిలా మాత్రమే తెలుసు.కుర్రాడు, అందగాడు, రాజవంశీయుడు - కుడికాలిలో ఉన్న సమస్య కుంటితనాన్ని తెచ్చిపెట్టింది, పట్టుమని పదిహేనేళ్ళు నిండక ముందే తనకన్న మూడెళ్ళు పెద్దదైన అక్క వరస అయ్యే Mary Chaworth మీద మోహం పెంచుకున్నాడు, అది అనైతిక శృంగారం అయినప్పటికీ పుత్తడి గలవాని పుష్ఠంబు పుండైన వసుధలోన వార్తకెక్కు అన్నట్టు తన ఫాంటసీల్ని కవిత్వం పేరున జనం మీదకి వదిలి రొమాంటిక్ పొయట్ అనిపించుకున్నాడు,కేంబ్రిడ్జిలో చదివిన మూడేళ్ళూ పుస్తకాల కన్న ఆడ శరీరాల్నే ఎక్కువ తడిమాడు,21 ఏట పనీ పాటా లేని తిరుగుళ్ళలో గ్రీసు వెళ్ళాడు, అప్పటి గ్రీసు అందాల్ని చూసి పిచ్చెక్కిపోయాడు,అక్కడి బ్రిటిష్ రాయబారి Theodoros Makris కూతురు అందాల్ని చూసి మరీ పిచ్చెక్కిపోయాడు, మలేరియా రోగపు బాధల్నీ తల్లి చనిపోయిన దుఃఖాన్నీ కూడా పొంగుకొచ్చే కన్నీటితో గాక పొంగులెత్తిన నిరంతర మదనోత్సవ సంరంభపు బడలికల చాటున గడిపేశాడు, తన కుర్ర తిరుగుళ్ళ పిట్టకధల పుస్తకం The Childe Harold’s Pilgrimage తెచ్చిపెట్టిన సొమ్ముల్ని కూడా అన్ని రకాల వ్యసనాలకీ ఖర్చు చేసేసి మళ్ళీ అప్పుల పాలయ్యాడు, ముండలముఠాకోరుతనంతో నానాటికి ముదిరిపోతున్న అపకీర్తిని తగ్గించడానికి Ana (Annabella) Isabella Milbank అనే చదువూ సంస్కారం గల చక్కని చుక్కని పెళ్ళి చేసుకున్నాడు గానీ సంవత్సరం తిరిగేసరికి కొంపలో జరుగుతున్న నిషిద్ధ శృంగారపు జారత్వం చూసి దడుచుకుని ఆమె విడిపోయి పుట్టింటికి పోవడంతో గోడకి కొట్టిన బంతిలా తన పాత బూతులబుంగ బతుకులోకి వచ్చిపడ్డాడు, అప్పులూ నిందలూ కలిసి మోతెక్కించడంతో కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయి ఆనక వైలెంట్ అయిపోయి మళ్ళీ సైలెంట్ అయిపోయి ఇక తప్పక ఇంగ్లాడుకు ఆఖరి వీడ్కోలు ఇచ్చి జెనీవాకి పారిపోయి Percy Shelleyకి దగ్గిరయ్యాడు,ఆఖరికి గురుశిష్యుల కబురు అందుకుని 1823 నాటికి Ottoman ప్రభుత్వాన్ని కూల్చడానికి గ్రీసు దేశంలో సెటిలయ్యాడు,జాతుల మధ్య ఉన్న చిన్న చిన్న వైవిధ్యాలని పెద్దవి చేసి లేనిపోని జాతీయతల్ని సృష్టించి ప్రజల్ని విడగొట్టి విధ్వంసం నుంచి ఆదాయం పొందే వ్యాపారంలో ఆరితేరిపోయి గురుశిష్యులు తనమీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు గానీ మరోసారి వచ్చిన మలేరియాకి ఆహుతైపోయాడు.పాపులు చిరాయువులు అంటారు గానీ ఈ పాపి ముప్పయ్యారేళ్ళకే చచ్చాడు!

గురుశిష్యులకి ఇప్పుడు కావలసింది అలా గ్రీకు భూభాగం మీద లార్డ్ బైరన్ విజయవంతం చేసిన ప్రజలని గ్రూపుల కింద విడగొట్టి ఒక గ్రూపు మరొక గ్రూపును చూసి ద్వేషంతో రగిలిపోతూ పరస్పర కలహాలతో అందరూ నశించిపోవడానికి పనికొచ్చే సిద్ధాంతం.అయితే, వీళ్ళు ప్రజల్ని విడగొట్టటానికే సిద్ధాంతాన్ని తయారు చేశారని చదివేవాళ్ళకి తెలిసేట్టు ఉంటే క్యామిడీలా ఉంటుంది గానీ ఎవడూ అనుసరించడు, కదా!కాబట్టి, ప్రజలు భావజాలాన్ని నమ్మితే వీళ్ళ దోపిడీ వాలుగాలిలో తెరచాప నావలా సాగిపోతుందో ప్రజలకి అంతు లేని నష్టాన్ని కలిగించే సిద్ధాంతం గురించి అది ప్రజలకి మేలు చెయ్యడం కోసమే ఉద్భవించినట్టు నమ్మించగలిగిన ప్రతిభాశాలి కోసం వెతుకుతుంటే ఆ వెతుకులాటలో వాళ్ళకి దొరికిన ఆణిముత్యమే కార్ల్ మార్క్స్.

అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం కొన్ని శతాబ్దాల నుంచి రాజులకీ ప్రభుత్వాలకీ ఋణాలు ఇవ్వడం మొదలు పెట్టిన నాటినుంచి అతి తక్కువ సమయంలో అధిక విత్తాన్ని ఆర్జించడం నేర్చుకుంది.ఇటువంటి పనులు చెయ్యడం అందరికీ సాధ్యం కాదు. నిజానికి, అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం కూడా అత్యంత కఠినమైన సమస్యలనే ఎదుర్కొన్నది.

మనకు తరచు కనిపిస్తున్న స్థానిక సేతుక(सेतुकः/bank) సమూహం కొన్ని చట్టపరమైన ఒప్పందాలను చేసుకుని ఋణగ్రహీతలు ఒప్పందాలను ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాయి.రాజులతోనూ ప్రభుత్వాలతోనూ ఒక సేతుకాధిపతి ఒప్పందాలను చేసుకోవడం సాధ్యమా?పాలితులు పాలకులు చేసిన చట్టాల్ని అతిక్రమించినప్పుడు అది నేరం అని చెప్పి శిక్షించడానికి అవకాశం ఉంది, నిజమే!కానీ చట్టాలను చేసిన  పాలకులు వాటిని అతిక్రమించినప్పుడు అది నేరం కాదు పొరపాటున చేసిన గతకాలపు చట్టాల్ని సవరించుకోవడం అని చెప్పి సమర్ధించుకునే అవకాశం ఉంది.రాజు సర్వాధికారి కాబట్టి ఋణం వసూలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని "వీడి తల తీయించ"మని ఆజ్ఞాపిస్తే ఋణదాత అయిన సేతుకాధిపతి పరిస్థితి ఏంటి?

సంప్రదాయకమైన ఆర్ధికశాస్త్రం ప్రభుత్వాలకీ రాజులకీ ఋణాలు ఇచ్చి వసూలు చేసుకోవడం ఎట్లా అనే ప్రశ్నని అసలు పట్టించుకోలేదు,ప్రస్తుతం నడుస్తున్న ఆర్ధిక శాస్త్రాన్ని బోధించే కళాశాలలూ విశ్వవిశ్యాలయాలూ తమ పాఠాలలో అంశాన్ని బోధించడం లేదు.మనకు సమీపంలో ఎవరూ  చేస్తున్నవాళ్ళు లేకపోవడం చేత మనకు తెలియడం లేదు గానీ  kingfinancing రాజులకీ ప్రభుత్వాలకీ ఇచ్చిన ఋణాల్ని వడ్డీతో సహా అప్పనం పప్పనం వసూలు చేసుకోగలిగిన చాకచక్యం ఉన్నవాళ్ళకి దమ్మిడీ పెట్టుబడి లేని నిరంతరం ఇబ్బడి ముబ్బడి లాభాలను కురిపించే కల్పవృక్షం, లాంటిది కూడా కాదు అక్షరాల కల్పవృక్షమే.

Stuart Crane అనే ఆర్ధికశాస్త్ర మహోపాధ్యాయుడు రాజుల నుంచి ఋణదాతలు తీసుకునే రక్షణలు రెండు విధాల ఉంటాయని చెప్పారు.ఎప్పుడైతే ఒక వ్యాపార సంస్థ  ఎక్కువ మొత్తం ఋణం తీసుకోవాలని అనుకుంటుందో అప్పుడు తన ఋణదాతకు తనవైపునుంచి దఖలు పరిచిన ఆస్తుల నుంచి తను చెల్లించాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకోవటానికి ఎంత క్రూరమైన పద్ధతిని అనుసరించినప్పటికీ తప్పు పట్టలేని సాధికారికతని ఋణదాతకు సమర్పిస్తూ లిఖితపూర్వకమైన ధృవపత్రం ఇస్తుంది - అది తప్పనిసరి.ఋణం తీసుకోవడం తప్ప గత్యంతరం లేని స్థితి గనక ఉంటే ఋణదాతలు ఎంత అన్యాయపు షరతులు పెట్టినప్పటికీ ఒప్పుకోవడం కూడా తప్పనిసరి అవుతుంది.అదే పధ్ధతిన, వ్యాపార సంస్థలు తమ ఆస్తుల్ని ఋణదాతకు దఖలు పర్చినట్టు ప్రభుత్వాలు తమ సార్వభౌమత్వాన్ని ఋణదాతకు దఖలు పరుస్తాయి.అది కూడా తప్పనిసరి వ్యవహారమే.

ప్రభుత్వాలకు ఋణదాతలైన అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం ఆయా దేశాల మీద రాజ్యాల మీద కొంత కాదు పూర్తి రాజకీయ పరమైన అధికారాన్ని అనుభవించడం చాలా సహజమైన విషయం - నీటి లోని చేప నీటిని త్రాగడం ఎంత సహజమో అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం తమ నుంచి ఋణస్వీకరణ చేసిన రాజ్యాధినేతల అధీనంలో ఉన్న ప్రాంతపు అన్ని వనరుల మీద అధికారం తెచ్చుకోవడం అంత సహజం.ఋణం తీసుకున్నది ప్రభుత్వాధినేతయే అయినప్పటికీ అతను ఋణం తీర్చాల్సినది ప్రజల నుంచి వచ్చిన పన్నుల వల్ల సమకూరిన ఆదాయం నుంచే కదా!

kingfinancing ఆవిష్కర్తలు తమ ఋణగ్రహీతలు తమకు చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనే ప్రమాదకరమైన పని చేసినప్పుడు అతన్ని నిగ్రహించడానికి తీసుకున్న అత్యద్భుతమైన ముందు జాగ్రత్త అతని శత్రువులకి కూడా ఋణం ఇవ్వడం.తమ ఆదాయం నిరంతరం కొనసాగుతూ ఉండాలంటే ఒక ప్రభుత్వాధినేతని తమ నుంచి ఋణస్వీకరణకి ఒప్పిస్తున్న సమయంలోనే అతను తమని ధిక్కరించినప్పుడు అతని స్థానంలోకి ప్రవేశ పెట్టడం కోసం అతని శత్రువులని కూడా ఋణం ఇచ్చి ప్రోత్సహిస్తారు.ఒకవేళ ఆయా రాజ్యాధినేతలకి శత్రువులు లేనట్లయితే వీళ్ళు సృష్టిస్తారు.

అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సామ్రాజ్యాల విస్తరణలో అతి కీలకమైనవి government bond(वैशस्त्र बन्ध्रम्/ప్రభుత్వ బంధ్రం) కాబట్టి మామూలు ఋణదాతలకు భిన్నమైన రీతిలో  ఋణాన్ని వసూలు చేసుకోవడానికి గాక ఆయా  దేశాలనూ రాజ్యాలనూ నిరంతరం ఋణగ్రహీతల స్థానంలోనే ఉంచడానికి వీరు ఎన్నుకున్న సృజనాత్మమైన వ్యవహారమే ఆంతరంగిక శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం నుంచి దౌత్యపరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసి ఇతర దేశాలతో యుద్ధాలకి దించడం వరకు ఆయా దేశాధినేతలనూ ఆయా దేశాధినేతలకు శత్రువుల కింద నిలబెట్టిన ప్రతిపక్ష నేతలనూ కీలుబొమ్మల వలె నడిపిస్తూ ఉంటుంది.

