Friday 19 April 2019

అప్పుని ఎవరు తీర్చగలరు?అప్పుని ఎలా తీర్చగలరు?అప్పుని తీర్చడానికి డబ్బుని ఎలా వాడుకోవాలి - అప్పునుంచి విడుదల ఎప్పుడు!

     అసలు స్వతంత్రం తెచ్చుకునేటప్పుడే "మీరు చేసిన అప్పులతో మాకు సంబంధం లేదు,మాకు ఋణం లేని దేశం కావాలి" అని మెలిక పెట్టడం కుదిరే పని కాదు, ఎందుకంటే ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం అని స్కూలు పుస్తకాల్లో చదువుతున్న వ్యవహారం మొత్తం ఇంగ్లీషువాళ్ళని "బాబ్బాబూ!మా దేశం మాకిచ్చి పోరాదూ - మీకు పుణ్యముంటుంది,మా పిల్లలకి మీ గురించి మంచిగా చెప్పుకుంటాం!" అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని బతిమిలాడ్డం తప్ప కనీస స్థాయి బెదిరింపులు కూడా చెయ్యని పద్ధతిలో నడిచింది!

           అసలు "అహింసాయుత పోరాటం" అనే పదం ప్రపంచంలో ఏ భాషలోని ఏ వ్యాకరణ నియమాలకీ పొసగని దుష్టసమాసం - "అహింస" అంటే ఇతర్లని హింసించకుండా నిగ్రహించుకోవటం, "పోరాటం" అంటే శత్రువుని హింసించి లొంగదీసుకోవటం. మరి  ఆ రెంటికీ లింకు ఎట్లా కలిపాడో ఈ విచిత్ర వ్యక్తి! నమ్మినవాళ్ళు ఎట్లా నమ్మారో!కలిపినవాడు పిచ్చివాడు అందామా అనుకుంటే నమ్మినవాళ్ళని ఏం అనాలి?ఒక రోజు కాదు,ఒక వారం కాదు, ఒక నెల కాదు, కొన్ని దశాబ్దాల పాటు ఆ దుష్టసమాసాన్ని శిష్టజనసమ్మతం చేసేశారే అంత మంది మేధ్ధావులూ పండిత్తులూ చరిత్రక్కారులూ కలిసి!

            ఇంగ్లీషువాళ్ళకి నెప్పి పుట్టకుండా వాళ్ళ ఒంట్లోనుంచి ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా స్వాతంత్య్రం తీసుకు రావాలన్న తన దిక్కుమాలిన సిద్ధాంతం కోసం లాఠీ దెబ్బలకి తలలు పగలగొట్టుకునీ ముస్లిముల చేతులో చచ్చిపోయీ మానభంగాలకి గురయ్యీ తన పరువు నిలబెట్టిన హిందువుల రక్తం రక్తమే కాదన్నట్టు ప్రవర్తించి మత పిశాచుల చేతుల్లో దెబ్బలు తిని మూల్గుతున్న హిందువులకే మతతత్వాన్ని అంటగట్టటానికి మూలకారకుడైన కపటిని ఏనాడో చెత్తబుట్టలోకి విసిరేయాల్సింది పోయి "కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటైతేనేమి" అని కీర్తిస్తూ గొఱ్ఱెల వలె అతని వెంట నడిచి స్వాతంత్య్రం వచ్చాక  జాతిపిత హోదా ఇచ్చి జయంతులు వర్ధంతులు జరుపుకుంటూ  కూడళ్ళలోనూ బ్రాందీ షాపుల కెదురుగానూ విగ్రహాలు పెట్టుకుంటూ  ఒక శతాబ్దమే గడిచిపోయింది! ఇంకా "అహింసాయుత పోరాటం!" అనే పదం ప్రజల్ని ఉర్రూత లూగిస్తున్నది - ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం, ఎంత దారుణం!

         మోహన దాసు గాంధీకి సంబంధించిన ఒక వింత నన్నెప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది - అంత తీవ్రస్థాయిలో ఏ ముస్లిముల్ని ఆకట్టుకోవటానికి హిందువుల్ని బలిపశువుల్లా వాడుకున్నాడో ఆ ముస్లిముల నుంచి కనీసపు ప్రశంసల్ని కూడా పొందలేకపోయాడు, పాపం!

          గాంధీ ఆలోచనలు ఎంత వింతగా ఉంటాయో గాంధీని మూలస్తంభం చేసుకున్న కాంగ్రెసువాదుల ఆలోచనలూ వాదనలూ అంత వింతగానే ఉంటాయి - వాళ్ళ అదృష్టం బాగుండి వినేవాళ్ళు ఏదో గందరగోళంతో కూడిన పరధ్యానంలో ఉంటే అద్భుతం అని అనిపిస్తాయి గానీ పూర్తి స్పృహలో ఉంటే మాత్రం మొహం మీదనే ఫకాల్న నవ్వాలనిపిస్తుంది!

          పెళ్ళాన్ని చంపి యాసిడ్ పీపాలో కరిగించేశాడనే కేసులో ఇరుక్కుని కొంతకాలం పరేషానీ అయిన ఒక కాంగ్రెసువాది ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీషువాళ్ళు మన దగ్గిర నుంచి దోచుకున్న సొత్తుకి లెక్కలు చెప్పి అదంతా కక్కమని అడిగితే ఎలా వుంటుందని జోకులేస్తూ చప్పట్లు కొట్టించుకుంటున్నాడు - ఇవ్వాళ్టి లెక్కలతో చూసినా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆదాయం మొత్తం తూచినా అప్పు పూర్తిగా తీరక మనకి వాళ్ళు వెట్టి చాకిరీ చెయ్యాల్సి వస్తుంది కాబట్టి ఇంగ్లీషువాళ్ళు అలాంటి పిచ్చిపని చెయ్యరని అతడికి తెలుసా తెలియదా?

          ఇంగ్లీషువాళ్ళ జేబు సంస్థ అయిన అంతర్జాతీయద్రవ్యనిధి మనకి ఇచ్చే అప్పు తిరిగి రాబట్టుకోవాలనే ఆశతో ఇస్తున్నది కాదు, తీర్చలేని అప్పులో ఇరికించి మనచేత వెట్టి చాకిరీ చేయించుకోవటానికి పనికొచ్చే బెల్లం ముక్క!మన దేశపు రిజర్వ్ బ్యాంక్ ముద్రించినవి అనుకుని మనం ఆత్మీయత ఒలకబోస్తున్న రూపాయి నోట్లకి సంబంధించిన మూలద్రవ్యం మన దేశానికి అవతల రహస్య మాళిగలో ఉంది.మనం చిన్నప్పుడు ఆటల్లో పేకముక్కలకీ ఖాళీ సిగిరెట్టు ప్యాకెట్ల కవర్లకీ 5, 10 రూపాయల హోదాల్ని ఇచ్చేవాళ్ళం - గుర్తుందా?మనకి మనం పెట్టుకున్న రూల్సు వల్ల ఆటలో ఉన్నంతసేపు ఆ విలువ ఉంటుంది గానీ ఆట ముగిశాక వాటి విలువ ఎంత?మనం అమ్మడానికీ కొనడానికీ ఉపయోగించుకుంటున్న ఈ ధనస్వరూపం కూడా అంతకు మించింది కాదు.

          ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది, బ్రిటిష్ ప్రభుత్వానికి బాహ్య ఆదాయం,రహస్య ఆదాయం అని రెండు రకాల ఆదాయాలు ఉన్నాయి.రహస్య భాగం నుంచి భారత్దేశానికి తను తగిలించిన అప్పుని చెల్లగొట్టెయ్యాలన్న నిజాయితీ బ్రిటిష్ వాళ్ళకి ఉంటే భారతదేశం అప్పు నుంచి బయటపడటానికి ఒకే ఒక సంతకం చాలు - కానీ, ఆ ఒక్క సంతకం రాబట్టుకోవటానికి జియోనిస్టు యూదులకున్న వ్యూహరచనానైపుణ్యం ఉండాలి! మన దేశంలోని ఏ రాజకీయ నాయకుడిలో అంతటి ధీశక్తి ఉంది?

