Tuesday 30 October 2018

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర విశేషాలు - ఉపోద్ఘాతం

     మొదటి స్వాతంత్య్ర పోరాటం సఫలమైనట్లే అయి చివర్లో దురదృష్టం కొద్దీ విఫలమై ఏ పోరాటం ఇంగ్లీషువాళ్ళని తరిమికొట్టటానికి ప్రారంభించారో ఆ పోరాటమే ఇంగ్లీషువాళ్ళు మరింత పాతుకుపోవటానికి ఉపయోగపడింది!అప్పటినుంచి రెండవ స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యేలోపు భారతీయ సమాజం ఎట్లా ఉండేది?

     ఆధునిక భారతదేశ చరిత్ర అనే అంశాన్ని తరచిన చరిత్రకారులూ పాత్రికేయులూ మేధావులూ విశ్లేషకులూ  ఈ కాలాన్ని గురించి చెప్పేటప్పుడు కాంగ్రెసు పార్టీ స్థాపనతో మొదలుపెట్టి రాజకీయాలనే స్పృశించారు తప్పితే సమాజం గురించి ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి."మనల్ని విదేశీయులు పరిపాలిస్తున్నారు!","విదేశీయులు పాలించడం వల్లనే మనకి అన్యాయం జరుగుతున్నది!","వీళ్ళని వాళ్ళ దేశానికి తరిమికొట్టి స్వతంత్రం తెచ్చుకోనిదే మనదేశం(?) బాగుపడదు!" అనే రాజకీయ భావనలు రావడానికి పునాదియైన అప్పటి భారతీయ సమాజం గురించి మనకి  వాస్తవాలు తెలియడం లేదు.ఎందుకంటే, అప్పటి సమాజం గురించి చెప్పాలనుకుంటున్న ఇప్పటి మేధావుల్లో ప్రతి ఒక్కరికీ ఒక పొలిటికల్ ఎజెండా ఉంది - తమ ఎజెండాకి వ్యతిరేకమైన విషయాల్ని దాచేసి అనుకూలమైన విషయాల్ని మాత్రమే చెప్పారు!

     ఇలాంటి చిక్కులు ఎదురైనప్పుడే మనుషులకి కాలయంత్రం లాంటి ఫాంటసీల మీదకి మనసు పోతుంది - మనమే వెళ్ళి చూస్తే పోతుంది గదా వాళ్ళూ వీళ్ళూ చెప్పే అబద్ధాలని నమ్మడం దేనికి?అయితే, కాలంలో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహార్మ్,రిజల్టులో కూడా గ్యారెంటీ లేదు!కానీ తక్కువ ఖర్చుతో కాలంలో ప్రయాణాన్ని సాధ్యం చేసే సాధనం ఒకటి ఉంది - అదే, సాహిత్యం!ఒక కాలం గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఆ కాలపు ప్రముఖ వ్యక్తుల జీవితచరిత్రలు గానీ ఆత్మకధలు గానీ అధికారికమైన విషయనిధులు(DATA BANKS) అవుతాయి.అలాంటి వాటిలో సా.శ. 18వ శతాబ్ది నాటి సమాజం గురించి దాని నైసర్గిక వర్ణనతో సహా తెలుసుకోవడానికి ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర అనే ట్రావలాగ్ కన్న విలువైనది మరొకటి లేదు.

     వేరే వ్యక్తి చెప్పినదాన్ని నేను మీకు చెప్తున్నానని అనగానే "ఇతన్ని నమ్మవచ్చునా!అబద్ధాలు చెప్పడం లేదని గ్యారెంటీ ఏమిటి?" అనే సందేహం వస్తుంది.కానీ ఈయన కాశీయాత్ర చరిత్ర రాసింది ఉబుసుపోక కోసం కాదు - అప్పటికే రెండుసార్లు కాశీ వెళ్ళి వచ్చి మూడోసారి వెళ్తున్నప్పుడు ఒక స్నేహితుడు తనకూ ఇతరులకూ సహాయకారిగా ఉంటుందని అడిగితే రాసి ఇచ్చినది,స్నేహితుడికీ ఇకముందు కాశీ వెళ్ళానుకున్నవాళ్ళకీ ఉపయోగపడటం కోసం రాసేదాంట్లో అబద్ధాలు చెప్తే ఉన్న పరువు పోతుంది, కదా!

     మొదటి ముద్రణ సా.శ 1838లో జరిగింది - అంటే ఆయన రాసినది మిత్రుడు చదివి మెచ్చుకుని అందరికీ పనికొస్తుందని అనుకోవడానికీ ప్రచురణ సిద్ధమవటానికీ ఏళ్ళు పట్టదు కదా!సా.శ. 2018లో ఉన్న మనం సా.శ 1820ల నాటి భారతదేశాన్ని చూడబోతున్నాం - కాలంలో ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా?



ఎంతమంది ప్రయాణీకులు ఉన్నారో లెక్క తెలిస్తేనే గానీ ఈ బండి కదలదు.
-----------------------------------------------------------------------------------------

2

Thursday 25 October 2018

మతము లన్నిటి నడుమ ఏ మతము మంచిది?దైవము లందరి నడుమ ఏ దైవము సర్వోన్నతం!

అర్జునుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించినట్టు మీకు నేను భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నాను!అసలు వేదంలోనే "న తస్య ప్రతిమా అస్తి!" అని తన గురించి తను చెప్పుకున్న దైవం మళ్ళీ అవతారం అనే పేరున రూపం ధరించడమూ ఆ రూపాలను హిందువులు భక్తితో ఆరాధించడమూ ఏమిటి అని కొందరు పండితులకే అనుమానాలు  వస్తుంటే దేవుణ్ణని చెప్పుకున్న శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం ఎట్లా చూపించగలిగాడు?విశ్వం లోపల ఉన్న భూమి మీద నుంచుని విశ్వం మొత్తాన్ని ఎట్లా చూపించగలడు?మొత్తం చూపించాలంటే విశ్వం బయటికి తీసుకెళ్ళాలి - తన నుంచే సమస్తమూ పుడితే ఇంక దీనినుంచి బయటికి వెళ్ళటం సాధ్యమా!ఇంకొక మెలిక కూడా వుంది - దేవతలు కూడా చూడలేరు అంటూనే మనిషైన అర్జునుడ్ని పట్టుకుని నీకు నేను చూపిస్తున్నాను అంటున్నాడు,ఇదేం తిరకాసు?

సంస్కృత సాహిత్యం,అందులోనూ ధార్మిక సాహిత్యం చాలా మార్మికమైనది - ఉన్నది ఉన్నట్టు చూసి మనకి ఎలా అర్ధమైతే దాన్నే ఫిరాయించేసుకుంటే సాయిబుల్లోనో కిరస్తానుల్లోనో నాస్తికుల్లోనో కలిసిపోవడం ఖాయం!నిజానికి, అక్కడ ఆయన చూపించిందీ ఈయన చూసిందీ ఏమీ లేదు - దివ్యదృష్టి ఇవ్వడం కూడా మిధ్యయే!విశ్వానికీ దైవానికీ ఉన్న సంబంధం గురించి కొన్ని గంభీరమైన విషయాలని ఆయన చెప్పాడు,ఈయన జ్ఞానపు స్థాయిని పెంచుకుని అర్ధం చేసుకోగలిగాడు - అంతే!అంతకుమించి సాగదీసి ఆలోచిస్తే దుర్యోధనుడితో సహా కౌరవసైన్యాన్ని తను ఎప్పుడో చంపేశానని అంటున్నాడు కదా,ఇంకా అర్జునుడూ పాండవసైన్యమూ వాళ్ళని చంపాల్సిన అవసరం దేనికనే పిచ్చి డౌట్లు కూడా వస్తాయి!ఒక ముగ్గుబుట్టలాంటి చింపిరిజుట్టున్న పిచ్చి ముసిల్దానికి ఆల్రెడీ ఈ అనుమానం వచ్చేసింది - తెలివైన వాళ్ళు గనక హిందువులకి రాదులెండి, వస్తే ప్రమాదమే!

భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపాన్ని చూడాలంటే ముందు కొన్ని విషయాలని తెలుసుకోవాలి.జుదాయిజం నుంచి పుట్టిన రెండు శాఖల కన్న ఒకింత వెనకబడి తడబడుతున్న హిందూమతం ఇవి ఉనికిలోకి రాకముందు ప్రపంచమంతటా వ్యాపించి తను అడుగు పెట్టిన ప్రతిచోట అక్కడ నెలకొని ఉన్న అజ్ఞాన తమస్సును తన విజ్ఞాన ఉషస్సు యొక్క మృదుస్పర్శతో పోగొట్టి ఆయా మానవ సమూహాలు గొప్ప సంస్కృతులను నిర్మించుకోగలిగేటట్లు చేసింది.ఒక హిందువుగా నేను ఈ మాట చెబితే హిందువులు స్వమతాభిమానం చూపించి నమ్మెయ్యడమూ హైందవేతరులు అనుమానించడమూ సహజమే!కానీ, హిందూ మతస్థులు కానివాళ్ళు తమ మతాన్ని గురించి ఆ మాట చెప్పుకోవటానికి బదులు తమకి సంబంధం లేని హిందూమతానికి  ఆ ఖ్యాతిని కట్టబెడుతుంటే మన వెనకటి తరాల వాళ్ళు సాధించిన విజయాల్ని పొగుడుకోవటానికి మనం ఎందుకు సంశయించాలి?

వాళ్ళెవరో India, that is bharat - so Great! అని ఒప్పుకుని దీని గురించి తెలుసుకోవటం అల్లాటప్పా గోంగూరకట్ట కాదని Indology అనే ఒక వైజ్ఞానిక శాఖనే తెఱిచి పరిశోధనలు చేసి ఎన్నో వాస్తవాలని వెలికి తీస్తుంటే హిందువులు కనీసపు ఆసక్తిని కూడా చూపించకపోతే ఎట్లా!వాళ్ళందరూ సత్యం పట్ల నిబద్ధతతో తమ తమ మత విశ్వాసాలను పాటిస్తూనే భారత దేశపు ఔన్నత్యాన్నీ సనాతన ధర్మం యొక్క విశిష్టతనీ గుర్తించిన సత్యాన్వేషులు - హిందూమతానికి బాకా కొట్టి భజనలు చెయ్య లేదు, గొప్పల్నీ తప్పుల్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్పారు!

"Christianity doesn't exist, Jesus Christ never existed.Jesus Christ was an invention by the orthodox bishops at the Councel of Nicaea. That's what he was. He was the idea ,but they were,they wanted to create the ideal the deity to make people to slaves and that deity was tirn the other cheek love thy neighbor and tgis is why we're in a mess.Today, you know not thy enemies and all this crap.This is a great way to subjugate people.You know Don't make them sell their sheep bringing in the sheaves and  these innocent sheep here are more intelligent than Christians. The vedas on the other hand like all in a European and all most in even like all indigenous spiritual traditions all over the world,  tell you fight back to defend yourself.And,  Christianity itself  is Jewish.It's radical jewish offset, a sect,like a kind of branch. Davidians or isis that broke away from judaism and the jews also were cruel while killing others,they were  killing anyone that they deemed to be, you know, sinners." - ఇది అన్ని మతాలనీ తులనాత్మకమైన అధ్యయనం చేసిన ప్రపంచ స్థాయి మేధావులు సూత్రీకరించిన వాస్తవం.