అమెరికన్ ఖండపు ఉత్తర దక్షిణ ప్రాతాల మధ్య జరిగిన అంతర్యుద్ధం ఒక చక్కటి సాక్ష్యం ఇస్తుంది - August Belmont అనే ఒక Rothschilds మధ్యవర్తి ఉత్తర ప్రాంతపు సంఘర్షణవాదులకి ఋణం ఇచ్చాడు,Emile Erlanger అనే ఒక Rothschilds బంధువు దక్షిణ ప్రాంతపు సంఘర్షణవాదులకి ఋణం ఇచ్చింది.యుద్ధాలూ విప్లవాలూ అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం యొక్క సృజనాత్మకత నుంచి వూడిపడిన నూటికి వెయ్యి శాతం లాభసాటి వ్యవహారం అయినప్పటికీ  అసలైన కీలకం డబ్బు మీద పట్టు సాధించడమే.

ప్రభుత్వాలని ఋణగ్రహీతల్ని చేసుకుంటే ప్రభుత్వాల మీద ఎనలేని అధికారం వస్తుంది.ఋణదాత ప్రభుత్వాల యొక్క పాలితుల మీద ప్రభుత్వాధినేతలను మించి అధికారం చెలాయించగలడు - దేశపు విపణుల మీద ఋణదాతల పట్టు బిగుస్తుంది, ప్రాంతపు సహజ వనరులు వారికి సొంతం అవుతాయి,సరుకుల రవాణాలో రాయితీలు వస్తాయి,పన్నులు కట్టాల్సిన అవసరం ఉండదు.అయితే, వీరికి అత్యంత ఇష్టమైనదీ అన్నింటికన్న ముందు సాధించేదీ అయిన ఘనకార్యం ఆయా రాజ్యాల ద్రవ్య చెలామణీని తమ అధీనంలోకి తెచ్చుకోవడం.మొదట వీరు యూరపు ఖండం లోని అనేకమైన రాజ్యాలను తమ సంస్థ యొక్క శాఖల వలె మార్చుకున్నారు.The Bank of England, Bank of France, Bank of Germany అనేవి ఆయా దేశాల పేర్లతో కనపడుతున్నవి గానీ అవి ప్రభుత్వ సంస్థలు కావు,దేశాధినేతల బలహీనతలని తెలుసుకుని వార్ని వశపర్చుకుని వారి పనుపున ఆయా దేశాలకు ఋణదాతలై  ఆయా దేశాల మీద పెత్తనం చేస్తున్న అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం యొక్క వ్యక్తిగత యాజమాన్యం కింద నడుస్తున్న వ్యాపార సంస్థలు.

Midlands Bank of England అను పేరు గల ఘనత వహించిన సంస్థ యొక్క అధ్యక్షుడైన Reginald McKenna అనే మేధావి యొక్క పరిశీలన ప్రకారం డబ్బును తయారు చేస్తూ డబ్బుని చెలామణిలోకి తెచ్చి అమ్ముతూ అప్పులు ఇస్తూ వుండేవాళ్ళు ప్రభుత్వాలని తమ గుప్పిట్లో ఉంచుకుని చట్టాలను తమకు దేశం మీదా రాజ్యం మీదా ప్రాంతం మీదా పోటీ లేని పెత్తనం దఖలు పర్చుకుని ప్రజల జీవితాలలోని ప్రతి కోణాన్నీ ప్రభావితం చెయ్యగలుగుతారు. ఒక ప్రభుత్వం అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం దగ్గిర ఋణం కోసం చెయ్యి చాపిన మరుక్షణం ఆ ప్రభుత్వం వాళ్ళకి పెంపుడు కుక్క అయిపోతుంది.

ఆధునిక కాలపు రాజ్యాధినేతలు నియంతృత్వం కోరుకుని ఎదురు లేని పరిపాలన చెయ్యాలనుకుంటే వారికి కందీకృత సేతుక నిర్మితి(central banking system) ఉండి తీరాలి.League of Just Men అనే ఒక సంస్థ Karl Marx అనే ఒక విప్లవ వైతాళికుడు అని మనం అనుకునే వ్యక్తికి The Communist Manifesto రాయడానికి అధిక మొత్తం డబ్బు ముట్టజెప్తూ పనికి కుదుర్చుకున్నారు.పెట్టుబడిదారుల్ని చంపేసి శ్రామైక ప్రజలకి సమస్త సంపదనీ అప్పనం పప్పనం ఇచ్చెయ్యడానికి ఉద్దేశించిన ఉద్గ్రంధం యొక్క 5 సూత్రీకరణ "దేశంలో పుట్టిన ప్రతి రూపాయినీ రాజ్యం యొక్క అజమాయిషీలో ఉండాలి - అందుకు కందీకృత సేతుక నిర్మితి(central banking system) చాలా అవసరం" అని ఉంటుంది.

కార్ల్ మార్క్సు గారి అంతిమలక్ష్యం ప్రజల్ని ఇల్యూమినాటీ బ్యాంకర్లు తమ దేశంలో అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం ఏర్పరచిన ఒక central bank తమ మీద నియంతృత్వం చెలాయించుతుంటే అది తమ  సౌభాగ్యం కోసమే అని నమ్మే పిచ్చమొహాల కింద తయారు చెయ్యటం - క్రైస్తవం యహోవా పేరు చెప్పి భయపెట్టి అదే దేవుడి కొడుకైన ఏసుని రక్షకుడి కింద చూపించినట్టు ఇటువైపునించి పెట్టుబడిదారుల దోపిడీని చూపించి భయపెట్టి అటువైపున అదే పెట్టుబడిదారులు ఏర్పరచిన సెంట్రల్ బ్యాంకు గొడుగు నీడ కిందకి పంపించాడు.బుద్ధీ జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడూ నియంతృత్వం కిందకి వెళ్ళడు కాబట్టి శ్రామికవర్గం అనే పదాన్ని తీసుకొచ్చి అతికించాడు, అంతే!

భూమిమీద ఉన్న అయిదు ఖండాలలో అతి పెద్దది ఆసియా ఐతే అతి చిన్నది యూరప్.అలాంటి అతి చిన్న ఖండంలోని ఒక ద్వీపం లండన్ మహానగరం ఉన్న బ్రిటిష్ దీవి నడిబొడ్డున కూర్చున్న కొద్దిమంది సైకోపాత్ గాళ్ళు ప్రపంచాధిపత్యం గురించి కలలు కనడమే ఒక విచిత్రం అయితే వాళ్ళు అంతటి దుష్కరమైన మరియు సంక్లిష్టమైన మరియు అసంభవం అనిపించే అంతిమ లక్ష్యాన్ని కూడా అవలీలగా సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో ఉండటం ఇంకో విచిత్రం.వీటన్నిటి కన్న, 1748లో పుట్టిన Adam Weishaupt  కేవలం 28 యేళ్ళ వయస్సుకే ప్రపంచాధిపత్యం గురించి కలలు కనటమే గాక దాన్ని సాధించటానికి అత్యంత వాస్తవికమైన ప్రణాళికలు వేసి తోటివారికి తను చెప్ప్పింది చెప్పినట్టు టైం ప్రకారం అమలు పరిస్తే చాలునని చెప్పి మూడు ప్రపంచ యుద్ధాలతో మూడు మహా విప్లవాలతో 2050 నాటికి భూమి మీద గల సమస్తం తమ బృందానికి స్వంతం అవుతుందని గ్యారెంటీ ఇవ్వడం మానవమాత్రులే కాదు సృష్టికర్త కూడా వూహించలేని విచిత్రం అనిపిస్తుంది కదూ!

అంతకన్న విచిత్రం ఏమిటో తెలుసా - 1784 నాడు `Adam Weishaupt` తన 36 యేట `French Revolution` తీసుకురావటానికి వేసిన ప్రణాళికతో తన అనుచరుడైన `Xavier Zwack` చేత ఒక పుస్తకం రాయించి, `Frankfurt` నగరం నుంచి `Paris` నగరానికి కొరియర్ చేస్తే దారిలో ఓడమీద పడిన పిడుగు దెబ్బకి కొరియర్ ఛిద్రమై పుస్తకం పోలీసుల చేతుల్లోకి వెళ్ళి, అందులోని విషయం చదివి ఠారెత్తిన `Bavarian authorities` అన్ని `masonic lodges` మీద దాడులు చేసి  Illuminati సంస్థనీ అన్ని masonic lodgesనీ చట్టవ్యతిరేకమైనవని ప్రకటించి వాటి కార్యకలాపాల్ని నిషేధించి, `Illuminati` ప్లాను మొత్తాన్ని `"The Original Writings of The Order and Sect of The Illuminati."` అనే పేరున `document` తయారు చేయించి, యూరోపు లోని అన్ని చర్చిలకీ దేశాలకీ పంపించినప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల అయిదేళ్ళ తర్వాత 1789 నాడు Illuminatiలు వేసిన ప్లాను కార్యరూపం దాల్చి మొదలైన `French Revolution` 1793 వరకు జరిగింది!

మళ్ళీ మనం 1848 నాటి Lord Palmerston,David Urquhart,Napoleon III, Karl Marx, Jeremy Bentham లాంటివాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే నందో రాజా భవిష్యతి అంటూ రాక్షస మంత్రి వేసిన ఎత్తుగడలకి షోడశ మహాజనపదాలు కూలిపోయి మగధను బలవత్తరం చేసినట్టు ఆనాటి యూరోపియన్ మాసామ్రాజ్యాలు ఒక్కొక్కటి వీళ్ళ పరం అయ్యాయి.Austria నుంచి Metternich,France నుంచి Louis Philippe పారిపోయి మహాజనానికి మరదలు పిల్ల లాంటి వూరుమ్మడి దొమ్మరి గడసాని అయిన లండను నగరానికే వచ్చిపడి చీట్లపేక ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు - ఇటలీలో యుద్ధం,ఆస్ట్రియాలో అంతర్యుద్ధం,జర్మనీలో సంక్షోభం అన్నీ వీళ్ళు సృష్టించినవే!రష్యా ఒక్కటే కొరకరాని కొయ్యలా ఉంది.ఒక మూడేళ్ళ తర్వాత Napoleon III సహాయం తీసుకుని రష్యా మీద యుద్ధానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు Lord Palmerston గాడు.దాదాపు అదే సమయంలో Sepoy Rebellion అని మనం గర్విస్తున్న ముస్లిం సిపాయిలకి తూటాల్లో పందికొవ్వు ఉందని చెప్పడం హిందూ సిపాయిలకి తూటాల్లో ఆవుకొవ్వు ఉందని చెప్పడం అనే కుట్రకి కూడా అప్పుడే వ్యూహాలు పన్నుకుని కూర్చున్నారు.

కార్ల్ మార్క్స్ అనే రష్యన్ జాతీయత ఉన్న లండను బ్యాంకర్ల పెంపుడు కుక్క అదే 1848 నాడు The Communist Manifesto రాసి జనం మీదకి వదిలి దానికి వచ్చిన రెస్పాన్సు చూసుకుని రెచ్చిపోయి 1867 మొదలు 1883 వరకు బ్రిటిష్ మ్యూజియం రీడింగురూములో కూర్చుని జెరెమీ బెంధాము గాడూ డేవిడ్ ఉర్కుహార్ట్ గాడూ చెప్పింది చెప్పినట్టు తీసుకుని దాన్ని ఆనవాలు పట్టలేనంతలా రంగూ రుచీ రూపం మార్చి Das Kapital అనే ఉద్గ్రంధాన్ని వండి వార్చాడు. “Classical economy always loved to conceive social capital as a fixed magnitude of a fixed degree of efficiency. But this prejudice was first established as a dogma by the arch-Philistine, Jeremy Bentham, that insipid, pedantic, leather-tongued oracle of the ordinary bourgeois intelligence of the 19th century.” అని పేరు పెట్టి మరీ తిట్టడం పచ్చి మోసకారితనం తప్ప అందులో నిజాయితీ లేదు. ఇక్కడ social capital అనేది dogma అని తిట్టిన మేధావి మరి, " స్వంత ఆస్తిని రద్దు చేసుకుని అదనపు సంపదని సమాజపరం చెయ్యడం" అనే dogmaని ఎందుకు ప్రతిపాదించాడు?Classical economy చేసిన social capital అనేది ప్రజలు తమ స్వేచ్చాయుత కార్యాచరణ ద్వారా సాధించుకోవాల్సిన లక్ష్యానికి సంబంధించిన ఒక సలహా అయితే అదేలాంటి "స్వంత ఆస్తి రద్దు" అనే సూత్రాన్ని తప్పనిసరి చేసి దాన్ని ఒప్పుకోనివాళ్ళని వర్గశత్రువు ముద్ర వేసి చంపెయ్యమని చెప్పటం బెంథాము చెప్పినదాన్నే పదింతల క్రౌర్యంతో చెయ్యటం కాదూ!