          ఏ రాజుకీ ఏ దేశానికీ ఏ సైన్యానికీ యుద్ధంలో గెలవటానికి దేశభక్తీ రాజభక్తీ పుష్కలంగా ఉంటే చాలదు, రాజులో గానీ మంత్రిలో గానీ సేనాధిపతిలో గానీ వ్యూహనిర్మాణచాతుర్యం ఉంటే ఒక్క సైనికుణ్ణి కూడా బలిపెట్టకుండా గెలుపుని కైవసం చేసుకోవచ్చు, ఓటమిని కూడా గెలుపు కింద మార్చుకోవచ్చును.అర్ధశాస్త్రం పుట్టిన గడ్డలోని పుట్టంధులకి పట్టుబడని కౌటిల్యుడి రాజనీతిని పాటించడం వల్లనే ఇంగ్లీషువాళ్ళు we are illuminated అని చెప్పుకుంటూ అన్ని వలస రాజ్యాలతో కూడిన అంత పెద్ద సామ్రాజ్యాన్ని అంత సుదీర్ఘకాలం పాటు తమ పట్టు నుంచి జారిపోకుండా ఉంచుకోగలిగారు.సాగినంత కాలం నా అంతవాడు లేడన్నట్టు నడిచి కాలం ఎదురు తన్ని రాజకీయాధికారం చేజారిపోయే ప్రమాదం  కనబడగానే బుద్ధికి పదును పెట్టి ఆర్ధికపరమైన ఎత్తుగడతో వలస రాజ్యాల్ని బానిస దేశాల కింద మార్చుకోగలిగారు!

      ప్రస్తుతం ప్రపంచం మొత్తం లూసిఫర్ సృష్టికర్త అని భావించే ఇల్యూమినాట్టి మతాధిపతులూ గాలిలోనుంచి డబ్బుని సృష్టించే లండన్ బ్యాంకర్లూ థ్రీ పీస్ సూట్లలో తిరుగుతున్న మధ్యయుగాల నాటి రాజవంశీకుల వంటి పార్లమెంటేరియన్లూ కలిసిన ఒక సాలీడు అధీనంలో ఉంది.దాని కేంద్రం మనకు కనిపించే లండన్ నగరంలో ఉన్న కనిపించని లండన్ నగరంలో ఉంది. "The City of London, London's financial district is a peculier place.It has been called a city within a city, a state within a state.It is run by an organisation called the City of London Corporation, a private company that performs all the functions of a local council with a private police force and private courts.THe City of London is a seperate entity to the wider London, and it has its own head, the Lord Mayor, who is distinct from the mayor who runs the rest of London. The City of London has long had the curious legal status of complete autonomy inside the city of london,because back in 1066 when william the conqueror came over, the City was one of the only portions of England that he failed to conquer.And he struck a deal with the City in 1067 that allowed them to continue functioning.To this day the City of London is exempt from numerous laws that govern the rest of Britain.Its political system derives from the Middle ages.The City's electorate is dominated not by its residents, but by the private businesses operating within the City,its Lord Mayor is selected by the heads of medieval guilds.They have a representative in te House of commons,caled the Remembrancer, apart from the clerks of the court of the House of Commons he is the only unelected person there.All other lobbyists have to stop in the lobby.The City of London has a permenant representative in the House of Commons, whose role is to report back to the City of London Corporation and to lobby parliament on behalf of the City." - దీని పనితీరు తెలుసుకుంటే జగన్ లాంటివాళ్ళ "అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ డబ్బుని సంపాదించగలిగిన సమర్ధత!" ఏమిటో తెలుస్తుంది.మిగిలిన భాగాల్ని అర్ధం కాలేదని వదిలేసినా పర్లేదు గానీ ఈ భాగాన్ని మాత్రం విశేష శ్రద్ధతో చదివి తీరాలి!

           రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం క్రమేణ ప్రాభవం కోల్పోయి తిరుగుబాట్ల గ్రహణాలు పట్టుకుని అమావాస్య నీడలలోకి జారుతున్నవేళలో బ్రిటిష్ వలస రాజ్యాలలోని ఒక్కొక్క ప్రముఖ నగరమూ తన సంపదనీ  సౌకర్యాల్నీ అధికారాన్నీ మసక చీకట్లలోకి నెట్టేస్తూ ఉండటం చూసి తట్టుకోలేక నేలలో ఇంకిపోయిన నేతిని పిండిన కర్ణుని వలె చేజారిన ప్రపంచాధిపత్యాన్ని తిరిగి దక్కించుకోవదానికి కొత్త దారుల కోసం వెతుకుతుంటే కనబడిన ఆశాకిరణమే credit based economy అనే మాయాజాలం!

          బ్యాంకింగ్ సిస్టం కొత్తది కాదు, rothschilds కుటుంబం అప్పటికే  అష్టపదిలా విస్తరించుకుని ఉంది - అన్ని ప్రముఖ వ్యాపార కూడళ్ళలోనూ local apex bank వాళ్ళదే.ఇప్పుడు చేర్చిన కొత్త ఆకర్షణ ఏమిటంటే, తమ మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ మనోభావాల్ని గౌరవించి స్వతంత్రం  ఇచ్చేస్తున్నట్టు మొహం పెట్టి అప్పటికి తమ నిర్వాకం వల్ల దఖలు పడిన అప్పుల్ని నియంత్రించుకోవడానికి ఒక సెంట్రల్ బ్యాంకును ప్రతిపాదించి వాళ్ళ బడ్జెట్ లోటును  తీర్చటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ద్వారా అప్పులిస్తూ వాళ్ళని పాక్షిక స్వాతంత్య్రం గల వలస రాజ్యం స్థాయినుంచి సంపూర్ణ పారతంత్య్రం గల బానిస దేశం స్థాయికి దిగజార్చెయ్యటం - అదీ ఆయా దేశాల స్వాతంత్య్ర వీరుల ఆమోదంతోనే!

          దీనితో వలను అల్లడం పూర్తయ్యింది.ఇది వాళ్ళకి కొత్తపని కాదు,మూడవ శతాబ్దం నుంచీ వాళ్ళు చేస్తున్న పనినే మరికొంత సృజనాత్మకతను జోడించేశారు, అంతే!ఇది పని చేసే విధానం ఎట్లా ఉంటుందో తెలియాలంటే ఒక ఉదాహరణ చెప్పాలి.1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు అప్పటి వరకు బ్రిటిష్ అధీనంలో ఉన్న Suez Canalను తను స్వాధీనం చేసుకుని జాతీయం చేస్తున్నట్టు ప్రకటించాడు - ఈ జిప్టు ప్రజలు కూడా హర్షధ్వానాలతో తమ ఆమోదం ప్రకటించారు.కానీ బ్రిటిష్ ఫ్రెంచ్ ప్రభుత్వాలు కోపగించుకుని శరవేగాన ప్రతిస్పందించి 12 గంటల్లోపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ultimatum ఇచ్చి అవధి దాటిన మరుక్షణమే యుద్ధ విమానాల్ని ఈజిప్టు మీదకి పంపించి కైరోతో సహా అన్ని ప్రముఖ నగరాలనీ బాంబుదాడులతో అతలాకుతలం చెయ్యటం మొదలుపెట్టేశాయి.అయితే అమెరికా గారు మాత్రం "There will be no United States involvement in these present hostilities.It is our hope and intent that this matter wil be brought before the United Nations General Assembly. There, the openion of the world can be brought to bear in our quest for a just end to this tormenting problem." అని ప్రకటించి ఈ యుద్ధానికి దూరం జరిగారు.

          దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడి ఇది అమెరికా వారి శాంతి ప్రియత్వానికి గుర్తులా కాక తమ పౌండును దెబ్బ తియ్యటానికి చేసిన కుట్రలా భావించింది.అది సహజమే!ఈ మహా సాలీడు గారు అల్లిన వల ప్రభావమే అది - మోదీ, కేసీయార్, చంద్రబాబుల మాదిరి వలలోని ప్రతి nodal point దగిర ఉన్న ప్రతి జీవీ తన రేంజిలో తను చిన్న సాలీడులా ప్రవర్తిస్తుంది!బ్రిటన్ వూహించినట్టుగానే అంతర్గత పెట్టుబడులు తగ్గిపోయాయి, సీమాంతర వ్యాపారం మందగించింది, స్టెర్లింగ్/పౌండ్ విలువ దిగజారటం నిశ్చయమై పోయింది.దీన్ని సరిచేసుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ బ్యాంకర్లు సరిహద్దుల కవతల ఉన్నవారికి అప్పులు ఇవ్వడం మీద మారటోరియం విధించింది.వీసమెత్తు నష్టాన్ని కూడా భరించలేని లండన్ బ్యాంకర్లు Bank of England ముందు ఒక ప్రతిపాదన పెట్టి వారు కూడా బ్యాంకర్లే కావటంతో సానుకూల స్పందనని రాబట్టుకున్నారు.నిజానికి, చిన్న బ్యాంకుల ప్రతిపాదన మరియు పెద్ద బ్యాంకు ప్రతిస్పందన అనేవి ఆర్ధికానికి సంబంధించినవి కాబట్టి ఒప్పందం రూపంలో రికార్డు చెయ్యాలి - కానీ ఇక్కడ అది జరగలేదు, దాని అర్ధం ఏమిటో తెలుసా!"if banks intermediated between two non-residents, in a foreign currency, in that case the dollar - This particular intermediation, this particular deal would not be considered by the Bank of England as under its own jurisdiction." అనే ఈ అలిఖితమైన తిలకాష్ఠమహిషబంధనమే జగన్ ఒక్కడే కాక ప్రపంచంలోని అనేకమంది మహా సాలీడు గారి అభిమానులకి "అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ డబ్బు సంపాదించగల సమర్ధత"ని కట్టబెడుతున్నది.

