Monday 15 July 2019

రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ బీజేపీకి తోకలా మారి త్వరలోనే తన ప్రాభవాన్ని కోల్పోయి అంతరించి పోనున్నదా?

మొదట నా చరిత్ర చెప్తాను.నేను యవ్వన కాలంలో నాస్తికుణ్ణి, కమ్యూనిష్టు భావజాలం వైపుకి కూడా మొగ్గు చూపాను.అయితే, కొన్ని చిత్రమైన వ్యక్తిగతమైన కారణాలతో ఆస్తికుణ్ణి అయ్యాక కూడా చాలా కాలం పాటు కమ్యూనిష్టు భావజాలం యొక్క ప్రభావంలోనే ఉన్నాను.చిన్నప్పటి నుంచీ ప్రతి రోజూ న్యూస్ పేపరు చదివే అలవాటు ఉండటం వల్ల సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయం కేంద్రంగా మొదలైన ఉద్యమాన్ని తొలినాళ్ళ నుంచీ గమనించాను.అప్పుడు ఆ ఉద్యమానికి అనుకూలుడైన మా మామయ్యని "ధర్మ స్వరూపుడైన రాముడు తనకి ఆలయం నిర్మించటానికి హింసని రెచ్చగొట్టమని చెప్పాడా?" అని అడిగి ఆయన తత్తరపడేటట్టు చేశాను.అయితే, మసీదును కూలగొట్టటానికి తొలినాళ్ళలో వ్యతిరేకించిన నేను రూటు మార్చుకుని భాజపా అభిమానిని కావడానికి అప్పుడు కళ్ళముందు కనబడుతున్న అద్వానీ, వాజపేయి లాంటి వారి వ్యక్తిత్వమే ప్రముఖమైన కారణం!నా మెయిల్ ఐడిలో ఉన్న లెనిన్ ఫొటోని గురించి కొందరు వెక్కిరిస్తున్నారు.అతన్ని కూడా అతని వ్యక్తిత్వం వలనే అభిమానించాను తప్పితే కమ్యూనిష్టు సిద్ధాంతం మీద ఉన్న అభిమానం కాదు.ఇంతకీ భారతదేశపు వీరకిశోరం భగత్సింగును ఇదే భాజపా వారూ రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా పొగుడుతున్నారు కదా!అతనేమైనా హిందూత్వవాదియా?పక్కా కమ్యూనిష్టు అయిన భగత్సింగ్ ఏనాడూ హిందూమతాన్ని ప్రశంసించలేదు, అయినా భాజపా వారికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులకూ ఉత్తేజాన్ని కలిగిస్తున్నాడు కదా, మరి నేను అదే లెక్కన లెనిన్ అనే మరో కమ్యూనిష్టుని అభిమానిస్తే తప్పేమిటో!

ఏ పార్టీ అయినా ఏ సిద్ధాంతం అయినా అంకితభావంతో ప్రజలకి మేలు చేసే ఆదర్శవంతమైన అనుచరుల వల్లనూ కార్యకర్తల వల్లనూ మాత్రమే తన విశ్వసనీయతను ప్రదర్శించి ప్రాభవాన్ని సాధించుకోగలుగుతుంది, అవునా?ఒకనాడు ఇందిరాగాంధీ చేతిలో దుర్మార్గమైన అణిచివేతకి గురై కూడా ఎన్నో కేసుల్ని తాన మీద వేసి అరాచక శక్తిగా నిరూపించాలని చూసినా కోర్టుల నుంచి ప్రశంసల్ని అందుకుని నిషేధాన్ని ఎత్తి వేయిచుకుని నిలబడిన ధృఢత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థది.కేవలం 2 సీట్లతో అపహాస్యానికి గురయిన భాజపా వాజపేయి మహాశయుడు ప్రకటించినట్టు ఇంత గొప్ప స్థితికి చేరుకోవడానికి భాజపా అనే రాజకీయ పార్టీలో ఆనాడు ఉన్నవారి మూలాలు రాష్ట్రీయ స్వయం సేవక్ అనే పవిత్రమైన సంస్థలో ఉండటమే కారణం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.మొదటిసారి భాజపా అధికారంలోకి రావడానికి తొలినాళ్ళలో ద్వేషించి మలినాళ్ళలో అభిమానించిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తులే కారణం అనేది కూడా యదార్ధమే, అవునా?

మరి వ్యతిరేకులను కూడా మెప్పించి తనవైపుకు తిప్పుకోగలిగిన సచ్చీలత బదులు ఇవ్వాళ వ్యతిరేకత నుంచి సానుకూలత వైపుకి వచ్చిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తుల నుంచి ఎదురౌతున్న ఛీత్కారాలను కూడా లక్ష్యపెట్టని నీచత్వానికి కారణం ఏమిటి?ఈ ప్రశ్నకి సరైన జవాబు తెలియాలంటే వాజపేయి ప్రభుత్వం కూలిపోయిన నాటికీ మోదీ తొలిసారి అధికారంలోకి రావడానికీ మధ్యన అటువైపు భాజపా మరియు రాస్వసే అనే జమిలి సంస్థల సంస్కృతిలోనూ ఇటువైపు హిందూ సమాజంలోనూ అంతకుముందు ఎవరూ వూహించని కొన్ని భీబత్సమైన మార్పులని పసికట్టాలి.

హైందవేతర సమూహాలు అంటే, కమ్యూనిష్టులూ వారిని వెనకేసుకొచ్చిన కాంగ్రెసు పార్టీ హిందూమతం మీద తమ దాడిని పెంచాయి. వారు దీనికి చెప్పుకున్న సమర్ధన భాజపా అయోధ్య ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టినదనేది సమర్ధించదగిన కారణమే గానీ ఆ పేరున వారు చేసిన చేష్టలు మాత్రం చాలా నీచ స్థాయిలో ఉండి అప్పటి వరకు తటస్థులుగా ఉన్న సహనశీలురైన హిందువుల్ని కూడా రెచ్చగొట్టి విధి లేక తమ రక్షణ కోసం భాజపాను తమ ప్రతినిధిగా ఎన్నుకోవలసి వచ్చింది. అయితే, ఈ వూపును భాజపా మరియు రాస్వసే నిర్మాణాత్మకమైన దృక్పధంతో ఉపయోగించుకుని ఉంటే ఆ రెండు సంస్థలకీ ఇవ్వాళ్టి దుస్థితి ప్రాప్తించి ఉండేది కాదు.కానీ భాజపా నాయకులు అప్పటివరకు తమకి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టిన నైతిక విలువల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉంటే చాలును అనే ధోరణిలో పడిపోయి కాంగ్రెసును అనుకరించటం మొదలుపెట్టారు.భాజపా ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఈ నైతిక పతనానికి సిగ్గుపడే ధోరణిలో లేదు.దానికి తార్కాణమే నేడు రామ్మాధవ్ లాంటివాళ్ళ సిగ్గులేని ప్రకటనలు!వాజపేయి లాంటివాళ్ళ సచ్చీలతకి తోడు ఆనాడు చంద్రబాబు సెక్యులర్ స్టాండు నుంచి యూ-టర్న్ తీసుకుని ప్రోత్సహించడం వల్లనే మతతత్వ పార్టీ ముద్ర నుండి బయటపడగలిగిందనేది నాలాగే ప్రతి రోజూ దినపత్రికలు చదువుతూ జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించిన సహస్రాధికమైన అనామక వ్యక్తులకు తెలుసు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థకు అసలైన హాని భాజపాకు తోకలా మారడం వల్ల జరిగింది.భాజపాకి తొలినాళ్ళలో ప్రాభవం తెచ్చిపెట్టిన ప్రముఖుల మూలాలు తమ సంస్థలో ఉండటం వల్ల మోహానికి గురయిన రాస్వసే పెద్దలు సామాజిక సేవా కార్యక్రమాలనూ క్షెత్ర స్థాయి ధర్మ ప్రచారాన్నీ పక్కన పెట్టి భాజపా రాజకీయ నిర్ణయాలను శాసించడం ప్రధాన కార్యక్రమం కింద పెట్టుకున్నారు.ఏ రాష్ట్రంలో రాస్వసె బలంగా ఉంటే ఆ రాష్ట్ర భాజపా శాఖకి ఎవరు నేత కావాలో కూడా ఆ రాష్టపు రాస్వసే అధ్యక్షుడే నిర్ణయించటం లాంటి తమాషాలు మొదలయ్యాయి.ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి కానీ భాజపా యొక్క రాజకీయపరమైన నైతిక భ్రష్టత్వాన్ని మాత్రం నిట్టూర్పులు విడవటం అసంతృప్తిని వ్యక్తం చెయ్యడం తప్ప అది తప్పని చెప్పి నియంత్రించలేకపోతున్నది.దీనికి బదులు బీజేపీ సంస్థాగత నిర్ణయాల్లో కల్పించుకోకుండా ఇదివరకు చేస్తున్న సేవ అకార్యక్రమాలను మరింత ముమ్మరం చేసి ఉంటే భాజపాకు బలమైన వోటుబ్యాంకు స్థిరపడి ఉండేది.ఇప్పటికీ కాంగ్రెసు, తెలుగుదేశం వంటి పార్టీలకి ఉన్న వోటుబ్యాంకును బద్దలు కొట్టలేకనే పార్టీల మార్పిడిని ప్రోత్సహించే దిక్కుమాలిన పద్ధతిలో అధికారంలోకి రావాల్సిన దుస్థితిలో భాజపా ఉన్నదనేది వాస్తవం!

ఒకనాడు ఏ చంద్రబాబు సహాయం వల్ల మతతత్వ పార్టీముద్రని వదిలించుకుని ప్రజల ఆమోదం పొందిందో ఆ చంద్రబాబుని అంతం చెయ్య్యాలని నిస్సిగ్గుగా ప్రయత్నించడం మానవ సహజమైన సంస్కారం ఉన్నవాడెవ్వడూ చెయ్యగూడని పని - కృతజ్ఞతను మించిన పుణ్యం కృతఘ్నతను మించిన పాపం మరొకటి లేదు!ఎన్నికలు నిన్ననే అయిపోయి ఆంధ్రలో తమ నిజమైన బలం తేటతెల్లమయ్యాక, ఇప్పుడప్పుడే ఎన్నికలు రావని తెలిసి కూడా ఆంధ్రలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని ప్రకటించడంలోని నైతికత ఏమిటి?వేరే పార్టీ కార్యకర్తల ప్రచారంతో వోటర్లు తమకి చచ్చినా వెయ్యకూడదని తీర్మానించుకుని ఇతర్లకి వేస్తే గెలిచినవాళ్ళని లాక్కుని సభలో సంఖ్యని పెంచుకోవడం అంటే తమ పార్టీలో తమ పార్టీకి వోట్లు వేయించుకోగలిగి సభలోకి రాగలిగిన సమర్ధులైన నాయకులు లేరని ఒప్పుకోవడమే కదా!ఈ వాస్తవం అధికార మదంతో కళ్ళు పొరలు గమ్మిన భాజపా నాయకులకి ఎప్పటికీ అర్ధం కాదు, కానీ ఆ పార్టీని భుజాల మీద మోస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులూ నాయకులూ ఎంతవరకు అర్ధం చేసుకున్నారు?

రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులూ కార్యకర్తలూ క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ సేవా తత్పరతనీ నైతిక ధృఢత్వాన్నీ కలిగి ఉన్నారా లేక వారు కూడా బద్ధకస్తులైపోయి భాజపా ద్వారా లాభపడాలని సర్దుకుపోతున్నారా?వృద్ధాప్యంలో శక్తులు ఉడిగిపోయినప్పుడు రాజీ పడటం సహజమే - కానీ రాస్వసేలో కుర్రవాళ్ళు ఎవరూ లేరా?అందరూ ముసలివాళ్ళైపోయారా?రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థలో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నవారికి ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి.హిందూమతానికి మూలమైనది సత్యము, నైతికత కాబట్టి ఆ విలువల కోసం పట్టుబట్టి భాజపాని మంచి దారికి తీసుకు రావటం ఒక దారి.కొంచెం విచక్షణతో ఆలోచిస్తే భాజపా ఇప్పుడు చేస్తున్న లత్తుకోరు పనులు చెయ్యడం వలనే కాంగ్రెసు ఇవ్వాళ ఉన్న స్థితిని అనుభవిస్తున్నదనేది తెలుస్తుంది.ఇవ్వాళ చీప్ ట్రిక్కులు ప్లే చేసి ఒకటి రెండు ఎన్నికల్లో గెల్చినా నిరంతరం గెలవాలంటే తమ కార్యకర్తల ప్రచారంతో ప్రజలు తమను మెచ్చి వేసిన వోట్లతో అధికారంలోకి రావడమే గౌరవప్రదమయినదనేదీ అదే సుదీర్ఘ కాలం పాటు తమని నిలబెడుతుందనేదీ రాస్వసే నాయకులు భాజపా నాయకులకి తెలియజెప్తేనే ఈ రెండు సంస్థలూ చిరకాలం మన్నుతాయి.

భాజపాతో సంబంధం తెంచుకుని ఇప్పటివరకు తమకు హిందూ సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టిన సేవా కార్యక్రమాలకీ ధర్మ ప్రచారానికీ పూర్తి సమయం కేటాయించటం రెండవ దారి.ఇందులో అలసత్వం చూపిస్తే నేను చెప్పినట్టు త్వరలోనే కనుమరుగు అయిపోవడం ఖాయం!హిందూ సమాజం రాస్వసే భాజపాతో తెగదెంపులు చేసుకోగానే మళ్ళీ నెత్తిన పెట్టుకుంటుందన్న గ్యారెంటీ కూడా లేదు.రాస్వసే భాజపా మీద పెత్తనం చెయ్యడంలో మునిగిపోయిన కాలంలో కొత్త సంస్థలు కొన్ని ఆవిర్భవించాయి.తెలుగు రాష్ట్రాల్లో శివశక్తి సంస్థ చాలా ప్రముఖమైనది.రాస్వసే కేవలం ధర్మ ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం వల్ల రాజకీయ రంగంలో భాజపాను తనకు మారుగా ఉపయోగించుకుంటున్నది. ఈ బలహీనత శివశక్తికి లేదు.కరుణాకర్ సుగ్గున ఈ మధ్యనే ఉత్తరాదికి కూడా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.భవిష్యత్తులో రాజకీయ పార్టీని కూడా స్థాపించే ఉద్దేశం ఉన్నట్టు అతని మాటల వల్ల తెలుస్తున్నది.అదే గనక కార్యరూపం దాలిస్తే తెలివి తక్కువా ఆకలి యెక్కువా అన్నట్టు సుస్థిరమైన వోటుబ్యాంకును ఏర్పాటు చేసుకోలేని భాజపాకు తప్పనిసరిగా నష్టం జరుగుతుంది.ఇప్పటివలెనే భాజపా మీద అధారపడి విస్తరించే బద్ధకపు ధోరణిలో ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా నష్టపోతుంది.అయ్యవారు వచ్చేదాక అమావాస్య ఆగుతుందా?హిందువులు అనంతకాలం వరకు మిమ్మల్నే నమ్ముకుని కూర్చుంటారా? 

ఈ జమిలి సంస్థలలోని వారు గానీ మిగిలిన హిందువులు గానీ గమనించని కొన్ని ప్రమాదాలను మీకు తెలియజెప్పాలి.ఇల్యూమినాటి, ఫ్రీమాసన్రీ లాంటి రహస్య సంస్థలు ఇప్పటికే ప్రపంచాన్ని బ్యాంకింగ్ సిస్టం ద్వార తమ గుప్పిట్లో పెట్టుకుని న్యూ వరల్డ్ ఆర్డర్ అనే ప్రణాళికలో మొదటి దశని విజయవంతంగా ముగించాయి.1947 ఆగస్టు 15 నుంచి మన దేశం సర్వ సత్తాక సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్రమైన గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందనేది కేవలం భ్రమ!ఇంగ్లీషువాళ్ళు వాళ్ళ జల్సాల కోసం యుద్ధాల కోసం చేసిన అప్పుని కూడా మనమే చేసినంత నిజాయితీగా స్వీకరించి దాన్ని అణాపైసలతో సహా తీర్చడానికి ఎప్పుడు ఒప్పుకున్నామో అప్పుడే అదివరకటికన్న భయంకరమైన దాస్యంలోకి వెళ్ళిపోయాము - ఆ ప్రణాళిక మొత్తం ఆ రహస్య సంస్థల రచనయే!నాకొక అనుమానం ఏమిటంటే భాజపా నాయకులు ఇవ్వాళ చేస్తున్న ఈ వికృతమైన రాజకీయ క్రీడ కూడా లండను నుంచి చక్రం తిప్పుతున్న వాళ్ళ పనియే అని!మన దేశానికి స్వతంత్రం ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం కూడా దేశంలో ఎక్కడా సుస్థిరమైన ప్రభుత్వం ఉండనివ్వకపోవటమే - సుస్థిరమైన ప్రభుత్వం ఉండి అభివృద్ధిని సాధిస్తే వాళ్ళ అప్పుని తీర్చేసి స్వతంత్రం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడే కాదు, ప్రపంచంలోని అని దేశాల్లోనూ ఏ ఒక్క ప్రాంత ప్రజలు గానీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పుకుంటే సహించలేరు వాళ్ళు!వాళ్ళ మొదటి దెబ్బగా రాజకీయ నాయకుల్ని నయాన కానీ భయాన కానీ లోబరుచుకుని వాళ్ళను నైతికంగా దిగజార్చి ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రజల్ని నైతికంగా భ్రష్టు పట్టిస్తారు.

ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా నాయకుల వ్యూహాన్ని గమనించండి - ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు ప్రజల్లో పలుకుబడి ఉన్న చంద్రబాబు జగన్ అనే ఇద్దర్నీ ఒకడి తర్వాత ఒకణ్ణి అసమర్ధుల కింద చూపించి ప్రజలకి ఇక భాజపా తప్ప దిక్కు లేదని నిరూపించాక సుజనా లాంటి గజ్జికుక్కని తమ పార్టీ తరపున గద్దె ఎక్క్కించడం అనేది ఆది నుంచీ భాజపా నాయకుల ప్రకటనల వల్ల తెలుస్తూనే ఉన్నది గదా - అస్థిరత్వం, అస్థిరత్వం, సదా అస్థిరత్వమే వాళ్ళ లక్ష్యం!భాజపా యొక్క స్వఛ్చత మీద భ్రమలు ఉన్నవాళ్ళు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి - తన పేరుని చంద్రబాబు మంత్రిమండలికి పంపించినప్పుడు అసహ్యించుకున్న పార్టీ తనమీద అవినీతి కేసుల్ని ఎర చూపించి భయపెట్టి ఐటీ దాడులతో హింసించి తన పక్కలోకి లాక్కుందని మనం భ్రమపడుతున్న ఇన్నాళ్ళ తర్వాత సుజనా చౌదరి చిద్విలాసంగా అసలు నామీద కేసులే లేవంటున్నాడు - అంటే, భాజపా వాళ్ళూ సుజనా ముందే కూడబలుక్కుని ఈ భూప్రపంచం మీద ఉన్న ఏ కోర్టులోనూ అతని మీద కేసు లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని కేవలం "అయ్యో పాపం!భాజపా అంత భయంకరమైన దాడి చేస్తే తప్పనిసరై వెళ్ళాడు పాపం!" అని కండువా మార్పిడికి కరతాళధ్వనులతో ప్రోత్సహించే అస్మదీయ చీర్ లీడర్ల ఆమోదం కోసం మ్మీడియాకి రోజుకోసారి వార్తలు వదిలి హైప్ క్రియేట్ చేసిన ఉత్తుత్తి యవ్వారం అన్నమాట - మరీ ఇంత నీచత్వమా!అసలు నేను పదే పదే నొక్కి చెప్తున్నట్టు తమకు ప్రజల్లో మంచిపేరును తెచ్చుకుని తమ పార్టీ కార్యకర్తల ప్రచారం ద్వారా బలం పెంచుకుని తమ పార్టీలోనే సమర్ధుడైన ఒక ముఖ్యమంత్రిని ప్రోత్సహించుకోవడం అనే చక్కని రాజమర్గం వదిలి ఈ సందుగొందుల తుఛ్చమైన దొడ్డిదారినే ఎందుకు నడుస్తున్నారు?వాళ్ళ వయస్సూ వివేకమూ అనుభవమూ అంతేనా, నిజంగా వాళ్ళు తాము కేతిగాళ్ళలా ప్రవర్తిస్తున్నామని తెలుసుకోలేనంత అమాయకులా - ఆలోచించండి!ఇవ్వాళ హిందూత్వం పేరుతో జరుగుతున్నది గాబట్టి వాళ్ళు అస్మదీయులైపోయారు, కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవ అనుకూల వర్గం వాళ్ళు పన్నితే సుజనా చౌదరి వాళ్ళ వైపుకి వెళ్ళడని గ్యారెంటీ ఉందా?సుజనాయే కాదు అమిత్ షా కూడా వ్యాపారియే కదా - ఇదే ఎత్తుగడ లండన్ బ్యాంకర్లు అమిత్ షా మీద ఇప్పటికే ప్రయోగించారని నా అనుమానం, ప్రయోగించలేదని గ్యారంటీ ఇవ్వగలరా?

ఈ జమిలి సంస్థల నాయకులూ కార్యకర్తలూ మిగిలిన హిందువులూ తేల్చుకోవలసిన విషయం ఒకటే - భాజపా ఇస్తుందో లేదో తెలియని రక్షణ కోసం భాజపా ఎంత నీచానికి ఒడిగట్టినా సహించటమా లేక సనాతన ధర్మం ఏ పునాదుల మీద నిలబడిందో ఆ సత్యం పునాదుల మీద నిలబడి భాజపాని ఒళ్ళు దగ్గిర పెట్టుకుని నడుచుకునేలా నిగ్రహించటమా?

అసతో మా సద్గమయ!
తమసో మా జ్యోతిర్గమయ!
మృత్యోర్మా అమృతం గమయ!!
ఓం శాంతి శాంతి శాంతి!!!

Monday 8 July 2019

ఆంధ్రాలో భాజపాకి నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు ఒక్కడే!బాబుకి ఆయువు తీసి జగనుకి కొమ్ములు పెంచి భాజపా సాధించింది ఏమిటి?