ఇవ్వాళ మాదే అత్యున్నతమైన మతం,మా ప్రవక్తయే జగద్రక్షకుడు,మా దేవుడే సర్వేశ్వరుడు అని డబ్బా కొట్టుకుంటున్న  క్రైస్తవీయ మహమ్మదీయ మతాలు రెండూ జుదాయిజం యొక్క వికృత శిశువులు అనేది ఆయా మతాల వారు కూడా ఒప్పుకు తీరాల్సిన యదార్ధం - అది యెప్పుడో తేటతెల్లమై పోయింది.వికృత శిశువులు అని యెందుకు అంటున్నానంటే, అంతస్సారాన్ని బట్టీ ఆచరణా విధానాలని బట్టీ జుదాయిజం సనాతన ధర్మానికి చాలా దగ్గిరగా ఉండే ఆదర్శవంతమైన జీవనవిధానం కాగా ఈ క్రైస్తవీయ మహమ్మదీయ మతాలకి రూపకల్పన చేసినవారు ఈ జుదాయిజం నుంచి కొన్ని మంచి విషయాలని తీసుకుని ఇతరుల్ని తమకి బానిసల వలె పడివుండేటట్లు చేసుకోవడానికి పనికి వచ్చే స్వంత పాండిత్యపు కొత్త సూత్రీకరణల్ని కలిపి తమ మతాల్ని సృష్టించుకున్నారు.

సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే బ్రహ్మ, సరస్వతి జుదాయిజంలో కనిపించే అబ్రహాం, సారా అనే రెండు జంటల మధ్యన చాలా దగ్గరి పోలికలు ఉంటాయి.ఈ రెండు జంటల లోని స్రీ పురుషులకి ఒకేసారి సోదర సోదరి సంబంధమూ దాంపత్య సంబంధమూ ఉంటుంది.ముఖ్యమైన తేడా అల్లా బ్రహ్మ,సరస్వతి పేరుతో సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే జంట మన వంటి పార్ధివ దేహధారులు కాక జ్ఞానరూపాలు మాత్రమే.జుదాయిజం యొక్క మూల ప్రవక్త అయిన అబ్రహాం మరియు అతని భార్య స్థానంలో ఉన్న సారాలు మాత్రం మనవంటి పార్ధివ దేహధారులే!

Psalm 78:2 
I WILL OPEN MY MOUTH IN A PARABLE;I WILL UTTER DARK SAYINGS OF OLD:"హిందూమతం యొక్క సాహిత్యం అంతా ఎవరికీ అర్ధం కాని సంస్కృత భాషలో ఉంటుంది.మా బైబిలు చూడండి ఎంత సరళమైన భాషలో ఉంటుందో!" అని జబ్బలు చరుచుకుంటున్న క్రైస్తవ మతప్రచారకుల బూటకాన్ని బయటపెట్టే వాక్యం ఇది!ఏసు వారి అనుచరులకే కొన్నిసార్లు ఆయన చెప్పిన నిగూఢమైన మార్మికమైన పిట్టకధలూ నీతివాక్యాలూ కలగలిసిపోయిన గందరగోళపు వచనానికి ఠారెత్తిపోయి ఒక్కండే ఉండగా అడిగితే "మీరు నా స్వజనులు!నేను చెప్పు సమస్తమూ మీకు మాత్రమే తెలియవలెను!ఓ నా ఇశ్రాయేలీయులారా,పొరపాటున మన మందలో చేరిన అన్యజనులకు తెలియకుండుటకు నేనట్లు మాట్లాడువాడను!నా తండ్రి నన్ను ఇశ్రాయేలీయుల కొరకే పంపియున్నాడు" అని తెగేసి చెప్పాడు. తమ తమ మాతృభాషల్లోకి అనువదించి శుద్ధ వచనంలో చెప్పినప్పటికీ ఒక పట్టాన అర్ధం కాకపోవడం బైబిలు మరియు ఖురాను యొక్క ప్రత్యేకత అయితే, హిందువుల వేదం సంస్కృతం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది - భావం కూడా సూటిగా ఉంటుంది.

"India is, the cradle of human race, the birth place of human speech, the mother of history, the grandmother of legend, and the great grandmother of tradition. Our most valuable and most instructive materials in the history of man are treasured up in india only"
- Mark Twain.


ఎవరీ మార్కు ట్వెయిను గారు?హిందూ మతతత్వ వాదియా!కాదు, కాదు గాక కాదు.వినగానే పొట్టచెక్కలయ్యేలా ఒక్క జోకు వెయ్యటం ఎంత కష్టమో జబర్దస్తు టీవీ క్యామెడీల్ని చూస్తే తెలియడం లేదా!అట్లాంటిది, అరిస్తే హాస్యం స్మరిస్తే హాస్యం అన్నట్టు బతికి ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్న మహా మేధావి!మేధావిత్వం చాలామందిలో ఉంటుంది,కానీ డబ్బుకి సంబంధించిన వ్యవహారాల్లో ఈయన నిజాయితీ యెంత గొప్పదో తెలుసా!తన రచనల వల్ల వచ్చిన డబ్బుని పెట్టగూడని చోట్ల పెట్టుబడి పెట్టి తనతో పాటు ఇతర్లనీ నష్టపెట్టాడు.అయితే మళ్ళీ ఆర్ధికంగా కూడదీసుకోగానే తనవల్ల నష్టపోయినవాళ్ళని పేరుపేరునా గుర్తుంచుకుని చెల్లింపులు చేశాడు - నోటరీలూ గట్రా వుండి చచ్చినట్టు చెల్లించాలేమో అనే పరిస్థితి లేదు, అయినా చెల్లింపులు చేసేశాడు! అంత మంచితనం ఉండబట్టే అంత మంచి హాస్యం సృష్టించగలిగాడేమో - మన హిందూమతాన్ని పొగిడి ఉండకపొయినా మెచ్చుకోవచ్చు కదూ!

కొలంబస్ ఇండియాకి సముద్రమార్గం కనుక్కుందామని బయల్దేరి తను విడిది చేసినది అమెరికా అని తెలియక అక్కడివాళ్ళని రెడ్ ఇండియన్లు అని యెందుకు పేరు పెట్టాడు?అప్పటికే ఇండియన్ కల్చర్ అని తను తెలుసుకున్నది అక్కడ కనపడటం వల్లనే!ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ తమ ప్రాచీనతను తెలుసుకోవటం కోసం జరుగుతున్న త్రవ్వకాలలో అక్కడ ఒకనాడు హిందూమతం అత్యంత ప్రజాదరణ కలిగి ఉండేదని తెలియజెప్పే ఆనవాళ్ళు బయటపడుతున్నాయి.కానీ,అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాటిని బయటికి రానివ్వటం లేదు.

"..These Jews are derived from the Indian philosophers;They are named by the Indians Calani.."
-Flavius Josephus(Book 1:22)

ఇంత స్పష్టమైన విషయాన్ని దాచిపెడుతున్నది యెందుకోసం?తమ మతం కొత్త మతం ఏమీ కాదనీ హిందూమతం నుంచి చీలిన జుదాయిజం నుంచి చీలిన పిల్లమతం అని తెలిస్తే ఏ హిందువు తమ మతంలోకి వస్తాడు?

ఈ భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న నాగరికతలను కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యమూ అది నిర్మించబడిన సంస్కృతమూ అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!

వేదం అనే పదానికి మూల ధాతు రూపం "విద్" - దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం "to know",అంటే మానవుడు తెలుసుకోవలసిన,తెలుసుకోదగిన,తెలుసుకోగలిగిన జ్ఞానం!వైదిక సాహిత్యంలో కనిపిస్తున్న అనేక సంస్కృత పదాలకి ఇతర భాషల్లోకి అనువదించటానికి సరైన పదాలు లేవు."ధర్మం" అనే పదానికి అర్ధం కోసం ప్రముఖమైన ఇంగ్లీషు డిక్షనరీలలో దేన్ని చూసినా ఈ విషయం తెలుస్తుంది."మీ అమ్మాయి పెళ్ళికి తెలుగులో మంత్రాలు చదివిస్తావా?" అని నన్ను అడిగి యేదో ఘనకార్యం చేస్తున్నట్టు విర్రవీగుతున్న ఎర్రిపప్పకి తెలియనిది యేమిటంటే "మంత్రం" అనే పదానికి సరైన పర్యాయపదం తెలుగులో లేదు.నాకు చాలెంజి చెయ్యడంలో చూపించిన తెలివిలో వెయ్యో వంతు తెలివిని ఆ మాట గురించి తెలుసుకోవాలనే దిశలో చూపించి ఉంటే ఆ నిజం తెలిసేది.

తెలుగులో కనీస పరిజ్ఞానం కూడా లేని ఒక గొట్టాంగాడు తెలుగు భాషాభిమాని వేషం కట్టి "నాకు పెళ్ళిమంత్రాలు తెలుగులో కావాలి!లేకపోతే నేనూరుకోను!కప్పెక్కి కూస్తా!రోడ్డెక్కి అరుస్తా!ఉరేసుకు చస్తా!" అని గోల చేస్తున్నాడు.అసలు వేదంలో ఉన్న వాటిని మాత్రమే "మంత్రం" అని పిలుస్తారు,అదే చందస్సు వాడి చెప్పిన ఇతర గ్రంధాలలోని వాటిని శ్లోకాలు అంటారు.అలాంటిది మంత్రాలు తెలుగులో కావాలంట ఆ ఎర్రిపప్పకి!తెలుగులోకి గానీ మరో భాషలోకి గానీ అనువదించటం కాదు,సంస్కృతంలోనే ఒక్క అక్షరాన్ని కూడా మార్చకూడనివి వేదమంత్రాలు.


వేదం బైబిలు వలె ఇశ్రాయేలీయుల సౌభాగ్యం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు,వేదం ఖురాను వలె అరేబియన్ల  వైభవం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు - సమస్త మానవాళికీ శాంతిభద్రతల్ని ఇవ్వడం కోసం చెప్పబడిన జ్ఞానబోధల సంకలనం!ప్రపంచ స్థాయి మేధావులూ పరిశీలకులూ ఒప్పుకున్న దాని ప్రకారమే మానవజాతి సృష్టించిన సాహిత్యంలో వేదమే అతి పురాతనమైనది, అత్యంత శాస్త్రీయమైనది!వేదం అపౌరుషేయం - అంటే మానవులు ప్రయత్నపూర్వకమైన అధ్యయనం, పరిశీలనం, చింతనం, ప్రయోగం, పరీక్ష, నిర్ధారణం వంటి ప్రక్రియల ద్వారా వీటిని తెలుసుకోలేదు,

ఋషులు తాము ఉద్ధరించబడి ఇతరులను ఉద్దరించగలిగే సత్యమైన జ్ఞానం కోసం సుదీర్ఘకాలం తపస్సు చేసిన అనంతరం వేరెవరో తమకి చెబ్తున్నట్టు ద్యోతకమైన విషయాలని యదాతధం బహిర్గతం చేసినవే వేదమంత్రాలు.అపౌరుషేయం అని చెప్పడం,అవి తమకి దేవుడు చెప్పాడనటం కొంతవరకు వారి వినయస్వభావాన్ని తెలియజేస్తున్నాయి - మానవప్రయత్నం ఉంటుంది,వారు తపస్సు మొదలుపెట్టినదే ఒక లక్ష్యంతో కదా!అదీ గాక అంత గంభీరమైన సత్యాన్ని కనుక్కోవడానికి ముందే వారు శ్రేష్ఠులైన గురువుల వద్ద అందుకు పనికొచ్చే అన్ని విద్యలూ అభ్యసించిన పండితశ్రేష్ఠులు - వారు గొర్రెల కాపర్లో నిశానీలో కాదు.ఎవరో వచ్చి  నోటికొచ్చింది వాగేసి ఇది నాకు దేవుడు చెప్పాడంటే ఒప్పేసుకుని వేదంలోకి చేర్చెయ్యటానికి ఇతర వైదిక ఋషులు గొర్రెలూ కాదు!

వేదం మూడు కాలాలను గురించి మూడు ప్రపంచాలను గురించి ఇతర మతాల వారు తెలుసుకున్న దానికి వెయ్యిరెట్లు తెలుసుకోగలిగిన వైదికఋషులు దర్శించిన జ్ఞానం కాబట్టి అన్యులు వాటిని సవరించడానికి గానీ తిరస్కరించడానికి గానీ సంక్షేపించడానికి గానీ ప్రక్షేపించడానికి గానీ అధిక్షేపించడానికి గానీ అర్హులు కారు. వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది.ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చు కదా!