          డాలర్లతో సంబంధం పెట్టుకోవడం కోసం Eurodollar market అనేదాన్ని సృష్టించి దీన్ని domestic banking activities నుంచి పక్కకి పెట్టడం కోసం రెండు ఎక్కవుంట్లు నడపటం మొదలుపెట్టారు లండన్ బ్యాంకర్లు.స్విస్ బ్యాంకుల్లో ఎక్కవుంట్ వివరాలు మాత్రమే రహస్యం అయితే ఇక్కడ మొత్తం అంతా రహస్యమే! లోపల ఏం జరుగుతుందో బయటివాళ్ళకి తెలియదు గానీ బ్యాంకింగ్ వర్గాల్లో ప్రతి ఒక్కరికీ ఏ మారుమూల ఎవరు ఏ fraud చేసినా తెలిసిపోతూనే ఉంటుంది - అయితే ఫ్రాడ్ చేస్తున్న వ్యక్తుల సమూహం తమ పనిని పూర్తి చేసుకునే దాక ఆగి అప్పుడు (ఓటర్ల తొలగింపు తప్పును సరిదిద్దుకుంటామని ప్రామిస్ చేసి ఎన్నికలయ్యాక సారీ కుదర్లేదని చెప్పి సరిపెట్టేసిన  తె'లంగా'ణ ఎలక్షన్ కమిషన్ లాగ) తమ నిస్సహాయతను వెలిబుచ్చి సరిపెడతారు!లండన్ బ్యాంకర్ల సృజనాత్మకమైన ఏర్పాటులోని వెసులుబాటు ఏమిటంటే, ఒక వ్యక్తి శూన్యం నుంచి లక్షల కోట్ల మిలియన్ల ఆస్తిని కేవలం కొద్ది నెలల్లోనే, అన్నీ కలిసొస్తే కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవచ్చును.

          ఒక వ్యక్తి మొదట ఏ విధమయిన లొసుగులూ లేని ఒక చట్టబద్ధమైన వ్యాపార సంస్థని స్థాపిస్తాడు. ఆ ఒక్కటీ అలా ఉండటం చాలా అవసరం కాబట్టి ఆ కొంత ఖర్చూ ఆ కొంత నీతీ తప్పదు!తర్వాత కొన్ని నేం ప్లేట్ తప్ప ఇంకేమీ లేని బుల్లి బుల్లి కంపెనీల్ని అతనే మారుపేర్లతో సృష్టిస్తాడు.వీటి స్థాపిత ఆస్తుల్ని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటాడు.ఈ సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న ఋణం ప్రధానసంస్థకు బదలాయించితే అది ఆ ప్రధానసంస్థ యొక్క మూలధనమూ ఆదాయమూ అవుతుంది - ప్రధాన సంస్థలో పోగయిన డబ్బుని ఆర్ధికచట్రంలోని ప్రధానస్రవంతిలోకి పంపించి సకల సౌఖ్యాలూ అనుభవించ వచ్చును!ఇక్కడే రెండు తమాషాలు జరుగుతాయి. ఈ గొడుగు కంపెనీలకి ఉన్న మూలధనం యొక్క భౌతిక అస్థిత్వాన్ని నిర్ధారించుకోవటం, వాటి ఆస్తుల విలువల్ని మదింపు చెయ్యటం ఒక పెద్ద తమాషా - తమ బ్యాంకును ఎలా మోసం చెయ్యాలో కూడా ఆ బ్యాంకు యజమానులూ ఉద్యోగులే చెబుతారు!వీళ్ళకి అప్పు ఇవ్వడానికి బ్యాంకులకి ఇదివర్లో నోట్లు ముద్రించాల్సి వచ్చేది, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాక ఆ కాస్త ఖర్చూ శ్రమా తప్పింది.బ్యాంకుకి సంబంధించిన డాటాబేస్ సర్వరుకి అనుసంధానించబడిన బ్యాంకు ఉద్యోగి ఆ సంస్థ పేరున ఒక అక్కవుంట్ క్రియేట్ చేసి ఆ సంస్థకి తను ఇవ్వదల్చుకున్న అప్పు అంకెల్లో ఇన్‌పుట్ ఇచ్చి సబ్మిట్ బటన్ నొక్కితే చాలు!

          అవతలి వైపున ఋణం తీసుకున్న గొడుగు సంస్థ నుంచి ప్రధానసంస్థకి నిధుల మార్పిడి జరిగాక గొడుగు సంస్థల్ని ఎత్తేసినా ఏమీ కాదు.వాటికిఅప్పు ఇచ్చిన బ్యాంకులు కూడా ఆ అంకెని గాలిలో నుంచి సృష్టించి ఇవ్వడమే తప్ప మూలధనం రాశిని కదిలించి ఇవ్వలేదు గాబట్టి వాటికి కూడా ఒక్క రూపాయి నష్టం ఉండదు.ఇవన్నీ ఇలాగే జరుగుతాయా అనేది కూడా అసలు అక్కడ "input capital assets->constructive manpower manipulation->product generation proceess->marketing activty->taxable income" అనే డబ్బుని సృష్టించే మామూలు ప్రక్రియలు లేకపోవటం వల్ల చేస్తున్న వూహలే తప్ప లోపల మనం వూహించలేనంత స్థాయిలో మాయాజాలం నడుస్తుందని ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.ఈ వ్యవహారం నడిపించాలనుకున్న వ్యక్తి మొదట మహా సాలీడు గారి భక్తుడై ఉంటాడు, అంటే సిగ్గూ లజ్జా మానమూ మర్యాదా రోషమూ మానవత్వమూ లేనివాడై ఉంటాడు కాబట్టి  జగన్ కూడా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ పోయినట్టే లండన్ పోయి నిష్పూచీగా బతికెయ్యగలడు!ఎటొచ్చీ, వాళ్ళు గాలిలోనుంచి సృష్టించిన అప్పుని బహిరంగ మార్కెట్టు దగ్గిర శక్తిని ద్రవ్యం కింద రూపాంతరం చెందించినట్టు డబ్బు కింద మార్చి వదలడం వల్ల దాని స్పర్శకి గురయిన సమస్త జనులకీ వాళ్ళ పాపంలో భాగం ఉంటుంది. ధర్మబద్ధమైన సంపాదనతో సంతృప్తిగా జీవించాలనుకునేవాళ్ళకి మాత్రం నిత్యం నరాలు తెగిపోయేలా ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా దరిద్రం, అసంతృప్తి, నైరాశ్యం,అనారోగ్యం తప్ప సుఖం అనేది అనుభవంలోకి రాదు, అంతే!