బాబు మీద పగబట్టి అతన్ని వోడించటానికి చేరదీసిన ఇద్దరూ భాజపాకి ద్రోహం చేశారు - కేసీయార్ ఎన్నికల్లో వాళ్ళకీ వీళ్ళకీ డబ్బులిచ్చాడని తెలిసింది,జగను తాము కుదరదంటున్న ప్రత్యేకహోదా కోసం తీర్మానం చెయ్యటమే కాకుండా కరకట్ట మీద బాబు ఇంటి గురించి గొడవ చేసి తమ పార్టీవాడైన గంగరాజుకీ చెడ్డపేరు తెచ్చిపెట్టాడు!చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మొదట బాబుని టార్గెట్ చేసినప్పుడు చంకలెగరేసి తమవాణ్ణి ముట్టుకుంటున్నాడని తెలియగానే వార్నింగులిస్తే పోయిన పరువు తిరిగొస్తుందా?తమ రెండు నాల్కల ధోరణి బయటపడిపోలేదూ!

బీజేపీ ఒక కఠినమైన వాస్తవాన్ని గమనించాలి - తెదెపా వాళ్ళని లాక్కుని బాబుని దెబ్బతియ్యడం ఘనకార్యం అని భావించేముందు కాంగ్రెసు గతంలో చేసిన ఇలాంటి దగుల్బాజీ పనుల వల్లనే ఇంకో వందేళ్ళ వరకు ఆ పార్టీకి వోటు వెయ్యకూడదన్నంతగా ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకున్నారు - వాళ్ళకీ  ఆ దుస్థితియే కావాలా?సుజనా చౌదరి పేరుని చంద్రబాబు ఇచ్చినప్పుడు "ఇతనే దొరికాడా!" అని ఈసడించుకున్నారు,అతను అవినీతిపరుడని నిరూపించడానికి కేసులు పెట్టిందీ వాళ్ళే, ఇవ్వాళ అతను తెదెపా నుంచి బయటికి వస్తే అక్కున చేర్చుకుంటున్నదీ వాళ్ళే - ఇది కాంగ్రెసు తరహా రాజకీయం కాదా!

అన్నిటికన్న కఠినమైన వాస్తవం యేమిటంటే తెలంగాణలో అయినా నాలుగు లోక్ సభ స్థానాలు గెలవగలిగారు గానీ ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు ఇప్పటికీ!"చంద్రబాబు ప్రభుత్వం తిరుమల ఆలయంలో జరుగుతున్నవాటి పట్ల స్పందిస్తున్న తీరు అసలుకే మోసం తెచ్చి వచ్చే ఎన్నికల్లో ఓటమిని చూపించవచ్చు!" అనే పోష్టులో నేను "బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడానికి అన్ని గతిలేని పనులు చెయ్యాల్సి రావడం కాంగ్రెసు క్రమేణా బలం పుంజుకుంటున్నదనే దానికి సంకేతం - అది వాళ్ళకి అర్ధం కావడం లేదు!బండ పద్ధతుల్లో అప్పటికి అధికారం దక్కితే దక్కవచ్చు గాక,వాటి నుంచి పాఠం నేర్చుకోవటం లేదు వాళ్ళు.అధికారంలో లేని కాంగ్రెస్ ఏమి మంచి పనులు చేసిందని ప్రజలు కాంగ్రెసుకి అంత బలం ఇస్తున్నారు?తమ పట్ల వ్యతిరేకత కాదా!ఒక వోటరు తను వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే సంతోషిస్తాడు,అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా రాకపోతే అందుకు కారణమైనవాణ్ణి మరింత ద్వేషిస్తాడు - ఇది జస్ట్ కామన్ సెన్సుతో ఆలోచించినా తెలిసే నిజం!2019 ఎలెక్షన్స్ బీజేపీకి నల్లేరు మీద బండి నడక కాదు - ప్రతికూలతలే ఎక్కువ ఉన్నాయి.కర్నాటకలో మిగిలిన అన్ని అంశాలతో పాటు చంద్రబాబు స్టేట్మెంటు కూడా పనిచేసింది.ఎన్నికల తర్వాత 2014లో కన్న బలహీనపడినప్పుడు చంద్రబాబు అవసరం తప్పనిసరి!" అని చెప్పినది ముమ్మాటికీ నిజం.మొన్నటి ఎన్నికల్లో మీరు మోదీని తీసుకొచ్చి పెద్ద యెత్తున ప్రచారం చేసినా కోడి పోయి కత్తి వచ్చె డండండం అన్నట్టు బాబు పోయి జగన్ రావడం తప్ప భాజపాకి ఎంత మేలు జరిగింది?అదే, బాబుకి మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో సహాయం చేసి ఎన్నికల సర్దుబాటులో కొన్ని ఎక్కువ సీట్లని తీసుకుని వాటిలో మీ సొంత బలం చూపించి గెలిచి ఉంటే ఎంత బాగుండేది?మోదీ వచ్చి ప్రచారం చేసినా బాబు వ్యతిరేక వోట్లు జగనుకి పడి అతను గెలవటం అంటే మిగిలిన దేశమంతటా అప్రతిహతంగా ఉన్న జాతీయ పార్టీకి ఎంత అప్రదిష్ట - ముఖ్యంగా ప్రధాని స్థానంలో ఉన్న మోదీకి ఎంత పరువు తక్కువ!

తన సొంత పార్టీలో మామకే వెన్నుపోటు పొడిచాడు అనేది పట్టుకుని ఎంతకాలం సాగదీస్తారు?సాక్షాత్తూ లక్ష్మీపార్వతి మొదటి భర్త ఇంటర్వ్యూ బయటపడిన ఇవ్వాళ అది ఎంత పిచ్చిమాట!నాదెండ్ల భాస్కరరావుది నిజమైన వెన్నుపోటు!అప్పుడు చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల్ని కాపాడుకోకపోయి ఉంటే రామారావు ఎన్ని కబుర్లు చెప్పినా వెర్రివెధవలా మిగిలిపోయి ఉండేవాడు కాదా!ఇవ్వాళ్టికీ అన్ని పార్టీల నాయకులూ అదే సమస్య వస్తే చంద్రబాబునే అనుసరిస్తున్నారు కదా!మరి, భార్య స్థానాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుదామని ప్రయత్నిస్తున్న లక్ష్మీపార్వతిని ఆనాడు నిగ్రహించకపోయి ఉంటే తెలుగుదేశం ఈరోజున ఎలా ఉండేది!ఇవ్వాళ మోదీ మీద తను యుద్ధం ప్రకటిస్తే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి రాజకీయ నాయకుడూ అతని పక్కకి వెళ్ళారంటే అది అతనికి ఉన్న విశ్వాసనీయత కాదా?వేరే పార్టీ టిక్కెట్లతో గెలిచినవాళ్ళకి మన పార్టీ కండువా కప్పెయ్యడం ద్వారా అధికారంలోకి రావడం ఆ ఒక్కసారికీ తక్షణలాభం తీసుకొస్తుంది గానీ ప్రజల్లో ద్వేషాన్ని పెంచి కాంగ్రెసుకి మల్లేనే పుట్టగతులు లేకుండా చేస్తుంది.

ఎవరు ఎంత దీమా చూపించినా ఆంధ్రాలో చంద్రబాబుతో శత్రుత్వం పెట్టుకోకుండా అతనికి ప్యాకేజీ ద్వారా ఇచ్చే సహాయమైనా నిజాయితీగా చేసి ఎన్నికల సమయంలో ఇదివరకటి కన్న ఎక్కువ సీట్లు తీసుకుని చంద్రబాబు విజయంలో మా ప్రోత్సాహం కూడా ఉందని చెప్పుకుని ఉంటే ఇప్పటికన్న మంచి ఫలితం దక్కి ఉండేది.ఇప్పుడు ఏమైంది?జగను తమకి బెండు పెడుతూ కేసీయారు పక్కకి చేరినా ఏమీ చెయ్యలేని పరిస్థితి దాపరించింది. గట్టిగా విమర్శిస్తే ఎందుకు ప్రోత్సహించారనే ప్రశ్న తమనే దోషిగా నిలబెడుతుంది.హిందూత్వం నినాదంతో ఉన్న పార్టీ క్రైస్తవ ముద్ర ఉన్న జగనుతో కలిసి పోటీ చెయ్యగలదా?

ఈ మొత్తం సంక్షోభానికి కారణం ఆంధ్రా బీజేపీ నాయకుల కులపిచ్చి అని నా అభిప్రాయం.వాళ్ళలో ఎవడికీ ప్రజల్లౌ తిరిగి వోట్లు తెచ్చుకోగలిగిన సామర్ధ్యం లేదు. కనీసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా హిందువుల్ని వోటుబ్యాంకు కింద మార్చుకునే చాతుర్యం కూడా లేదు. ముత్యాల ముగ్గు కాంట్రాక్టరు "వెనకటికి మా మావ చెవుల్లో మీసాలు మొలిపిచ్చు మిగతాది నేంజూసుకుంటానన్నాట్ట, ఏం జూసుకున్నావ్!" అని జోకేసినట్టు బాబుని కమ్మ కులస్థుడిగా చూసి "ఈ కమ్మోడితో మనం కలవడం ఏంటి?" అని తేలిక చేసి అతన్ని పడగొట్టేస్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయని వాళ్ళు నమ్మి అధిష్ఠానాన్ని నమ్మించి ఒక భాజపాయేతర పార్టీ బదులు ఇంకో భాజపాయేతర పార్టీని పవరులోకి తీసుకు రావడం తప్ప వీళ్ళు భాజపాకి ఎన్ని వోట్లు పెంచగలిగారు?

కాబట్టి రాష్ట్రంలోని వాస్తవమైన బలాబలాల్ని అంచనా వేసుకుని అహంకారాలకి పోకుండా చంద్రబాబుతో కలిసి అతని సాయంతో ఎదగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలి.ఒక ఎన్నికలో వోడిపోయినంత మాత్రాన చంద్రబాబు అసమర్ధుడైపోడు, జీరో బడ్జెట్ వ్యవసాయం గురించి నాలుగేళ్ళ క్రితం అతను ప్రతిపాదించినదాన్ని ఇవ్వాళ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించడమే అతని పరిపలనా దక్షతకి తార్కాణం. అలాంటివాణ్ణి శత్రువుని చేసుకోవడం కన్న మిత్రుణ్ణి చేసుకోవడమే లాభం.

