Tuesday 27 September 2022

మన హిందువులకి మోక్షం అనేది ఒక పిచ్చిలా తయారైంది.

అది ఎక్కడవరకు వెళ్ళిందంటే Quora తెలుగు విభాగం జ్యోతిషం గురించి ఒక వేదిక ఏర్పాటు చేస్తే అక్కడ సైతం జాతకంలో మాకు మోక్షప్రాప్తి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారు.అందుకు నిర్వాహకులు " భూమి మీద వుండగానే ఆత్మానందాన్ని అనుభవించడమే మోక్షం. సరగున పాదములకు (పాద పద్మములకు) స్వాంతమను సరోజమును సమర్పణము చేయడమే మోక్షమంటే. జాతకాలు చూసి మోక్ష నిర్ణయం చేయలేము. నీ మనస్సాక్షికి మించిన జాతకం మరొకటి లేదు. జాతకం లో మోక్షం వస్తుందని వుందని మోక్షం కోసం ప్రయత్నం చేయడం అవివేకం" అని చాలా చక్కటి జవాబు ఇచ్చారు.ప్రశ్న ఎప్పుడూ మంచిదే,వేసినవారిని వెక్కిరించడం మంచిది కాదు గానీ,కల్లగురువులు మోక్షం గురించి వూదరగొట్టడం వల్లనే ప్రశ్న వచ్చింది,కదా!

" భూమి మీద వుండగానే ఆత్మానందాన్ని అనుభవించడమే మోక్షం" - చాలా బాగా చెప్పారు.గురువులు సైతం మోక్షాన్ని ఇవ్వలేరు.ఎవరికి వారు చేరుకోవాల్సిన మానసిక స్థితి అది.సద్గురువులు సైతం మోక్షం గురించి చెప్పడం,దానికోసం ప్రయత్నించడానికి మిమ్మల్ని సంసిధ్ధుల్ని చెయ్యడం మాత్రమే చెయ్యగలరు.మానవులు మొదట ఐశ్వర్యం కోసం ప్రయత్నించాలి.ఐశ్వర్యం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించాలి.ఇక చాలు అనిపించినప్పుడు మాత్రమే మోక్షం కోసం ప్రయత్నించాలి.మీరు అనుభవిస్తున్న ఆనందం గురించి ఇక చాలు అని ఇతర్లు మీకు చెప్పకూడదు,ఇతర్లకి మీరు చెప్పకూడదు.

మోక్షం మీద ఆసక్తి కలగడం అనేది షడ్రసోపేతమైన విందు భోజనం చేశాక భుక్తాయాసం వల్ల నిద్ర ముంచుకు రావడం లాంటిది.ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి తప్ప నిద్ర పొమ్మని సలహా ఇవ్వకూడదు కదా!అది తెలియని కొందరు మేము చెప్పినట్టు వింటే మోక్షం వస్తుందని అబధ్ధాలు చెప్తున్న కల్లగురువులని నమ్మి మోసపోతున్నారు.

ఐశ్వర్యం కావాలంటే కల్లగురువుల కాళ్ళకి మొక్కటం వాళ్ళ సొల్లుకబుర్లు విని స్తోత్రాలు చదవటం పూజలు చెయ్యటం మాని వ్యవసాయం చెయ్యాలి,ఉద్యోగం చెయ్యాలి,వ్యాపారం చెయ్యాలి,ప్రతి రూపాయినీ తెలివైన పధ్ధతిలో ఖర్చు పెట్టాలి.తెలివైన వాడు సరైనచోట మదుపు చేసిన ప్రతి రూపాయీ తక్కువలో తక్కువ వంద రూపాయల్ని తెచ్చి ఒళ్ళో పడేస్తుంది.

గృహస్థులకి ఐశ్వర్యం మాత్రమే అవసరం,మోక్షం అనవసరం.మోక్షం కోసం గృహస్థులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

జై శ్రీ రాం!

Thursday 15 September 2022

హరి ఓం హరి!హరి ఓం హరి!హరి ఓం హరీ!

 పల్లవి:హరి ఓం హరి!హరి ఓం హరి!హరి ఓం హరీ!