          "The main secret of this modus operandi is providing a legal space in which you pretend activity is taking place.And the importance of that is:you pretend it is not taking place in the economy where it really is taking place.So, you are taking activity from the place where it is regulated and taxed, and pretending that it is happening elsewhere.Now, where doesn't really matter, it is just elsewhere." అనేది కేవలం ఏ ఒక్క చోటనో కాదు Bank of Englandకి అనుసంధానించబడిన బ్యాంకులు ఉన్న అన్ని చోట్లా జరిగే సామాన్యమైన వ్యవహారమే - మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఆ తానులో ముక్కే కదా, కాబట్టి బ్యాంకో రక్షతి రక్షితః

          అన్ని వ్యవస్థల మాదిరే బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రజాశ్రేయస్సుకి పనికివచ్చే లక్షణం ఉంది, కానీ మహా సాలీడు గారు తమ సృజనాత్మకతని ఉపయోగించి అలా చెయ్యనివ్వటం లేదు.పైన చెప్పిన వ్యవహారం మొత్తం మొదట్లో ఆర్ధిక శాస్త్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ఊపయోగించాలనే తపన ఉన్న ఆర్ధిక శాస్త్రవేత్తలకి తెలియలేదు - రహస్యంగా జరిగిన వ్యవహారం కదా!వాళ్ళకి తెలిసేసరికి వల నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు వారికి కూడా మొత్తం వలని చేదించటం అసాధ్యమైపోయింది.అయితే హానిని తగ్గించటానికి ప్రజలకీ ప్రభుత్వాలకీ కొన్ని సూచనలు ఇస్తున్నారు.అవేమిటో వచ్చే భాగంలో చెప్తాను.


(this is the fifth part of a series on macro economy!)

Saturday 6 April 2019

అప్పుని ఎవరు తీరుస్తున్నారు?అప్పుని ఎలా తీరుస్తున్నారు?అప్పుని తీర్చడానికి డబ్బుని ఎలా ఉపయోగించుకుంటున్నారు?అప్పుని లేకుండా చెయ్యలేరా!

     2019లో భారతదేశపు మొత్తం ఆదాయం కేవలం 167 లక్షల కోట్లు,కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెల్లించాల్సిన సాలుసరి వడ్డీ ₹4,551,323,407,985 - మొత్తం అప్పు ఎప్పటికి తీరుతుంది?ఇంగ్లీషువాళ్ళు రాకముందు హిందూ ముస్లిం ప్రభువులు ఎవ్వరూ తమ రాజ్యాలని పోషించటానికి బయటివాళ్ళ దగిర అప్పు చెయ్యలేదు - అప్పుడూ ఒక స్థాయిలో వేరే రూపంలో బ్యాంకింగ్ సిస్టం ఉండేది, కానీ రాజులు  తమ సొంత ఆస్తుల్ని తనఖా పెట్టి గానీ మరుసటి ఏడాది రాబడి నుంచి తీర్చే ఒప్పందంతో గానీ రాజ్యం లోపలి ధనవంతుల నుంచే అప్పులు చేసేవాళ్ళు, అప్పు చేసేది నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనుల కోసం కాబట్టి ఆదాయం రాగానే తీర్చేసేవాళ్ళు!

          కానీ ఇంగ్లీషువాళ్ళు మాత్రం ఈ దేశప్రజల పట్ల ఎలాంటి బాధ్యతా లేని పక్కా వ్యాపారస్తులు కాబట్టి ఎప్పటి కప్పుడు వాళ్ళ పాత అప్పుల్ని కొత్తగా స్వాధీనం చేసుకున్న రాజ్యపు ఖజానా నుంచి కిట్టించేసుకునేవాళ్ళు.సాక్ష్యం ఏమిటంటే 1765లో East India Company బెంగాలుని పట్టుకునేసరికే వాళ్ళు ఫ్రెంచివాళ్ళతో చేసిన యుద్ధాల వల్ల అప్పుల్లో ఉంది.ఆ అప్పుల్ని బెంగాలు ఆదాయం నుంచి నొల్లుకుని చెల్లు చేసుకోవటంతో మొదలుపెట్టి అప్పటినుంచి మన దేశంలోనూ మన దేశానికి బయటా వాళ్లు చేసిన ప్రతి యుద్ధానికీ ఖర్చయిన ప్రతి రూపాయీ మన ప్రజల కష్టార్జితమే - ఆఖరికి ప్రధమ స్వాతంత్య్ర పోరాటం అని ఆప్యాయంగా పిలుచుకునే సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి వాళ్ళు చేసిన ఖర్చు కూడా మన కష్టార్జితమే!

          భారతదేశం బ్రిటిష్ రాణికి పూర్తి స్థాయి వలస రాజ్యం కాబొయే ముందరి 1834లో East India Company యొక్క అప్పు సుమారు Rs. 36.9 కోట్లు. British Parliament  కూడా వాళ్ళ చుట్టమే కాబట్టి ఈ అప్పుని భారతీయుల ఖాతాలోకి వేసేసింది - లేకపోతే కంపెనీ తన  పెత్తనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యదు మరి!

        1834 నాటి Charter Act వల్ల భారతదేశంలో ఏర్పడిన Government మక్కీకి మక్కీ లండనులోని British Government యొక్క ప్రతిరూపమే - It was the Indian Goverment formed by the British, of the British, and for the British!

    1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి అయిన ఖర్చును కూడా కలిపితే 1860 నాటికి భారతదేశం యొక్క అప్పు Rs. 693 కోట్లకి పెరిగింది.యుద్ధాల ఖర్చుకి తోడు మన దేశంలో జరిగిన ఉత్తుత్తి అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన Home Charges కూడా మననుంచి అప్పు తీసుకుని ఖర్చు పెట్టిన ఉదారులు వాళ్ళు!

      అలా 1913 నాటికి భారతీయుల అప్పు Rs. 411 కోట్లకి చేరింది.1914లో వచ్చిన మొదటి ప్రపంచయుద్ధం నాడు భారత ఉపఖండపు ప్రజలు  బ్రిటిష్ ప్రభుత్వానికి Rs. 150 కోట్ల యుద్ధనిధిని కానుక ఇచ్చారు - మన మహాత్ముడి సెంటిమెంటుతో కూడిన ప్రసంగాలకి కరిగిపోయి సామాన్య స్త్రీలు తమ ఒంటిమీద బంగారాన్ని కూడా ఒలిచి ఇచ్చారు!ఇంగ్లీషువాళ్ళకి మనం ఇచ్చిన కానుక వల్ల ఆ తర్వాత ఆరు సంవత్సరాల పాటు వందేసి కోట్ల లోటు బడ్జెట్ కష్టాల్ని అనుభవించిన ఉదారులం మనం!

          మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాల్లో జరిగిన ప్రముఖమైన సంఘటన పాలస్తీనా ఏర్పాటు వెనక ఉన్న మెలిక ఏమిటో తెలుసా!ఆ యుద్ధం తొలి దశలో ఇంగ్లీషువాళ్ళకీ జర్మన్లకీ మధ్య దీర్ఘకాలిక కలహంలా ఉండేది.జర్మన్ల దగ్గిర U-boat అనే శక్తివంతమైన జలాంతర్గామి ఉండటంతో దాదాపు అన్ని దాడుల్లోనూ వాళ్ళదే పైచేయి అవుతూ ఉండేది.కానీ పూర్తి గెలుపు కూడా సాధ్యపడేది కాదు.ఎందుకో,  జర్మన్లకే విసుగు పుట్టి యుద్ధం మొదలు కాక ముందరి స్థితికి ఇద్దరూ వెళ్ళి కుదురుకునే అద్భుతమైన శాంతి ప్రతిపాదన చేశారు!బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పేసుకుందామనుకునే సమయానికి జియోనిస్టు యూదులు రంగప్రవేశం చేశారు - "అబ్బెబ్బే!మీరు లొంగిపోవటం ఏంటి?పరువు తక్కువ!అమెరికా గనక మీ తరపున సాయం వస్తే మీరే గెలుస్తారు - అమెరికాని యుద్ధంలోకి లాక్కొచ్చే పూచీ మాది" అని వూదర గొట్టారు.అయితే, యుద్ధంలో గెలిచాక తమకు పాలస్తీనా పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చెయ్యాలని మెలిక పెట్టారు.