మహా మేధావులూ రాజకీయ విశ్లేషకులకే కాకుండా ప్రతిరోజూ న్యూస్ పేపరు చదివే పోరగాడికి కూడా ఆనాడు కాంగ్రెసు పార్టీకి విభజన బిల్లుని ఎవరి మద్దతూ లేకుండా సభలో నెగ్గించుకోగలిగిన మద్దతు లేదనీ బిల్లులో ఆంధ్రాకి హాని జరిగే అంశాలు ఉన్నప్పటికీ బిలు నెగ్గడంలో కాంగ్రెసు కన్న బీజేపీ ప్రమేయమే ఎక్కువ అని తెలిసిపోయింది!ఎన్నికల సమయంలో తల్లిని చంపి పిల్లని పుట్టించారు అని జాలి కబుర్లు చెప్పినవాడు ఆ తల్లికి గృహప్రవేశం రోజునే హ్యాండిచ్చాడు అనేది కూడా అందరికీ తెలుసు!అక్కడి మేధావులూ ఇక్కడి మేతావులూ తమని తాము ఎంత గొప్పగా వూహించుకుని మాస్టర్ ప్లాన్లు వేసినా బీజేపీ ఆంధ్రాను బలిమిని కైవసం చేసుకోవాలనే ప్రతి ఎత్తుగడా ఆంధ్ర ప్రజల్లో బీజేపీ పట్ల  మరింత కోపాన్ని ఎగదోస్తున్నదనేది నిజం - ఈనాడు కాదు దేశంలో రాజకీయం మొదలైన తొలినాటి నుంచీ విజయవాడయే తెలుగువాళ్ళ రాజకీయ రాజధాని అనేది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం, వీళ్ళని మోసం చెయ్యడం చాలా కష్టం!ఇసుకలో తల దూర్చిన ఉష్ట్రపక్షిలా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా అమాయకత్వం నటించకండి!ఉన్న చెడ్డపేరును పోగొట్టుకోవాలంటే మంచిపనులు చెయ్యాలా మరిన్ని చెడ్డపనులు చెయ్యాలా అనేది కూడా తెలియనంత చిన్నపిల్లలు కాదు కదా, ఇప్పటివరకు తెచ్చుకున్న చెడ్డపేరును పోగొట్టుకోవాలంటే రాష్ట్రాన్ని కష్టాల నుంచి బయటపడెయ్యటానికి చంద్రబాబుకి సహాయం చెయ్యటం తప్ప మరో మార్గం లేదు.

బుద్ధిః కర్మాను సారిణీ - తధాస్తు!

Thursday 4 July 2019

అసలు కేసీయార్ మనిషా, పశువా, దెయ్యమా లేక రెండు తెలుగు రాష్ట్రాలనీ ముంచటానికి పుట్టిన బ్రహ్మరాక్షసుడా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కాక మిగిలిన 150 మంది అధికారపక్షపు శాసనసభ్యులకి కనీసపు తెలివితేటలు కూడా లేవా!నెల రోజుల్నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత ప్రభుత్వం కట్టిన బిల్డింగుల్ని కూల్చటం, అల్లరి చెయ్యకుండా ఉంటే చాక్లెట్టులిస్తానని చిన్నపిల్లలకి చెప్పినట్టు పాత ప్రభుత్వం మొదలుపెట్టిన పనుల్ని ఆపేసి వాటిలో బొక్కలు పడితే ప్రైజులిస్తానని అధికార్లకి లంచాలు ఎర వెయ్యటం తప్ప రాష్ట్ర ప్రజలకి మేలు జరిపించే పని ఒక్కటన్నా చేశాడా?ఇప్పటికీ పరిపాలన మొదలుపెట్టటానికే తీరిక లేదు చిన్నబాబుకి,  ఢిల్లీ వైజాగూ హైదరాబాదుల చుట్టూ తిరగడమే సరిపోతంది.

తన చేతులో ఉన్న పని గాబట్టి ఠడామనీ ప్రజావేదికని కూల్చేశాడు, మరి మొత్తం అన్నింటినీ కూల్చేస్తాను,ఏ ఒక్కదాన్నీ వదిలేది లేదని రంకెలు వేసినవాడు ఒక్క ఇంటికే నోటీసులు పంపించడం కనపడుతూనే ఇంది కదా!బుజ్జాయిగారి గర్జనని చంబానా తప్ప అందరూ మెచ్చుకున్నారని ఉర్రూతలొగుతున్న జఫాలకి మేధావుల ప్రతిస్పందనలోని ముఖ్యమైన పాయింటు అర్ధం కావడంలేదా?"అక్రమ నిర్మాణాల్ని కూల్చడం మంచిపనే, కానీ కక్ష సాధింపులా చంద్రబాబు నివాసం ఒక్కదాన్నే టార్గెట్ చెయ్యకుండా లెక్కపెట్టి 21 నిర్మాణాల్నీ కూల్చాలి!" అని పట్టుబడుతున్నాక కూడా నన్నెవరూ చూడట్లేదని అనుకుంటున్న పాలు తాగే పిల్లిలా ఆ ఒక్క ఇంటికే నోటీసు అంటించి వచ్చారేం!బీజేపీ వాళ్ళ ఇళ్ళని ముట్టుకోవడానికి ధైర్యం చాలడం లేదా?

ప్రభుత్వం నోటీసులు జారీ చేయడానికో పధ్ధతి ఉంది.మొదటగా నోటీసును అది ఎవరికైతే ఉద్దేశించ బడిందో వారికి గానీ, వారు ఆథరైజ్ చేసిన వ్యక్తులకు గానీ బై హేండ్ సర్వీస్ చేసి, అది ముట్టినట్లుగా వారి సంతకం, అది ఒక సంస్థ గనక అయినట్టైతే, సంతకం కింద తత్సంబంధిత స్టాంప్; ముట్టిన తేదీ వేయించాలి. ఇది ఫస్ట్ మోడ్ ఆఫ్ సర్వీస్. ఇది సాధ్యం కాకపోతే రెండవ మోడ్ ఆఫ్ సర్వీస్ కి వెళ్ళాలి. అది సర్వీస్ బై పోస్ట్ అండర్ అక్నాలెజ్ మెంట్ డ్యూ. అంటే సదరు వ్యక్తికి వ్యక్తిగతంగా సర్వ్ చేయలేని పక్షంలో పోస్ట్ ద్వారా పంపించాలి. దాన్లో కూడా సంతకం, స్టాంప్, ముట్టిన తేదీ తప్పని సరిగా ఉండాలి. ఇలా రిసీవ్ చేసుకోకుండా అవాయిడ్ చేస్తే (ఎందుకంటే అందులో అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుస్తుంది కాబట్టి, అది రిసీవ్ చేసుకోవడం అవాయిడ్ చేస్తారు) అది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లు రిటర్న్ చేస్తారు, అడ్రెసీ నాట్ ఫౌండ్ ఎట్ ద అడ్రెస్; అడ్రెసీ డినైడ్ టు రిసీవ్ ద పోస్ట్ అనే ఎండార్స్ మెంట్ ఇచ్చి. అలా మూడు నాలుగు సార్లైనా రిటర్న్ అయిన తర్వాత, అప్పుడు మూడో మోడ్ ఆఫ్ సర్వీస్ కి వెళ్ళాలి. అదేమంటే, సర్వీస్ బై అఫ్ఫిక్చర్. ఇదే లాస్ట్ మోడ్ ఆఫ్ సర్వీస్. ఇదెలా అంటే, లాస్ట్ నోన్ అడ్రెస్ యొక్క మెయిన్ డోర్/కాన్ స్పిక్యుయస్ ప్లేస్ లో సదరు వ్యక్తి/సంస్థ కి ఉద్దేశించబడిన నోటీసును, ఇద్దరు వ్యక్తుల విట్ నెస్ సంతకాలతో (ఆ నోటీసు మీద) వాళ్ల సమక్షంలో అతుక బెట్టాలి. ఇదీ ప్రభుత్వ నోటీసులు సర్వ్ చేసే విధానం. ఇది ఏ మాత్రం లోప భూయిష్టంగా ఉన్నా, కోర్ట్ లో కేవలం "ఇం ప్రోపర్ సర్వీస్" అనే గ్రౌండ్ మీద వీగిపోతుంది. మెరిట్స్ లోకి వెళ్ళరు. టీవీలల్లో విజువల్స్ చూస్తుంటే, మొదటి రెండు మోడ్స్ ఆఫ్ సర్వీస్ వదిలేసి డైరెట్టుగా మూడో సర్వీసుకి వెళ్ళినట్లుగా తోస్తోంది. పైగా విట్ నెస్ సంతకాలు కూడా తీసుకున్నట్లు అనిపించడం లేదు. చంద్రబాబుగారు తన నివాసంలోనే ఉండగా నోటీసును గోడకతికించడం అంటే దొంగతనానికి పోయినవాడు తన పని తను చూసుకోకుండా దురద కొద్దీ తేలుతో కుట్టించుకున్న దొంగ కిక్కురుమాంకుండా బాధను భరిస్తూ తప్పుకు పారిపోయేటప్పటి అవస్థలా లేదూ!చంబానాను మాత్రమే టార్గెట్ చేసి తమని వదిలేస్తాడనుకున్నప్పుడు చంకలు గుద్దుకుంటూ జగన్ని పొగిడిన భాజపా వాళ్ళకి ఇన్ని రోజుల తర్వాత జగన్ తుగ్లక్ మాదిరి కనిపిస్తున్నాడు- మరి, ఈ సామంతరాజు ఆ చక్రవర్తిని  ఢీ కొట్టగలడా?

"జగన్ బలహీనతలను అర్థం చేసుకున్న కేసీఆర్ ఏపీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాస్తవానికి తెలంగాణలో పారే గోదావరికి మహారాష్ట్ర దయతలిస్తే తప్ప నీరు చేరదు. తెలంగాణలో గోదావరిలో కలిసే ఉపనదులు కేవలం వర్షాకాలంలో స్వల్పంగా నీటి తెస్తాయి. కాబట్టి వచ్చిన ప్రతినీటిబొట్టును దాచినా తెలంగాణ గోదావరికి చేరే నీటి వల్ల తెలంగాణలో తడిసే గొంతులు, పొలాలు తక్కువే. అయితే, ఆంధ్రాలో గోదావరి పరిస్థితి అలా లేదు. అవసరానికి మించి నీరు లభ్యం అవుతోంది. దీనికి కారణం చత్తీస్ ఘడ్, ఒడిసా అడవుల నుంచి భారీ ఎత్తున వరద నీరు అనేక చిన్న నదుల ద్వారా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ పోలవరం ప్రయోజనాలు తెలంగాణకు తీసుకెళ్లాలని కుట్ర పన్నుతున్నారు. అది కూడా మన డబ్బుతో కట్టిన ప్రాజెక్టులతో. మరి జగన్ ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయానికి ఒక చక్కటి సాకును కేసీఆర్ రెడీ చేశారు. అదే రాయలసీమ ప్రయోజనాలు.

రాయలసీమ సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరాలంటే గోదావరి నుంచి నీళ్లు తెచ్చి శ్రీశైలంలో కలపాలని కేసీఆర్ చెబుతున్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీనికి ఇప్పటికే గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. పోలవరం, పట్టిసీమ కట్టింది ఇందుకోసమే. కృష్ణా నది నీటిని అత్యధికంగా వాడుకునేది ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు. నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజీకి వెళ్లే నీరు ఎంత ఎక్కువంటే… అది రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలకు సరిపోతాయి. వాటిని శ్రీశైలంలోనే ఆపేస్తారు. ప్రకాశం బ్యారేజీకి పోలవరం నుంచి నీటిని తరలిస్తారు. ఈ నీళ్లు తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అందుతాయి.