University of Edinburghలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం గల Prof. Keith వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసి "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని తేల్చి చెప్పారు.మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలనీ తన పరిశ్రమనీ కలిపి చూసుకుని విసుగెత్తి ఆయన ఆ మాట అన్నాడో లేక ఈయన ఇంత మాట అనేశాక కూడా వేదసాహిత్యాన్ని ఏదో ఒక కాలానికి కుదించుదామనే చిరాశతో చేశారో తెలియదు గానీ మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలు ఇలా ఉన్నాయి:Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 1500BCE మధ్యన అని నిర్ధారించాడు.Keith మరియు McDonald వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 2000BCE మధ్యన అని నిర్ధారించారు.Whitney మరియు ఇతర్లు వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE వెనక అని నిర్ధారించారు.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE నుంచి 2500BCE మధ్యన అని నిర్ధారించాడు.Jacobi వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3000BCE నుంచి 4000BCE మధ్యన అని నిర్ధారించాడు.Satyavrata Samashrami వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5000BCE వెనక అని నిర్ధారించాడు.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6000BCE నుంచి 10000BCE మధ్యన అని నిర్ధారించాడు.Sampoornananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE నుంచి 30000BCE మధ్యన అని నిర్ధారించాడు.Pt.Krishna Sastri Godbol వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE వెనక అని నిర్ధారించాడు.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25000BCE నుంచి 50000BCE మధ్యన అని నిర్ధారించాడు.Lele Shastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 40000BCE నుంచి 54000BCE మధ్యన అని నిర్ధారించాడు.Rajpur Patangar Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 21000BCE అని నిర్ధారించాడు.Pavaki వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,40,000BCE వెనక అని నిర్ధారించాడు.Pt.Dinanath Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Maahrshi Dayananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 200,00,00,000BCE వెనక అని నిర్ధారించాడు.భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు స్వయంగా వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు కాబట్టి వేదం యొక్క ప్రాచీనతను నిర్ధారించడం అసంభవం - మధ్యలో పుట్టిన నడమంత్రపు గ్రంధాలు మధ్యలోనే నశించి పోతాయి గానీ ఆదియే కాదు అంతం కూడా లేకుండా నిలిచేది ఒక్క వేదమే!


సనాతన ధార్మిక సాహిత్యం ప్రకారం బ్రహ్మ కూడా వేదాలు గోచరించకముందు సరస్వతి పట్ల మోహానికి గురై ఆ శరీరాన్ని విసర్జించి నూతన దేహాన్ని ధరించినప్పటికీ సృష్టి చెయ్యలేని తన నిస్సహాయతను చూసుకుని ఎంతో వేదన అనుభవించి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశాకనే వేదవిజ్ఞానం లభ్యమైంది - అది తనకు గోచరించిన తర్వాతనే సృష్టి చెయ్యగలిగాడు.దాన్నిబట్టి వేదం అనేదానికి హిందువుల పౌరాణిక సాహిత్యంలోనూ బౌద్ధిక వికాసంలోనూ జీవన విధానంలోనూ ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలుస్తుంది. హిందువుగా జీవించడానికి బాప్తిజం, దావత్ లాంటి కార్యక్రమాలు ఏమీ లేవు వేదం చెప్పినది గొప్పదని ఒప్పుకుని పాటించితే చాలును.వేదాన్ని గౌరవించనివాడు హిందువు కాలేడు,వేదనింద చేసిన వాడు హిందువులకి శత్రువే అవుతాడు!

వేదం అంటే ఒకే ఒక పుస్తకం కాదు,వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే ఇంగ్లీషులో Branch of Study అని చెప్పుకోవచ్చు.వీటిలో శృతి అనే విభాగంలో ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం,అధర్వ వేదం అనేవి ఉన్నాయి - ఇది ఒక  భాగం మాత్రమే.అయితే,మిగిలిన అన్ని శాఖల్లోని విషయాలు అన్నీ ఈ నాల్గింటిలోని సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి.శృతి అనే విభాగంలో ఈ నాలుగూ తప్ప ఇంకేవీ లేకపోవడం వల్ల వేదం,శృతి అనేవాటిని పర్యాయపదాలుగా కూడా వాడతారు. వేదములు నాలుగు - 1.ఋగ్వేదం, 2.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు, 3.సామవేదం, 4.అధర్వ వేదం. వేదాంగములు ఆరు - 1.శిక్ష(Phonetics), 2.శిక్షా కల్ప(Study of Rituals), 3.వ్యాకరణ(Grammer), 4.నిరుక్త(Etumology), 5.ఛందం(Prosody), 6.జ్యోతిషం(Astronomy). ఉపాంగములు నాలుగు - 1.మీమాంస, 2.న్యాయశాస్త్రం, 3.పురాణములు, 4.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం కానీ ముఖ్యమైనవి  - 1.ఆయుర్వేదం(Medical Science), 2.అర్ధశాస్త్రం(Economic Science), 3.ధనుర్వేదం(Military SCience), 4.గాంధర్వవేదం(Musical Science).


వేదాలను శృతి(Revealed) అని అంటే మిగిలినవాటిని స్మృతి(Memorizes) అని అంటారు.శృతి అనే విభాగంలో నాలుగు ఉపవిభాగాలు ఉంటాయి - ఋగ్వేదం(Collection of Prayers), యజుర్వేదం(Sacrificial Manual), సామవేదం(Rigvedic hymns in musical form), అధర్వవేదం(Magical Charms) - ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాలుగా ఏర్పరచబడి ఉంది:1.మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు 2.బ్రాహ్మణములు->ఆయా సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం - వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి మాత్రమే బోధిస్తారు 3.అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం - నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని కోరుకుని అరణ్యవాసానికి ఇష్టపడినవారికి మాత్రమే బోధిస్తారు 4.ఉపనిషత్తులు->ప్రధానమైన సంహిత మీద పూర్తి అధికారం కోరుకునే నమ్మకస్తులైన శిష్యులకు మాత్రమే వారి గురువులు బోధిస్తారు.

"అనంతా వై వేదాః" అని చెప్పిన ప్రకారం వేదం  మొదలూ తుదీ లేనిది. మానవులు తెలుసుకోవలసిన మొత్తం జ్ఞానం ఒక హిమాలయ పర్వతశ్రేణి అనుకుంటే, భగవంతుడి కృప వల్ల సనాతన ధార్మిక ఋషులు తెలుసుకోగలిగినది మొదట మనం చేరుకున్న పర్వతం నుంచి తీసిన మన పిడికిట పట్టగలిగిన ఇసుక కుప్ప అనుకుంటే - ఇతర దేశాల వారిని కళ్ళు చెదిరేటట్టు చేస్తున్న ఇంతటి విస్తారమైన జ్ఞానం కూడా మరీ అంత కొంచెమేనా!వేదం పరిస్థితే ఇలా ఉంటే తోరా,బైబిల్,ఖురాన్ సంగతేంటి?

"ఆదియందు వాక్యము పుట్టెను!" అని పుట్టినప్పట్నుంచీ అఘోరిస్తూ ఇప్పటికీ "ఏమిటి ఆ వాక్యం?" అని నిలదీస్తే నీళ్ళు నమలడం తప్ప ఇదీ ఆ వాక్యం అని చెప్పలేని అర్ధపాండిత్యపు కూష్మాండం గాళ్ళతో మనకి పోలికలూ జ్వాలికలూ పోట్లాటలూ కాట్లాటలూ దేనికి గానీ దేవుడు తమకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేశాడని సంబరపడిపోయి పప్పన్నం తింటూ కూర్చున్నారా మనవాళ్ళు అని చూస్తే ఏమి కనిపిస్తుంది?వైదిక సాహిత్యం మీద తులనాత్మకమైన అధ్యయనం చేసిన సర్వులూ ఒప్పుకుంటున్నది మొదట ఆవిర్భవించినది ఋగ్వేదమే నని - అంతటి ప్రాచీన కాలంలో కూడా అప్పటి ప్రజలు ఎంత వైభవోపేతమైన జీవితం గడిపారో తెలుసుకుంటే, అవి పరిశోధకులు చెప్పిన వాస్తవాలే అయినప్పటికీ నమ్మలేని విషయాల్ని నేను కల్పించి చెబుతున్నట్టు అనిపిస్తుంది - అంతటి గొప్ప సంస్కృతికి దూరం అయినందుకు మనమీద మనకే అసహ్యం కూడా పుట్టవచ్చు!

అసలు వైదిక సంస్కృతి ఎంతమేర విస్తరించిందీ అని చూస్తే మధ్యభారతంలో ఎక్కువ ప్రభావశీలమై ఉంది,ఈశాన్య భారతంలో బలహీన స్థాయిలో ఉంది,దక్షిణ భారతంలో కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది,పశ్చిమాన ఆఫ్ఘనిస్థాన్ వరకు చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రభావశీలమై ఉంది.అయితే, ఆఫ్ఘనిస్థానుకు ఇవతలనే ఉన్నప్పటికీ వైదిక సంస్కృతికి చెందిన హరప్పా,మొహంజెదారో వంటి నగరాల్ని కూడా కలిగి ఉన్న ప్రాంతం మననుంచి విడిపోవటం వల్ల దాన్ని వదిలేసి ఒక దేశం రూపంలో ఇప్పుడు మనకి కనపడుతున్న భూఖండమే సనాతన ధర్మానికి మూలస్థానం అని మనం గర్వించవచ్చు!

సింధు నాగరికతా నిర్మాతలుగా ఇప్పుడు తెలిసిన జనసమూహం వైదిక సంస్కృతికి చెందినవారేనా అనేది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.మౌలికమైన విషయాలు కలుస్తున్నాయి గానీ కొన్ని అంశాలలో విభిన్నతలు కనిపిస్తున్నాయి.హరప్ప వంటివి సర్వసంపద్విలసితమైన నగరాలు అయితే వైదిక సంస్కృతికి చెందిన ప్రజలు గ్రామ్యజీవనులు.ముందు ముందు జరిగే కొత్త పరిశోధనల అనంతరం ఈ చిక్కుముడి విడిపోవచ్చు.

మొత్తం మీద వైదిక సమాజం బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అనే నాలుగు వర్ణాలు కలిసి ఏర్పడినది.వైదిక సంస్కృతి యొక్క అతి ముఖ్యమైన లక్షణం యజ్ఞభావనతో జీవించడం - యజ్ఞం అంటే అగ్నిలో ఓషధుల్ని వ్రేల్చి వాయువుని శుభ్రం చేసి మానవులని ఆరోగ్యవంతుల్ని చేసినట్టు వ్యక్తులు తమ సంపదలో కొంత భాగాన్ని సమాజానికి సమర్పించి సమాజం నుంచి గౌరవాభిమానాల్ని పొందడం!వైదిక సంస్కృతిలోని ప్రజలు తమ జీవితాల్ని ప్రభావితం చేసే ప్రకృతి శక్తులనే దైవభావనతో అర్చించారు. అప్పటి వారు పూజించిన ప్రధాన దైవాలు వాయు(air), మరుత్(storm), ఇంద్ర(rain), వరుణ(water), సూర్య(sun), అగ్ని(fire), పృధ్వి(earth), అరణ్య(forest) - దాదాపు దృశ్యమాన ప్రపంచంలో మానవుడికి భయాన్నీ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ క్షేమాన్నీ కలిగించే ప్రతి చిన్న అస్తిత్వం పట్ల వారు గౌరవాన్ని ప్రకటించటం ఇందులోని విశేషం!కొందరు అల్పబుద్ధులకి ఇది పిచ్చితనం అనిపించవచ్చు గానీ లోనారసి చూడగలిగిన Sylvain Levi వంటి ఫ్రెంచి ఓరియంటలిస్టులు మాత్రం "The multiplicity of the manifestations of the Indian genius as well as their fundamental unity gives India the right to figure on the first rank in the history of civilized nations.Her civilization, spontaneous and original, unrolls itself in a continuous time across at least thirty centuries, without interruption, wuthout deviation." అని ప్రశంసలు కురిపిస్తున్నారు! 