         అటువైపు అమెరికా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా!వీళ్ళ మధ్య జగడం మొదలైన మొదటి రోజుల్లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధంలో కలగజేసుకోనని ప్రకటన చేసి ఉన్నాడు.ఈ పీటముడిని విప్పటానికి అప్పటినుంచే జర్మనీకి జాత్యహంకారపు ముద్ర వెయ్యటం మొదలైంది - మీడియా వాళ్ళ అధీనంలోనే ఉంది కదా!అలా దుర్మార్గమైన జర్మనీని అణిచివేసే మహదాశయంతో అమెరికాని  బ్రిటిష్ ప్రభుత్వం వైపున పోరాడటానికి రంగం సిద్ధం చేసిన జియోనిస్టు  యూదులు మన మహాత్ముడిలా అంతటి సత్యసంధులు మాట తప్పరని యుద్ధం అయిపోయే వరకు తెల్లమొహం వేసుకుని కూర్చోలేదు - యుద్ధం నడుస్తూ ఉండగానే ఒప్పందపత్రాలు రాసుకుని యుద్ధం పూర్తి కాగానే సర్వస్వతంత్ర యూదు రాజ్యాన్ని సాధించుకున్నారు.ఇక్కడ మన దేశంలో మాత్రం యుద్దనిధినీ సైనికుల్నీ అందించి సాయం చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధం కాగానే మనకి స్వతంత్రం ఇచ్చేస్తుందని నమ్మబలికిన మోహన దాసు గాంధీ యుద్ధం పూర్తయ్యాక తను తెల్లమొహం వేసి మనని వుసూరు మనిపించాడు.ఇంకా విచిత్రం ఏమిటంటే, కొన్నేళ్ళ తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధం నాడు కూడా మోహన దాసు అధ్వర్యంలో ఇదే నాటకం నడిచింది.

         మన దేశభక్తులుంగార్లు వాళ్ళ పాటికి వాళ్ళు బ్రిటిషుమిత్రుడు గారి అధ్వర్యంలో కాలక్షేపం బఠానీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, భారతీయుల అప్పు బ్రిటిష్ వాళ్ళ పాపంలా పెరిగి పోతూనే ఉన్నది - డిల్లీ నగర నిర్మాణానికి అయిన Rs 13 కోట్ల పైచిలుకు ఖర్చును కూడా కలుపుకుని బ్రిటిష్ ఇండియా అప్పు 1924 నాటికి Rs. 918 కోట్లకి ఉబ్బిపోయింది.

       మొదటి ప్రపంచయుద్ధం మనకి చేసిన మహోపకారం రోడ్లు వేసీ రైళ్ళని తిప్పీ ఇంగ్లీషు నేర్పీ ఇంగ్లీషువాళ్ళు మనల్ని బాగు చేశారని రుజువు చెయ్యటానికి వాళ్ళూ వాళ్ళ తైనాతీలూ  మన మార్కెట్ చాలా చిన్నది గనక దాన్ని వాళ్ళు విస్తరించకపోతే కూపస్థ మండూకాల మాదిరి ఉండిపోయేవాళ్ళమని చెప్తున్న అబద్ధాల్ని పటాపంచలు చెయ్యటమే - 1917లో Rs. 53 కోట్లూ 1918లో Rs. 57 కోట్లూ చాలా ఈజీగా నొక్కేశారు!1922 నుంచి అయిదేళ్ళ పాటు రైల్వేస్ మీద Rs. 150 కోట్లు ఖర్చు పెట్టినందుకు గాను Rs. 300 కోట్ల అప్పు పెరిగింది - బాగు చెయ్యటం అంటే అప్పులు పెంచటమా!

        మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు రెండో ప్రపంచ యుద్ధపు ఖర్చు కూడా మన నెత్తినే పడింది"The Government was able to raise huge loans as can be seen from the fact that the interest-bearing obligations of the Government rose from Rs. 1204 crores in 1939-40 to Rs. 2308 crores in 1945-46." అని ఒక ఆర్ధిక విశ్లేషకుడు అంటున్నాడంటే ఇంగ్లీషువాళ్ళు అంత పిండేసిన తర్వాత కూడా ఈ భూమిలో పోషణనీ సంపదనీ ఇవ్వగల తత్వమూ ఈ దేశప్రజలలో కష్టించే తత్వమూ సంపదని సృష్టించగల సామర్ధ్యమూ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోండి!

         అన్ని ప్రతికూలతల మధ్యన ఆస్థాయిలో వార్షిక ఆదాయాన్నీ ఆ స్థాయిలో వృద్ధి రేటునీ ఆ స్థాయిలో మార్కెట్ విస్తృతినీ చూపించిన దేశం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు!మోహన దాసు నుంచి మదన మోహను వరకు అంతా శ్రీవైష్ణవులే అయితే మరి బుట్టెడు చేపలూ ఏమైనాయి అన్నట్టు 1925ల నాడు కూడా ఇంగ్లీషువాళ్ళ ప్రభుత్వం మన అదృష్టం కొద్దీ వచ్చిందని పులకించి పోతూ జరిపిన ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం ఫలించిన 1947 మార్చి నాటికి మన అప్పు Rs. 2331.98 కోట్ల దగ్గిర నిలబడింది!

         ఇప్పుడు మనం ఆర్ధిక విషయాలని మర్చిపోయి కొంచెం వెనక్కి వెళ్ళి  1922 నాటి ఖిలాఫత్ ఉద్యమ కాలంలో ఆగుదాం. ఖిలాఫత్-చౌరీచౌరా-మోప్లా అనే త్రిత్వం గురించి first hand information తెలుసుకుంటే మన దేశం తీర్చలేనంత అప్పుతో స్వతంత్రం తెచ్చుకోవడానికీ స్వదేశీ శ్రేయోరాజ్యం ఏర్పడిన తర్వాత కూడా ఎడతెగని కుల కక్షలకీ మతహింసకీ ఆలవాలమై ఇప్పటికీ సమస్యలతోనే కొట్టుమిట్టాడుతూ ఉండటానికి ముఖ్యమైన కారణం ఇంగ్లీషువాళ్ళ విభజించి పాలించే కూటనీతి కన్న హిందువుల అమాయకత్వమూ పయోముఖ విషకుంభం లాంటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీని నెత్తిన పెట్టుకుని అతను ఆడించినట్టు ఆడటమే అని బోధపడుతుంది - మన మీద మనకే రోత పుడుతుంది!

         కేవలం గాంధీకి ముస్లిం నాయకుల్ని బుట్టలో వేసుకోగలనన్న పిచ్చి నమ్మకం తప్పిస్తే ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెసు యొక్క సత్యాగ్రహ ఉద్యమంతో కలపటం ఆయన ప్రియశిష్యుడైన  నెహ్రూతో సహా ఎవరికీ ఇష్టం లేదు.చౌరీ చౌరా సంఘటన ఫిబ్రవరి 5, 1922 నాడు జరిగింది.అక్కడ ఉన్నది ఖిలాఫత్ ఉద్యమకారులు. ఒక రోజు ముందర  సత్యాగ్రహులూ ఖిలాఫత్ ఉద్యమకారులూ కలిసి 2500 మంది ఒక కల్లు కొట్టు దగ్గిర పికెటింగ్ చేస్తుంటే పోలీసులు కొందరు నాయకుల్ని అరెస్టు చేశారు, ఉద్యమకారులు తమ నాయకుల్ని విడిపించుకోవటం కోసం పోలీసు స్టేషను దగ్గిర గుమిగూడి నినాదాలతో ఆందోళన చెయ్యటం మొదలుపెట్టారు.వాళ్ళని చెదరగొట్టటానికి పోలీసులు కాల్పులు జరిపితే ముగ్గురు అక్కడికక్కడే చచ్చిపోయారు, చాలామంది గాయపడ్డారు.దీనితో ఉద్యమకారులకి మరినత్ కోపమొచ్చి కాల్పులను కూడా లెక్కచెయ్యకుండా ముందుకి దూకుతూ ఉండటంతో ఇప్పుడు పోలీసులు వాళ్ళ మొండిధైర్యానికి భయపడి స్టేషను లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని కూర్చున్నారు.ఇంక ఉద్యమకారులకి పిచ్చెత్తిపోయి పోలీసు స్టేషనుకి నిప్పంటించారు - మొత్తం 23 మంది పోలీసులు మలమల మాడిపోయారు, వాళ్ళు కూడా భారతీయులే!

       ఈ వార్త తెలియగానే మహాత్మ గాంధీ గారు విలవిలలాడిపోయారు.తనే వాళ్ళని చంపేసినంత దుఃఖంతో రగిలిపోయి ముందు అలవాటు చొప్పున 5 రోజుల నిరశనవ్రతం పాటించేశారు. తర్వాత తీరిగ్గా విచారించి విచారించి క్షోభపడి క్షోభపడి పశ్చాత్తాపం చెంది తను సత్యాగ్రహుల్ని సరైన రీతిలో నడిపించలేకపోయాననీ భారతీయులు బ్రిటిషువాళ్ళమీద అహింసాయుతపోరాటం చెయ్యటానికి పూర్తి స్థాయి చైతన్యం సంతరించుకోలేదనీ భావించి ఫిబ్రవరి 12న అన్ని సహాయ నిరాకరణ మరియు శాసనోల్లంఘన కార్యక్రమాల్నీ ఆపెయ్యమని ఆదేశించారు.అయినప్పటికీ బ్రిటిష్  ప్రభుత్వం గాంధీకి ఆరు సంవత్సరాల కారాగార వాసపు శిక్ష విధించింది.అయితే అనారోగ్య కారణాల వల్ల 1924లోనే విడిచిపెట్టింది లెండి - లేదంటే, అప్పుడు అతను బయటికి వచ్చి వాళ్ళకి చేసిపెట్టలసిన ఘనకార్యం ఏదో తగలడి ఉంటుంది!