తన స్వార్థం తప్ప మరేదీ పట్టించుకోని కేసీఆర్ రాయలసీమ పేరు చెప్పి ఏపికి రావల్సిన నీటిని దోచుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం నీటి దోపిడీతో ఆగిపోవడం లేదు. ఎత్తిపోతల పథకాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లేదన్నా ఎకరానికి రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ విద్యుత్తుకే ఖర్చు అవుతుంది. ఇపుడు పోలవరం నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్లాలంటే చాలా ఎత్తుకు నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చు చాలా అధికం. ఒకరకంగా కాళేశ్వరం అంత ఖర్చ అవుతుంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం నీటిని తీసుకెళ్లడానికి ఏపీ సగం ఖర్చు భరించాల్సి వస్తుందన్నమాట. ఇదే కేసీఆర్ కుట్ర. మన వేలుతో మనకంటినే పొడవడం. ఏపీ మీద అనవసర ఖర్చు మోపడం." - జగనన్న ఏం చెసినా "ఒహోం!ఒహోం!" అంటూ పల్లకీ మొయ్యడం తప్ప మాకేం తెల్దు అంటే మళ్ళీ ఎన్నికల్లో వోట్లు పడతాయా!కేసీయారు కంటే సొంత తెలివి ఉంది, మీ జగనన్నకేం ఉంది?హైదరాబాదులో ఆస్తులున్న తెదెపా వాళ్ళని బెదిరించి తన పార్టీలోకి తెచ్చిపెట్టిన కేసీయారు చుట్టూ తోకూపుకుంటూ తిరగటం తప్ప ఇంతవరకు సొంత తెలివిని చూపించి రాణించిన సన్నివేశం ఒక్కటి కూడా లేదు, ముందు ముందు చూస్తామని నాకు నమ్మకం లేదు!మీ సంగతి చెప్పండి, మీ నాయకుణ్ణి వాజెమ్మని చేసి కేసీయారు దోచుకుపోతున్న రాష్ట్రపు సంపదలో మీకు వాటా లేదా?

మీరు జగనుకీ జగను కేసీయారుకీ బాకాలు వూదుకుంటూ అయిదేళ్ళు గడిపేత్తే సాల్లెమ్మని అనుకుంటున్నారేమో, మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ మూడేళ్ళకే మళ్ళీ మిమ్మల్ని జనం ముందు నిలబెట్టబోతున్నాడు, అప్పటికి కూసిన్ని కూడా మంచిపనులు చెయ్యరా?ఈ దిక్కుమాలిన ఎత్తిపోతల పథకం అవసరం లేకుండానే పోలవరం పూర్తయితే ఏపీలోని 13 జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరుతాయి. పోలవరం, శ్రీశైలం అనుసంధానం శుద్ధ తప్పుడు ప్రాజెక్టు. కేవలం తెలంగాణ కోసం ఏపీ మోయాల్సిన బర్డన్. మేలుకుని దీనిని అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. లేండి, మేలుకోండి!

80వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతలుగా రికార్డులకు ఎక్కింది గాని అది అస్సలు ఫలవంతమైన ప్రాజెక్టు కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ప్రాజెక్టులో కేసీయారు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాని పెట్టుబడి, నిర్వహణ ఖర్చు రాష్ట్రానికి తెల్ల ఏనుగు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది కేవలం ఒక‌ప్రదేశంలో ఉన్న ప్రాజెక్టు కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పేరు “డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్”. 2007-2009 మధ్యకాలంలో “డాక్టర్. వైఎస్ రాజశేఖరరెడ్డి” ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే ఒప్పందాలు పూర్తైపోయాయి. పాత ప్రాజెక్టుపై 2008 నుంచి 2014 వ‌ర‌కు రూ.7 వేల కోట్లు ఖ‌ర్చు అయింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్లాన్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా “తుమ్మెడిహట్టి” దగ్గర గోదావరి నది మీద బ్యారేజీ నిర్మించి 160 టీఎంసీల నీటిని తోడుకొని తెలంగాణాలోని 7 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 16 లక్షలా 40 వేలఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ, దారిలో ఉన్న గ్రామాలకు తాగునీటికి గాను 10 టీఎంసీలు, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలకు తాగునీటికోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకోసం 16 టీఎంసీల నీటిని వాడుకోవాలని నిర్ణయించారు.

అయితే 2014 లో రాష్ట్రవిభజన తరవాత తెలంగాణా ఏర్పాటయ్యాక, కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసింది. దానికి వివిధ కారణాలు ఉన్నా, ప్రధానమైన కారణాలు మాత్రం, 

1. ముంపు ప్రాంతాలపై మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలు – పరిష్కారమార్గాల్లో సమస్యలు ఇతరత్రా
2. తుమ్మెడిహట్టి వద్ద నీటిలభ్యత తక్కువగా ఉండడం

ఈ మొత్తం ప‌నిని లింకులుగా, తిరిగి ఆ లింకుల‌ను ప్యాకేజీలుగా విభ‌జించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి. ప్రస్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని ప్రయత్నిస్తున్నారు. 21వ తేదీన వీటినే పాక్షికంగా ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. లింక్ 1, లింక్ 2 ల‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజులు ఉన్నాయి.

=> నీటి సరఫరా మొత్తం మార్గం: 1832 కి.మీ
=> మామూలు కాలువల‌ పొడవు: 1531 కి.మీ
=> సొరంగాలు (భూగ‌ర్భ కాలువ‌లు) పొడ‌వు: 203 కి.మీ
=> పైపులైన్ పొడ‌వు: 98 కి.మీ
=> మొత్తం లిఫ్టులు: 20
=> పంపు హౌజ్‌లు: 19
=> అవసరమయ్యే విద్యుత్తు: 4627.24 మెగావాట్లు
=> మొత్తం విద్యుత్ సబ్ స్టేషన్లు: 17
=> అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం: 139 మెగావాట్ల‌వి 7 పంపులు 
=> పాత జలాశయాలు: 5 
=> కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు: 20
=> మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీలు
=> 13 జిల్లాల్లో వ‌చ్చే కొత్త ఆయ‌క‌ట్టు: 18,25,700 ఎక‌రాలు
=> శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగ‌ర్, సింగూరుల పాత ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ: 18,82,970
=> కొత్త ఆయకట్టుకు సాగునీరు: 134.5 టీఎంసీలు
=> హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా: 30 టీఎంసీలు
=> దారిపొడవునా ఉండే గ్రామాలకు తాగునీరు: 10 టీఎంసీలు
=> పారిశ్రామిక అవసరాలకు: 16 టీఎంసీలు
=> ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం భూమి విస్తీర్ణం: 70,326 ఎకరాలు
=> ఇప్పటిదాకా సేకరించిన భూమి: 36,624 ఎకరాలు
=> సేకరించవలసిన భూమి: 33,702 ఎకరాలు
=> మొత్తం అంచ‌నా ఖ‌ర్చు: 80 వేల 500 కోట్లు
=> బ్యాంకులు ఇస్తోన్న లోన్లు: 18 వేల 800 కోట్లు

తెలంగాణలో గోదావ‌రి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కూ నీటిని ఎత్తిపోయ‌డం త‌ప్ప వేరే గత్యంత‌రం లేదు. గోదావ‌రి నీటిని కాలువల్లో త‌ర‌లించ‌డానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. న‌ది నుంచి నీటిని కాలువ‌ల్లోకి పంపాలంటే వీటి ప్రవాహాన్ని ఆపడానికి బ్యారేజీలు కట్టి, మోటార్ల ద్వారా తోడి కాలువ‌లో పోయాలి. దీన్ని లిఫ్ట్ ఇరిగేష‌న్(ఎత్తిపోత‌లు) అంటారు. న‌ది నుంచి నీరు కాలువ‌లోకి రావ‌డం, అక్కడ నుంచి సొరంగం ద్వారా ప్రయాణించడం. అక్కడ భూమిలోప‌ల ఉన్న పంపుల‌ నుంచి తిరిగి పైకి రావడం. అక్కడి నుంచి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం. ఇదీ ఇక్కడ జ‌రిగే ప్రక్రియ.

నీటిని లిఫ్ట్ చేయడానికి వాడే అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తం 7 పంపులు బిగిస్తున్నారు. ఈ పంపుల‌కు క‌రెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్నారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తోడుకోవేవిధంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. 2 టీఎంసీల నీటిని తోడడానికి సుమారు 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 7 లింకులుగా విభజించారు. ఒక్కొక్క లింకు ద్వారా ఒక్కొక్క ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నీటిని ఆయా జలాశయాలకు(రిజర్వాయర్లు) తరలిస్తూ అక్కడినుండి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని తరలించడం చేస్తారు. ఈ 7 లింకుల ద్వారా నీటి తరలింపు ఇలా ఉంటుంది.

[లింక్-1 : మేడిగడ్డ బ్యారేజి నుండి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు]
లింక్-1 ద్వారా, మొత్తం మూడు బ్యారేజీలనుండి (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) మూడు లిఫ్టుల్లో భారీ పంపుల సహాయంతో మొత్తం 33 టీఎంసీలకు పైగా నీటిని తోడుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్ కు పంపుతారు.

గోదావరి నది ప్రవాహంలో అన్నిటికంటే ముందు(ఎగువ భాగాన) ఎల్లంపల్లి రిజర్వాయర్ – తరవాత సుందిళ్ల బ్యారేజు – దాని తరవాత – అన్నారం బ్యారేజు – చివరగా మేడిగడ్డ బ్యారేజులు (అన్నిటికంటే దిగువన) ఉంటాయి. అంటే నదీప్రవాహంనుండి భారీ పంపుల ద్వారా తోడుకొన్న ఈ నీటిని గోదావరి నది ప్రవాహానికి వ్యతిరేకదిశలో దిగువభాగం నుండి ఎగువకు పంపిస్తారు.

మేడిగడ్డ బ్యారేజు నుండి పంపులద్వారా తోడిన నీరు సుమారు 15 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి ఎగువనున్న అన్నారం బ్యారేజీలోనికి చేరుతుంది. ఆ నీటిని అన్నారం నుండి పంపులతో తోడి, వాటిని మళ్ళీ ఇంకొంచెం ఎగువభాగాన ఉన్న సుందిళ్ల బ్యారేజీలోని పంపుతారు. సుందిళ్ల బ్యారేజీలో నిలువచేసిన నీటిని అక్కడి పంపులద్వారా తోడి, వాటిని చివరగా మరింత ఎగువనున్న ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి నింపుతారు.

అంటే, మేడిగడ్డ నుండి – అన్నారం – సుందిళ్ల – బ్యారేజీలద్వారా నదీప్రవాహానికి వ్యతిరేకదిశలో పంపులతో తోడుకొంటూ చివరికి ఎగువనున్న ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి నీటిని నింపుతారు – ఇదీ స్థూలంగా లింక్-1 లో జరిగే పని. దీనిద్వారా సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది.

[లింక్-2 : ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి మిడ్-మానేరు రిజర్వాయర్ వరకు]
లింక్-2 ద్వారా ఎటువంటి ఆయకట్టుకూ నీరు అందదు. అయితే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి మిడ్-మానేరు రిజర్వాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో మేడారం రిజర్వాయర్లో సుమారు 0.78టీఎంసీల నీటిని నింపుకొంటూ ప్రవాహం ముందుకు వెళుతుంది. ఈ లింక్-2 లో నీటిని తరలించడానికి రెండుచోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు.