మార్క్సిజం అనేది అసలు ప్రపంచంలో అన్ని దేశాలలోని మేధావుల్నీ ఆకర్షించడానికి కారణమేమిటో తెలుసా?గతకాలపు చరిత్రని కొత్తరకంగా వ్యాఖ్యానించి చెప్పడం!ఆయన తన సిధ్ధాంతానికి "గతి తార్కిక చారిత్రక భౌతికవాదం" అని పేరు పెట్టి అప్పటివరకూ చరిత్రలో జరిగిన రాజకీయపరమైన తిరుగుబాట్ల వెనక దాగి ఉన్న కొత్త నేపధ్యాన్ని చూపించగలగటం!కొందరు సంస్కృతీ,సామాజిక విషయాల గురించి కూడా వ్యాఖ్యానించాడు కాబట్టి ఇదొక ఎన్సైక్లోపెడియా అని భ్రమపడతారు గానీ చాణక్యుడిలాగే ఇతని వాదనల్లోనూ పొలిటికల్ యెకానమీ దృక్కోణం మాత్రమే ప్రముఖంగా ఉంది.ఒక ప్రధాన వాదంలో ఉపాంగాలు ఉండటం ప్రతి సిధ్ధాంతంలోనూ సహజమే కదా - ఇందులో చర్చించిన సామాజిక విషయాల గురించిన ప్రస్తావన కూడా అంతే!

మొదటి ప్రతిపాదన ఉత్పత్తి శక్తుల మీద యెవరు అధికారం చెలాయిస్తారో రాజకీయంగా వారు అధికారంలో ఉంటారు అనేది.దీనికి రుజువుగా ఆదిమ కాలం నుంచి ప్రతి సమాజాన్నీ ఉదాహరణగా తీసుకుంటూ కాలంలో అక్కడ యేది ఉత్పత్తి శక్తి,దాన్ని యెవరు నియంత్రిస్తున్నారు,అప్పటి సామాజిక సంబంధాల మీద అది యెలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నది అని విశ్లేషించాడు. సాక్ష్యాదారాలను గతకాలపు చరిత్ర నుంచి సోదాహరణంగా చూపించాక అన్ని కాలాల్లోనూ అసలు ఉత్పత్తికి కారణమైన శ్రామికులు ప్రయోజనం పొందటం లేదు గాబట్టి శ్రామికులు ప్రయోజనం పొందగలిగే లక్ష్యాన్ని చదువరులకు యెక్కించి శ్రామికవర్గ నియంతృత్వం ద్వారా యేర్పడే వర్గరహితసమాజం అనే ఒక బ్రహ్మపదార్ధం లాంటి కల్పనాత్మక సమాజపు స్థితిని సమస్త మానవాళికీ ఒక అంతిమ లఖ్యంగా ప్రవచించాడు!

ఉత్పత్తి శక్తులకీ ఆనాటి సామాజిక వాతవరణానికీ ఉన్న సంబంధాన్ని కనుక్కోగలగటమే ఇతని విశ్లేషణలోని ప్రత్యేకత.అంతవరకూ అతని విశ్లేషణలన్నీ తిరుగులేని నిజాలే!వేట జీవనోపాధిగా ఉన్న సమూహంలో యెవరు యెక్కువ చాకచక్యంగా జంతువుల్ని వేటాడగలరో వారికే ప్రాధాన్యత!అక్కడ వేటకి పనికొచ్చే ఆయుధాలు ఉత్పత్తి శక్తులు,వాటిని అమితంగా ప్రేమించటం,తాము వేటాడిన జంతువుల అవశేషాల్ని తమ దేహం మీద అలంకరించుకోవటం - ఇవన్నీ సామాజిక జీవితంలో దాని ప్రతిబింబాలు!వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్న తర్వాత అన్ని దశల్లోనూ భూమి ప్రముఖ ఉత్పత్తిశక్తి అయ్యింది - భూస్వామ్యం రాజరికం దీని ప్రతిబింబాలు!మార్క్సు ప్రధానంగా చెప్పిన శ్రామికవర్గం పారిశ్రామిక విప్లవం తర్వాతనే అవతరించింది!శ్రామికవర్గం ప్రబలశక్తిగా ఉన్న కాలంలో దాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పిన సిధ్ధాంతం తర్వాత వచ్చిన వూహించని మార్పు కంప్యూటరీకరణతో అర్ధం లేనిదిగా తయారైపోయింది!

మార్క్సు తన జీవితకాలంలో సిధ్ధాంతాన్ని రాస్తున్నప్పుడూ,ప్రచారం చేస్తున్నప్పుడూ మేధోశ్రమని శ్రమగా గుర్తించలేదు,గుర్తిస్తే నట్లూ బోల్టులూ తిప్పుకునే మామూలు వర్కరుకి 1000 రూపాయలూ మేనేజరుకి 10000 రూపాయలూ ఇవ్వడం న్యాయమే కదా అనిపిస్తుందే తప్ప దాన్ని దోపిడీ అని అనటం ససేమిరా కుదరదు గాబట్టి,అది కుదరనప్పుడు శ్రామికవర్గనియంతృత్వం అనేది కూడా యెవరికీ యెక్కదు గాబట్టి మేధోశ్రమని ఒప్పుకోలేదు - తెలిసే ఒప్పుకోలేదు!"పెట్టుబడిదారీ విధానం తనలోని వైరుధ్యాలకి తనే బలయి అంతమైపోతుంది?" అని డంబాలు పలుకుతూ చంకలెగరేస్తున్న అరివీర కమ్యునిష్టు లంతా కేవలం మేధోశ్రమని శ్రమగా ఒప్పుకుంటే చాలు యెంత పెద్ద రేంజిలో సక్సెసయిన కమ్యునిష్టు సమాజమయినా ఒక్క నిముషంలో కూలిపోతుంది!

నిజంగా పెట్టుబడిదారీ విధానమే అంతమైపోవటం జరిగితే అక్కడ మిగిలేది శూన్యం,యెందుకంటే మార్క్సు పెట్టుబడిదారీ విధానంలో ఉన్న దోపిడీని అరికట్టే ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థని దేన్నీ ప్రతిపాదించలేదు గనక!తను మానవుడు వస్తుగత వాద అని చెప్పే స్మిథ్సోనియన్ భావజాలాన్ని ఒప్పుకుంటూనే స్మిథ్సోనియన్ సిధ్ధాంతాల నుంచే మానవుల్ని వాటికి భిన్నమైన ఆదర్శాలతో నిండిఉన్న తను కొత్తగా వర్ణించి చెప్పిన వర్గరహితసమాజంలోకి యెట్లా నడిపించాలి అనే కీలకమైన విషయాన్ని మాత్రం అసలు పట్టించుకోలేదు.

దోపిడీకి కారణమైన ఆర్ధిక వ్యవస్థతోనే దోపిడీని నిర్మూలించటం యెట్లా అనే అనుమానం ఇప్పటి వరకూ యే కమ్యునిష్టు కైనా వచ్చిందా?ప్రతిదానికీ ఒక నిర్మితి అవసరం,అనుబంధాలూ ఆప్యాయతలూ సమాజంలో ప్రతిదీ ఆర్ధికానికి సంబంధంగానే ఉంటుంది అని బల్ల గుద్ది చెప్తున్న వాళ్ళు వర్గరహితసమాజం అనేదానికి కూడా ఆర్ధికపరమైన పునాది ఉండాలి అని ఇప్పటికీ అనుకొవడం లేదా?గతాన్నంతా ఉత్పత్తిశక్తుల ఆధారంగా అధ్భుతంగా విశ్లేషించినప్పుడు తలూపడమే తప్ప మరి వర్గరహితసమాజాన్ని యే రకమైన ఉత్పత్తిశక్తి యెట్లా ప్రభావితం చేస్తుంది అని అడగటం మర్చిపోయారా?అంతా బొంకులదిబ్బ!

అసలీ ఉత్పత్తి శక్తులు సమాజాన్ని ప్రభావితం చెయ్యటంలో ఒక మిస్సింగ్ లింక్ ఉంది!వేట జీవనోపాధిగా ఉన్న తొలిదశనే తీసుకోండి.ఒక మనిషి మిగిలిన వాళ్ళకి అలివిగాని మృగాన్ని తను గొప్పగా పోరాడి చంపాడనుకోండి, జంతువు పులి అయితే దాని గోళ్ళని గుర్తుగా అట్టే పెట్టుకుంటాడు.ఇప్పుడు ఆటగాళ్ళ కిస్తున్న గోల్డ్ మెడల్ కూడా గుర్తింపు కోసమే గదా!వాటికి సమాజంలో యెలాంటి ప్రాముఖ్యతా లేదు,ఉండదు!కానీ మరొక వ్యక్తి దగ్గిర ఉన్న యే వస్తువైనా మనిషి కోరుకుని అది కావాలంటే పులిగోరుని ఇవ్వాల్సి వచ్చిందనుకోండి - అప్పుడు దానికి వెల అంటూ యేర్పడి అమ్మకపు సరుకుగా మారుతుంది,అవునా!అంటే ఉత్పత్తి శక్తులు వాటంతటవి సమాజాన్ని ప్రభావితం చేయ్యలేవు,వాటికి వెల నిర్ణయించబడినప్పుడే వాటి చుట్టూ ఒక మార్కెట్ యేర్పడినప్పుడే అవి సమాజంలో ప్రకంపనలు సృష్టించగలుగుతాయి - అది సత్యం! నిజాన్ని మాత్రం వదిలేశాడు.

అన్ని దశల్లోనూ తను ఉత్పత్తి శక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నప్పుడు అవి యెట్లా ప్రభావితం చేస్తాయి అనేది తెలియకనే వొదిలేశాడా?ఒక పులిగోరు ఖరీదుని యేర్పరచుకుని మార్కెట్టులో వస్తువుగా నిలబడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ అక్కడ జరుగుతున్న దేమిటి?వెల కట్టబడిన వస్తువు,అమ్మకం దారు,కొనుగోలు దారు,మారక ద్రవ్యం,లాభం,నష్టం - వీటిల్లో మార్పు యేమైనా ఉందా?ఇన్ని మిలియన్ల సంవత్సరాల నుంచీ ఖచ్చితమైన సూత్రాల మీద ఆధార పడి నడుస్తున్న పెట్టుబడి దారీ విధానం మార్క్సు గారికి ముందర యెప్పుడయినా కుప్పకూలిపోయిందా?మెసపొటేమియన్,మాయన్,గోబియన్ ,గీబియన్ సమాజాలు అంతరించి పోవడం గురించి చెబితే చెప్పవచ్చు గాక,వాటి స్థానంలో అంతకన్నా శక్తివంతమైన మరో పెట్టుబడిదారీ సమాజం పుట్టింది గదా!వర్గరహితసమాజం కూడా ప్రత్యేకంగా యే ఆర్ధికసూత్రాల్నీ కాకుండా ఇవే ఆర్ధికసూత్రాల ప్రకారం నడుస్తూ ఉంటే పెట్టుబడిదారీ విధానం కూలిపోతుందనడమే పెద్ద అబధ్ధం,కాదా!