          మహానుభావుడు, జైలుకి వెళ్ళే ముందు ఖిలాఫత్ అనే ఒక వెరిమొర్రి ఉద్యమాన్ని ఎందుకు సమర్ధించాడో దానివల్ల రాబోయే కాలంలో సాధించగలననుకున్న హిందూ ముస్లిం ఐక్యత గురించి ఎన్ని కలలు కన్నాడో ఉద్యమాన్ని ఆపెయ్యటం వల్ల తను జైలునుంచి బైటికి వచ్చేసరికి చరిత్ర దానికి వ్యతిరేక దిశలోకి  తిరిగి వెనక్కి మళ్ళించటానికి వీలు లేనంత దూరం వెళ్ళిపోయింది - హిందూ ముస్లిం ఐక్యత భగ్నమైపోయింది!ఉద్యమం ఆపెయ్యటం అందరికన్న ఎక్కువ ముస్లిముల్ని దెబ్బ తీసింది.ఎందుకంటే, చౌరీచౌరా సంఘటనలో పాల్గొన్నది వాళ్ళే గనక వాళ్ళని తప్పు పట్టినట్టు భావించారు..గాంధీకి అత్యంత సన్నిహితుడైన రాజాజీ కూడా డైరీలో "...Despite my close relationship with my mentor Gandhi, I fail to understand the reason why he called off the movement." అని రాసుకున్నాడంటే అప్పటి సంక్షోభాన్ని అర్ధం చేసుకోవచ్చు.

         తమ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాడన్న ఒకే ఒక స్వార్ధపూరితమైన ఆకాంక్ష తప్పిస్తే గాంధీ పట్ల గానీ కాంగ్రెసు పట్ల గానీ హిందువుల పట్ల గానీ ఏమాత్రం ఆపేక్ష లేని ముస్లిం నాయకులు ఖిలాఫత్ ఉద్యమం తమకు తెచ్చిపెట్టిన కొత్త పాప్యులారిటీతో కేరళలోని మోప్లాలో చేసిన భీబత్సానికి అప్పటికే లోలోపల ముస్లిములంటే భయంతో ఉన్న హిందువులు పాకిస్తాన్ ఏర్పాటుని స్వాగతించే మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు.

         For six months from August 1921, the rebellion extended over 2,000 square miles (5,200 km2) – some 40% of the South Malabar region of the Madras Presidency. An estimated 10,000 people lost their lives, although official figures put the numbers at 2337 rebels killed, 1652 injured and 45,404 imprisoned. Unofficial estimates put the number imprisoned at almost 50,000 of whom 20,000 were deported, mainly to the penal colony in the Andaman Islands, while around 10,000 went missing. The most prominent leaders of the rebellion were Variankunnath Kunjahammad Haji, Sithi Koya Thangal and Ali Musliyar. Estimates of the number of forced religious conversions range from 180 to 2500; 678 of the 50,000 rebels were charged with this crime.

        Citing narratives available to him regarding the actions of the Mappilas during the rebellion, C. Sankaran Nair  wrote:"The horrid tragedy continued for months. Thousands of Mahomedans killed, and wounded by troops, thousands of Hindus butchered, women subjected to shameful indignities, thousands forcibly converted, persons flayed alive, entire families burnt alive, women it is said hundreds throwing themselves into wells to avoid dishonour, violence and terrorism threatening death standing in the way of reversion to their own religion. This is what Malabar in particular owes to the Khilafat agitation, to Gandhi and his Hindu friends."

          ఆనాడే కొంతమంది గాంధీ అసలు రూపాన్ని గుర్తించినప్పటికీ దానిని సామాన్య ప్రజలకి తెలియనివ్వకుండా దాచేశారు.దానితో పాటు దాచేసిన విషయాలు చాలా ఉన్నాయి.వాటిలో ఒకటి ముస్లిములు పాకిస్తాను కోసం ఔరంగజేబు చచ్చిపోయి మొఘల్ సామ్రాజ్యం  బలహీనపడిన తర్వాత మరాఠాలు మొఘల్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చెయ్యటం మొదలు పెట్టి అప్పటి మొఘల్ పాదుషాని దాదాపు తమ సామంతుడి స్థాయికి దిగజార్చి ఎర్రకోట మీద రెండు జండాలు ఎగరేసినప్పటినుంచీ "ఔరంగజేబు తరహా ముస్లిం సామ్రాజ్యం" కోసం తపించిపోతున్నారనేది కూడా చాలామందికి తెలియనివ్వలేదు.


   ఇంగ్లీషువాళ్ళు కూదా చాలా ముందుగానే ముస్లిములకి పాకిస్తాను ఇవ్వటానికి వొప్పుకున్నారనేది కూడా మనకి తెలియనివ్వకుండా దాచేశారు.ఖిలాఫత్ ఉద్యమం నాటినుంచి దేశ విభజన వరకు జరిగిన ప్రతి చరిత్రాత్మకమైన సన్నివేశమూ పధకం ప్రకారం గాంధీ సహకారంతో పాకిస్తాన్ ఏర్పాటుకి సామాన్య ప్రజల్ని సంసిద్ధులను చెయ్యటం కోసమే నడిచింది!సైకో ఎనలిస్టులు ఎవరైనా గాంధీ మనస్తత్వాన్ని విశ్లేషించారో లేదో తెలియదు గానీ నాకున్న కొద్దిపాటి  పాండిత్యానికే అతను ఇతరుల్ని హింసించి ఆనందించే శాడిస్టు మనస్తత్వం గల సైకోలా కనిపిస్తున్నాడు! గాంధీని చరిత్ర చెత్తబుట్టలోకి విసిరెయ్యందే మనం ముందుకు వెళ్ళలేం అనిపిస్తుంది నాకు!ఇది నేను వ్యక్తిగత రాగద్వేషాలతో చెప్తున్న మాట కాదు.అసలు నాకు అతని మీద వ్యక్తిగత కోపం దేనికి?నేను పుట్టేటప్పటికే తను చచ్చిపోయాడు - నా ఆస్తిని దోచుకునే చాన్సు గానీ నా పెళ్ళానికి లైనేసే చాన్సు గానీ తనకి లేదు గదా!

         మీరు నిదానంగా ఆలోచించండి, కేవలం నలుగురు సభ్యులున్న కుటుంభానికి యజమాని బాధ్యత లేకుండా ప్రవర్తించి కుటుంబాన్ని అప్పులపాలు చేస్తే ఎంత పీకి పాకం పెడతారు?అలాంటిది, సామాన్య ప్రజల బాగు కోసమే స్వదేశీ పాలన తెస్తున్నామని చెప్పి ఎవరి కొంపలో వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నవాళ్ళని వీధుల్లోకి లాక్కొచ్చి రాట్నం వడికించీ బట్టల్ని తగలబెట్టించీ లాఠీదెబ్బలకి గురిచేసీ జైళ్ళకి పంపించీ ముస్లిములు మమ్మల్ని పాడు చేశారు ఏం చెయ్యమంటావని అడిగితే నాలుకలు కోసుకుని చావండని చెప్పినా కిక్కురుమనకుండా తన వెంట నడిచిన లక్షల కోట్ల అమాయక జనాలకి దేశబిభజన సమయంలో ఇంగ్లీషువాళ్ళు మిగిల్చిన అప్పులో పాకిస్తాను వాటాకి కేవలం 300 కోట్లు మాత్రం వేసి అది కూడా సాలుసరి వాయిదాల్లో 50 యేళ్ళు డేకించవచ్చునని వెసులుబాటు ఇచ్చి ఇక మిగిలిన మొత్తం అప్పుని అంటగట్టిన తల మాసిన వెధవ ఏ రకం తండ్రి?