01.చరణం:నువ్వు నిజం,నేను నిజం,విశ్వం నిజం,

నిన్న నిజం,నేడు నిజం,రేపు నిజం,

ఆది నిజం,మధ్య నిజం,అంతం నిజం,

ప్రకృతీ నిజం,పురుషుడూ నిజం - హవామహే!

||పల్లవి||

02.చరణం:సృష్టి నిజం,వ్యక్తి నిజం,వ్యష్ఠి నిజం,

కాంక్ష నిజం,వాంఛ నిజం,బాధ నిజం,

కామన నిజం,వాదన నిజం,వేదన నిజం,

వ్యామోహమూ నిజం,వైరాగ్యమూ నిజం - ఋతాయంతే!

||పల్లవి||

03.చరణం:ఏదీ మాయ కాదు,ఏదీ ఉచితం కాదు,

నిన్న లేనిది నేడు రాదు,నేడు లేనిది రేపు రాదు,

ప్రయత్నం నిజం,ఫలితం నిజం,ఐశ్వర్యం నిజం,

కర్తృత్వమూ నిజం,భోక్తవ్యమూ నిజం - విరాజంతే!

||పల్లవి||

04.చరణం:అగ్ని నిజం,హోత నిజం,క్రతువు నిజం,మిత్రుడు నిజం,

కవిత నిజం,భవిత నిజం,మహిత నిజం,వరుణుడు నిజం,

అన్నం నిజం,ప్రాణం నిజం,ఇంద్రియాలు నిజం,మనోబుధ్ధులు నిజం,

వేదమే శివం,శివమే వేదం,శివ మచ్యుతం - బ్రహ్మణస్పతే!

||పల్లవి||

05.చరణం:రాగం నిజం,ద్వేషం నిజం,పక్షపాతం నిజం,

యుధ్ధం నిజం,కవచం నిజం,శస్త్రం నిజం,స్వపక్ష రక్షణ నిజం,

లాభం నిజం,నష్టం నిజం,శత్రువు నిజం,విపక్ష నిధన నిజం,

హింస నిజం,సంధి నిజం,రక్తపాతం నిజం,నిగ్రహం నిజం - సమాయుషే!

||పల్లవి||

06.చరణం:బ్రాహ్మ్యం నిజం,క్షాత్రం నిజం,వైశ్యం నిజం,

శూద్రం నిజం,పంచమం నిజం,తారతమ్యం నిజం,

ఉన్మత్తత నిజం,అధికారం నిజం,చరిత్ర నిజం,

అణచివేతా నిజం,తిరుగుబాటూ నిజం - సంభవామి యుగే యుగే!

||పల్లవి||

Monday 5 September 2022

అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

భారత జాతీయ ప్రభుత్వంలో "అవినీతి నిరోధక శాఖ" అనేది అసలు అవినీతిని నిరోధించే శాఖ కాదు.అది "లంచం తీసుకుంటున్నప్పుడు మాత్రమే పట్టుకోవాలి" అన్న నిర్దేశంతో ఏర్పాటు చేసిన అనవసరమైన శాఖ!అసలు సిసలైన అవినీతి నిరోధక శాఖ అయిన "విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్" అనేది ఉన్నప్పుడు దీని అవసరం ఏమిటి? ప్రజలను మభ్యపెట్టటానికే!లంచం ఇచ్చేలా ఏర్పాటు చేసిన విధివిధానాలను వెతికి పట్టుకునే అసలైన అవినీతి నిరోధక శాఖ అయిన "విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్" అనే శాఖని బలహీనం చేసి బలహీనమైన "అవినీతి నిరోధక శాఖ"ని ప్రభుత్వంలోని ఇతర శాఖలకు సమాంతరంగా పనిచేసేలా సృష్టించారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