ఐన్స్టీన్ రెలేటివిటీ సిధ్ధాంతంలో అన్నీ రిలేటివ్ కానీ కాంతి వేగం మాత్రం కాన్స్టాంట్ అన్నట్టు అసలు వైరుధ్యాలన్నీ మార్క్సు చెప్పిన గతి తప్పిన భౌతిక్కవాదంలో ఉంటే స్థిరమైన విలువలన్నీ పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాయి! అంత తెలివితక్కువ సొల్లు ఇంత స్థాయిలో ప్రజల్ని ఉర్రూత లూగించడానికి అది ఎవరికి పనికొస్తుందో వాళ్ళు మీడియా సాయంతో బాకాలు వూదుతూ ప్రజల్ని మోసం చెయ్యడమే కారణం. అంతకు డెభ్భయ్యేళ్ళ ముందు Adam Weishaupt భూమి మీద పుట్టే సంపద సమస్తాన్నీ ఒక 13 మధ్యయుగాల నుంచి కొనసాగుతున్న రాజవంశీయుల పరం చెయ్యడానికి తన సొంత మనుషులకి చెప్పిన రహస్య ప్రణాళికని తిరగేసి ప్రజలు అది తమ సౌభాగ్యం కోసం వేసిన ప్రణాళికలా భావించి వాళ్ళ శ్రమ వల్ల పుట్టిన సంపదని తమ స్వహస్తాలతో ఆ 13 మధ్యయుగాల నుంచి కొనసాగుతున్న రాజవంశీయుల పరం చెయ్యడానికి పాయసంలా కనిపించే విషాన్ని వండివార్చిన పరమ కిరాతకుడు కార్ల్ మార్క్స్!

ఎంత మోసం కాకపోతే రష్యన్ ప్రజలు జార్ ప్రభువు మీద తిరగబడితే వచ్చిందని మనకి అనిపిస్తున్న 1917 నాటి రష్యన్ విప్లవం సఫలం కావడానికి Jacob Schiff అనే అమెరికన్ బ్యాంకర్ 20,000,000 డాలర్లు ఖర్చు చేస్తాడు?రష్యన్ విప్లవం ఏ సిద్ధాంతం మీద ఆధారపడిందో ఆ మార్క్సిజం పెట్టుబడిదారుల్ని నిర్మూలించమని చెప్తుంటే మెడ మీద తలకాయ ఉన్న పెట్టుబడిదారు ఎవడూ సహాయం చెయ్యడు కద!తనని చంపమని హంతకులకి సుపారీ ఇవ్వటం సినిమాల్లోనూ నవలల్లోనూ ఏ పాత్ర అన్నా చేస్తే నవ్వుకోవడమే తప్ప వాస్తవ ప్రపంచంలో నమ్మటం సాధ్యపడదే!అలాంటప్పుడు Jacob Schiff ఒక్కడే గాక Paul Warburg, Max Warburg అనే ఇద్దరు కలిసి $6,000,000, Harriman Alfred Milner మరొక $5,000,000 రష్యన్ విప్లవాన్ని ముందుండి నడిపిస్తున్న లెనిన్ ట్రాట్స్కీలకి ఎందుకు ఇచ్చారు?

అసలు రష్యాలో జార్ ప్రభువు గానీ పెట్టుబడి దారులు గానీ ప్రజల్ని దోచుకోవటం నిజమే అయితే లెనిన్ గానీ ట్రాట్స్కీ గానీ విప్లవాన్ని విజయవంతం చెయ్యడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని రష్యన్ భూభాగం లోపల ఉన్నవాళ్ళనుంచి రాబట్టుకోవటం తెలివైన పని గానీ ఆమెరికన్ దోపిడీదారుల  నుంచి డబ్బు తీసుకుని మాతృదేశపు దోపిడీ దారుల నుంచి ప్రజల్ని విముక్తం చేస్తానని చెప్పడం విధమైన తెలివో అర్ధం అవుతుందా మీకు?

ప్రాచీన కాలం మొదలు నవీన కాలం వరకు గల ఆర్ధికశాస్త్ర గ్రంధాలు అన్నీ ఒకేలాంటి నిర్మితిని పాటించాయి.ఒక ప్రాంతం అనేదాన్ని సరిహద్దు అనుకుని ప్రాంతం యొక్క ప్రజల పోషణ కోసం అవసరమైన సమస్తాన్నీ భూమిని ఉపయోగించుకోవాల్సిందే.అయితే, ఒక రాజ్యం తన భూమిని మొత్తమూపయోగించుకుని సైతం తన ప్రజల అవసరాలను తీర్చలేనప్పుడు ఏం చెయ్యాలి?ప్రజల్ని ఇతర దేశాలకు పంపించాలి.లేదంటే, తన ప్రజలకు అదనపు సౌభాగ్యం కోసం భూమిని విస్తరించాలి. కొత్త భూమి ఎవరి అధీనంలోనూ లేనప్పుడు సమస్య ఉండదు గానీ అలా కానప్పుడు యుద్ధం చెయ్యాల్సిందే, కదా!

యుద్ధం అంటే మొదట సైనికులు కావాలి,వాళ్ళకి యుద్ధవిద్యలలో శిక్షణ ఇవ్వాలి,ఆయుధాలు తయారు చేసుకోవాలి.వీటన్నిటికీ చాలా ఖర్చవుతుంది గాబట్టి ఎంతో కొంత అభివృద్ధి సాధించని ఒక కొత్త దేశం యుద్ధానికి సిద్ధం కాలేదు.అందుకే, ఒకప్పుడు యుద్ధాలు చాలా తక్కువ జరిగేవి.లాభనష్టాలు బేరీజు వేసుకోని మూర్ఖపు యిద్ధాలు మరీ తక్కువ జరిగాయి.యుద్ధాలు తరచు జరగడం, అవి ఆయా రాజ్యాల్నీ దేశాల్నీ విపరీతమైన నష్టాలకి గురిచెయ్యడం 1784 నాడు Adam Weishaupt తన 36 యేట French Revolution తీసుకురావటానికి వేసిన ప్రణాళికతో Illuminatiలు చేసిన ప్రయత్నాలు ఫలించి అయిదేళ్ళ తర్వాత 1789 నాడు మొదలైన French Revolution విజయవంతం అయ్యాకనే మొదలైంది.

యుద్ధాల మాదిరిగానే విప్లవాలు విజయవంతం కావటానికి కూడా  రాజ్యం లాంటి పకడ్బందీ నిర్మాణం ఉన్న రాజకీయ సంస్థలతో పాటు వాటిని నడపటానికీ అక్కడ చేరిన సభ్యుల్ని పోషించడానికీ ధనసంపత్తి చాలా అవసరం.మరి, అప్పటికే బీదరికంలో మగ్గుతున్న శ్రామికులూ దళితులూ పీడితులూ తాడితులూ జనసమీకరణ వరకు ముందుకొస్తారు గానీ ధనసమీకరణ వరకు వచ్చేటప్పటికి చేతులు ఎత్తేస్తారు, అవునా?

అందరూ రష్యన్ విప్లవం అనగానే 1917 నాటి లెనిన్ వర్గం పెట్రోగ్రాడ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటననే గుర్తు చేసుకుంటారు గానీ లెనిన్ అధ్వర్యంలో జరిగిన ప్రయత్నాల్లో అది రెండవది.మొదటిది 1905 నాడు జరిగి అపజయం పాలయ్యి లెనిన్, ట్రాట్స్కీ లాంటివాళ్ళు ప్రవాసంలోకి వెళ్ళిపోయారు.

1917 నాడు సమకూర్చగలిగిన ధనం 1905 నాడు అమెరికన్ బ్యాంకర్ల దగ్గిర లేకపోవడమే   మొదటి విప్లవం అపజయం కావడానికి ముఖ్యకారణం.1902 నాడు జర్మనీ నుంచి అమెరికాకు వచ్చిన Paul Warburg అఖండమైన వ్యూహనిర్మాణ చాతుర్యంతో ఎత్తులు వేస్తూ వేస్తూ 1907 నాటికి తగినంతమంది బ్రోకర్లనీ డాఫర్లనీ సంపాదించుకుని 1913 నాటికి Federal Reserve bank ఏర్పాటు చెయ్యగలిగాడు.ఇవ్వాళ మన దేశంలో మనం చూస్తున్న Reserve Bank India అనేది అచ్చు అదే తరహాలో పనిచేస్తుంది గాబట్టి Federal Reserve bank యొక్క చరిత్రని ప్రతి భారతీయుడూ తెలుసుకుని తీరాలి.

తర్వాత రష్యన్ విప్లవానికి పెట్టుబడి పెట్టిన Max Warburg అనేవాణ్ణి M.N. Warburg & Company అనే కుటుంబ వ్యాపార సంస్థ నిర్వహణ కోసం అక్కడే వదిలి Paul Warburg,Felix Warburg అనే అన్నదమ్ములైన తోడుదొంగలు అమెరికా వచ్చి చేసిన మొదటి ఘనకార్యం Nelson Aldrich అనే సెనేటర్ని తమ చెప్పులు నాకే కుక్కలా తయారు చేసుకోవటం.వాళ్ళు కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు, వాడు అప్పటికే "Morgan's floor broker in the Senate." అని పేరు తెచ్చుకున్నాడు.వీడి కూతురు Abbyని John D. Rockefeller Jrకి ఇచ్చి పెళ్ళి చేసి అంతర్జాతీయ సేతుక(सेतुकः/bank) సమూహం యొక్క ఆంతరంగికుడు ఐపోయాడు.వీళ్ళందరూ కలిసి కట్టు ప్రణాళికలు వేసి 1907 నాడు ఒక ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించి ప్రజలూ ప్రభుత్వమూ భయభ్రాంతం అయిపోయాక్ దాన్ని ముగించి సంధి ప్రతిపాదనల కింద Nelson Aldrich అనే వీళ్ళ పెంపుడు కుక్కని National Monetary Commission  అనే కీలకమైన సంస్థకి అధ్యక్షుడు అయ్యేలా చేశారు.అసలైన వింత యేమిటంటే, Nelson Aldrich అనేవాడికి banking system గురించిన technical knowledge శూన్యం.అచ్చు మచ్చు మన దేశపు రాజకీయ నాయకుల మాదిరే రెండేళ్ళు యూరోపియన్ బ్యాంకర్లతో కలిసి తినీ తాగీ చెడదిరిగీ అక్షరాల $300,000 తగలేసి వెనక్కొచ్చాడు - కనీసం సాక్ష్యానికి సైతం ఒక్క కాగితం ముక్కని రిపోర్టు కింద తయారు చెయ్యలేదు!

మరి, ప్రబుద్ధుడు ఏర్పాటు చేసినది యేమిటయ్యా అంటే,అమెరికన్ చరిత్రని శాశ్వత పరాధీనత వైపుకి నడిపించే ఒక రహస్య సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భగ్నం కాకూడదన్నంత నిక్కచ్చితనం పాటిస్తూ ఏర్పాటు చేశాడు.

నిజానికి ఆండ్రూ జాక్సన్ కాలం నుంచీ అమెరికన్ ప్రజలు వీళ్ళ మోసాల్ని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ తెలివిని చూపిస్తూ ఉన్నారు గానీ వీళ్ళ కుట్ర సఫలం అవుతున్న సమయానికి వాళ్ళ దృష్టిని మళ్ళించేలా అమెరికన్ సామాజిక జీవితంలో ఒక గందరగోళం ఏర్పడింది.కొత్త శతాబ్దపు తొలినాళ్ళలో rural socialists బలం పుంజుకుని New York bankers మీదా monopolist industrialists మీదా పోరాడుతూ ప్రజలకు గొప్ప ఆశని కలిగించారు.వాళ్ళు సంధించిన ప్రశ్నలు సరైనవే గానీ వాటికి సాధించిన జవాబులు మాత్రం సరైనవి కావు. అటువంటి సంస్థలకి నిధుల అవసరం ఉంది గాబట్టి Morgan firm రంగంలోకి దిగి తమ బంట్లని అందులోకి ప్రవేశపెట్టింది.