       హిందువుల్ని భయంకరమైన దుర్మార్గుల కింద చిత్రించి వీళ్ళ కింద మేం బతకలేమని చెప్పినవాళ్ళు, రక్తపిశాచుల మాదిరి వాళ్ళు చేసిన భీబత్సాలని కూడా హిందువుల అణచివేత మీద చేసిన తిరుగుబాటు కింద చెప్పేసుకున్న పవిత్రభూమి కోసం అలమటించిన ముస్లిములు ఆ అప్పులో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోతే ముక్కు పిండి వసూలు చేసుకోలేనివాళ్ళు దేశానికి ఎందుకు స్వతంత్రం తెచ్చారు?వాళ్ళు దేశభక్తులా!

     కాపరం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందని అంటారు కదా - స్వతంత్రం తీసుకురావడమే ఇంత లక్షణంగా చేసినవాళ్ళు స్వతంత్రం వచ్చాక మాత్రం ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటారు?అస్సలు పట్టించుజోలేదు - స్టాంపు పేపరు మీద రాసిస్తాను!

         Top IMF official has said as he cautioned that the global debt has reached a new record high of USD 182 trillion in 2017. As on 31 December 2018, India's external debt stock totaled US$ 521.2 billion, a quarter-over-quarter increase of 2.1%.External Debt in India decreased to 510428 USD Million in the third quarter of 2018 from 514442 USD Million in the second quarter of 2018.

         ఇవ్వాళ, అంటే 2019 నాడు 167 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, రక్షణ శాఖకి కావాల్సిన ఆయుధాల కొనుగోళ్ళు, టెలికమ్యూనికేషన్ వంటి common expenditures తీసేస్తే వడ్డీయే పూర్తిగా కట్టలేని స్థితిలో ఉంది దేశం - ఇంత అప్పు నెత్తి మీద వేలాడుతున్నప్పుదు "మన ఎదుగుదల అమోఘం!ఇంకేముంది, ఒక్క అడుగు వేస్తే అగ్రరాజ్యం హోదా వచ్చేస్తుంది" అని నమ్మబలుకుతున్న మాటల్లో నిజం లేదు.

     అసలు స్వతంత్రం తెచ్చుకునేటప్పుడే "మీరు చేసిన అప్పులతో మాకు సంబంధం లేదు,మాకు ఋణం లేని దేశం కావాలి" అని మెలిక పెడితే ఎట్లా వుండేది?పోనీ ఇవ్వాళ ఈ అప్పుని ఇంగ్లీషువాళ్ళనే తీర్చమని అడగవచ్చునా!ఆ విషయాలన్నీ తర్వాతి పోష్టులో చర్చిస్తాను.


(this is the fourth part of a series on macro economy!)

Wednesday 3 April 2019

అప్పుని ఎవరు పుట్టిస్తున్నారు?అప్పుని ఎలా పెంచుతున్నారు?అప్పుని తీర్చడానికి డబ్బుని ఎలా ఉపయోగించుకుంటున్నారు?అప్పుని లేకుండా చెయ్యలేరా!

          చాలా కాలం క్రితం రిజర్వ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ చెప్తున్న ఒకరు "నువ్వు పది రూపాయలు తీసుకెళ్ళి రిజర్వ బ్యాంకు దగ్గిరకెళ్ళి ఇది నాకక్కర్లేదు అంటే దానికి సమానమైన బంగారం నీకు ఇస్తుంది,ఎందుకంటే, ఆ పది రూపాయల్ని ముద్రించేటప్పుడు తన దగ్గిర ఉన్న బంగారం నిల్వల్నే డబ్బుగా మార్చి మనకి అందిస్తుంది కాబట్టి" అని చెప్పారు.అప్పుడు అది నిజమేనని నమ్మాను కానీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తుంది - రిజర్వ్ బ్యాంక్ అనేది మెజీషియన్ శూన్యం నుంచి కుందేలుని సృష్టించినట్టు ప్రభుత్వం ద్వారా రాబోయే సంవత్సరపు ఎదుగుదలని లెక్కలోకి తీసుకుని  కరెన్సీని ముద్రించి దాన్ని మనకి అప్పుగా ఇవ్వడానికి దుకాణం పెట్టుకుని కూర్చున్న వ్యాపార సంస్థయే తప్ప మనకి సౌకర్యాల్ని అమర్చి పెట్టే ధార్మిక సంస్థ కాదు!

          ఎందుకంటే, ఒక రూపాయి నోటు జీతం రూపంలో గానీ లాభం రూపంలో గానీ వడ్డీ  రూపంలో గానీ నీ చేతికి వస్తున్నదంటేనే అది రిజర్వ్ బ్యాంక్ నీకు అప్పుగా ఇచ్చినట్టు,నువ్వేదయినా వస్తువుని ఎవరి దగ్గిరయినా కొంటే తిరిగి రిజర్వ్ బ్యాంకుకి తీసుకున్న అప్పుని చెల్లించేసినట్టు. నమ్మకం లేదా? అయితే, ఈ కరెన్సీని ముద్రించటానికి ముందూ తర్వాతా ఇంగ్లీషువాళ్ళు మన దేశంలో వ్యాపారం చేసిన పద్ధతిని చూడండి ఒకసారి!

          ఇంగ్లీషువాళ్ళు మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ముస్లిముల ఆక్రమణకీ దీనికీ తేడా ఏమిటి అనే విషయంలో మన దేశపు పండితులు "హిందూ రాజులు ఒకరితో ఒకరు కలహించుకుంటూ విలాసాలలో మునిగి తేలుతుంటే దాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు!వాళ్ళు ఐకమత్యంగా ఉండి ఉంటే మన దేశం పరాధీనం అయ్యి ఉండేది కాదు కదా!" అనే సొల్లు చెప్తారు.కానీ, అప్పటి హిందూ ముసల్మాన్ ప్రభువులది వ్యాపారంలో ఇంగ్లీషువాళ్లు అనుసరించిన వ్యూహం అర్ధం కాని అమాయకత్వం! ముస్లిములలో కూడా మాలిక్ ఇబ్రహీం, తానీషా వంటి సద్వర్తనులు ఉన్నారనేది మర్చిపోకూడదు.అదీగాక, నేను అమాయకత్వం అనే పదం వాడాను కాబట్టి వాళ్లు అజ్ఞానులని జాలిపడుతున్నట్టు కూడా కాదు.ఎందుకంటే, ఇప్పటికీ ప్రపంచ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ చాలామంది ఆర్ధికవేత్తలకే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోని దుర్మార్గం అర్ధం కావడం లేదు, అర్ధం అయినవాళ్ళకి కూడా దీనినుంచి బయటపడే పరిష్కారం తెలియడం లేదు! మరి, కొత్తగా కనిపిస్తున్న అత్యంత ఆకర్షణీయమైన పద్ధతిలోని దేహం ఇక్కడ ఉంటే ప్రాణం మాత్రం సప్తసముద్రాల కవతలి చిలకలో ఉన్నట్టు అనిపించే అసలు కీలకం అర్ధం కావడం ఎలా సాధ్యం?

          రాను రాను రాజు గారి గుర్రం గాదిదై గుడ్డు కూడా పెట్టిందన్నట్టు ఈ దేశంలో అడుగుపెటిన మొదటి రోజుల్లో దుబాసీల దగ్గిర్నుంచి రాజుల ఉంపుడుగత్తెల వరకు ప్రతి అడ్డగాడిదకీ వంగి వంగి దణ్ణాలు పెట్టిన East India Company ఆ కాస్త అనుమతులూ దొరికాక వాళ్ళకీ వీళ్ళకీ కలహాలు రేపెట్టి వాళ్ళు చేసుకునే యుద్ధాల్లో ఇరు పక్షాలకీ అప్పులిచ్చి రెండు రాజ్యాల్నీ తన పీట కిందకి తెచ్చుకునే పాత ట్రిక్కునే ఇక్కడా ఉపయోగించి మోనాపలీ తెచ్చుకున్న 1765 నుంచీ మరో రూపాన్ని చూపించటం మొదలుపెట్టింది. యుద్ధరుణం వసూలు పేరుతో పన్నుల్లో వాటా తీసుకునేది, ఇందులోనుంచి మూడోవంతు పక్కకి తీసి దాంతో ముడిసరుకుల్ని కొనుక్కునేది,ఈ ముడిసరుకులని ఉపయోగించుకుని లండనులో తయారు చేసిన వస్తువుల్ని మనకీ ఇతర్లకీ అమ్మేది - ఈ రకం పనులు మనం చెయ్యటం అటుంచి దగ్గరివాడు చేస్తున్నాడని తెలిస్తే మొహాన ఉమ్మేస్తాం, అట్లాంటిది కొన్ని తరాల పాటు ఘనకార్యం లాగ చేశారు, ఎంత సిగ్గు లేని మంద!