నిజానికి పోలీసులు ఎలాగైతే సాధారణ ప్రజల మీద నిఘా ఉంచుతూ నేరాలను అరికడతారో "విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్" అలాగే ప్రభుత్వాధికారుల పైన ప్రభుత్వోద్యోగుల పైన నిఘా పెట్టాలి.అనునిత్యం  ప్రభుత్వ కార్యాలయాల మీదా ఉద్యోగులూ అధికారుల మీదా ఆడిట్లు నిర్వహిస్తూ క్రమశిక్షణా రాహిత్యాన్నీ అవినీతినీ నేరాల కింద నమోదు చేసి కేసులు పెట్టాలి.కానీ దానికి పనిగట్టుకుని పక్షవాతం తెప్పించి పిల్లుల తలల్ని గొరగడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని మంగళ్ళతో "అవినీతి నిరోధక శాఖ" అనే పక్షవాతపు రోగిని అవినీతి మీద యుధ్ధానికి పంపిస్తున్నారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

ట్రాఫిక్ పోలీసింగ్ వ్యవస్థ రవాణా శాఖకు అనుబంధమై పని చేయాల్సిన వ్యవస్థ అయితే దీన్ని తీసుకెళ్ళి పోలీసు శాఖకి అనుబంధం చేశారు.ప్రభుత్వ వ్యవస్థల నుంచి ప్రజలకి అందాల్సిన సౌకర్యాలలో సేఫ్టీ,సెక్యూరిటీ అనేవి ముఖ్యమైనవి.వీటిలో సేఫ్టీ అనేది సాంకేతిక విషయం అయితే సెక్యూరిటీ సాధారణ విషయం.రోడ్ల మీద ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత రవాణా శాఖది - రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు,నిర్మాణం జరిగే పలు స్థాయిల్లో వాడుతున్న మెటీరియల్స్ యొక్క నాణ్యత,రోడ్దు మీద వాహనాలు వెళ్ళాల్సిన పధ్ధతులూ,పార్కింగ్ సౌకర్యాలూ అన్నీ గమనిస్తూ పౌరుల కదలికల్నీ ప్రయాణాల్నీ నియంత్రించే రావాణా శాఖయే ట్రాఫిక్ కంట్రోలింగ్ చెయ్యటం సముచితం అనే ఇంగిత జ్ఞానం రావాణా శాఖలోని ఒక్కరికీ లేకపోబట్టే ట్రాఫిక్ కంట్రోలింగ్ పోలీసు శాఖ అధీనంలోకి వెళ్ళింది.ట్రాఫిక్ కంట్రోలింగ్ అనేది రవాణా శాఖ నిర్మించిన రోడ్లకు సంబంధించిన సాంకేతిక ఉపశాఖ అయితే దాన్ని పోలీసు శాఖకు సాధారణ ఉపశాఖను చేశారు.ఇది రెండు శాఖలలోని ఉద్యోగులకూ పై సంపాదన కోసం రెండు శాఖల మధ్యన ఏర్పాటు చేసిన ఒక అవినీతి వారధి - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ అనేది ఎలా ఉంటుందో రిజిస్ట్రేషన్ శాఖ,రెవెన్యూ శాఖ,పంచాయితీ లేదా పురపాలక శాఖల మధ్యన ఏర్పాటు చేసిన సంబంధ బాంధవ్యాలను చూస్తే తెలుస్తుంది.రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక ఆద్స్తి యొక్క యాజమాన్యం మారినప్పుడు అది వయవ్సాయ భూమి అయితే రెవెన్యూ శాఖకూ ఇల్లు లాంటి మానావ్ నిర్మిత ఆస్తి అయితే స్థానిక పంచాయితీ ఆఫీసుకు గానీ పురపాలక సంఘానికి గానీ రిజిస్ట్రేషన్ ఆఫీసు నుంచి నోట్ వెళ్ళాలి,అక్కడ రికార్డులు మారాలి.దీనికోసం పౌరులు ఏమీ చెయ్యాల్సిన పని లేదు.బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసిన "పౌరుల వద్దకు ప్రభుత్వ సేవలు వెళ్ళటం" అనే పాత మంచి విధానాన్ని స్వతంత్రం వచ్చాక తీసేసి "ఒక చిన్న పనికోసం పెద్ద పెద్ద పనులన్నీ ఆపుకుని ప్రభుత్వాధికారుల చుట్టూ ప్రజలు చక్కర్లు కొట్టటం" అనే కొత్త చెత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు మన అధికారులుం గార్లు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