ప్రాచీన కాలపు అమెరికా చరిత్ర చాలా చిన్నది.కొలంబస్ ఇండియాకు దారి కనుక్కోవడానికి బయల్దేరి దారి మధ్యలో సరిగ్గా తనకు తెలిసిన అప్పటి భారతీయ సంస్కృతిని పోలిన సంస్కృతిని ప్రతిబింబిస్తున్న జనసమూహాన్ని చూసి గమ్యం చేరినట్టు మురిసిపోయి అక్కడి ప్రజలకు "రెడ్ ఇండియన్లు" అని పేరు పెట్టి తాను ఆశించిన వైభవం కనబడక  అసలైన ఇండియాను కనుక్కోవడం కోసం అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలాకాలం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది.అయితే, బోస్టన్ టీ పార్టీ అనే సంచలనాత్మకమైన సన్నివేశం నుంచీ మనకు తెలుస్తున్న ఆధునిక కాలపు ఆమెరికా చరిత్ర సమస్తం సామాన్యులు బ్యాంకింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలతో ముడిపడి ఉంటుంది!

అప్పటికి చాలాకాలం క్రితమే అమెరికాలో కాలనీలు ఏర్పాటు చేసుకుని ఆఫ్రికా నుంచి బానిసల్ని తెచ్చుకుని పని చేతించుకుని తెగ బలిసిన అమెరికన్ కాలనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వం తమ మీద విధించిన పన్నులకి అలిగి December 16, 1773 342 బ్రిటిష్ టీ కార్టన్లని సముద్రంలోకి విసిరి ముంచేసి నిరసన ప్రకటించడంతో నిప్పురవ్వ రగులుకుని క్రమేణ అంతర్యుద్ధం కింద మారి తర్వాత స్వాతంత్య్రపోరాటం రూపం తీసుకుని జార్జి వాషింగ్టన్ నేతృత్వంలో స్వతంత్రదేశపు హోదాని పొందింది.అయితే, ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల నుండి ఉద్భవించిన ధర్మయుద్ధం కాదు, కేవలం తమ మీద ప్రభుత్వం పెత్తనం చెయ్యడాన్ని సహించలేని అమెరికాలోని 13 కాలనీల వ్యాపారుల కూటమి ఇల్యూమినాటి, ఫ్రీ మాసన్రీ వంటి మతసంస్థల సాయంతో తమ స్వార్ధానికి ప్రజల క్షేమం అనే ముసుగు తొడిగేసి చేసిన మర్మయుద్ధం - అమెరికన్ కరెన్సీ మీద ఇల్యూమినాటి పిరమిడ్ కొట్టొచ్చినట్టు కనబడటమే అందుకు బలమైన సాక్ష్యం!

ఆదినుంచీ అనేకమంది అమెరికన్ మేధావులు ప్రజల తరపున దుర్మార్గమైన బ్యాంకింగ్ సిస్టం మీద పోరాడుతూనే ఉన్నారు, ఒకసారి గెలుస్తున్నారు, అంతలోనే అటువైపున ఉన్నవారి చాటుదెబ్బలకి బలై ఓడిపోతున్నారు.దాదాపు 19 శతాబ్దపు చివరి దశకంలో Rothschilds అత్యంత ధనిక దేశమైన అమెరికాని తన పట్టులోకి తెచ్చుకోవాలని అనుకుంది.

1907లో New York Chamber of Commerce ముందు Jacob Schiff గంభీరంగా “If we don’t get a central bank with sufficient credit control, this country will experience the most severe and far-reaching financial panic in its history!” అని ప్రకటించాడు. వాళ్ళు ఇలా చెప్పారు, అది అలా జరిగింది! monetary crisis మొదలైంది, financial market అల్లకల్లోలమైంది, దేశం మొత్తంలో పదిల వేల సంఖ్యలో జనం సర్వనాశనమైపోయారు!ఒక్క దెబ్బకి రెండు పెట్టలు, ఇక్కడి నష్టం లాభం రూపంలో Rothschildsకి వెళ్ళడమూ central bank  ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలియజెయ్యడమూ వెంటవెంటనే జరిగిపోయాయి.  FEDERAL RESERVE SYSTEM (the private central bank of the U.S.) యొక్క విధి విధానాలకి సంబంధించిన final version మొత్తం Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estateలోనే రూపు దిద్దుకుంది.

అది December of 1910, Nelson Aldrich అనే senator  గారు Paul Warburg,Frank Vanderlip, Benjamin Strong, Henry Davidson, Charles Norton, Abe Andrews  అనే ఆనాటి ప్రపంచపు మొత్తం సంపదలో నాలుగో వంతును మూటగట్టిన ఆరుగురితో కలిసి New York నగరంలోని ఒక private train car ఎక్కాడు.వాళ్ళు Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estate వెళ్ళారు.అక్కడ తొమిది రోజులు గడిపి తమను అక్కడికి పిలిపించుకున్న మేధావి సూచనల ప్రకారం,federal reserve sustemకి ముసాయిదా ప్రతిని రూపొందించారు. ముసాయిదా ప్రతిలో ఉన్న దుర్మార్గం తెలియాలంటే తర్వాత కాలంలో wanderlip తమ Jekyll Island ప్రయాణం గురించి చెప్పిన మాటల్ని వింటే చాలు - "I was aas secretive - indeed, as furtive - as any conspirator.Discovery, we knew, simply must not happen , or else all our time and effort would be wasted.If it were to be exposed that our particular group had got together and written a banking bill, that bill would have no chance whatever of passage by congress." అంటే, వాళ్ళు అంత రహస్యం పాటించటానికి కారణం అమెరికన్ ప్రజలకి వీళ్ళ అసలు సంగతి తెలిసి వ్యతిరేకించే కృతనిశ్చయంతో ఉండటమేనని తెలుస్తూనే ఉన్నది కద!అప్పటికే "Wherever a central bank went, there would be wealth inequality, wild swings between economic booms and bursts and after each burst, those in the top of cociety mysteriously came out richer,while everyone else got poorer" అనే సత్యాన్ని Bank of England చరిత్రని బట్టి తెలుసుకుని ఉన్నారు.

Nelson Aldrich నుంచి శ్రీముఖాలు అందుకుని రాక్ ఫెల్లర్ గాడి సొంత ఎస్టేట్ జెకిల్ ఐలాండుకు వెళ్ళిన ప్రముఖులు - Henry P. Davison of J.P. Morgan & Company; Frank A. Vanderlip, President of the Rockefeller-owned National City Bank; A. Piatt Andrew, Assistant Secretary of the Treasury; Benjamin Strong of Morgan's Bankers Trust Company; and Paul Warburg.దొంగలు దొంగలు చేరి వూళ్ళని పంచుకున్నట్టు "After a general discussion it was decided to draw up certain broad principles on which all could agree. Every member of the group voted for a central bank as being the ideal cornerstone for any banking system." అని తీర్మానం చేసినట్టు B.C. Forbes అనే పరిశోధక రచయిత వ్రాశాడు.Warburg ఎట్టి పరిస్థితుల్లోనూ "central bank" అనే పదం వాడకూడదని పట్టుబట్టదంతో తర్వాత పన్నెండుకు పెరిగిన నాలుగు "regional reserve"లని ప్రతిపాదించి New York bank దగ్గిర వీళ్ళు కుదురుకునేలా ప్లాన్ చేశారు.ఆఖరుకి Warburg దీనికి Federal Reserve System అని పేరు పెట్టాడు. పేరు విన్నప్పుడల్లా తల్చుకున్నప్పుడల్లా దాని అసలు స్వరూపం తెలిసినవాళ్ళకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏడవలేక నవ్వే వెర్రినవ్వు ఒకటి వస్తూ ఉంటుంది - శూన్యం ఉంచి నోట్ల కట్టల్ని సృష్టించి ప్రజలకు ఇచ్చి ప్రజల నుంచి ఉత్తుత్తి అసలుకి నిక్కచ్చి వడ్డీని తీసుకుని వాళ్ళు బలిసిపోవటమే తప్ప  అక్కడ reserve అంటూ ఒక్క చిల్లి కానీ కూడా ఉండదు,అసలు ప్రజాస్వామ్యానికీ ప్రజాసంక్షేమానికీ సంబంధమూ లేని నియమాలతో ఏర్పడిన సంస్థ Federal ఎలా అవుతుంది?

Aldrich Bill సభలోకి వచ్చినప్పుడు అప్పటికే "తగినంత స్థాయిలో అప్పు ఉండటం ఆర్ధికరంగానికి ఉత్సాహం తీసుకొస్తుంది, అసలు అప్పు లేకపోతే భద్రత ఎక్కువైపోయి ప్రజలకు బద్ధకం పెరిగిపోయి ఆర్ధికాభివృద్ధి నిలవనీరులా ఉంటుంది" అని ప్రగల్భిస్తున్న మహనీయతేజుడైన ఋణదార్శనికుడి ప్రమేయాన్ని చూసి ప్రమాదం పసికట్టిన ఇటువైపు మేధావులు బిల్లుని తిరక్కొట్టెయ్యాలని అనుకున్నారు.అటువైపు మేధావులు కూడా ప్రమాదం పసికట్టి ఇద్దరు మిలియనీర్ మిత్రుల్ని రాయబారం పంపించి Federal Reserve Act అని పేరూ రూపూ మార్చి పై స్థాయిలోని వారి వ్యతిరేకతని తగ్గించారు.దీని తర్వాత కింది స్థాయిలో ఉన్న అసంఖ్యాక ప్రజానీకాన్ని మోసం చెయ్యటానికి ఒక బహుముఖీనమైన అంతర్నాటకం నడిపించారు.దాని ప్రకారం దేశంలోని బ్యాంకర్లు అందరూ బిల్లు వల్ల తమకు ముప్పు వస్తుందన్నట్టు ఆందోళన నటించారు.పేపర్లలో బ్యాంకర్ల ఏడుపుల్ని చూసిన rural socialists లాంటి అమాయకులకి బ్యాంకులు ఇంత వ్యతిరేకతను చూపిస్తున్నాయంటే అది తమకు అనుకూలమైనదని అనుకున్నారు. సజీవ నటనని మరింత తారాస్థాయికి తీసుకెళ్తూ బ్యాంకుల తోకల్ని కత్తిరిస్తున్నట్టు కనిపించే క్లాజుల్ని బిల్లులో చేర్చారు.ఆఖరికి 1913 డిసెంబర్ 23 అమెరికన్ కాంగ్రెసు సభ్యులలో చాలామంది శెలవులో ఉన్న శుభదినాన ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ సభ ఆమోదం పొంది చట్టరూపం దాల్చేసింది!

అమెరికాతో వ్యాపార వ్యవహారాలు జరపాలని కోరుకునే వారంతా తమ లావాదేవీల కోసం సంప్రదించాల్సిన  Federal Reserve Systemని ఏర్పాటు చేసేశారు - Paul Warburg మొదటి chairman అయ్యాడు.FEDERAL RESERVE SYSTEM (the private central bank of the U.S.) యొక్క విధి విధానాలకి సంబంధించిన final version మొత్తం Bank of England  యొక్క విధి విధానాలకి ప్రతిరూపం.శ్రీమాన్ అంబేద్కర్ మన దేశపు రిజర్వ్ బ్యాంక్ రూపకల్పనలో ఇదే చట్రాన్ని అనుసరించారు. పాటిస్తున్న ఆర్ధిక చట్రం మనసా వాచా కర్మణా ప్రజల కోసం కాక బ్యాంకుల యజమానుల కోసం నడిచేటట్టు ఉంటే ఆర్ధిక విశ్లేషకులకు గానీ రాజకీయ నాయకులకు గానీ ప్రజల పట్ల ఎంత నిజాయితీ ఉన్నా ఏమి లాభం?

ఇంతకీ, Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estate ఎవరిదో కాదు, John Rockefellar అనే ఇతరుల నుంచి చిన్న స్థాయి పోటీని కూడా సహించలేని మోనాపలిస్ట్ ఎకానమీ సిద్ధాంతకర్త గారిది - "Comptetion is a sin!" అనేది ఆయనగారి సుస్థిరమైన అభిప్రాయం.