వైదిక సంస్కృతి ఎలా పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలియనట్టే ఎంతమేర వ్యాపించింది అని చెప్పడం కూడా కష్టమే!అయినప్పటికీ వైదిక సాహిత్యంలోని కొన్ని వివరాలను బట్టి చూస్తే అప్పుడు గాంధారం అని పిలిచిన ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అప్పుడు ప్రాగ్జ్యోతిషం అని పిలిచే ఇప్పటి అస్సాం వరకు వ్యాపించి ఉంది కాబట్టి ఇప్పుడు ఉత్తర భారతం అంటున్న అప్పటి మధ్యభారతం మొత్తం వైదిక సాహిత్యానికి మాతృస్థానం అని చెప్పటం సమంజసంగా ఉంటుంది.

ఋగ్వేద సాహిత్యంలో యమున ప్రస్తావన లేదు.హిమశ్రేణి ప్రస్తావన ఉంది కానీ వింధ్య ప్రస్తావన లేదు.ఇప్పుడు మనం  నదులలో శ్రేష్ఠమైనది అని చెప్పుకునే గంగకి సరస్వతి అదృశ్యం కాక మునుపు ఇంతటి ప్రాముఖ్యత లేదు కాబట్టి ఒకే ఒక్కసారి ప్రస్తావించబడింది - అదీ ఋగ్వేద కాలం ఆఖరి దశలో!అబ్రహామిక్ మత సాహిత్యంలో The Graet Flood అని వ్యవహరిస్తున్న పెద్ద వరద సరస్వతిని ముంచేసింది - ఆ సమయంలో ఇక్కడినుంచి వెళ్ళినవారే యూదులు.ఈ దురదృష్టకరమైన సంఘటనకి మనస్సు చెదిరి కకావికలై తమకు క్షేమకరమైన నివాసస్థలం కోసం చేసిన ప్రయాణమే "వలసకాండ"లో రూపం మారి కనిపిస్తుంది!

ఈ సరస్వతిని తిరిగి గుర్తుపట్టడం వల్లనే "ఆర్య-ద్రవిడ సంఘర్షణ" జరిగిందనే వికృత సిద్ధాంతం అబద్ధమని తేలిపోయింది!ఇంకొక విశేషం యేమిటంటే, ఆ ప్రాచీన ఋగ్వేద సాహిత్యంలోనే సముద్రాల ప్రస్తావన ఉంది - ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారో అక్కడ సముద్రాలు లేవు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని భుజాల మీద మోసుకు తిరిగిన వారందరూ అవి ఇప్పటి సముద్రాలకి ప్రత్యామ్నాయం కాదనీ అతి పెద్ద జలరాశిని ఋగ్వేద ఆర్యులు సముద్రం అని వర్ణించారనీ చెప్పాల్సి వచ్చింది.కానీ ఋగ్వేద సాహిత్యంలోనే సముద్ర జలాలు ఉప్పగా ఉంటాయన్నది వారికి తెలుసుననీ వాటిమీద నౌకలతో ఇతర భూభాగాలతో సంబంధం పెటుకోవడం గురించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయనీ గమనిస్తే ఈ దేశంలోనే పుట్టి ఈ దేశపు గొప్పతనాన్ని దాచెయ్యడంలో ఆ చరిత్రకారులు ఎంత కృతనిశ్చయులై ఉన్నారో తెలుస్తుంది - అటువంటివాళ్ళు రాసిన చరిత్రని మన పిల్లల చేత చదివిస్తున్నందుకు సిగ్గు పడాలి!

వైదిక ఆర్యులు ఋగ్వేద యుగం ముగిసిపోయి తర్వాతి వైదిక సాహిత్యం ప్రభవించే కాలానికి గంగా యమునల మధ్యన ఉన్న మైదాన ప్రాంతం చేరి అక్కడి నుంచి దక్షిణాదికి కూడా వ్యాపించారు - వింధ్యనీ దక్షిణాదికి అటూ ఇటూ ఉన్న రెండు సముద్రాలనీ రెండు పర్వతశ్రేణుల్నీ ప్రస్తావించడమే అందుకు సాక్ష్యం.Henry David Thoreau అనే ప్రముఖ ఆమెరికన్ విమర్శకుడు "In the great teaching of the Vedas,there is no touch of sectarianism. It is of all ages and nationalities and is the Royal road for the attainment of the Great Knowledge" అని చెప్పిన దాన్ని బట్టి అప్పటికే సనాతన ధర్మం ప్రపంచ స్థాయికి ఎదిగిందని అర్ధం చేసుకోవాలి.

కొందరు చరిత్రకారులు అప్పటి రాజ్యం ఇప్పటి ఆటవిక తెగలను పోలి చాలా ప్రాధమిక స్థాయిలో ఉండేదని చెప్పారు.కానీ కొత్త పరిశోధకులు రంగంలోకి దిగిన తర్వాత మరొక దృశ్యం కనబడుతున్నది - ఇప్పటి ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలకు దీటైన సభ, సమితి, విధాత వంటి పండితుల సమూహం రాజుకు రాజ్యపాలనలో సహకరించేది, రాజు సర్వస్వతంత్రనియంత కాడు!ఋగ్వేద సాహిత్యంలో పురోహిత,సేనాపతి అనే పదవుల ఉద్యోగుల ప్రస్తావన మాత్రమే ఉంటే మలి వైదిక యుగంలో యువరాజు వంటి కొత్త పదాల వర్ణన కనిపిస్తుంది.గోవులు ప్రధానమైన ఉత్పత్తి సాధనం కాబట్టి యుద్ధాలు కూడా "గవిష్టి" అనే పేరుతో పశుసంపదని పెంచుకోవడం కోసం జరుగుతూ ఉండేవి.

ఋగ్వేద సాహిత్యంలో లేని జనపదాల ప్రస్తావన మలి వైదిక సాహిత్యంలో కనబడుతుంది, అంటే, రాజ్యం యొక్క విస్తీర్ణం ఎక్కువయి సరిహద్దుల రక్షణ కూడా కీలకమైనదని గుర్తించారని తెలుసుకోవాలి.ఋగ్వేద సాహిత్యంలో  సైనికనిర్మితి లేదు,కానీ మలి వైదిక యుగంలో పదాతి,అశ్విక,రధిక విభాగాలతో పూర్తి స్థాయి సైనికనిర్మితి ఏర్పడింది.ఋగ్వేద సాహిత్యంలో పన్నుల ప్రస్తావన లేదు.రాజు ప్రజలు సంతోషం కొద్దీ ఇచ్చిన కానుకల్ని మాత్రం స్వీకరించేవాడు.కానీ మలి వైదిక యుగం నాటికి పన్నుల వసూలు యంత్రాంగం పూర్తి రూపం  తెచ్చుకుంది - సంగృహీతి(Treasurer).భాగదుఘ(Tax Collector) వంటి ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.


రాజ్యపు సంపదని పెంచే ఆర్ధికరంగంలో భూమిని దున్ని చేసే వ్యవసాయం,పశుపాలన మీద ఆధారపడిన వ్యాపారం అనే రెండు పద్ధతులూ లాభసాటిగానే ఉండేవి.ఈ రెండు రకాల ఆర్ధికరంగాల్లోనూ కీలకమైన పాత్రని పోషించడం వల్లనే గోజాతికి అంతటి విశిష్టమైన స్థానం లభించింది - గోపూజ అనేది ఆ జాతి తమకు కలిగిస్తున్న సౌభాగ్యానికి కృతజ్ఞతను తెల్పడం లాంటిది,కృతజ్ఞత అంటే ఏమిటో తెలియనివాళ్ళే హిందువుల గోపూజనీ నదీపూజనీ విమర్శిస్తారు.Carpenter, Potter, Blacksmith, Goldsmith, Gem-Specialist, Hunter, Star-Gazer/Astronomer, Chariot-Driver, Dancer,Singer, Musician, Fisherman, Merchant,Surgeon వంటి వాటిని ఎక్కువ ప్రస్తావించడం వల్ల ఈ వృత్తులు మంచి ఆదాయం తెస్తూ ఉండేవని అనుకోవాలి.Elephant-rearer, Shepherd, Weapon-Manufacturer, Conch-Blower, Gardener, Watchman, Calculation-Expert వంటి వృతులను కూడా అక్కడక్కడ ప్రస్తావించారు.వీరిలో ఆర్ధికవ్యవస్థకి సంబంధించిన లావాదేవీల్ని లెక్కించే గణకులు(Calculation-Experts) ఇప్పటి NRIల మాదిరి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తెచ్చేవారు - ఇక్కడి గణకుల్ని ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు!

మలి వైదికయుగం పూర్తయ్యేసరికి పురోహిత-రాజరిక వ్యవస్థలు పరస్పరాశ్రితం అయ్యాయి.రాజు యొక్క అర్హతానర్హతల్ని నిర్ణయించడం,రాజును మూర్ధాభిషిక్తుణ్ణి చెయ్యటం,రాజు చేత సత్కార్యాలు చేయించి కీర్తిని పెంచడం పురోహితుల విధి.దీనికి బదులు పురోహితులకి గౌరవమర్యాదల్నీ ఆర్ధిక భద్రతనీ కలిగించడం రాజపురుషుల విధి.

సామాజిక జీవితంలో కుటుంబవ్యవస్థ బలమైనది - అప్పటి కుటుంబాలూ ఇప్పటి కుటుంబాలూ ఒక్కటి కావు,అప్పటి కుటుంబాలు ఇప్పటి గోత్రాలకి సమానం!అంటే,ఇవ్వాళ్టి గోత్ర పురుషుడు తొలినాళ్ళలో తండ్రి యొక్క కుటుంబం నుంచి విడిపోయి గానీ ఆర్ధికంగా ఎదగటం వల్ల కొత్త గుర్తింపును తెచ్చుకోవటం వల్ల గానీ సొంత ఇల్లు కట్టుకుని తన పేరున ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకునేవాడు.అతని తర్వాతి తరాల వాళ్ళు అతని కుటుంబం అయ్యేవాళ్ళు - ఉమ్మడి కుటుంబం కాబట్టి తండ్రి కావచ్చు తాత కావచ్చు ముత్తాత కావచ్చు ఎవరు జీవించి ఉంటే ఆ వ్యక్తియే కుటుంబానికి యజమాని.తొలి తరం కుటుంబపెద్ద పేరున గోత్రం స్థిరపడింది.


ఈ కుటుంబపెద్దనే గృహపతి అని పిలిచారు.ఒక్క యజమాని హోదా లేదనే తప్ప కుటుంబపెద్ద యొక్క భార్యకి సర్వాధికారలు ఉండేవి.ఒక విధంగా చూస్తే పురుషుడు సామాజిక జీవితం మీద దృష్టి కేంద్రీకరించడం,స్త్రీ కుటుంబ పాలన చెయ్యడం అనే సర్దుబాటు అది - గృహిణి,గృహం అనేవి విడదీయలేని అంశాల కింద పేర్కొనడాన్ని బట్టి గృహపతి,గృహపత్ని ఇద్దరికీ సమాన స్థాయి ఉన్నదనేది స్పష్టం!పురుషుడికి కుటుంబ యాజమాన్యం దఖలు పర్చటం అనేది కుటుంబం యొక్క ఉమ్మడి ఆస్తుల మదింపు,వారసత్వ విభాగం,ఇతరులతో భాగస్వామ్య ఒప్పందాలు, రాజ్యానికి కట్టవలసిన పన్నులు వంటివాటిలో చిక్కులు రాకుండా చేసిన ఏర్పాటు కావచ్చు - పురుషుడికి గల ఈ సాంకేతికపరమైన వెసుబాటును తీసేస్తే బాధ్యతలు మాత్రం ఇద్దరికీ సమానంగానే ఉండేవి.

"కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయేషు ధరిత్రి - షట్కర్మ నారి కులధర్మపత్ని" అని స్త్రీలకి మాత్రం సుత్తేసి వూరుకోలేదు."కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం - షట్కర్మ యుక్తః ఖలు ధర్మనాధః" అని పురుషులకి కూడా నొక్కి చెప్పారు.

ఇంటా బయటా స్త్రీకి వైదిక సమాజం ఇచ్చిన భాగస్వామ్యాన్ని గమనిస్తే ఈ కాలపు ఆండోళ్ళు మమ్మల్ని వేదకాలంలోని మగాళ్ళు చూసుకున్నట్టు చూసుకోండని రాండోళ్ళు మోగించటం ఖాయం - మహిళలకు వైదికయుగం స్వర్ణయుగమే!బహుభార్యాత్వం  అనేది రాజకీయ అవసరాల కోసం రాజులకీ పై స్థాయి వారికి మాత్రమే పరిమితమైంది.నూటికి నూరు శాతం స్వతంత్రత అంటే ఒక విధమైన అరాచకత్వమే,నూటికి నూరు శాతం సమానత్వం అంటే ఒక విధమైన అసంతుష్టత్వమే - పురుషుడికీ నియమాలూ నిబంధనలూ ఉన్నప్పుడు స్త్రీకి రక్షణనీ గౌరవాన్నీ మర్యాదనీ ఇవ్వటం కోసం చేసిన ఏర్పాట్లని కూడా అన్యాయం అనేవాళ్ళు నైతికభ్రష్టత్వాన్ని కోరుకుంటున్నారని అర్ధం చేసుకోవాలి.బాల్యవివాహం అనేది ఆనాడు లేదు - స్త్రీకి యుక్తవయస్సు వచ్చాకనే వివాహం,అదీ పెద్దల నిర్ణయం/ఆమోదంతో పనిలేని స్వయంవరం అనే ఏర్పాటు కూడా ఉన్నది!భర్త చనిపోతే ఇప్పటివలె జీవితాంతం ఒంటరితనం అనుభవించనక్కరలేదు - విధవలకు పునర్వివాహం ధర్మబద్ధమే!


యజుర్వేదం 10:03 women should be valiant అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should earn fame అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be scholars అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be illuminating అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be wealthy అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be intelligent అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should take part in legislative Chambers అని చెబుతుంది.ఋగ్వేదం 10:85:46 women should lead nation as a ruler అని చెబుతుంది.అధర్వవేదం 09:09:02 women should Ride on Chariots అని చెబుతుంది.యజుర్వేదం 16:44 women should participate in war అని చెబుతుంది.

వేదాధ్యయనం చెయ్యాలనుకున్న స్త్రీలకి ఉపనయన సంస్కారం ద్వారా  అర్హత కల్పించబడుతూ ఉండేది.అపాల,ఘోష వంటి స్త్రీలు మంత్రద్రష్టలై ఋషిత్వాన్ని కూడా సాధించారంటే ఇంక అసమానతకి తావు యెక్కడ?సృష్టిలోని చలనానికి కారణమైన శక్తికి స్త్రీ రూపం ఇచ్చి సృష్టికి కర్తయే ఆమె అబి చెబుతుంటే హిందువుల మతగ్రంధాలు స్త్రీని రెండవ స్థానంలోకి నెట్టేశాయి అనేది అర్ధం లేని వాదన.వైదిక యుగంలో ఆలయ నిర్మాణం కానీ మూర్తిపూజ కానీ లేదు.ఉభయ సంధ్యలలో చేసే వ్యక్తిగత ప్రార్ధనలూ యజ్ఞం జరిగే సందర్భాలలో చేసే సామూహిక ప్రార్ధనలూ తప్ప మరొక రకమైన ఆరాధనా పద్ధతి లేకపోవటం వల్ల "అగ్ని" అనే పురుషదేవతాస్వరూపం ఒక్కటే ఎక్కువ కీర్తించబడుతూ ఉండేది. తర్వాత కాలంలో ప్రముఖ స్థానం పొందిన బ్రహ్మ(god of creatoion),విష్ణు(god of nourishment),మహేశ్వరుల(god of annihilatio) కన్న ముందు సరస్వతి(godess of cducation),లక్ష్మి(godess of affluence),పార్వతి(godess 0f protection) అనే త్రిమాతలు వైదికయుగంలోనే ప్రముఖస్థానం  పొందారు.వీళ్ళని జంటల్ని చేసింది హిందూద్వేషులు అనుకుంటున్నట్టు వాళ్ళ కామతృష్ణని తీర్చటం కోసం కాదు: creation-education అనే వాటి మధ్య complementary relationship, nourishment-affluence అనే వాటి మధ్య projectile relationship, annihilation-protection అనే వాటి మధ్య supplementary relationship ఉంటాయి అని ఆర్యఋషులు చెబుతున్నట్టు అర్ధం చేసుకోవాలి.

కాళిక అనే దేవత శివుడు అనే దేవుడి అర్ధాంగి - శివుడికి ఈ దేవత పేరు లాంటిదే అయిన కాళుడు అనే పేరు కూడా ఉంది.annihilation అనే ఒక తత్త్వానికి కాళుడు పురుషరూపం అయితే కాళిక స్త్రీరూపం అవుతుంది - వీళ్ళిద్దరూ చేసేది దుర్మార్గుల్ని annihilate చెయ్యటం ద్వారా సన్మార్గుల్ని protect చెయ్యటం.అయితే హిందూమతానికి సంబంధించిన ఈ కాళి అనే దేవతకి మెక్సికో ప్రాంతంలో దేవాలయం ఉండటానికి కారణం ఏమిటి?కాలిఫోర్నియా నగరం పేరులో ఉన్నది కాళియే - నిజం!సమస్త ఇశ్రాయేల్ అని అర్ధం వచ్చే హీబ్రూ భాషలోని kal-Israel ఆనె పదం నుంచి తొంగి చూస్తున్నది కూడా కాళికయే - Kal Yisroel:All Israel[to be found in jewish glossory].అమెరికా ఖండం లోని ప్రాచీన మయన్ నాగరికత నిర్మాతల జాతినామంలో ఉన్నది కూడా మాయ అనే హిందూ దేవత నామధేయమే!ప్రాచీన aztec సమూహం అజ మహారాజు పేరునే తమ జాతినామం కింద స్వీకరించారు!అక్కడా ఇక్కడా అని లేదు ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతన ధర్మపు ఆదిప్రణవనాదమే ప్రతిధ్వనిస్తూ ఉండేది!ఇప్పటి క్రైస్తవం పుట్టిన జుదాయిజం సర్వమూ షివమయమే - Ish, Yish, Is, Isa,Issa వంటి దైవసంబంధమైన సంబోధనలు అన్నీ శివనామం యొక్క అపభ్రంశ రూపాలే!బైబిలు పాత నిబంధనలోని వ్యక్తుల పేర్లూ ప్రాంతాల పేర్లలో సంస్కృత మూలాలు స్పష్టంగా కనబడతాయి - yahweh యొక్క consort పేరు asura!న్యూయార్క్ నగరంలో యూదులు తమకోసం నిర్మించుకున్న యూనివర్సిటీకి yeshiva university అని పేరు పెట్టుకున్నారు!పాత నిబంధనలో తరచు కనిపించే seven అనే సంఖ్యాపదం కూడా శివనామమే - He is the Lord of Seven Worlds, Seven Rivers, Seven Churches!భయదనర్తనం చేసే హిందూ దేవుడైన ప్రళయ కాలరుద్రుడినే క్రైస్తవులు తీసుకుని "యహోవా రోషము గల దేవుడు!" అని చెప్పుకున్నారు.వలసకాండలో కనిపించే యహోవా యొక్క ఉగ్రత్వం పరమశివుడు ప్రళయతాందవం చేస్తున్నప్పడు జరిగే భీబత్సాలకి సంబంధించిన వర్ణన!అయితే హిందువుల శివుడికి మనుషులు ధర్మహాని చేస్తూ సాధుసజ్జనుల్ని హింసిస్తే కోపం వస్తుంది,క్రైస్తవుల యహోవాకి మనుషులు యెన్ని తప్పుడుపన్లు చేసినా పర్లేదు గానీ తనని నమ్మకపోతే మాత్రం కోపం వస్తుంది.హిందువుల దేవుడు మనుషులు తనని నమ్మకపోయినా మంచిగా ఉంటే చాలు కటాక్షిస్తాడు,క్రైస్తవుల దేవుడు మనుషులు మంచిగా ఉన్నా తనని నమ్మకపోతే తప్పకుండా శిక్షిస్తాడు.

పరం గురించి ఆలోచించే అవసరం లేని ఇహం లోని అన్ని పార్శ్వాలనూ కూలంకషం తడిమిన వైదిక యుగం నాటి భారతీయసమాజానికి సాటి రాగలిగిన మరొక మానవ సమాజం అప్పుడే కాదు భూమి మీద ఇప్పుడు కూడా లేదు. భక్తియార్ ఖిల్జి నలంద దహనం దగ్గిర్నుంచి ఇప్పటివరకు గడచిన సుమారు వెయ్యేళ్ళ కాలం వైదిక సంస్కృతికి చీకటియుగం అని చెప్పాలి.!భక్తియార్ ఖిల్జి వంటివాళ్ళు దోచుకున్నంత సంపద దోచుకుని సంస్కృతిని ధ్వంసం చేసి పోవటానికీ ఇతర్లు ఇక్కడ తిష్ఠ వేసుకు కూర్చుని అధికారం ఆశ చూపించి మనలోని కొందర్ని మన సంస్కృతికి శత్రువులను చెయ్యటానికీ ఆ సంస్కృతిని అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఈ దేశానికి పట్టిన వైభవం వారిలో ఈర్ష్యను రగిలించటమే కారణం!

“ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”
ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.



అలాంటి ఈర్ష్యాళువుల కన్ను వైదిక యుగం నుంచీ సా.శ 17వ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తం మీద పుట్టే సంపదలో మూడొంతుల నుంచి నాలుగొంతులకి తగ్గకుండా సృష్టించగలిగిన భారతదేశం మీద పడింది - అంతటి వైభవమూ నరుడి కంటికి నల్లరాయి పగులుతుందన్నట్టు పిగిలిపోయింది!

సృష్టికి ముందునుంచే ఉనికిలో ఉండి తను గోచరం కావడం వల్లనే బ్రహ్మకు కూడా మోహాన్ని చెదరగొట్టి సృష్టి రచనకు కావలసిన శక్తియుక్తులని ప్రసాదించి సృష్టిని నడిపిస్తున్న వైదికధర్మం భారతీయ సమాజంలో ఒక వెయ్యేళ్ళ పాటు తన ప్రాభవాన్ని కోల్పోవడం ఏమంత పెద్ద విషయం కాదు.హిందువులు తమ పొరపాటును గ్రహించారు.వేదం పట్ల ఆసక్తి పెరిగింది.పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి సాధించాలనే పట్టుదల కనిపిస్తున్నది.అయితే సామాజికులలో కనిపిస్తున్న ఈ అంకితభావం రాజకీయవాదులలో కనిపించడం లేదు.వైదిక సంస్కృతి తిరిగి లేస్తున్నదని పసికట్టిన హిందూద్వేషులు కూడా దాడిని పెంచిన తరుణంలో బలమైన రాజకీయ నాయకత్వం లేకపోతే దాడిని ఎదుర్కోవటమూ తిప్పికొట్టటమూ కష్టమౌతుంది.అలాంటి రాజకీయ సంఘటన జరగడానికి కూడా హిందువులు తమ జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాలి.