[లింక్-3 : మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి అప్పర్ మానేరు రిజర్వాయర్ వరకు]
లింక్-3 ద్వారా మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి అప్పర్ మానేరు రిజర్యాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో మలక్ పేట రిజర్వాయర్లో సుమారు 3 టీఎంసీల నీటిని నింపుకొంటూ ప్రవాహం ముందుకు వెళుతుంది. ఈ లింక్-3 లో నీటిని తరలించడానికి రెండుచోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు. దీనిద్వారా సుమారు 86 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-4 : మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు]
లింక్-4 ద్వారా మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో అనంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్లను నింపుకొంటూ ప్రవాహం ముందుకుపోతుంది. ఈ లింక్-4 లో నీటిని తరలించడానికి నాలుగు చోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు. దీనిద్వారా సుమారు 5 లక్షల 89 వేల 280 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-5 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి చిట్యాల వరకు]
లింక్-5 ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి ములకలపల్లి(చిట్యాల మండలం) వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపుకొంటూ ప్రవాహం ముందుకుపోతుంది. ఈ లింక్-5 లో నీటిని తరలించడానికి ఎటువంటి పంపులూ వాడరు. నీళ్లన్నీ గ్రావిటీ కెనాల్ ద్వారానే క్రిందికి ప్రవహిస్తాయి. దీనిద్వారా సుమారు 2 లక్షల 51 వేల 800 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది.

[లింక్-6 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి సింగూరు వరకు]
లింక్-6 ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి సింగూరు రిజర్వాయర్ వరకూ సుమారు 625 కిలోమీటర్లమేర 3 లక్షల 30వేల ఆయకట్టుకు నీరు అందుతుంది. నీటిని తరలించడానికి ఎటువంటి పంపులూ వాడడంలేదు. పూర్తిగా గ్రావిటీ ద్వారానే నీటిని తరలిస్తారు. 

[లింక్-7 : శ్రీరామ్ సాగర్ నుండి మూడు డిస్ట్రిబ్యూషన్లు ]
లింక్-7 ద్వారా శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నుండి మూడువైపులకు నీటిని సరఫరా చేస్తూ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లోని సుమారు 5 లక్షల 39 వేల 428 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. మొత్తం 30 టీఎంసీల నీటిని 9 రిజర్వాయర్లద్వారా తరలించడానికి 7 పంపుహౌజులను ఏర్పాటుచేశారు. ఇదీ స్థూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేసే విధానం.

ప్రాజెక్టులోని లింక్ 1, లింక్ 2 తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల‌కు గ్యారెంటీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది. లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ క‌న్సార్టియం రూ.7,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. లింక్ 2 కోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు క‌న్సార్టియం రూ.11,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది.

ఈ వివరాలన్నీ తెలంగాణా ప్రభుత్వ నీటిపారుదలశాఖ వారివి. అయితే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ తెలిపే వివరాలు నీటిపారుదలశాఖ వెబ్సైట్లో ఎక్కడా పొందుపరచలేదు. కేవలం ముఖ్యమంత్రో, లేక మంత్రులో చెప్పే వివరాలనుబట్టి మాత్రమే మనకు ప్రస్తుతం పనులు ఎంతవరకూ వచ్చాయి అన్నది తెలుసుకొనే అవకాశం ఉంది. లేకపోతే ఈ ప్రాజెక్టు ప్రాంతాలన్నీ వ్యక్తిగతంగా వెళ్లి చూసి తెలుసుకోవాల్సిందే. దాదాపు లక్షకోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ ను ప్రజలకు తెలియజేసే ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రారంభం అని పేరు పెట్టి చేస్తున్న హడావిడి చూసి కొంతమంది అమాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందనే భ్రమల్లో వున్నారు.కానీ, పూర్తయింది 15 శాతమే. ప్రస్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కడితే ఇలాంటి కాంట్రాక్టర్లని బాగు చేస్తూ ప్రజల నడ్డి విరగ్గొట్టే తెల్ల ఏనుగుల్ని కట్టడమూ, అమాసకీ పున్నమికీ వెర్రెక్కి నోటికొచ్చింది వాగుతూ పిచ్చిపనులు చెయ్యటమూ, తన అధ్వర్యంలో నడిచిన ఉద్యమం వల్ల గాక అసెంబ్లీ భవనపు వాస్తుదోషం వల్ల ఒకనాటి సమైక్య రాష్ట్రం విడిపోయిందనే మూఢనమ్మకంతో ప్రగతి భవన్ నుంచే పరిపాలిస్తూ శుభ్రంగా ఉన్న అసెంబ్లీ భవనాల్ని కూల్చటమూ - ఇదేనా బంగారు తెలంగాణని సాకారం చేసే అద్భుతమైన పరిపాలన?నాలుగేళ్ళ తర్వాత కూడా తన పిచ్చ పనులకి కోర్టులతో చివాట్లు తినే దుర్దశ తప్పడం లేదు.

తెలంగాణని బొందలో పెట్టింది చాలక ఆంధ్రని కూడా తుంగలో తొక్కడానికి తగులుకున్నాడు.సిగ్గెగ్గులు వదిలేసి హైదరాబాదులో ఆస్తులు ఉన్న బలమైన తెదెపా క్యాండిడేట్లని బెదిరించి వైకాపాలోకి లాగేసి జగన్ను తన పెంపుడు కుక్కని చేసుకుని ఆంధ్రా పోర్టుల్నీ నీళ్ళనీ వనరుల్నీ ఇష్టారాజ్యం వాడేసుకుందామని అనుకుంటున్నాడు. ఇప్పుడు పోలవరాన్ని పొగుడుతూ ఎత్తేస్తానంటున్న అప్పుడు పెట్టిన కేసుల్ని అసలు ఎందుకు వేశాడు - జగనుకీ వైకాపా గొర్రెలకీ బుర్రలేదని ఆంధ్రాలో ఎవడికీ తెలివి లేదా?

30 రోజుల్లో కేసీయారుకు అనుకూలమైన నిర్ణయాలు చేసి సొంత రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న జగన్:01. కేంద్రం మెడలు వంచుతా అని మోడీ కాళ్లు పట్టుకున్నాడు, 02. కాలేశ్వరం వల్ల ఆంధ్రకు నష్టం, 03. ప్రత్యేక హోదా ప్లీజ్ ప్లీజ్, 04. హైదరాబాదులో ఏపీకి చెందిన భవనాలు అప్పగింత, 05. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిపివేత, 06. నిరుద్యోగులకు యువ నేస్తం నిలిపివేత, 07. మూడు వేల రూపాయలు పింఛన్లలో కోత, 08. పెన్షన్ వయసు 45 ఏళ్లు అని చెప్పి 60 ఏళ్లు చేశాడు, 09. రాజధాని పనులన్నీ ఆపివేశాడు, 10. కాపులకు రిజర్వేషన్లు ఆపేశాడు, 11. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతికి అమ్మ ఒడి లేదు, 12. రైతులకు విత్తనాలు లేవు, 13. ఎడాపెడా కరెంటు కోతలు, 14. పోలవరం పనులు ఆపేశాడు, 15. వంశధార నాగావళి అనుసంధానం ఆపేశాడు, 16. విజయవాడ సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆపేశాడు, 17. ఇబ్రహీంపట్నం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి పనులు ఆపేశాడు, 18. వైకుంఠపురం బ్యారేజ్ పనుల ఆపేశాడు, 19. అన్ని జిల్లాలలో ఇంటింటికి నీళ్లు పనులు ఆపేశాడు, 20. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు ఇచ్చేశాడు, 21. పోలవరం నుంచి నీళ్లు తెలంగాణకే, 22. ఢిల్లీలో ఆంధ్ర భవన్ తెలంగాణకి ఇచ్చేశాడు, 23. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వదులుకున్నాడు, 24. తెలంగాణలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇస్తాడంట, 25. ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ ఉద్యోగులను పంపించడంట, 26. ఉద్యోగులకు పెంచిన IR 27% జూలై నుంచి, 27. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు, 28. రామాయపట్నం పోర్టు లేదు, 29. హంద్రీనీవా గాలేరు-నగరి పనులు ఆపేశాడు, 30. పారదర్శకత పేరుతో ఒక నెలలో 30 రహస్య జీవోలు విడుదల చేశాడు.

Big Breaking News: తెలంగాణకి మచిలీపట్నం పోర్ట్..! రహస్య జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం …??

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో భేటి ఆయన విషయం తెలిసిందే, ఈ సమావేశం సుమారు అరు గంటల పాటు జరిగింది. ఇదే భేటిలో మచిలీపట్నం పోర్టు అంశం గురుంచి చర్చకు వచ్చినట్లు సమాచారం, మచిలీపట్నం పోర్ట్ తెలంగాణకి అప్పజప్పాలని సీఎం కేసీఆర్ ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశములో మచిలీపట్నం ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి పేర్ని వెంకట్రామయ్య పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న తెలంగాణకు మచిలీపట్నం పోర్ట్ కేటాయిస్తూ రహస్య జివో RT-62 28/06/2019 రిలీజ్ చేసినట్ల సమాచారం. ఈ రహస్య జివోలో మచిలీపట్నం పోర్ట్ పూర్తి హక్కులు, సుమారు 8000 ఎకరాల భూమి కేటాయిస్తూ తెలంగాణకి చెందేటట్లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంతదానికి అసలు విడిపోవటం దేనికి?నువ్వే ముఖ్యమంత్రివై తెలంగాణకి అన్యాయం జరక్కుండా పరిపాలించి చూపించమని సమైక్యవాదులు ఆఫర్ లాంటి చాలెంజి చేశారే!ఆంధ్రోళ్ళని తిట్టి తెలంగాణ సాధించుకోవాలని ప్లానేసి "అట్లెట్ల వస్తది తెలంగాణ?" అన్నవాళ్ళకి "ఇట్లనె వస్తది తెలంగాణ!" అని వూదరగొట్టి పన్నెండేళ్ళు అందరికీ పిచ్చెత్తించి ఆఖరికి కేసీయార్ ఆంధ్రా వనరులు లేంది ఆంధ్రా సాయం లేంది తెలంగాణ బతకలేదని తెలుసుకున్నాడా?ఉద్యమకాలంలో ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణకి మంచి చేసే ఏ పని మొదలుపెట్టినా అది పూర్తయితే ఉద్యమం బలహీన పడుతుందని ప్రాణాచారాలు పడి ఆపాడు, ఆనాడు పొరుగు రాష్ట్రం ఆల్మటి డ్యాం ఎత్తు పెంచుతుంటే అప్పటి ఆంధ్రా దొంగోళ్ళ ప్రభుత్వం అది తెలంగాణ సమస్య కాబట్టి పట్టించుకోలేదని విమర్శించాడు, అధికారంలోకి వచ్చాక అదే పొరుగు  రాష్ట్రపు ముఖ్యమంత్రిని కలిసి ఆప్యాయంగా కావిలించుకుని "మీ ప్రాజెక్టు, మీ ఇష్టం" అని భరోసా ఇచ్చాడు, ఇదివరకు పరిపాలించినవాళ్ళు అంత మంచివాళ్ళ మీద అనవసరమైన గొడవలు చేస్తే తను వెళ్ళి ఫ్రండ్షిప్ బ్యాండ్ కట్టేసి సామరస్యంగా సమస్యని పరిష్కరించానని గొప్పలు చెప్పుకున్నాడు - ఏమిటి ఈ రాజకీయం?

