Saturday 13 April 2024

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది. కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో బాధకు గురి అవుతున్నది . పేరుకు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం , శుభలేఖ మీద ఉండే పేర్లు సీతా , రాములు . కళ్యాణంలో మహా సంకల్పం రామనారాయణుడు , సీతామహాలక్ష్మి పేర్ల మీద చదువుతున్నారు . వారి తండ్రులైన దశరధ , జనక మహారాజుల బదులుగా విభవ వాసుదేవ శర్మ , క్షీరార్ణవ శర్మలని చెప్పడం బాధకు గురి చేస్తున్నది. ఎవడీ విభవ వాసుదేవ శర్మ?ఎవడీ క్షీరార్ణవ శర్మ?

భద్రుని కోరిక మీద శ్రీరామ చంద్రుడు నాలుగు చేతులతో శంఖు చక్రాలతో సీతా లక్ష్మణులతో కలసి దర్శనమిచ్చాడు. ఆయన తాను శ్రీ రామచంద్రుడిని అని మనకు తెలిసే విధంగా తన కుడిచేతిలో శంఖం (భరతుడు ) ఎడమచేతిలో చక్రం ( శతృఘ్నుడు ) ఉండే విధంగా దర్శనమిచ్చాడు . అంతేగాక సీతామాత , లక్ష్మణుడు కూడా ఎడమవైపు ఉన్నారు . చేతిలో కోదండం ధరించి కోదండపాణి గా దర్శనమిచ్చారు . రామ పట్టాభిషేకంలో కూడా కోదండం ధరించి కుడి వైపున భరతుడు, ఎడమవైపున సీతమ్మ తల్లి , లక్ష్మణ , శత్రుఘ్నులు ఉండటం మనం గమనింపవచ్చు.

వచ్చినది నారాయణ రూపములో అయితే శంఖం , చక్రం సవ్యంగా ఉండేవి , నారాయణమూర్తి వాడే ధనసు పేరు శ్యారంగం , అందుకే ఆయనను సారంగ పాణి అని పిలుస్తారు . భద్రాచలంలో సారంగపాణి అనే పేరు ఎక్కడా వాడలేదు .భద్రాచలాన్ని దర్శించిన శంకరాచార్యులవారు వామాంకస్ధిత జానకి , పరిలసత్ కోదండ దండం కరే , చక్రం చోర్భ కరేన బాహుయుగళే , శంఖం శరం దక్షిణే , విబ్రాణం జల జాత పత్ర నయనం , భద్రాద్రి మూర్తి స్ధితమ్ , కేయూరాది విభూషితం రఘుపతిం , సౌమిత్రి యుక్తం భజే ।। అని రాశారు.

గుడి కట్టించిన రామదాసు గారు దాశరధీ అంటూ రాముడిని పిలుస్తూ దాశరధీ శతకం రాశారు . నీకు ఈ నగలు నీ తండ్రి దశరధుడు చేయించాడా లేక నీమామ చేయించాడా అని రాశారు . అలాగే పలుకే బంగారమాయనా కోదండపాణీ అంటూ రాశారు . ఇక్ష్వాక కుల తిలకుడిగా భావించి , కలికి తురాయి చేయించారు . చింతాకు పతకము చేయిస్తి నీకు సీతమ్మ తల్లి అంటూ రాశారు.

భద్రాచలంలో నవమి నాడు కళ్యాణం జరగటానికి కారణం ఆరోజున శ్రీరాముడు జన్మించడమే. కానీ రామనారాయణుడు జన్మించిన సమయం ఎవ్వరికీ తెలియదు . భద్రాచలం లోకళ్యాణం జరిగే మంటపానికి పైన ఉన్న శిల్పంలో చతుర్భుజుడైన శ్రీరామ కళ్యాణాన్ని దశరధ , జనకులు చూస్తున్నట్లుగా చెక్కించారు.

కళ్యాణానికి వాడే మంగళ సూత్రం లో 3 మంగళ సూత్రాలుంటాయని వాటిని దశరధుని తరుఫున ఒకటి , జనకుని తరుఫున ఒకటి , రామదాసు గారి తరఫున ఒకటి చేయించారని గతం లో శుభలేఖలో రాసేవారు. వ్యాఖ్యాతలు కూడా ఇంతకు ముందు చెప్పటం జరిగేది . ఇప్పటి శుభలేఖలో కేవలం 3 మంగళ సూత్రాలున్నాయని రాసి దశరధ , జనకుల పేర్లు చెప్పకుండా పుట్టినింటి వారిదొకటి , మెట్టినింటి వారి దొకటి అని చెప్పి దాటవేస్తున్నారు . దశరధ , జనకులు చేసిన తప్పేమిటో వారినెందుకు మహాసంకల్పంలో నుంచి తప్పించారో అర్దం కావటం లేదు.