మన మతాన్ని బలహీనం చెయ్యడానికి హిందూద్వేషులు మూడు ముఖ్యమైన విషయాలని ఎంచుకున్నారు - 1).బ్రాహ్మణాధిక్యత,2).మూర్తిపూజ మరియు బహుళదేవకీర్తనం, 3).పురాణకధలలోని అసంబద్ధత అనేవి.నిజానికి వాళ్ళు హిందూమతంలోనే ఉన్నాయని చెబుతున్న ఇవే లోపాలు వాళ్ళ మతాల్లో కూడా ఉన్నాయనేది వాళ్ళకి తెలియటం లేదు.

"బ్రాహ్మణులు హిందూమతానికి సంబంధించిన అన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని ఒళ్ళలిసే పనులకి పోకుండా కూర్చుని తింటూ ఇతర్ల మీద పెత్తనం చేస్తున్నారు!" అనేవాళ్ళకి క్రైస్తవంలో పాస్టర్ల్కూ ఇస్లాములో ముల్లాలూ కూడా రికామీగా తిరుగుతూ జనం మీద పడి బతకటం ఎందుకు కనిపించటం లేదు?మనం చేస్తున్న స్థాయిలో కాదు గానీ క్రైస్తవులు శిలువకీ ముస్లిములు నల్లరాయికీ చేస్తున్నది కూడా ఒకింత తక్కువ స్థాయిలోని మూర్తిపూజయే కదా!మనకున్న విస్తారమైన పౌరాణిక సాహిత్యంలో అక్కడొకటీ ఇక్కడొకటీ తప్పులు కనిపెడుతున్న వాళ్ళకున్న అతి తక్కువ పురాణకధల్లోనే లెక్కలేనన్ని బూతులు కనపడుతున్నాయి కదా!వాళ్ళ మతసాహిత్యం మనకి తెలియదని వాళ్ళ ధైర్యం - ఒకవేళ తెలుసుకుని రెట్టించి అడిగితే "ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు!మేం మీలో తప్పులు పడితే తిరిగి మీరు మాలో తప్పులు పడితే అది ఉడుకుమోత్తనం అవుతుంది కానీ మీ మతం మా మతం కన్న గొప్పదని ఋజువు చేసినట్టు కాదు!" అని అడ్డం తిరిగి వాదిస్తారు.

వాళ్ళ పురాణ కధలు మన పురాణ కధల నుంచి కాపీ కొట్టినవి కాబట్టి వాటి అసలు అర్ధం వాళ్ళకి తెలియదు,కానీ మనం మన పురాణ కధలకే కాక వాళ్ళ పురాణ కధల వెనక ఉన్న అసలైన అర్ధం కూడా చెప్పగలం - ఎందుకంటే, మన పౌరాణిక సాహిత్యకర్తలు వైదిక సాహిత్యంలో కనిపించే శాస్త్రీయతకి లోబడే ఆ రచనల్ని కూడా చేశారు!ఉదాహరణకి శివుడూ విష్ణువూ ఒకరితో ఒకరు యుద్ధం చెయ్యటం, బ్రహ్మ శివుడి భార్యకేసి కసిగా చూడటం,శివుడు బ్రహ్మ తలని గోటితో తుంచెయ్యడం,తన గోరుకి అతుక్కున్న బ్రహ్మకపాలాన్ని వదిలించుకోవడానికి శివుడు భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలని సందర్శించడం లాంటి కధల్ని సృష్టి నడవటానికి కారణమైన "మాయ - లీల" అనే శక్తులను గురించి ప్రజలకి అర్ధం అయ్యేటట్లు చెప్పటం కోసం కల్పించారు.

వేదంలోనూ భాగవతంలోనూ పురాణాలలోనూ అసలు సృష్టి ఎలా జరిగిందనేదానికి ఒకే ఒక విశ్లేషణ ఉంది - పదార్ధ తత్త్వాలు అన్నీ మహత్తత్వం అనే మాయ వల్లనే ఏర్పడుతాయి.ఈ మాయ కూడా ఈశ్వర స్వరూపమే కాబట్టి జీవులు కూడా పరమేశ్వరుని నుంచి ప్రభవించిన పరమేశ్వరుని స్వరూపాలే కానీ ఆ సత్యాన్ని జీవులు తెలుసుకోలేవు - కారణం మాయ తనకు తనే ఒక ముసుగులా మారి జీవులకి తమలోని ఈశ్వరతత్త్వాన్ని గ్రహించే వీలు లేకుండా చేస్తుంది.ఈ ముసుగు తొలగిపోతే సృష్టిని నడిపిస్తున్న పరమేశ్వరుని లీల తెలుస్తుంది - అదే మోక్షం!అయితే , మాయ ముసుగును వేసినది భగవంతుడే కాబట్టి ఆయన తనంతట తను తొలగించడు - అది జీవుడు ప్రయత్నపూర్వం చెయ్యాల్సిన దుష్కర కార్యం.

అసలైన సృష్టికర్త ఒక్కడేననీ ఆ ఏకేశ్వరుడిని మనం కంటితో చూడలేమనీ సాక్షాత్తూ వేదం చెబుతూనే ఉంది,భాగవతంలోని విరాట్పురుష వర్ణన ప్రకారం అనంతకోటి విశ్వాలలోని ప్రతి విశ్చమూ మన విశ్వం యొక్క నిర్మితినే పోలివింటుంది.విశ్వాన్ని నిలబడి ఉన్న  అండంలా వూహించుకుంటే కింద మహావిష్ణువూ పైన మహాశివుడూ ఉంటారు.నిరంతరం ధ్యానమగ్నులై ఉంటూ మాయకు లోబడకపోవటమే వీరి ప్రత్యేకత - దృశ్యమాన ప్రపంచం నిర్మించబడిన మాయావరణానికి లోపలనే ఉన్నారు కాబట్టి సర్వేశ్వరుడి లీలావినోదం ప్రకారమే వీరు కూడా అప్పుడప్పుడు మాయకు లోబడుతూ ఉంటారు. మాయ కూడా ఈశ్వరస్వరూపమే కాబట్టి దానికి లోబడటం నేరమో ఘోరమో కూడా కాదు.ఎటూ అది ముసుగే కాబట్టి ప్రధానపాత్ర దాన్ని లాగిపారేసి అసలు తత్త్వాన్ని చూడటంతో కధ పూర్తయిపోతుంది, అంతే!

ఏసు శిష్యులు "నీవు రెండవ తూరి ఎప్పుడు వత్తువు?" అని అడిగి "మీరు జీవించియున్న కాలముననే వత్తును!" అని క్రీస్తు చెప్పిన జవాబు విని గంపెడాశతో బతికినంతకాలం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి వాళ్ళు చచ్చిపోయిన ఇన్ని తరాల తర్వాత కూడా బూర వూదుకుంటూ వచ్చే క్రీస్తు రెండవ రాకడ కోసం చెవులు రిక్కించుకుని ఎదురు చూస్తున్న గొర్రెలకి ఇవన్నీ అర్ధం కాకపోయినంతలో నష్టమేమీ లేదు గానీ ఇలా అర్ధం తెలుసుకుని ధృఢమైన నమ్మకం పునాదుల మీద నిలబడిన హిందువులు లక్ష డాలర్లు ఇచ్చినా మతం మారిపోరు.

అప్పుడు గాంధారలో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది, సింధ్ హిందువులు మతం మారారు పాకిస్తాన్ అయ్యింది, ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది, ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది, బెంగాలులో మతం మారారు బంగ్లాదేశ్ అయ్యింది.

ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల "మతం మారండి మతం మారండి" అని. మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని, మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది. మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే!

ప్రపంచ చరిత్రలో:ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి ->ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->గ్రీకు నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మాయన్ నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మంగోలియా నాగరికత నాశనం అయ్యింది, క్రైస్తవం అడుగుపెట్టింది->చైనీస్ నాగరికత నాశనం అయ్యింది

భారత చరిత్రలో:ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->అఖండ భారతం ముక్కలయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->కుల గొడవలు పెంచారు, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->సనాతన సామాజిక వ్యవస్థ ను కూల్చారు, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెడుతున్నారు.

మళ్ళీ వీళ్ళెవరో కాదు,సరస్వతి ఎండిపోయినప్పుడు అటువైపుకు వలసపోయి  మూలంతో సంబంధం తెగిపోయి పోగొట్టుకున్న పాలు తేనెలు పొంగిపొర్లే పాడిపంటలతో నిండిన భూతలస్వర్గం కోసం అలమటిస్తున్న మందభాగ్యుల వారసులే!ఎక్కడ పోగుట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్నట్టు తిరిగి వైదిక సంస్కృతిని పునరుద్ధరించడం వల్లనే మనం క్షయం లేని వృద్ధిని సాధించి ప్రపంచానికి శాంతిభద్రతల్ని ప్రసాదించగలమనేది వ్యాసపరాశరాదిషిర్దిసాయినాధపర్యంతం ఉన్న గురుపరంపర పాదాల సాక్షిగా నేను చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Tuesday 9 October 2018

భీష్ముడు కూడా శ్రీమహావిష్ణువు అవతారమేనా?ఎందుకు కాకూడదు - స్వఛ్చంద మరణమూ అవతార పరిసమాప్తీ ఒకటే కదా!

ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము
1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. 

హరివాక్యం:
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధ ప్రారంభ పద్యం - భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైన పద్యం. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే ఆరు అద్భుత ప్రయుక్తాలు భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు. 

పోతన గారి గురించి మనకి చాలా కల్పిత కధలు ఉన్నాయి.ఆయనొక బీదరైతు అనుకుంటూ ఉంటారు చాలామంది ఆ కధల్ని బట్టి.కానీ తన తాత తండ్రులైన భీమన సోమనలకు చేర్చిన మంత్రి అనే పదం వాళ్ళు రాజసభలో మంత్రిగా ఉందేవాళ్ళని సూచిస్తున్నది - ఇప్పటి ప్రభుత్వోద్యోగులకి ఉండే ఇలాంటి బిరుదుల్ని ఆ హోదా లేనివాళ్ళు పెట్టుకోకూడదు కదా!ఇతనికి మాత్రం ఆ పొడ గిట్టక స్వతంత్రజీవనం గడిపాడని అనుకోవచ్చు."మనుజేశ్వరాధములు" అనే మాట ఛందస్సు కోసం వాడినట్టు కాక మనస్సులో ఉన్న కసిని బయటపెట్టుకుంటున్నట్టు పద్యం మొత్తం మీద ఖంగున మోగుతుంది!

ఇప్పుడు మనమనుకుంటున్నట్టు ఏదో మారుమూలాన నాలుగైదెకరాల మడక దున్నుకుంటూ బీదరికం అనుభవించే దుర్గతిలో లేడనీ లౌక్యం తెలిసిన పెద్ద రైతు అనీ అనుకోవాలి.అదీగాక,ఆనాడు కూడా కవిత్వం రాయాలంటే తను రాయడానికి తాళపత్రాలు సిద్ధం చేసుకోవడం దగ్గిర్నుంచీ ప్రచారం కోసం ప్రతులు తీయించడం వరకూ ఇవ్వాళ్టి లాగానే చాలా శ్రమా వ్యయమూ కలిసిన వ్యవహారం - అందుకే అప్పుడూ ఇప్పుడూ కవులకీ కళాకారులకీ రాజాశ్రయం తప్పదు!ఇతనికి తగినంత ధనం ఉన్నది గనక రాజాశ్రయం అవసరం లేకపోయింది,అవసరం లేదు గనక తిట్టగలిగాడు!

మధురాధి పతే రఖిలం మధురం అన్నట్టు పోతన గారి కవిత్వంలో రమ్యం కాని భాగం ఏదీ లేదు!ప్రస్తుతానికి భీష్మ పితామహుడు అవతార పరిసమాప్తి ముందు సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ స్తుతిస్తూ చెప్పిన పద్యాలను గురించి చెప్పాలనుకుంటున్నాను.గతంలో గరికపాటి వారు "హయరింఖాముఖ,కుప్పించి యెగసిన" పద్యాలను గురించి చెప్పటం విన్నాను.చాలా బాగా చెప్పారు.అయితే,ఇప్పుడు నేను వాటిని చదువుతున్నప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి.వాటిని మీతో పంచుకుంటాను.