ప్రాణహిత రూపంలో ఉన్నప్పుడు మంచి నీటిపారుదల ప్రాజెక్టులకు ఏ లక్షణాలు ఉండాలో తెలిసిన నిపుణుల దృష్టిలో అత్యుత్తమమైనది అయినప్పటికీ ఇదే కేసీయార్ జాతీయ హోదా కోసం ఎంత ప్రయత్నించినా అనుమతులూ ప్రోత్సాహమూ లభించలేదు, కానీ కాళేశ్వరం రూపంలోకి మారిన తర్వాత దాదాపు ప్రతి ఒక్క ప్రజాహితైషికీ తెల్ల యేనుగు లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ ప్రజల్నీ మేధావుల్నీ ఇది అత్యుత్తమమైనదనే భ్రమలకి గురి చేస్తున్నది - కీలకం ఏమిటి?నాకు తెలిసిన మేరకు జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలో గానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం కోసం కాక ప్రజల నెత్తిన వీలైనంత ఎక్కువ అప్పుని ఉంచడానికే అహరహం శ్రమిస్తున్నారు. ప్రజలేమో గొర్రె కసాయివాణ్ణి నమ్మినంత చక్కగా వీళ్ళని నమ్ముతున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తున్న మహానుభావుల ఉద్గ్రంధాలు కానీ భారతదేశపు రాజ్యాంగం కానీ సర్వోన్నతమైనవే, కానీ వాటిని ఆచరణలోకి తీసుకురావలసిన వాళ్ళు తద్భిన్నమైన సంస్కృతికి చెందినవాళ్ళు అయినప్పుడు వాటి ప్రకారం నడుచుకోవడం వాళ్ళకి సాధ్యమా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలలొ మొత్తం 175 నియోజకవర్గాలలో 29 రిజర్వుడు నియోజకవర్గాలు పోను మిగిలిన 146 నియోజకవర్గాలలో  గెలిచిన రెడ్లు 51 మంది. అంటే, మూడోవంతు మంది ఒకే కులానికి, అనగా రెడ్డి కులానికి చెందినవాళ్ళు. 1. వైఎస్.జగన్మోహన్ రెడ్డి. 2. మేడా మల్లికార్జున రెడ్డి. 3.గడికోట శ్రీకాంత రెడ్డి. 4. పి రవీంద్రనాథ్ రెడ్డి. 5. ఎం సుధీర్ రెడ్డి. 6.రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 7. శెట్టిపల్లి రఘురామి రెడ్డి. 8.పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి. 9. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 10.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 11.చింతల రామచంద్రరెడ్డి. 12.భూమనకరుణాకర్ రెడ్డి. 13. ఆర్. కే. రోజా రెడ్డి. 14. బి. మధుసూదన రెడ్డి. 15. కాపు రామచంద్ర రెడ్డి. 16.వై.వెంకట్రామిరెడ్డి. 17.కె.పెద్దారెడ్డి. 18.అనంత వెంకట్రామిరెడ్డి. 19.టి.ప్రకాశ్ రెడ్డి. 20. డి.శ్రీధర్ రెడ్డి. 21.కే.వెంకట్రామిరెడ్డి. 22.పివి. సిద్ధా రెడ్డి. 23. జి బిజేంద్రనాధ్ రెడ్డి. 24. శిల్పా మోహన్ రెడ్డి. 25. శిల్పా రవి చంద్ర రెడ్డి. 26.కాటసాని రాం భూపాల్ రెడ్డి. 27.కాటసాని రామి రెడ్డి. 28. బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి. 29. కె.శ్రీదేవీ రెడ్డి. 30. కె. చెన్నకేశవ రెడ్డి. 31. వై. బాలనాగి రెడ్డి. 32 వై.సాయి ప్రసాద్ రెడ్డి. 33. ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి. 34. మేకపా గౌతం రెడ్డి. 35.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. 36. ఎన్.ప్రసన్న కుమార్ రెడ్డి. 37.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 38. కాకాని గోవర్ధన రెడ్డి. 39. ఆనం రామనారాయణరెడ్డి. 40. బాలినేని శ్రీనివాసులు రెడ్డి. 41. మాగుంట మహిధర్ రెడ్డి. 42. కేపి నాగార్జున రెడ్డి. 43. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి. 44. జీ.శ్రీనివాస రెడ్డి. 45. కాసు మహేష్ రెడ్డి. 46. పి.రామకృష్ణా రెడ్డి. 47. తిప్పల నాగిరెడ్డి. 48.  అదీప్ రాజ్ అన్నం రెడ్డి. 49. సత్తి సూర్యనారాయణ రెడ్డి. 50. ద్వారాంపూడి చంద్రశేఖర్ రెడ్డి. 51.  చిర్ల జగ్గి రెడ్డి.

వీళ్ళల్లో దరిదాపు  90 శాతం మంది మీద తీవ్ర అభియోగాలు, క్రిమినల్ కేసులు, క్రిమినల్ చరిత్ర ఉన్నవాళ్లే ! వీళ్ళే కాకుండా పాలకపక్షం నుండీ ఇతర సామాజిక వర్గాల నుండీ ఎన్నికైనవారిలో కూడా అత్యధిక శాతం మంది బలమైన క్రిమినల్ చరిత్రలు ఉన్నవాళ్లే. వీళ్ళ అనుచరవర్గాలు పూర్తిగా రౌడీలు గూండాలు ఆరాచకవర్గాలు  లంపెన్ శక్తులు.వీళ్ళూ వీళ్ళ పత్రికా నిన్నటి రోజున మొత్తం 30+ పోలీసు నియామకాల్లో ఉన్న 2 కమ్మ పేర్లనీ 40 కింద మార్చేసి తెదెపాకి కులపిచ్చి పార్టీ ం ఉద్ర వేసి ఎంత హడావిడి చేశారు?వీళ్ళూ వీళ్ళ పత్రికా నిన్నటి రోజున మొత్తం 30+ పోలీసు నియామకాల్లో ఉన్న 2 కమ్మ పేర్లనీ 40 కింద మార్చేసి తెదెపాకి కులపిచ్చి పార్టీ ముద్ర వేసి ఎంత హడావిడి చేశారు?అధికారం చేతికి రాగానే ఒక సీనియర్ జర్నలిష్టుని "నడిరోడ్డు మీద నరికేస్తా!" అని బెదిరించిన abc రెడ్డికీ తమని చిన్న మాట అన్నాడని ఒక అసహాయుడైన ఒంటరి మనిషిని బూటుకాళ్ళతో తంతూ అదేదో ఘనకార్యం అయినట్టు వీడియో తీసి ప్రచారం చేసుకున్న xyz రెడ్డికీ ఉన్నది ఏమిటి?

ఇప్పటి ముఖ్యమంత్రి నిన్నటి రోజున అప్పటి ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చి చంపమని ప్రజలకి పిలుపు ఇచ్చాడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీని ఎత్తేశాడు - అంటే, అప్పటి తన మాటల్ని నిజం చేసే అవకాశాన్ని తన అభిమానులకి ఇస్తున్నాడు.ఇది చంద్రబాబు స్వయంకృతం అనే చెప్పాలి."లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే!ఆంధర్లో పుట్టినోళ్ళంతా దుర్మార్గులే!" అని ప్రగల్భించి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కారుకూతలు కుయ్యటమే కాకుండా తన మీద కేసు పెట్టి బహిరంగ ఏదిక మీద "దొంగ బాబు!" అని అవమానించి హైదరాబాదు నుంచి తరిమికొట్టినవాణ్ణి స్వర్ణాంధ్రప్రదేశ్ అవతరణకి ఆహ్వానించి శిలాఫలం మీద పేరు కూడా చెక్కించిన క్షాత్రలేమి అతనిలో ఉన్నంతకాలం అతను శత్రువులకి లోకువ కాక తప్పదు!

కాళేశ్వరం ప్రాజెక్టును సమర్ధిస్తున్నవాళ్ళు అందరూ భావోద్వేగాలతో మాట్లాడటం తప్ప నికరమైన లెక్కలని చెప్పటం లేదు, దాని ప్రతిపాదిస్తున్నవాళ్ళే కాదు, సమర్ధిస్తున్నవాళ్ళు కూడా ప్రపంచంలోనే అతి పేద్ద ప్రాజెక్టూ, నీళ్ళు కావాలంటే ఖర్చు పెట్టకుండా ఉంటామా, అవసరమై ఖర్చు చేసినా తప్పులు పడతారా అని దీర్ఘాలు తియ్యడమే తప్ప వాస్తవాలని చెప్పటం లేదు.ఇప్పుడు వేసిన అంచనా 80 వేల కోట్లూ ఒక్కసారే ఖర్చు చెయ్యటం లేదు,సంవత్సరాల తరబడి జరిగే పనులకి కొన్నేళ్ళ తర్వాత అప్పటి రూపాయి విలువని బట్టీ ధరలు పెరగడం లాంటి వాటివల్లనూ వ్యయం పెరిగి పెరిగి మొత్తం పూర్తయ్యేసరికి లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు!దశల వారీగా పూర్తయిన వాటిని వాడుతున్నప్పుడు మెయింటెనెన్స్ కూడా లెక్కెయ్యాలి. అదీగాక, అసలైనదీ అత్యంత ముఖ్యమైనదీ ఋణభారం - పెడుతున్న ఖర్చులో తీసుకున్న అప్పుకి వడ్డీని ఎలా మర్చిపోవాలి!అసలుని మాత్రం ఎట్లా తీర్చాలి?మిగులులో వచ్చిన తెలంగాణని అప్పులోకి నెట్టిన ఘనుడు రుద్దుతున్న ఇన్నేసి కొత్త అప్పుల్ని తీర్చాల్సింది ఎవరు?తెలంగాణని ఇంత దరిద్రంగా పరిపాలిస్తున్న ఇతని దర్శకత్వంలో నడుచుకుంటున్న జగన్ అన్ని అభివృద్ధి పనుల్నీ ఆపేసి వ్యక్తిగత కక్షల్ని తీర్చుకుంటూ ఆంధ్రని కూడా తెలంగాణ దారిలోనే నడిపిస్తున్నాడు.

ఇన్నేళ్ళుగా తెలుగుజాతి నిర్మించుకున్న పరువుప్రతిష్ఠలు ఇవ్వాళ అక్కడా ఇక్కడా కొలువుదీరీన సుందోపసుందుల వల్ల అవహేళనకు గురవుతున్నాయి.ఇకమీదట సంస్కారమూ ఆత్మగౌరవమూ కలిగిన తెలుగువాళ్లు బయట రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగితే మేము ఆంధ్రప్రదేశ్ నుండీ, మేము తెలంగాణా నుండీ వచ్చాము అని చెప్పుకోవటానికి సిగ్గుపడే రోజులు సమీపంలోనే ఉన్నాయి!