దొంగాటకం జరుగుతూ ముగుస్తున్న హడావిడిలోనే 1912 Woodrow Wilson యొక్క రాజకీయ రంగప్రవేశం జరిగింది. మొదటిసారి ఎన్నికయ్యేటప్పుడు William Howard Taft అనే Republican Party అబ్యర్ధినీ  "Bull Moose" Party తరపున పోటీ చేసిన మాజీ Republican అయిన Theodore Roosevelt అనే ఉద్దండుణ్ణీ తట్టుకోవటానికి ప్రైవేట్ ట్రస్టుల్నీ బ్యాంకుల్నీ మర్దించే  New Freedom ప్రతిపాదించి జగజెట్టిలా నిల్చినవాడు 1916 వచ్చేసరికి "He Kept Us Out of War!" అని గొప్పలు చెప్పుకుని రెండోసారి గెలిచిన కొద్ది రోజులకే ఇంగ్లాండుకీ ఫ్రాన్సుకీ మధ్యన దూరి అమెరికాని అనవసర యుద్ధంలోకి నడిపించాడు.అప్పటివరకు అతన్ని "He Kept Us Out of War!" అని ప్రశంసించిన మీడియా మొగల్సే ఇప్పుడు ప్లేటు మార్చి “inevitability of war" అనే కొత్త పాటని ఎత్తుకున్నారు.బ్రిటిష్ ఇంటిలిజెన్స్ తరపున వచ్చి అమెరికాని యుద్ధానికి ఒప్పించిన Sir William Wiseman అమెరికాలోనే ఉండిపోయి మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక Jacob Schiff-Paul Warburg అనే జంటదొంగలు నడుపుతున్న Kuhn, Loeb bank అనే సంస్థకు భాగస్వామి అయ్యాడు.

అలా ఫెడరల్ రిజర్వ బ్యాంక్ ఏర్పడీ ఏర్పడిన వెంటనే తెల్ల యేనుగులు ఆకలి గొన్న సింహాలై చెలరేగిపోయి జాతీయ ఋణాన్ని అమాంతం పెంచి ఆకాశం ఎత్తుకి చేర్చారు - ఒక్క వుడ్రో విల్సన్ పరిపాలన ముగిసేసరికి ఆమెరికన్ జాతీయ ఋణం వందకి ఎనిమిది వందలు(800%) పెరిగింది!

అనేకమంది చరిత్రకారులు అనేకరకాల విశ్లేషణలు చేసినప్పటికీ విషాప్ట్ చెప్పిన లెక్క ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధం అనేది రష్యాలో అప్పటి జార్ ప్రభువును దించేసి కమ్యునిజాన్ని గెలిపించడం కోసమే జరిగింది.అక్కద పోరాడిన రెండు బలమైన ప్రతికక్షులు Allied Forces, Central Powers. ఒకసారి 1917 సంవత్సరం నాడు రష్యాలో జరిగిన సంఘటనల్ని అతి దగ్గర నుంచి చూస్తే I know what you did last summer లాంటి సస్పెన్స్ ధ్రిల్లర్ కన్న మెలికల మలుపులు ఎక్కువ ఉంటాయి.

1917 ఫిబ్రవరి 23 మొదలు మార్చి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున యుద్ధం వల్లా తిండి కొరత వల్లా విసుగెత్తిన మహిళలు వీదుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు.క్రమేణ ఆందోళనలు సమ్మెల కింద రూపాంతరం చెందాయి.ప్రభుత్వం ఆందోళనల్ని అణిచివెయ్యాలని చూడటంతో 1300 మంది చనిపోయారు.కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు చిన్న చిన్న గొడవలు కలిసి కలిసి ముదిరి ముదిరి పెద్ద పెద్ద గొడవలై మార్చి 15 నాటికి Tsar Nicholas II పదవీత్యాగం చేసి ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.తర్వాతెప్పుడో కమ్యునిజం అంతమైపోయాక 80 యేళ్ళ క్రితం తాతల నాటి Rothschilds పగకు బలైపోయిన జార్ కుటుంబీకులని జన్యుపరీక్షలు చేసి గుర్తించి Imperial family అన్న గౌరవం కొద్దీ sainthood ఇచ్చారు. Nicholas వెళ్ళిపోయాక అతని అన్నMikhail అధికారం తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో Prince Lvov నాయకత్వంలో Provisional Government ఏర్పడింది.

Prince Lvov సంప్రదాయకమైన పరిపాలనని పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు.కానీ, అతని అసమర్ధతని అలుసు తీసుకుని లెనిన్ వర్గంతో "మెన్షివిక్కులు" అని వెక్కిరింతకి గురైన Kerensky వర్గం democratic socialist ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది.అతను కూడా జర్మనీతో కలిసిన Central Powers మీద యుద్ధాన్ని కొనసాగించటానికే నిశ్చయించుకున్నాడు.దానితో పాటు 1905 నాటి తిరుగుబాటుదార్లకి general amnesty ఇచ్చేసరికి 250,000 మంది పొలోమంటూ దిగబడిపోయి పెట్టిన చేతినే కొరికినట్టు కరెన్స్కీ ప్రభుత్వాన్ని కూల్చేశారు.

1917 ఏప్రిల్ నాటికి లెనిన్ వచ్చి పడ్డాడు.అప్పుడు లెనిన్ ఎక్కడున్నాడో తెలుసా!1905 నాటి విప్లవం ఫెయిలైన వెంటనే పశ్చిమ యూరపు ఖండాన్ని చేరుకుని ఇప్పుడు స్విట్జెర్లాండులో ఉంటున్నాడు.జార్ పదవీచ్యుతుడైన నాటికి దేశం లోపల బోల్షివిక్కుల ప్రభావం చాలా తక్కువ.కమ్యునిష్టు చరిత్రకారులు చెప్పినట్టు లెనిన్ అధికారం చేపట్టటం పీడిత తాడిత దళిత అణగారిన బడుగువర్గం సహాయం వల్ల గాక ప్రపంచ స్థాయిలో చక్రం తిప్పుతున్న అమెరికన్ పెట్టుబడిదారుల సహాయం వల్లనే జరిగింది.పెట్టుబడిదారుల్ని అంతం చేసే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న కామ్రేడ్ లెనిన్ అనే తమ ప్రబల శత్రువుని ఆ ప్రపంచ స్థాయిలో చక్రం తిప్పుతున్న అమెరికన్ పెట్టుబడిదారులు  అప్పటికే ప్రపంచ యుద్ధ సంరంభం పెళపెళలాడిస్తున్న యూరోపియన్ ఖండపు ఆ చివర ఉన్న Zurich నగరం నుంచి ఈ చివర ఉన్న Petrograd నగరానికి ఒక సీలు వేసిన రైలుపెట్టెను లెనిన్ కోసం ఏర్పాటు చేసి తరలించడమే ఒక ఆశ్చర్యం అయితే మధ్యలో ఎక్కడా ఆగనివ్వని సౌకర్యం కూడా ఏర్పాటు చేశారంటే ఇక చెప్పేది ఏముంది!ఇప్పుడు లెక్క సరిగ్గా తెలియడం లేదు గానీ ఆ రైలుపెట్టెలో $6 మిలియన్ల విలువ గల బంగారం కూడా ఉంది,అది ఎవరు ఇచ్చారు?

ఇక ట్రాట్స్కీ పెట్రోగ్రాడ్ చేరుకున్న కధ అయితే ఆశ్చర్యం కాదు, వింతల కెల్ల వింత!అప్పుడు అతను న్యూయార్కులో మరొక 175 మంది విప్లవవీరులతో కలిసి ఉన్నాడు.1917 మార్చి 27న న్యూయార్కు నుంచి బయల్దేరిన ఇతన్ని Nova Scotia ప్రాంతపు Halifax దగ్గిర కెనెడియన్లు పట్టుకుని ఖైదు చేశారు.వాళ్ళ బాధ యేంటంటే, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్టు వీళ్ళు నడుపుతున్న రష్యన్ విప్లవం సక్ససయితే జర్మన్లతో యుద్ధం ఆపేస్తామని అంటున్నారు కాబట్టి అప్పటివరకు తూర్పు వైపున యుద్ధం చేసున్న జర్మనీ ట్రూపులు పశ్చిమానికి వచ్చి కెనెడియన్ల మీద పడతారని - ట!

ఒక రష్యన్ కమ్యునిష్టు నేత కెనెడియన్ పెట్టుబడి దార్ల ఖైదులో అంతమైపోయి ఉంటాడని అనుకునే మనబోటివాళ్ళ అమాయకత్వాన్ని పరిహసిస్తూ తర్వాత కాలంలో Jacob Schiff-Paul Warburg అనే జంటదొంగలు నడుపుతున్న Kuhn, Loeb bank అనే సంస్థకు భాగస్వామి అయిన William Wiseman గారు బ్రిటను వైపునుంచీ వుడ్రో విల్సను గారి అంతరాత్మ అనే "Colonel" House గారు అమెరికా వైపునుంచీ కెనెడియన్ ప్రభుత్వానికి యుద్ధకాలపు సున్నితత్వం,విదేశాంగ విధానపు సమతౌల్యం వంటి పారిభాషిక పదాలను గుప్పించి కొడుతూ "Let Trotsky go" అని సలహాయో ఆజ్ఞయో తెలియని విజ్ఞప్తి చేశారు.

అలా అమెరికన్ పాస్ పోర్టు పొంది రష్యా వెళ్ళి లెనిన్ పక్కన చేరాడు.ఇద్దరూ కలిసి పెట్టుబడి దారులు తమకు అప్పగించిన ధనసంపత్తిని ఉపయోగించుకుని bribery, cunning, brutality, deception అన్న చతుర్విధ ఉపాయాలతో చాణక్యనీతిని జయప్రదం చేశారు.లెనిన్ మరియు ట్రాట్స్కీ నడిపిన విప్లవ కార్యక్రమం కొన్ని నగరాలకే పరిమితం అయ్యి వేల సంఖ్యలోనే ఉన్న బోల్షివిక్ పార్టీ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు తప్ప అసంఖ్యాక  ప్రజల ప్రమేయం ఉన్నట్టు లేదు.నిక్కచ్చి లెక్కల ప్రకారం లెనిన్ అధ్వర్యంలోని విప్లవం మొత్తం పెట్రోగ్రాడ్ నగరాన్ని కైవసం చేసుకోవటంతో కామ్రేడ్ లెనిన్ విజయం స్థిరపడిపోయింది

లెనిన్ కూడా ఒక దేశాన్ని శ్రామికవర్గనియంతృత్వం గొడుగు కింద నిలబెట్టడానికి కందీకృత సేతుక నిర్మితి(central banking system) ఒక్కటే 90 శాతం పని పూర్తి చేస్తుందని అన్నాడు. Illuminati, Freemason కుట్రవీరులకి ఒక దేశాన్ని ఆక్రమించాలంటే సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధం చెయ్యాలి, లేదా దేశంలో ఒక కందీకృత సేతుక నిర్మితి(central banking system) ఏర్పాటు చెయ్యాలి అనేది తెలుసు.అందుకే, Karl Marx అనుచరుల తీరుతెన్నుల్ని నఖశిఖపర్యంతం పరిశీలించిన అరాచకవాది Bakunin "వాళ్ళు ఒక కాలు సోషలిస్టు ఉద్యమంలోనూ ఒక కాలు కందీకృత సేతుక నిర్మితి(central banking system)లోనూ పెట్టారు" అని వెక్కిరించాడు.

నిజమే, Rothschilds, Rockefellers, Schiffs, Warburgs, Morgans, Harrimans, and Milners వంటి అంతర్జాతీయ సేతుక సమూహం ప్రియమారగ పుట్టించి పెంచి పెద్ద చేసిన రష్యన్ కమ్యూనిష్టు ప్రభుత్వం తమకు కావలసిన ధనసంపత్తిని సమకూర్చిన వారి ప్రయోజనాలను గాక తమకు వీసమెత్తు ధనం కూడా ఇవ్వని ప్రాణాలకు తెగించి తమ వెంట తిరిగని తమతోపాటు ప్రవాసానికి రాని పీడిత, తాడిత, దళిత వర్గాలకి సహాయం చెయ్యటం అనేది కాల్పనిక సాహిత్యంలో జరగవచ్చునేమో గానీ వాస్తవ ప్రపంచంలో జరగటం సాధ్యమా?