అసలు రవాణా శాఖ చేస్తున్న అత్యంత లాఘవమైన అవినీతి ఇంజనీరింగ్ అద్భుతం నేరాలకి తావు లేదనుకునే చోట కూడా నేరాలను చేయంచగలిగే నియమాలను ఏర్పరచి స్వయాన ప్రజల చేతనే అవినీతి చేయించి జరిమానాలు వెయ్యటం!పౌరుడు స్వంతంగా వాడుకునే ఒక వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తీసుకెళ్ళినప్పుడు జరగాల్సిన మామూలు పధ్ధతులను తిరగేసి మరగేసి తప్పుదోవ పట్టించి ఉల్లంఘనలు తప్పనిసరిగా జరిగేటట్టు నిబంధనలను తయారు చేశారు.డిపార్టుమెంటు వారు "మీకు మీరు ఆఫీసుకు వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోండి!" అని పౌరులకు చెప్పటంతోనే మొదటి లెవెల్ అవినీతి మొదలవుతుంది.అది డిపార్టుమెంటు చెయ్యాల్సిన విధిలోని అత్యంత సహజమైన బాధ్యత అనేది పౌరులకు తెలియదు,తెలియనివ్వలేదు అంటే బాగుంటుంది.వాళ్లు చెయ్యాల్సిన పనిని పౌరులకు చేతి చమురు వదిలించుకునే వ్యవహారంలా  తయారు చేసి అప్పగించడం దగ్గిర్నుంచీ పౌరుల్ని కోర్టుల ముందు "పన్నుల ఏగవేత దారుడు" అనే నేరం మోపి నిలబెట్టడం వరకూ జరుగుతున్న అనేకమైన సంఘటనల వెనక ఉన్న అదృశ్య హస్తం ప్రభుత్వాధికారుల అవినీతియే అన్నది నిజం - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

పౌరుడిని చట్టబధ్ధంగా నడుచుకునేలా చెయ్యడమే ఒక ప్రభుత్వ అధికారి యొక్క ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క బాధ్యత అని చట్టలో ఉంది.కానీ, ఇక్కడ నడుస్తున్నది పూర్తి వ్యతిరేకం.ఇక్కడ నడుస్తున్నది ప్రభుత్వాధికారుల దృష్టిలో చట్టాన్ని అమలు చెయ్యడం అంటే పౌరుల్ని నేరస్థుల కింద తయారు చేసి వాళ్ళనుంచి జరిమానాలు కట్టించుకోవడం మాత్రమే.జరిమానాలు కట్టలేని వాళ్ళ దగ్గిర లంచం తీసుకుని జరిమానా రద్దు చేసి పంపిస్తారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

మీరు గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళి అప్లికేషన్ పెట్టినప్పుడు పలు రకాల సర్టిఫికెట్లను జత చేయమంటారు.అందులో కొన్ని ఇతర ఆఫీసుల నుంచి రావలసిన వాటిని తేవడానికి మిమ్మల్నే వెళ్ళమంటారు.వాటిని ఆయా చోట్లనుంచి తెప్పించుకోవడం వాళ్ళ పనే అని మీకు తెలియదు కాబట్టే వెళ్తున్నారు.అక్కడ లంచాలు ఇచ్చి తెచ్చుకుని వీళ్ళకి ఇస్తున్నారు.ఇలా ఎన్నో రకాల సంస్థాగత,వ్యవస్థాగత అపసవ్యతలను సృష్టించి పౌరులకు అవినీతిని తప్పనిసరి చేస్తున్నారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?

న్యాయ్వవస్థ కూడా అవినీతికి అతీతం కాదు.ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని నేరం కింద చూసి విజిలెన్స్ శాఖకు అప్పగించి నేరపరిశోధనకు పురమాయించి నేరం రుజువైతే శిక్షించాల్సిన కోర్టులే పని చెయ్యనప్పుడు పౌరులు ఎంత ఆవేదన పడి మాత్రం ప్రయోజనం ఏమిటి?

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...