          వాళ్ళు సాధించామని చెప్పుకుంటున్న పారిశ్రామిక విప్లవం ఒక బూటకం - ఆవిరి యంత్రాల్నీ రైలింజన్లనీ తయారు చేసింది వాళ్ళే గానీ దానికి పెట్టుబడి ఎక్కడిది?మన డబ్బే!ఒక్క ఇంగ్లాండు మాత్రమే కాదు, ఇవ్వాళ వైభవోపేతమై విర్రవీగుతున్న అన్ని యూరోపియన్ దేశాలూ మన దగ్గిర్నుంచి కొల్లగొట్టుకుపోయిన సొమ్ముని మూలధనం చేసుకుని బలిసినవే - వాళ్ళ సొంత చరిత్రనే అబద్ధాలతో నింపి భ్రష్టు పట్టించుకున్న సిగ్గు లేని మందకి వలస దేశాల చరిత్రల్ని అబద్ధాలతో నింపి భ్రష్టు పట్టించటం ఒక లెక్కా!

          పన్నులు వసూలు చేసేది ఒకడూ సరుకులు కొనుక్కునేది ఇంకొకడూ కావడంతో పత్తి రైతులూ నేతపనివాళ్ళూ ఈ మాయని కనిపెట్టలేకపోయారు.మరి, అంతకుముందు ఇక్కడ ఉన్న మన వ్యాపారస్థులు తమ మార్కెట్ చేజారిపోతూ ఉండటాన్ని ఎందుకు గమనించలేకపోయారు?బహుశః ఈ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకుని ఉంటారు - మంచి ఆకర్షణీయమైన లాభసాటి వ్యవహారం కదా!

          మొత్తం ఈ పద్ధతి ఎలా ఉండేదంటే, అదివరకు చచ్చినట్టు వాళ్ళ దగ్గిరున్న 10 బంగారు/వెండి నాణేలు ఇచ్చి కొనుక్కునే ముడిసరుకుల్ని అప్పటినుంచి పన్నుల కింద 30 నాణేల్ని కిట్టించుకుని వాటినుంచి 10 నాణేలతో ముడిసరుకుల్ని కొనుక్కుని తీసుకెళ్ళి లండనులో తయారు చేసిన వస్తువుల్ని 50 బంగారు/వెండి నాణేలకి అమ్మేవాళ్ళు. వీళ్ళని మన దేశపు కమ్యునిష్టు, కాంగ్రెస్, ముస్లిం, క్రైస్తవ చరిత్రకారులు "అబ్బెబ్బే!ఎంతో కొంత దోచుకున్నప్పటికిన్నీ మనకి ఇంగ్లీషు నేర్పిస్తిరి, మంచి చదువులు చెప్పిస్తిరి, పంట్లాములు తొడగటం చూపిస్తిరి, డబ్బంటే ఏమిటో తెలియని మన మొహాలకి డబ్బు సంపాదించటం నేర్పిస్తిరి - హత్తెరికీ, వాళ్ళు గనక రాకపోయుంటే మనం ఇప్పటికీ అనాగరికంగా ఉండిపోయేవాళ్ళమిస్మీ!" అని పొగడలేక ఛస్తున్నారు.

          అయితే, మనవాళ్ళకి చమ్మగానే ఉన్న ఈ దోపిడీ గురించి తెలుసుకున్న sheridon లాంటివాళ్ళు తిట్టే తిట్లకి తట్టుకోలేక 1836లో బ్రిటిష్ ప్రభుత్వం/ఇంగ్లాండు రాణీ East India Companyని రద్దు చేసి British Raj పేరుతో భారతదేశాన్ని తనే పరిపాలించటం మొదలుపెట్టింది - దీని ప్రకారం భారతీయ వ్యాపారులు తమ సరుకుల్ని తామే ఇతర దేశాల్లో అమ్ముకునే వీలు కుదిరింది."హమ్మయ్య!పీడ విరగడైంది - వాళ్ళు కొట్టేస్తున్న లాభం ఇక మనదే!అది మనదే!" అని చంకలెగరెయ్యకండి, ఇక్కడే వాళ్ళు పాత దోపిడీకే కొత్త ట్విస్టు ఇచ్చారు!British Crown కొన్ని ప్రత్యేకమైన చట్టాలను చేసి ఇప్పుడు మనం వాడుతున్న పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టింది.భారతీయ వ్యాపారులు, ఒక్క భారతీయులనే కాదు, అన్ని వలస దేశాల వారూ,  తమ సరుకుల్ని ఎగుమతి చెయ్యడానికీ ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికీ లండను ప్రభుత్వం ముద్రించే పేపరు కరెన్సీని మాత్రమే వాడాలి - వాటిని తమ దగ్గిరున్న వెండి బంగారు నాణేలతో కొనుక్కోవాలి!

          అద్గదీ సంగతి!మనవాళ్ళు బీరువాల్లో పెరుగుతున్న నోట్లకట్టల్ని చూసుకుని మైమరిచిపోతుంటే ఈ సమస్తమైన క్రయవిక్రయాలకి సంబంధించిన వాస్తవ మూలధనం లండను నగరానికి చేరుతున్నది!మన దేశంలోని వనరుల్ని ఉపయోగించుకుని మన దేశపు కష్టజీవుల స్వేదం నుంచి పుట్టిన వస్తువుల్ని మన దేశపు వ్యాపారులే ప్రపంచమంతటా తిరిగి అమ్మి సంపాదించిన సంపద మన దేశం లోపల కనపడకపోవటం వల్లనే ఇప్పటి బ్రిటిష్ దేశపు స్థూల జాతీయ ఉత్పత్తికి 17 రెట్ల సంపదని అందించిన భారతదేశం కేవలం ఒక్క దశాబ్దం తర్వాత అప్పుల్లో ఉందని నమ్మాల్సి వచ్చింది!

          దాదాభాయ్ నౌరోజీ, బిపిన్ చంద్ర పాల్, బాల గంగాధర తిలక్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ,  వల్లభాయ్ పటేల్, మహమ్మదాలీ జిన్నా, మదన్ మోహన్ మాలవ్యా, మాన్యశ్రీ అంబేద్కర్ - అందరూ మేధావులే, అయినా కీలకం కనిపెట్టలేకపోయారు.అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏమిటంటే,ఇంగ్లీషువాళ్ళు బిగించిన దోపిడీ చట్రాన్ని ఏమాత్రం మార్చకుండా కొనసాగించారు - ఏమిటీ ఘోరం!

          అతి ముఖ్యమైన ఆర్ధిక చట్రాన్ని శాసించే రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన అన్ని మార్గదర్శకాల్నీ రూపొందించింది సాక్షాత్తూ అంబేద్కర్ మహానుభావుడే.రిజర్వ్ బ్యాంక్ మన దేశపు  ప్రభుత్వం కన్న అంతర్జాతీయ ద్రవ్యనిధికే ఎక్కువ అనుసంధానించబడి వుంటుంది!కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్ లోటుని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి - రిజర్వ్ బ్యాంకు నుంచే కదా!ఆ రిజర్వ్ బ్యాంకు ఎక్కడి నుంచి  తీసుకుంటున్నది?అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తను అప్పు చేసి తెచ్చి మన ప్రభుత్వాలకి అప్పు ఇస్తున్నది.

          కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాలలో గానీ మేధావుల బడ్జెట్ విశ్లేషణలలో గానీ రాబడి పోబడి లెక్కలనే చూపిస్తారు, డెఫిసిట్ వస్తే అంకెల్ని మాత్రం చెప్పేసి వూరుకుంటారు గానీ ఆ డెఫిసిట్ స్థానంలోకి తెచ్చే అప్పు స్వతంత్రం వచ్చినప్పటినుంచి తీరకుండా ఉన్న అప్పుకి ఇంకెంత పెంచుతుంది అనేది మాత్రం చెప్పరు - అసలు ఆ ప్రస్తావననే దాటవేస్తారు.అది  తర్వాత పోష్టులో చెప్తాను.ఒకరకంగా ఈ పోష్టులో నేను చెప్పిన విషయాల్ని జీర్ణించుకోవటం కష్టమే!


(this is the third part of a series on macro economy!)

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...