Stanford University యొక్క అనుబంధ సంస్థ అయిన Hoover Institution తరపున  Antony Sutton అనే పరిశోధకుడు 1918 నుంచి జరిగిన Soviet Economic Development యొక్క చరిత్రని official State Department documents ప్రకారం నమోదు చేసిన వివరాల్ని బట్టి చూస్తే లెనిన్ మొదలు గోర్బచేవ్ వరకు నడిచిన రష్యన్ అభివృద్ధి సమస్తానికీ అమేరికన్ బ్యాంకర్ల పెట్టుబడియే మూలం అని తేల్తుంది - practical joke లాంటి ఒక వాస్తవం ఏమిటంటే "U.S.S.R was made in U.S.A":-)

మనలో కొందరికి అదనపు సౌకర్యం అనిపిస్తుంది గానీ రష్యన్ విప్లవం పెట్టుబడిదార్లకి రష్యన్ భూభాగపు సంపదని దోచుకోవటానికి ఉపయోగపడుతూనే తమ kingfinnancing వ్యాపారం లాభసాటి అయ్యేందుకు ఇతర దేశాల్ని తమ వద్ద అప్పులు చేసేటందుకు ఒప్పించటానికి కమ్యూనిజాన్ని శత్రువు కింద వాడుకోవటానికి పనికొచ్చిందని అనిపిస్తుంది నాకు.ఇదే కాదు చైనాలో జరిగిన కమ్యునిష్టు విప్లవం కూడా లండను నుంచే చైనాని చేరుకుంది.కార్ల్ మార్క్స్ దొసో కొపిత్యలో గ్రంధాన్ని వండి వారుస్తున్నప్పుడే వాళ్ళ పోషణ మరియు పర్యవేక్షణ కిందనే పనిచేస్తున్న నీషే కనిపెట్టిన మరొక సిద్ధాంతం నాజీజం పేరున రూపం మార్చుకుని హిట్లర్ అనే నియంతని పుట్టించింది.సంప్రదాయక చరిత్రకారులు నెపోలియన్, హిట్లర్, లెనిన్, మావో వంటి కిరాతకులు తమ తమ దేశాలలో ఆనాడు ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ప్రభవించిన ధీమంతుల కింద కీర్తిస్తుంటారు గానీ మన దేశంతో సహా 17 శతాబ్ది తరవాత జరిగిన ప్రతి చారిత్రక మలుపు వెనక ఆడం వీషాప్ట్ వేసిన "మూడు ప్రపంచ యుద్ధాలు, మూడు మహావిప్లవాలు, 2020 నాటికి ప్రపంచ దేశాల ఆర్ధిక  దిగ్బంధనం - 2050 నాటికి నూతన ప్రపంచ రాజ్యం!" అనే ప్రణాళిక యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి.

1789 నాడు ఫ్రెంచి విప్లవం,1911 నాటి చైనా విప్లవం, 1917 నాటి రష్యన్ విప్లవం అనే విషాప్ట్ గారి మూడు విప్లవాల లెక్కని పూర్తి చేశారు.1914 July 28 మొదలు   1918 November 11 వరకు మొదటి ప్రపంచ యుద్ధం,1939 September 1 మొదలు 1945 September 2 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగాయి.రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన రెండేళ్ళకి భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తున్నట్టు పైకి చూపిస్తూ అమెరికన్ Fedarael reserve bank వంటి Reseve Bank of India అనే వ్యక్తిగత వ్యాపార సంస్థ(Private Banking Company) పెత్తనం కిందకి శాశ్వత బానిసత్వంలోకి నడిపించారు.

ఆంగ్లేయులకి ఆప్తమిత్రుడైన చిత్పవన్ బ్రాహ్మణుడు గోపాల కృష్ణ గోఖలే కన్న కొంతలో కొంత జాతీయత ఉన్న కాంగ్రెసులోని అతివాదులు మరియు చాపేకర్ సోదరుల వంటి ఉద్రేకపరులైన వారు కొడుతున్న దెబ్బలకి దడుచుకుని 1910 జనవరి 25 Viceroy Minto గారు “with the gloom several assassinations hanging over everyone, a spirit hitherto unknown to India has come into existence, a spirit of anarchy and lawlessness which seeks to subvert not only British rule but the Governments of Indian chiefs…” అని తన యజమానులకు మొర్రలు పెట్టుకుంటున్న సమయంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తనను గనక భారత జాతీయ రాజకీయాలో దించితే సత్యాగ్రహం అన్న విచిత్రమైన పద్ధతిలో ఉద్యమం నడిపి వారికి కిచిత్తు నష్టం కూడా జరగనివ్వని Loyal SLAVE వలె అఘోరిస్తానని  Viceroy Minto,  Lord Ampthill గార్లకు ఉత్తరాల మీద ఉత్తరాలను సంధించిన తర్వాత వాళ్ళు కూడా “….A Satyagrahi should expect to get killed by an aggressor and not to kill him…”. అనీ “…if blood be shed , let it be our own , let us cultivate calm courage to die without killing..” అనీ ప్రామిస్సులు చేసి మెప్పించిన బానిసకుక్కను 1947 వరకు వాడేసుకున్న వాళ్ళు 1948 జనవరి 30 Nathuram Godse అనే చిత్పవన్ బ్రాహ్మణుడైన హిందూ జాతీయవాదితో చంపించేశారు.

గాంధీ హత్య కేసులో కనబడుతున్న ఒక విచిత్రమైన విషయమే అది ఫ్రీమ్యాసన్ల పని అని అనుమానించడానికి ఆస్కారం ఇస్తున్నది నాకు.గాడ్సేకి తుపాకీ ఎవరిచ్చారు అనేది చాలా ముఖ్యమైన విషయం అయినప్పటికీ అప్పటి పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు.అప్పటికే వ్యవస్థీకృతమై ఇప్పటికీ కొనసాగుతున్న నేరనిర్ధారణాశాస్త్రం(forensic science) చనిపోయిన వ్యక్తి యొక్క శవం, హత్యకు వాడిన ఆయుధం గురించి చాలా ఎక్కువ శ్రధ్ధ చూపిస్తుంది.తెలంగాణలో జరిగిన దిశ హత్యకేసులో హంతకుల్ని పద్ధతి తప్పి ఎన్కవుంటర్ చెయ్యడానికి కారణం హంతకులు దిశ శవాన్ని మాయం చెయ్యడం వల్ల కేసు కోర్టుకు వచ్చినప్పుడు నిలవదు గనకనే!చాలా కాలం క్రితం ఒక కాంగ్రెసు నాయకుడు భార్యను యాసిడ్ డ్రమ్ములో ముంచి చంపేశాడని నమోదయిన కేసులోనూ శవం కనబడకపోవటం అతను నిర్దోషి కింద తీర్పు రావటానికి ఒక కారణం. అలాంటిది ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చాడని గాడ్సే చెప్పిన పిట్టకధతో సరిపెట్టెయ్యడం ఎంత విచిత్రం?గాడ్సేకి తుపాకీ రావడానికి సహాయం చేసిన ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఉన్న అప్పటి హిందూత్వవాదులు  ఇంగ్లీషువాళ్ళకి మిత్రులు కావడం వల్లనే గాడ్సే అన్న చిన్న పావుని బలిపెట్టి వెనక ఉన్న పెద్ద పావుల్ని ముట్టుకోలేదని అనుకుంటున్నాను నేను.సావర్కార్ హిందూత్వకు ఇచ్చిన నిర్వచనాన్నీ చేసిన సూత్రీకరణలనూ చూస్తే వీషాప్ట్ ధియరీని మార్క్సు రష్యన్ల కోసమూ నీషే జర్మన్ల కోసమూ రూపం మారిస్తే సావర్కార్ అదే ధియరీని భారతీయుల కోసం రూపం మార్చినట్టు ఉన్నాడు - సావర్కార్ హిందూత్వ ప్రణాళికలో హిందువులకి ఒక లేబుల్ కొట్టి ఒక గొడుగు కిందకి తెచ్చి పొలిటిసైజ్ చెయ్యటం తప్ప "ప్రియం బ్రూయాత్ సత్యం బ్రూయాత్, బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః" అనే వైదిక ధర్మం యొక్క ప్రతిధ్వనులు వినబడలేదు నాకు.

సావర్కార్, గోల్వాల్కర్ వంటి హిందూత్వ వాదులు కూడా kingfinance కోసం వీలైనన్ని ఎక్కువ సమూహాలు ఉండాల్సిన అవసరం కోసం లూసిఫర్ మతస్థులు పెట్టుబడి పెట్టి పోషించితే పాప్యులారిటీ తెచ్చుకున్నవాళ్ళే.వాళ్ళు అతి తెలివికి పోయి గాంధీ నేతృత్వంలోని కాంగ్రెసు ముస్లిములని బుజ్జగిస్తుంటే గాంధీని వ్యతిరేకించి హిందువులని తమ పక్కకి లాక్కోవాలనే వ్యూహంతో రెచ్చిపోతుంటే లూసిఫర్ మతస్థులైన ఫ్రీమ్యాసన్లు గాంధీని హిందూత్వ వాదులతో చంపించితే స్వతంత్రం వచ్చాక ఫేక్ హిందూత్వం క్రమేణ పెరిగి పెరిగి ప్రజల్లో నిజమైన జాతీయవాదం ప్రబలనివ్వని గొప్ప ఎత్తు వేశారు.లూసిఫర్ మతస్థుల లెక్కలు రేసుల్లో పాల్గొనగలిగినంతవరకు తెగ మేపిన గుర్రాన్ని రేసుల నుంచి తప్పుకున్న మరుక్షణం కాల్చి చంపి బరువు దించుకునే రేసుగుర్రాల యజమానుల కన్న నిక్కచ్చి అయినవి.స్వతంత్రం తీసు రావడం వరకే గాంధీ అవసరం, భారత దేశపు ప్రధాని పదవి ఫ్రీమ్యాసన్ అయిన మోతీలాల్ కొడుకు నెహ్రూ పేరున ఎప్పుడో దఖలు పర్చేశారు.అన్నట్టు జవహర్ లాల్ కూడా ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఉన్నవాడే!తొలి ప్రధానియే కాదు, తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఉన్నవాడే.

బ్రిటిష్ సామ్రాజ్య వాదులు వలసల్ని అంత సుదీర్ఘ కాలం పాటు నిలబెట్టుకోవటానికి వాళ్ళు తీర్చి దిద్దుకున్న సంస్థయే Freemason సంస్థ. ఈ సంస్థ యొక్క అధికారిక కార్యాలయాన్ని Grand Lodge అంటారు.Irish Grand Lodge మొదట Freemasonry వ్యవస్థని రూపొందించితే తక్కిన వలసలు అందుకున్నాయి.ఇప్పుడు Detective CodyBank, Avengers వంటి కామిక్స్ మీద ఆధారపడి తీస్తున్న హాలీవుడ్ సినిమాల్లో family అనే పదం తరచు వినబడుతుంటే చూసి నేను విచ్చలవిడితనానికి అలవాటు పడ్డవాళ్ళకి కౌటుంబిక బంధాల గురించి చెప్తున్నారని అనుకున్నాను.కానీ, ఫ్రీమ్యాసన్రీ గురించి తెలుసుకుంటున్నప్పుడు అర్ధం అయ్యింది - ఒక గ్రాండ్ లాడ్జి నుంచి సభ్యులు విడిపోయి వేరే లాడ్జిలు పెడితే మొదటిదాన్ని పేరెంట్ లాడ్జి అనీ విడిపోయి ఏర్పాటయిన వాటిని సిబ్లింగ్ లాడ్జిలు అనీ ఇలాంటి లాడ్జిలను కలిపి ఫ్యామిలీలు అనీ అంటార్ట!