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు


హరివాక్యం:
అవతార పురుషులైన శ్రీరాముడూ శ్రీకృష్ణుడూ తమ కార్యం పూర్తి కాగానే తమ పార్ధివ దేహాల్ని విడిచిపెట్టి నిజస్థానం చేరిన విధంగానే అర్జున  శస్త్రాలకి ఖిలమై నీరసించిన ప్రాణజ్యోతిని దేహధర్మానుసారం అప్పుడే పోనివ్వకుండా నిలిపి ఉంచి తను కోరుకున్న సుముహూర్తంలోనే విడువగలిగిన భీష్ముడి నిర్యాణం ఆ ఇద్దరి అవతార పరిసమాప్తికి సమానమైనదే!


ఇతని జననం కూడా విశిష్టమైనదే - శివపత్ని అయిన గంగ ఇతని కోసం మానవదేహం దాల్చి శంతనపత్ని కావలసి వచ్చింది!ఇతను తొలిసారి తన తండ్రికి దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో కనిపిస్తాడు.అక్కడ సంవత్సరం చెప్పినట్టు చూడలేదు నేను,కానీ పూర్తి యవ్వనంలో ఉన్నట్టూ చెప్పలేదు, మరీ పసిబాలుడిలా ఉన్నట్టుగానూ చెప్పలేదు - కాబట్టి ఉజ్జాయింపు అంచనా వేశాను.శ్రీకృష్ణుడి జనన కధనం ప్రకారం తను బొడ్డు తాడు తెంచుకుని పుట్టలేదు - మొదట పన్నెండేళ్ళ బాలుడిలా కనబడి నేను మీకు పుత్రుడినౌతున్నానని చెప్పి మరుక్షణం దేవకి ఒడిలో శిశువులా చిరునవ్వులు చిందిస్తూ కనబడతాడు. బౌద్ధమతానికి ప్రారంభకర్త అయిన గౌతమ బుద్ధుడు కాక విష్ణువు అవతారమైన సుగత బుద్ధుడు పెంపుడు తండ్రి ముందు కనబడినప్పటి వయస్సు పన్నెండేళ్ళు అని చాలా స్పష్టంగా ఉంటుంది!

అసలు రహస్యం ఏమిటో తెలియడం లేదు గానీ బాల వటువుగా బలిని సందర్శించే వామన మూర్తి కూడా దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో ఉండటమూ కపిలముని తన తల్లికి జ్ఞానబోధ చేసినప్పటి వయస్సు కూడా ఇదే స్నిగ్ధయవ్వనం కావడమూ నేను గమనించాను.అన్నింటి మధ్యన బలమైన కారణం ఉంటే పెద్దలు చెప్పాలి - అది నా ప్రస్తుత జ్ఞానానికి అతీతమైన విషయమే!బహుశా వేదాధ్యయనం మొదలుపెట్టడానికి నిర్దేశించిన వయస్సు కావచ్చునని నేను వూహిస్తున్నాను.

అలా జనన మరణ విశేషాలు రెండింటిలో వాసుదేవసముడైన శ్రీ భీష్మ పరంధాముడు కట్టెదుట నిల్చిన శ్రీ కృష్ణ పరంధాముణ్ణి చూసి ధన్యుడై సాటి మానవులు తరించడం కోసం కొన్ని దివ్యమణుల్ని వెదజల్లుతున్నాడు!

1-219-మ.
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావము:
“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.

1-220-మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
భావము:
గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

హరివాక్యం:
గుఱ్ఱాల్నీ,వాటి కాలి గిట్టల్నీ,వాటినుంచి రేగిన  ధూళిని కూడా వర్ణించాలా?అవేం అందమైన అమ్మాయిల కళ్ళా,చెంపలా,పెదవులా,వక్షోజాలా,నడుమా,పిరుదులా,తొడలా,పాదాలా - అబ్బో!ఆనాటి ప్రబంధ కవుల నుంచీ ఈనాటి సినిమా కవుల వరకూ పోల్చని పోలిక లేదు.అయినా తనివి తీరడం లేదు.ఈయనేమిటండీ,గుర్రాల మీదా వాటి కాలిగిట్టల మీదా వాటినుంచి పైకి లేస్తున్న దుమ్ము మీదా ఇంత అందమైన పద్యం చెప్పాడు!

కుసింత వెరైటీ కోసం చెప్పాడా!కాదండి!ఆ గుర్రాల్ని పొగడాల్సిందే!వాటి అదృష్టమే అదృష్టం!ఏ క్షణాన సారధిత్వానికి ఒప్పుకున్నాడో ఆ క్షణం నుంచీ వాటికి ఆయన చేసిన సేవలు ఎలాంటివో చూడండి!మేత పెట్టటం,నీళ్ళు తాపించడం,ఒళ్ళు కడిగి శుభ్రం చేయడం,మెత్తని శయ్యలు అమర్చడం,వాత్సల్యంతో ఒళ్ళంతా నిమురుతూ కబుర్లు చెప్పడం - యశోదానందులకి చేశాడా దేవకీ వసుదేవులకి చేశాడా రుక్మిణీ సత్యభామలకి చేశాడా ఇవన్నీ!

పెద్దలు ఏమిటో చెప్తారు, కొందరు దేవతలూ ఋషులూ  శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తున్నాడని తెలియగానే కోతులై పుట్టారనీ శ్రీకృష్ణుడిగా అవతరిస్తున్నాడని తెలియగానే గోపికలై పుట్టారని.ఈ లింకులు కలిపే పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీకృష్ణుడి బొటనవేలికి గాయం చేసినవాడు రామాయణ కావ్యంలోని వాలి అనేవరకు వెళ్ళింది! వాలి పగ తీర్చుకోవటం కోసం వరం పొంది మళ్ళీ పుట్టటం అంటే వాణ్ణి చంపటం అన్యాయం అంటున్నట్టు కాదూ!మూడు కాలాలనీ ముడి వేసి చూడగలిగిన వాడూ యోగశక్తితోనే తనువు చాలించగలిగినవాడూ గాంధారి శాపాన్ని మన్నించడం కోసం ఒక మిషని కల్పించుకోవడానికి మామూలు బోయవాడు చాలడా?రామాయణ కాలం నాటి వాలి మళ్ళీ జన్మ యెత్తి రావాలా!పౌరాణికులు ఇలాంటి అతి చేష్టల్ని తగ్గించుకోవాలి.ఇంతకీ అంతటి మేధావులు శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటాడని తెలిసి ఆడుకోవడంతోనే సరిపెట్టుకున్నారు గానీ ఈ గుర్రాలై పుట్టాలని ఎవరూ అనుకోలేదేమిటో - ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్సయ్యారు?



ఇలాంటివి అదృష్టంతో రావండి!అర్హత ఉండాలి.మానవజాతిలో అపుడప్పుడూ కొందరు జాతవేదులు ప్రభవిస్తారు - కాలానికి అవసరమై పుట్టిన ముహూర్తం వల్లనో, పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం వల్లనో,మిత్రబాంధవ సంపర్కం వల్లనో కొందరికి ప్రత్యేకించి గురువులెవరూ లేకపోయినా తమ జన్మకారణం తెలుస్తుంది.ఆ జాతవేదులనే ఈ అశ్వాల రూపంలో భావించితే అర్ధం అద్భుతః అనిపిస్తుంది - దైవకార్యం నెరవేర్చే జాతవేదులకి కూడా భగవంతుడు ఇవే సేవల్ని చేస్తాడు!మహాకవి పోతన ఇక్కడ స్మరిస్తున్నది అలాంటి జాతవేదులనే!

1-221-మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
భావము:
ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో, కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో -  ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

1-222-క.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.
భావము:
రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.

1-223-సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; 
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ; 

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; 
జగముల వ్రేఁగున జగతి గదలఁ; 

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; 
బైనున్న పచ్చనిపటము జాఱ; 

"నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; 
మన్నింపు" మని క్రీడి మరలఁ దిగువఁ;

1-223.1-తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి 
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావము:
ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.

హరివాక్యం:
ఈ జంట పద్యాలలోని సీస పద్యపు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క విచిత్రమైన వైరుధ్యం ఉంది.వీటన్నిటికీ తేటగీతి చివరి రెండు పాదాల్లో జవాబు దొరుకుతుంది!మొదటి పాదంలోని వైరుధ్యం:భూమి మీద ఎక్కడో కురుక్షేత్రం అనేచోట మెరిసిన ఈయన కుండలాల తళుకులు ప్రపంచం మొత్తాన్ని ఎట్లా వెలిగిస్తాయి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగుంది గనక దాన్నే ఖాయం చేద్దాం.అదేమిటంటే, లలితాసాహస్రంలో కనత్కనకతాటంకయుగళే అని ఉంటుంది.ఈయనా ఆవిడా ఒకరే అని అనుకుంటే అది విచిత్రం అనిపించదు.


రెండవ పాదంలోని వైరుధ్యం:పధ్నాలుగు లోకాల ఈ బ్రహ్మాండాన్ని ఉదరంలో మోస్తున్నవాడు తన ఉదరంలో ఉన్న ఈ విశ్వంలోకి రావడమే ఒక వింత, మళ్ళీ ఇక్కడున్న ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి దూకితే తనతో సహా తన ఉదరంలో ఉన్న ఈ విశ్వం కదిలిపోవాలి గదా - చిన్న అదురుతో ఆగిపోయిందేమిటి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగానే ఉంది కానీ నేను మరో వైపు నుంచి చూద్దామనుకుంటున్నాను.

మనం ఉన్న విశ్వం యొక్క పరిమాణం ఎంత?తెలియదు!కానీ కొలవడానికి తీసుకున్న కొలత మన దేహమే,అవునా?మన దేహం తప్పించి మిగిలిన వాటిని మనకన్న ఎంత పెద్దది, మనకన్న ఎంత చిన్నది అని సాపేక్షంగా కొలుస్తున్నాం.అయితే, అనంతకోటి విశ్వాలలో అన్నీ ఇదే పరిమాణంలో ఉండాల్సిన పని లేదు - మరొక విశ్వం మన బొటనవేలి పరిమాణంలోనే ఉండవచ్చు!ఆ చిన్న పరిమాణంలో ఉన్న విశ్వం కూడా మన విశ్వంలో ఉన్న ఆన్నింటినీ కలిగి ఉండవచ్చు.ఇలా ఉన్న విశ్వాల అమరికలో మనం ఉన్న విశ్వంలో భగవానుడు దూకినది ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి గాబట్టి మిగిలిన విశ్వం కదలదు.కానీ ఆయన ఉదరంలో ఉన్నవి మొత్తంగా కదులుతాయి గాబట్టి ఆ విశ్వాల లోపల ఉన్నవాళ్ళకి ఈ కదలిక తెలియదు.

మూడవ పాదంలోని వైరుధ్యం:చక్రం గిరగిరా తిప్పేస్తూ కోపంతో భీష్ముడి మీదకి ఉరుకుతుంటే పైనున్న ఊత్తరీయం జారిపోయిందట!ఇందులో విచిత్రం ఏముంది అనిపించవచ్చు అధాట్న చూడగానే!కానీ, అలవాటులో పొరపాటు అన్నట్టు ఇక్కడ ఒక అనౌచిత్యం ఉంది. యుద్ధరంగంలో రధికుడితో పాటు సారధి కూడా కవచాలూ శిరస్త్రాణాలతో కూడిన దుస్తులు ధరించాలి కదా - కొంచెం వేగంగా కదిలితేనే జారిపోయే పచ్చని పటము ఇక్కడ తొడగటం ఉచితమా!