తెలుగువాళ్ళు మొదట గర్వపడాల్సింది భాష గురించి!అగస్త్యుడు తమిళ వ్యాకరణం రాశాడని చెప్పుకుంటూనే మా నాన్నకి కూడా నేనే నాన్నని అన్నట్టు సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టిందని చెప్పుకునే మూర్ఖత్వం మనకి అక్కరలేదు.జనని సంస్కృతమ్ము సకల భాషలకు అన్న మాట ప్రకారం తెలుగు కూడా సంస్కృతం నుంచే పుట్టిందని ఒప్పుకోవచ్చు.కానీ, కొన్ని విషయాల్లో తెలుగు సంస్కృతాన్ని మించిపోయింది - సంస్కృత వర్ణమాలలో "ఎద్దు"లో ఉన్న పొట్టి ఏత్వం లేదు. అయితే, "ఎ" ఉండటం అనేది తెలుగుభాష యొక్క ప్రత్యేకతయే గానీ అది లేకపోవటం వల్ల సంస్కృతభాషకి వచ్చిన లోపం ఏదీ లేదు కాబట్టి ఇలాంటి ప్రత్యేకతలను గురించి అతి చెయ్యనక్కరలేదు గానీ కొత్త పదాల్ని పుట్టించడంలో సంస్కృతంతో సరితూగగలిగిన భాష తెలుగు తప్ప మరొకటి లేదు - పింగళి నాగేంద్ర రావు గారు మనకి అన్ని కొత్త పదాల్ని పరిచయం చెయ్యగలగటానికి తెలుగుభాష యొక్క నిర్మితి సంస్కృతభాష యొక్క నిర్మితికి చాలా దగ్గిరగా ఉండటమే కారణం!ఇంకొకటి, ప్రపంచంలో మానవుడు ఉచ్చరించగలిగిన ప్రతి ధ్వనికీ సంజ్ఞను ఏర్పరచుకున్న ఒకే ఒక భాష తెలుగు భాష - దానికి "ఌ, ౡ, ౘ , ౙ, ఱ"లే సాక్ష్యం!మూలాల్ని మర్చిపోయిన ఈరోజున మనం వాడకపోవచ్చు గానీ వాటిని వాడిన వెనకటివాళ్ళు లెక్క ప్రకారమే అవసరమై సృష్టించుకుని వాడారు. అలాంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కాలంలో ఉద్యమనాయకుడి స్థానంలో ఉన్న కేసీయారు "ఎవడికి తల్లి?" అని రెచ్చిపోతే అతని వాలగాత్రులు తెలుగుభాషకి ఇన్ని అక్షరాలెందుకు అనేవరకు వెళ్ళారు, అన్యాయం చేసింది మనుషులైతే భాషని తిట్టడం దేనికో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు!

ఈరోజున తన బానిసను ఆంధ్రలో సామంతరాజును చేసుకుని తెలంగాణని నాకేసినట్టు ఆంధ్రని కూడా నాకటానికి తయారై సుద్దపూసలా సామరస్యం గురించి సుభాషితాలు చెప్తున్న కేసీయారు నిన్నటి రోజున ఈ ప్రాంతం గురించి కక్కిన విషాన్ని ఎట్లా మర్చిపోవాలి?ఇప్పుడు మాత్రం ఇక్కడ 150+ సీట్లతో నెగ్గి కూడా బహుశా తన గెలుపు ఆంధ్రప్రజల వల్ల కాక కేసీయారు దయ వల్ల వచ్చిందని తన అంతరాత్మకు తెలియడం వల్లనో యేమో జగన్ తను గీసిన గీతని దాటడనే ధైర్యంతో తనకి రావలసిన హైదరాబాదులోని భవనాల్ని తీసుకుని ఆంధ్రకి ఇవ్వాల్సిన కరెంటు బకాయిల్ని చెల్లించకపోవడం ఎంత నీచత్వం?

ప్రజాస్వామ్యం అనేది పుట్టిన తర్వాత ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వాధినేతలైన వాళ్ళ మధ్యన ప్రపంచ స్థాయిలో ఇంతకన్న అధముడు ఎవడూ లేడు!ఎంత అధమాధముడు కాకపోతే పోడు వ్యవసాయం కోసం తను పట్టాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అమాయక ప్రజలని అకణ్ణుంచి వెళ్ళగొట్టి హరితహారం పేరుతో కబ్జా నాటకం నడిపించటానికి ప్రభుత్వాధికారులని పంపిస్తాడు - అమాయక ప్రజలకి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఆవెశపడిన కోనేరు సోదరుల్ని విలన్లని చేసి పెంపుడు మీడియాని ఉసిగొల్పి చోద్యం చూస్తున్న ముక్కుమంత్రికి తను ప్రభుత్వాధికారుల్ని పంపించినది ఎక్కడికో అక్కడ జరిగిన నాటకీయమైన సంఘటనలో అసలు దోషి యెవరో తెలియకుండా ఉంటుందా?బలహీనులైన ప్రజలని బలవంతుల దోపిడీ నుంచి రక్షించాల్సిన ప్రభుత్వం తనే అత్యంత క్రూరమైన దోపిడీకి అభివృద్ధి పేరున అధికార ముద్ర వేసి భక్షించడం తెలంగాణలో తప్ప ఈ సమస్త భూమండలం మీద ఇంకెక్కడైనా గతంలో జరిగిందా,  వర్తమానంలో జరుగుతున్నదా,  భవిష్యత్తులో జరుగుతుందా!

మొదటి నాలుగున్నరేళ్ళ పాలనలో తను చేసిన నిర్వాకం చూసి కూడా గతి లేనట్టు మళ్ళీ నెత్తిన పెట్టుకున్న తెలంగాణ వోటర్లు ఎంత పిచ్చివాళ్ళు?మళ్ళీ గెలిచిన కేసీయారు కొట్టిన దెబ్బకి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు ఆంధ్ర వోటర్లు కూడా పిచ్చోళ్ళైపోయారు. ఒక పక్క "కేంద్రం ఆదుకోకపోతే రాష్త్రం దివాలా తీస్తుంద"ని తన పార్టీ ఎంపీయే ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఇంకో పక్క తన ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రి రాష్ట్ర ఆర్ధిక పరిస్థి గురించి భయాన్ని వ్యక్తం చేసుంటే నవరత్నాలని ప్రజల కివ్వటం కోసమైనా అబ్జివృద్ధిని పరుగులు పెట్టించాలనే ఇంగితజ్ఞానం లేకుండా చంద్రబాబుని జైల్లో పెట్టించటం కోసం బొక్కలు వెదకటమే తక్షణ కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తున్న సైకో రాష్ట్రాన్ని అప్పుల వూబిలో ఇంకొంచెం లోతుకి ముంచటం ఖాయం - వాళ్ళ తిప్పల్ని చూసి వీళ్ళూ వీళ్ళ తిప్పల్ని చూసి వాళ్ళూ ఏడవటమే తెలంగాణ మేధావులు కేసీయారు వెంట నడిచి మొత్తం తెలుగు జాతికి తెచ్చిపెట్టిన సౌభాగ్యం!

రాజధానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానికీ సింగపూరు ప్రభుత్వానికీ మధ్య కుదిరిన ఒప్పందం గురించి విజయసాయిరెడ్డి తనకి తెలిసిన వాళ్ళని ఆరా తీస్తుంటే వాళ్ళు "రెండూ ప్రభుత్వాలే - ఏ ప్రభుత్వమైనా మరో ప్రభుత్వానికి లంచమిస్తుందా?అది సాధ్యమా!" అని చివాట్లు పెట్టాక కూడా ముడ్డీ నోరూ మూసుకుని ప్రభుత్వంలో ఉన్నందుకు చెయ్యాల్సిన మంచిపనులు చేస్తే గౌరవం పెరుగుతుంది కానీ నిర్దుష్టమైన సమాచారం లేదని తెలిసి కూడా "చంద్రబాబుని జైల్లో పెట్టేయ్యాలి!బొక్కలు వెతికి ముందే చెప్తే మీకు ప్రైజులిస్తా!మీరు చెప్పకుండా నాకు దొరికితే మీకు తాట తీస్తా!" అనే పిచ్చపుల్లయ్య కబుర్లు చెప్తే విన్నవాళ్ళు పక్కకి వెళ్ళి నవ్వుకుంటారు. ప్రస్తుతం తిరిగి దెబ్బ కొట్టలేని స్థితిలో ఉన్నాడని చంద్రబాబు మీద చూపిస్తున్న ప్రతాపం "రాష్ట్రంలో YCP అరాచకాలు పెరిగిపోయాయి!పరిణామాలు తీవ్రంగా ఉంటాయి!" అని వార్నింగు లిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ మీద చూపించగలరా జఫాలు?రేపటి రోజున అదే గతి మీకు పట్టినపుడు వాళ్ళు నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి వూహించుకింటే కళ్ళు కిందకి దిగి నేల కనబడుతుంది.

అయినా, మత్తు వదిలి తెలివి తెచ్చుకోవడానికి సరిపడిన సమయం ఎక్కువ లేనట్టుంది, అనేకమంది వైకాపా నాయకులు మా పార్టీ వైపు చూస్తున్నారు అని మాధవ్ ప్రకటించటాన్ని బట్టి. మొట్టమొదట తనకోసం కేసీయారు మొదలుపెట్టి అత్యంత చాకచక్యంగా నడిపించిన పార్టీ మార్పిడి వ్యూహాన్నే అక్కడ కేసీయారు మీదా ఇక్కడ జగను మీద ప్రయోగించి ఒకే దేశం ఒకే ఎన్నిక పేరున తెచ్చిపెట్టే జమిలి ఎన్నికలకి ముందే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల్ని ఏర్పాటు చెయ్యాలనే కృతనిశ్చయంతో భాజపా ఉన్నట్టు నాకు అర్ధం అవుతున్నది - ఔరా, ఏమి చాణక్యం?ఒకేసారి ఇద్దర్నీ లేపేస్తారా ఒకోసారి ఒకడి చొప్పున రెండు తూర్ల లేపేస్తారా అనేది వాళ్ళ వెసులుబాటుని బట్టి ఉంటుంది గానీ జమిలి ఎన్నికల లోపు ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే తప్ప దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల్లో విస్తరించడం కష్టం కాబట్టి లేపెయ్యడం మాత్రం తప్పదు. ఎవరు తవ్విన గొయ్యి వారికే నుయ్యి అయినట్టు డెభ్భయ్ వేల పుస్తకాలు చదివిన కామక్రోధమదమాత్సర్యలోభసహితదంభపూరితగర్వంతో గొప్ప మేధావి లెక్కన మొదలుపెట్టిన కొత్త రకం పార్టీ ఫిరాయింపుల చెత్త నాటకం అటు తిరిగి ఇటు తిరిగి తననే బలి తీసుకునే కృత్యాభూతమై పెరిగి పెరిగి కచరాసుర సంహారం అనే భీబత్సరసపూరితమైన విషాదాంత జగన్నాటకం ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు తెలుగుజాతి కొంత కాలం ఇతని వల్ల పోగొట్టుకున్న ప్రశాంతతనీ చేజార్చుకున్న ఐకమత్యాన్నీ తిరిగి సాధించుకుని కొంతమేరకు సాంత్వన పొందగలదు - అయినప్పటికీ నిశితమైన దృష్టితో భావిని పరికించి చూస్తే "గత కాలమె మేలు వచ్చు కాలము కంటె!" అన్నట్టుగానే ఉంది.

"యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మ సంస్థాపనార్ధాయ - తదాత్మానం సృజామ్యహం" అని భగవానుడు వాగ్దానం చేసినట్టు రావలసిన వాడు రావలసిన చోటికి రావలసిన విధంగా వస్తే తప్ప తెలుగుజాతి పూర్వ వైభవాన్ని సాధించుకోలేదనేది వ్యాసపరాశరషిర్డీసాయినాధపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్టితమైన గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న నిష్ఠుర సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...