అన్ని వలస దేశాలలో తిరిగి పన్లు చక్కబెట్టే ఫ్రీమ్యాసన్లకి కలివిడి తిరుగుడు హక్కులు దఖలు పరుస్తూ ఆనాడు జారీ చేసిన సర్టిఫికెట్లే తర్వాత కాలంలో పాస్ పోర్టులు అయ్యాయి.తొలినాళ్ళలో ఫ్రీమ్యాసన్ లాడ్జీలు సైనిక అవసరాల కోసం సైనికాధికారులతో మాత్రమే నిండి వుండేవి.క్రమేణ ఇతర రంగాలలోని బ్రిటిష్ సామ్రాజ్యానికి  అత్యంత విశిష్టమైన సేవలను అందించేవారికి కూడా ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఇవ్వడం మొదలుపెట్టారు.బ్రిటిష్ సామ్రాజ్యానికి అపరిమితమైన సేవలు అందించేవారికి మత్రమే ఇచ్చే ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఉన్న గోపాల కృష్ణ గోఖలే, రాజేంద్ర ప్రసాద్, మోతీలాల్, జవహర్లాల్, అంబేద్కర్ వంటివాళ్ళు భారత రత్నాలూ దేశభక్తులైన స్వాతంత్య వీరులా - హవ్వ!మనం సిపాయి తిరుగుబాటు అని గర్వించి చెప్పుకునేది కూడా లండను నుంచి ల్లార్డ్ పాల్మెర్స్టన్ మంద ప్లాను వేసి నడిపించినది అయినప్పుడు ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం మటుకు మరోలా ఎలా జరుగుతుంది? అలా ఇంగ్లీషువాళ్ళ సౌకర్యం కోసం ఇంగ్లీషువాళ్ళ బానిసలు తెచ్చిన మేడిపండు స్వతంత్రం వల్ల దక్కిన అధికారం అనుభవిస్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధికి వూడిగం చేస్తున్న ప్రభుత్వాధినేతలు ఇంగ్లీషువాళ్ళకి కాక భారతీయులకి తమ సేవల్ని ఎలా అందిస్తారు?

ప్రస్తుతం 2020 నాడు కరోనా లాక్ డౌన్ పేరున మనమీద రుద్దిన ఆర్ధిక దిగ్బంధనాన్ని అంతర్జాతీయ సేతుక సమూహం యొక్క ప్రతినిధి అయిన నరేంద్ర మోదీ గారు నిన్నటికి నిన్న వేసిన బడ్జెట్ చూస్తే 2050 నాటికి లూసిఫర్ మతస్థులు వారి అభ్యున్నతి కోసం సాధించాలనుకుంటున్న నూతన ప్రపంచ ప్రభుత్వానికి భారతీయుల్ని అలవాటు పడేలా చెయ్యటం కోసం తమ మేధస్సుని ఉపయోగిస్తున్న కీలకమైన దశ నడుస్తున్నదని అనిపిస్తున్నది నాకు.

లూసిఫర్ మతస్థుల వ్యూహం ప్రకారం ఆంధ్ర ప్రాంతపు లోక్ సభ సభ్యుల్ని బయటికి గెంటి తలుపులు మూసి జరిపించిన రాక్షసమైన విభజనలో తను సైతం పాలు పంచుకుని కూడా వేశ్యలకు మాత్రమే సహజమైన అమాయకత్వాన్ని అరువు తెచ్చుకుని 2014 ఎన్నికల సమయాన తల్లిని చంపి పిల్లని పుట్టించారని తెగ బాధ పడిపోయి అదే తల్లి గృహప్రవేశానికి పిలిస్తే వెకిలితనాన్ని కూడా పెద్దమనుషుల తరహాలో చూపించగలిగిన నటనా చాతుర్యం ఒలకబోస్తూ కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చి ఇచ్చి తీరాల్సిన ప్రత్యేకహోదాని మాత్రం అసలు సిసలైన నీచత్వాన్ని మొహమాటం లేకుండా చూపిస్తూ ఇవ్వనని భీష్మించుకుని ఆంధ్ర ప్రజానీకం ఛీ కొడుతున్నారని తెలిసీ 2019 ఎన్నికల సమయాన ప్రత్యేక హోదా అడగటం తప్ప తనకి ఎటువంటి ఇబ్బందులూ కలిగించని మిత్రపక్షం మీద పైకి చెప్పలేని రహస్యవేదనతో రగిలిపోతూ ద్వేషించి తెలిసి తెలిసీ  అనుభవ రాహిత్యం నుంచి అధికార దర్పం వరకు సమస్తమైన రోగిష్టి గుణాలూ కలబోసుకున్న ఒక ఫ్యాక్షనిష్టుని ఆంధ్ర మీద రుద్ది అమరావతీ విధ్వంసం మొదలు విశాఖ ఉక్కు తరలింపు వరకు గల సమస్తమైన కొంచెపు వంచన పనులలో జీవీయల్ లాంటివాళ్ళు బాహాటంగానూ సోమూ వీర్రాజు లాంటివాళ్ళు రహస్యంగానూ తోడుదొంగల పని చెయ్యటం చూసిన తర్వాత కూడా కొందరు ఆంధ్ర హిందువులు భాజపాకు వోట్లెయ్యడానికి సిద్ధపడుతున్నారంటే ఆశ్చర్యం కాదు, భయం కాదు, జాలి వేస్తున్నది నాకు.

2018 ఆగస్టు నెలలో ప్రపంచంలోని అన్ని స్వతంత్ర సార్వభౌమాధికారం గల అన్ని దేశాలూ GESERA అనే ఒక రహస్య ఒప్పందం మీద సంతకం చేశాయి.ఇది లూసిఫర్ మతస్థులకి నూతన ఏకీకృత ప్రపంచ ఆర్ధిక వ్యావ్స్థని ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది.పైకి మాత్రం 2015 నాటి Paris Agreement on Climate Change మీద సంతకాలు చేసినట్టు మీడియా ముందు నమ్మబలికారు గానీ వాళ్ళ నినాదమైన one world, one citizenship, one currency, one staate, one religion అనేదానికి తలూపటమే అక్కడ సంతకాలు చేసిన 209 మంది దేశాధినేతలూ చేసినది.నరేంద్ర మోదీ లూసిఫర్ మతస్థులకు అనుంగు మిత్రుడు అనటానికి మొస్సాద్ అనే భయంకరమైన రహస్య సంస్థను అధికారికమైన సైన్యం స్థాయిలో నడుప్తున్న ఇజ్రాయేలును సందర్శించిన ఇటీవలి కాలపు తొలి భారత ప్రధాని కావటమూ అమెరికన్ ప్రెసిడెన్షియల్ అబ్యర్ధికి ఎన్నికల ప్రచారం చేసిన ఇటీవలి కాలపు తొలి భారత ప్రధాని కావటమూ తిరుగు లేని సాక్ష్యాలు.ఇప్పుడు తెలుసుకుంటే హిందువులు మూడు చేపల కధలోని దూరదృష్టి గల మొదటి చేపలా సుఖపడతారు.

పాకిస్తానునీ చైనానీ ఆటాడిస్తున్న మా మోదీగారు లూసిఫర్ మతస్థుల్ని గెలిచేస్తారు, కుదరకపోతే మహా మేధావి అమితు షా గారు తమ చానక్యం ఉపయోగించి సంధి చేసుకుంటారు అనుకుంటే గనక అంతకన్న తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.తను రెండోసారి ఎన్నికల్లో గెలవడానికి నలభై మంది భారత సైనికుల్ని బలిపెట్టి పాకిస్తాన్ అధ్యక్షుడితో లాలూచీ పడి సరిహద్దు దాటిన చీప్ ట్రిక్కులు ఇండియాలోని పిచ్చ జనాన్ని మోసం చెయ్యడానికే పనికొస్తాయి గానీ లూసిఫర్ మతస్థుల ముందు పనిచెయ్యవు.వాళ్ళ 13 కుటుంబాలకి సంబంధించిన రక్తసంకరం ఉన్నవాళ్ళకి తప్ప భూమిమీద ఏ ప్రాంతంలోనూ అధికారం దక్కనివ్వరు కష్తార్జితం కాని దోపిడీ సొత్తుని కూడా తమ కుటుంబాలను దాటి పోనివ్వకూడదని చెల్లెలి వరస ఆడవాళ్ళనే కాదు కూత్రురు వరసైన అన్న కూతుర్నీ పెళ్ళిచేసునే వాళ్ళు - తస్మాత్ జాగ్రత్త!

ఇప్పటికీ RSS, BJP హిందువుల్ని నమ్మకమైన వోటుబ్యాంకు కింద చూస్తూ సావర్కార్ దృక్కోణంలోనే ఉండిపోయాయి.అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నరేంద్ర మోదీ గానీ అమితుషా గానీ ఎన్ని క్షణాల పాటు "ప్రియం బ్రూయాత్ సత్యం బ్రూయాత్, బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః" అనే వైదిక సంస్కృతిని పాటించారు?కాంగ్రెసు మరియు కమ్యునిష్టేతర రాజకీయ పక్షాలు భారత దేశపు ప్రజానీకానికి మేలు చేకూర్చేందుకు చేసిన ప్రతి ఆర్ధిక సంస్కరణనీ దోపిడీ పేరున తూర్పారబట్టిన నోబెల్ బహుమతి గ్రహీత  అమర్త్య సేన్ భార్య పేరు Emma Rothschild, అంటే భారతదేశం లోపల లూసిఫర్ మతస్థులు ఎంత లోతున పాతుకుపోయారో అర్ధం చేసుకోండి!

జాతీయ స్థాయిలోని భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్నటి ఆంధ్రుల హక్కైన ప్రత్యేక హోదాని సర్వాబద్ధపు సాకులతో తిరస్కరించడమే గాక మొన్నటి ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని అంబానీకి ధార పొయ్యడానికి బరితెగించిన తర్వాత సైతం ఆంధ్ర రాష్ట్రపు ప్రాంతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు అనూహ్యమైన రీతిలో వచ్చిపడే అధికారం ఆశిస్తున్నారంటే భారత దేశపు అంతర్గత రాజకీయాలలో సైతం అంతర్జాతీయ సేతుక సమూహం ఎంతమంది Nelson Aldrich లాంటి తార్పుడుగాళ్ళని దించిందో అర్ధం చేసుకోండి!

దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలు యాదృఛ్చికమైనవీ కావు, భారత దేశ ప్రజలకు గర్వకారణమైనవీ కావు.అనాది కాలం నుంచి చరిత్ర ఏనాడూ అనుకోని మలుపును తీసుకోలేదు.ఒకనాడు ప్రపంచానికి నాగరికత నేర్పామని గర్విస్తున్న ప్రతి హిందువూ నరేంద్ర మోదీ హిందువులలోని అవినీతికీ నీచత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్న గోముఖవ్యాఘ్రం అని తెలుసుకుని నిజమైన హిందూత్వ పరిరక్షకుల్ని వెతికి పట్టుకుని అధికారం కట్టబెట్టకపోతే 2026 నాటికి మూడవ ప్రపంచ యుద్ధాన్ని చూశాక గోచరిస్తుంది వ్యాసపరాసరాది చతుర్యుగ పర్యంతం ఉన్న ఆచార్య పరంపర యొక్క ఆశీస్సులతో మూడు కాలలనూ ముడివేసి చూడగలిగిన హరిబాబు అనే నేను చెప్పిన కఠిన సత్యం. అప్పుడు తెలుసుకుంటే హిందువులు మూడు చేపల కధలోని సమాయస్పూర్తి గల రెండవ చేపలా ఆపదను దాటుతారు.

ఇప్పటి కరోనా లాక్ డౌన్ వల్ల ఏర్పడిన ఆర్ధిక దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి భారతదేశంతో సహా అన్ని దేశాల అధిపతులూ మరింత అప్పు కోసం అంతర్జాతీయ ఋణనిధి సంస్థలని దేబిరిస్తుంటే దాదాపు రెండు సంవత్సరాలు నిష్క్రియాపరత్వాన్ని అప్పనం పప్పనం అనుభవించిన ప్రజలూ సంస్థలూ తేరుకుని బలవంతపు సోమరితనాన్ని వదుల్చుకుని చురుకు తెచ్చుకుని ఉత్పత్తులు మొదలుపెట్టి వేగం పుంజుకునే లోపున మూడవ ప్రపంచ యుద్ధం రానే వస్తుంది, అది వాళ్ళ ఇచ్చానుసారం మొదలై వాళ్ళ లక్ష్యానుసారం కొనసాగి వాళ్ళ నిర్ణయానుసారం ఆగిపోయేసరికి మొత్తం భూమిమీద కనీసపు కామన్ సెన్సు ఉన్నవాడు ఒక్కడు కూడా మిగలడు - అప్పుడు తెలుసుకున్న హిందువులు మూడు చేపల కధలోని బుద్ధీ జ్ఞానం లేని మూడవ చేపలా అఘోరిస్తారు. 

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...