సినిమా రాముళ్ళని చూసీ చూసీ మాయపొర కమ్మకుండా బుర్ర చురుగ్గా పనిచేస్తున్న ఒకాయన ఉషశ్రీ గారిని ఒక ప్రశ్న అడిగారు, "వయసొచ్చిన ప్రతి మగాడికీ గడ్డాలూ మీసాలూ పెరగటం సహజం కదా!అదీ ఒకసారి క్షురకర్మ మొదలెట్టాక మధ్యలో ఆపేస్తే రెట్టింపు వేగంతో పెరుగుతాయి కదా!మరి,పధ్నాలుగేళ్ళు అడివిలో గడిపినా రామలక్ష్మణుల మొహాలు నున్నగా ఉన్నాయేమిటీ?"  అని.ఉషశ్రీ గారు సినిమా వాళ్ళ మీద కాస్త విసుక్కుని నందిగ్రామం దగ్గిర భరతుణ్ణి కలిశాక తల మీదా ముఖం మీదా చంకల్లోనూ పెరిగిన వెంట్రుకల్ని తీసేసి తలంటు పోసుకుని కొత్త బట్టలు తొడుక్కుని అయోధ్యానగర ప్రవేశం చేసినట్టు వాల్మీకం నుంచే శ్లోకాలు ఉదహరించి చెప్పారు.

మనం చూస్తున్న దేవుళ్ళ పటాలన్నీ రవివర్మ లాంటి చిత్రకారులు గీసినవి.వాళ్ళకి ఆ మొహాల్లో పవిత్రత కనపడ్డానికి పసితనాన్ని సూచించే మీసాలు లేని మొహం గుర్తు అని ఒక మూఢనమ్మకం ఏర్పడిపోయింది.ఆ మూఢనమ్మకాల్నే సినిమా వాళ్ళూ కొనసాగించారు,తమ సొంత మానసిక రోగాల్ని కూడా వాటికి కలిపారు.యన్.టి. రామారావు చూడండి, రావణుడి వేషంలో కైలాసం వెళ్ళినా దుర్యోధనుడి వేషంలో సభకి వెళ్ళినా భుజం మీద గద ఉండాల్సిందే!సైకాలజీలో మనకి ఇష్టమైన వస్తువుల్ని ప్రతి చోటుకీ దేహానికి అతికించుకున్నట్టు వెంట తీసుకుపోవడాన్ని ఫెటిషిజం అంటారు.

అసలు దుర్యోధనుడు అలా గదని మోసుకుంటూ తిరగనూ లేదు.అసలు కృష్ణుడు కవచ శిరస్త్రాణాలు తొడక్కుండా యుద్ధరంగంలోకి వెళ్ళనూ లేడు.అయితే, పోతన గారు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినంతవరకు ఆయనకున్న భక్త్యావేశంతో ఒక రూపానికి అతుక్కుపోయాడు.అది అసహజమే గానీ రాసిన పోతన గారు భక్తుడు,చూస్తున్న భీష్ముడు భక్తుడు,చదువుతున్న మనమూ భక్తులమే - ఒక దణ్ణం పెట్టుకుని వదిలెయ్యడమే!

నాల్గవ పాదంలోని వైరుధ్యం:"బాబ్బాబు!నా పరువు తియ్యకు, వెనక్కిరా" అని బతిమిలాడుకోవడంలో వైరుధ్యం ఏముంది అని మీకు సందేహం రావచ్చు!కానీ కృష్ణుడు అంత ఆవేశం ఎందుకు తెచ్చుకున్నాడు?అర్జునుడు ఆపకపోతే నిజంగానే భీష్ముణ్ణి చంపేసేవాడేనా?లేదు,ఆ సంరంభం ఆర్జునుడికి చురుకు పుట్టించి భీష్ముడి కధని ముగించడానికి చేసిన నటన!అర్జునుడు తాతగారి మీద మమకారంతో యుద్ధంలో చూపించాల్సిన ధాటి చూపించకపోవడం వల్లనే కదా ఇంత గొడవ జరిగినది - ఒకసారి విషాదం అనుభవించి గీతాసారం విన్నాక మళ్ళీ బెంగ పుట్టుకు రావటం అసహజం కాదూ!నేను గతంలో చెప్పి ఉన్నాను,ఇవ్వాళ చూస్తున్న లక్ష శ్లోక విస్తారమైన భారతం అంతా వ్యాస విరచితం కాదు,అందరూ తలా ఒక చెయ్యి వేసి పెంచి ఇంత పెద్దది చేశారని - దానికి ఇది సాక్ష్యం!

అసలు వ్యాసుడు రాసినవి 4000 అయితే శిష్యులు 6000 రాసినవి కలిపిన మొదటి రూపం 10,000 శ్లోకాలు మాత్రమే అని అంటారు.ఈ మధ్యనే ఆ మూలకధని మాత్రమే తీసుకుని జయం పేరుతోనే ఒకరు నవల వ్రాసినట్టు చదివాను.

అయితే,చేర్పుల వల్లనే ఆ కావ్యం మోనాలిసా నవ్వులా ధర్మతత్వజ్ఞులకు ధార్మిక గ్రంధంలా ఆధ్యాత్మిక వేత్తలకు మోక్షసాధనంలా కనబడుతూ అనితర సాధ్యమైన విశిష్టతని దక్కించుకున్నది!గీతకి ఇవ్వాళ ఉన్న విశ్వవ్యాప్తమైన ప్రాచుర్యం అక్కడ అమరిపోవడం వల్లనే కదా!కిం కర్తవ్యతా విమూఢుడైన ప్రతివాడూ తనని తను విషాద యోగంలో ఉన్న అర్జునుడితో పోల్చుకోవడమూ గీతాబోధ సమస్తమూ తనకే జరుగుతున్నట్టు భావించడమూ గీతని ఆ కధనుంచి విడదీస్తే జరగదు!మూలకధకీ నేటి కధకీ మార్పులు ఎలా జరిగాయో తెలుసుకోవడం వరకు మంచిదే గానీ ప్రస్తుతం మనకి తెలిసిన కధని మర్చిపోవడం అనవసరం - మర్చిపోలేం కూడా!

1-225-క.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
భావము:
తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.

1-226-ఆ.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు
భావము:
మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు..

1-227-మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థిం
తు శుద్ధుండనై."
భావము:
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."

హరివాక్యం:
ఇక్కడ పోతన గారు హైందవద్వేషులు సదా విమర్శించే హైందవధర్మంలోని మూర్త్యారాధన మరియు బహుళ దేవతా ప్రశస్తి అనే రెండు ముఖ్యమైన విషయాలకీ తిరుగులేని సమర్ధన ఇచ్చేస్తున్నాడు!ఇక్కడే కాదు, సనాతన ధార్మికులు సృష్టించిన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఉన్న విశిష్టత ఏమిటంటే సాహిత్యానికి సంబంధించిన రమ్యత,గాఢత కూడా ఉండి గుర్తుంచుకోవడం తేలిక అవుతుంది. విదేశీయులూ వేరే మతస్థులు కూడా సనాతన ధర్మానికి ఆకర్షితులు కావడానికి వాటిలోని వస్తుగతమైన తార్కికతతో పాటు శైలిపరమైన సౌందర్యం కూడా ఒక కారణమే!

ఏం చెప్తున్నాం అన్నదానితోపాటు ఎలా చెప్తున్నాం అనేది కూడా ముఖ్యమే - అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టేస్తే పిల్లాడు అల్లాడిపోతాడు!ఎంతటి పండితుడికైనా నిర్గుణ పరబ్రహ్మ మీద మనస్సు లగ్నం చెయ్యడం దాదాపు అసాధ్యమే - అసలు ఆ పదాన్ని పరిచయం చేసినవారికే దాని పూర్తి అర్ధం తెలియదు పాపం!నేనయితే నిర్గుణోపాసనని తిరస్కరిస్తాను కూడా.ఎందుకంటే,జ్ఞానం కోసం జ్ఞానం,కళ కోసం కళ వంటి పనికిమాలిన లక్ష్యాలు పెట్టుకుంటే ఇహానికీ పరానికీ పనికిరాకుండా పోతాం.మన దేహాలు తయారైన పృధివ్యాపస్తేజోవాయురాకాశాల మూలతత్వం మహదహంకారం - అది కూడా భగవత్స్వరూపమే!మనల్ని మోహానికి గురి చేసి పతనం చేస్తున్నదని అనుకుంటున్న మాయ కూడా భగవంతుడి కన్న వేరు కాదు, అవునా?మరి, రూపధారులమైన మనం భావనామరూప సంకీర్తనం చెయ్యడానికి భయపడటం గానీ సంకోచపడటం గానీ అవసరమా?"మేం విగ్రహారాధనని వ్యతిరేకిస్తున్నాం!" అని అంటున్నవాళ్ళే అలవాటులో పొరపాటుగా కాకుండా బరితెగించి విగ్రహారాధన చేసేస్తూ ఉంటే హిందువులు సిగ్గుపడటం దేనికి?అయితే, ఒకటి గుర్తుంచుకోవాలి మూర్తిపూజ అంటే ఆలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలకి చేసే అభిషేకాదులు మాత్రమే కాదు, అక్కడినుంచి మొదలుపెట్టి దృశ్యమాన ప్రపంచంలోని అన్ని రూపాలలోనూ భగవంతుణ్ణి చూడగలిగే స్థాయికి ఎదగాలి!

హిందూమతప్రచారకులు ముఖ్యంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి,ఆసక్తిని కలిగంచడం కోసం హాస్యప్రసంగాలు చెయ్యడం మంచిదే గానీ హాస్యం అపహాస్యం స్థాయికి దిగజారకూడదు.గరికిపాటి నరసింహారావు లాంటి అనుభవజ్ఞులు కూడా ఒక్కోసారి ఆవేశం వల్లనో అనాలోచితంగానో చెప్పకూడని విషయాలు చెబుతున్నారు,అనకూడని మాటలు అంటున్నారు.ఈ మధ్యనే వారు గణేశ్ నిమజ్జం పేరుతో వ్యాపారమూ పోటీ ఎక్కువయ్యాయనీ అవన్నీ అక్కర్లేదనీ వాటిలో భక్తి ఉండదనీ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఒంటరిగా చేసే పూజల్లోనే భక్తి ఉంటుందనీ మాట్లాడారు - అది నాకు నచ్చలేదు.ఒంటరి పూజని పెద్దలు అప్పటికే సర్వం త్యజించిన యోగులకి ప్రాణోత్క్రమణ సమీపించిందని తెలిసినప్పుడు మనిషి కనిపిస్తే చాలు "నాకు నెప్పిగా ఉందిరో!వైద్యం చెయించరో!నన్ను బతికించరో!" అని వ్యామోహం పెరక్కుండా ఉండటానికి చెప్పారు.గృహస్థు అయిన ప్రతి ఒక్కరికీ తన పాటికి తను వైదిక విధుల ప్రకారం బతకడంతో పాటు ధర్మప్రచారం కూడా ఒక ముఖ్యమైన విధి.

సత్యనారాయణవ్రతం కుటుంబసభ్యులు మాత్రమే చేసుకోవాలని చెప్పారా?అసలు ఆలయాలు ఉన్నదే సామూహిక ప్రార్ధన కోసం - అలాంటప్పుడు ఈయన అవన్నీ అక్కర్లేదు,మీ ఇంట్లో మీరు పూజలు చేసుకుంటే చాలు అంటారేమిటి!ఈయనే ఇలా చెప్తున్నప్పుడు ప్రబోధానంద లాంటివాళ్ళని మనం తట్టుకోగలమా?ప్రపంచ స్థాయిలోనే ఏకం కావలసిన సమయంలో హిందువులు ఒంటరిపక్షులు కాకూడదు - తస్మాత్ జాగ్రత్త!


కలిసి ఉంటే కలదు సుఖం!కలిసి నడిస్తే కలదు జయం!కలిసి బతికితే కలదు వైభవం!!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...