రాముడు కేవలం అర్చామూర్తి మాత్రమే , దశరధ తనయుడు కాదు , సీతమ్మ తల్లి లాగా అయోనిజుడు , ఆయనకు తండ్రి ఆయనే , సీతమ్మ కు తల్లి సీతమ్మే అని చెప్పటం ఎంతో శోచనీయం . ఆయన దశరధ తనయుడు కాకుంటే చైత్ర శుద్ధ నవమి నాడు కళ్యాణమెందుకు చేస్తున్నారు? ప్రతి సాయంత్రం దర్బారు సేవ ఎందుకు చేస్తున్నారు? కళ్యాణం మరునాడు పట్టాభిషేకమెందుకు చేస్తున్నారు?కళ్యాణానికి రామనారాయణుడు , పట్టాభిషేకానికి రామచంద్రుడా?

అసలు రెండు పంచ లోహ విగ్రహాల్ని రోజూ చింతపండేసి తోమితే చాలు మోక్షం వచ్చేస్తుందని చెప్తున్న రామానుజ మతమే వేద విరుధ్ధమైనది.కాబట్టి ఈ సాతాను జియ్యరుతో బాటు రామానుజ మతాన్ని కూడా తన్ని తగలేస్తే డబల్ బెనెఫిట్.

జై శ్రీ రామ్!

Wednesday 28 February 2024

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి 03 ఈనాడు దినపత్రికలో "కాంతితో క్యాన్సర్ ఖతం" అని ఒక వార్త పబ్లిష్ అయ్యింది. వార్తని యధాతధం ఇక్కడ ఇస్తున్నాను,చదవండి:"క్యాన్సర్ కణాలను అంతం చెయ్యడానికి డాక్టర్లు ఇటీవల ఒక వినూత్న ప్రక్రియను వాడుకున్నారు.ఇది ప్రయోగ సాలలో 99% వరకూ క్యాన్సరును నిర్మూలించదం విశేషం.ఇంతకీ ఇందుకు ఉపయోగపడిన సాధనం ఏమిటో తెలుసా?నియర్-ఇంఫ్రారెడ్ కాంతి!ఈరకం కాంతి శరీరం లోపలికి చొచ్చుకెళ్ళగలదు మరి.

ఇంతకీ క్యాన్సర్ కణాల్ను ఇదెలా చంపుతుంది?కంపింపజెయ్యటం ద్వారా!క్యాన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేవరకు కంపింపజేస్తూ క్యాన్సర్ కణాలను చంపుతుంది.ఎముకల్లో,అవయవాల్లో తలెత్తే క్యాన్సర్లకు శస్త్రచికిత్సరహిత చికిత్సల దిశగా ఇది ద్వారాలను తెరుస్తుందని భావిస్తున్నారు."

అయితే, 2023 ప్రారంభం నుంచీ చాగంటి వెంకట్ గారు వేదాస్ వరల్డ్ సంస్థ తరపున అప్పటికే వేదసాస్త్రాల పరిచయం ఉన్న యువకులైన వేదవిద్యార్ధులతో చేసిన కొన్ని చర్చల్ని తన చానల్లో వీడియోల రూపంలో పబ్లిష్ చేశారు.సుమారు మే జూన్ల మధ్యన పూషా కిరణాలను గురించి చర్చిస్తూ చేసిన వీడియోలలో కొన్న్ని ఋగ్వేదమంత్రాలను విశ్లేషించారు.ఋగ్వేదం 01.42.03 - అంటే ఒకటవ మండలం 42 సూక్తం మూడ్వ మంత్రం అని అర్ధం చేసుకోవాలి.

"పూష కిరణములు (అజ)మూడు రకములైన - 1.శరీరము లోపల(హురశ్చిత్, deceiver), 2.బయటినుండి(ముషీవాన్ప్రత్యక్షంగా), 3.సంక్రమించే వ్యాధులు(పరిపంధి, hindering) అనేవాటిని దూరం చేస్తాయని విద్వాంసుడైన వైద్యుడు తెలుసుకుని ఆచరించునట్లు విద్వాంసుడైన రాజు మూడు రకములైన - 1.రాజద్రోజు(హురశ్చిత్, deceiver),  2.దొంగలు(ముషీవాన్,ప్రత్యక్షంగా నేరాలు చేసేవారు), 3.మోసగాళ్ళను(పరిపంధి, hindering) అనేవాళ్ళను కనిపెట్టి శిక్షంచవలెను/ప్రజాజీవితం నుండి తప్పించవలెను(స్రుతేః)" అనేది మంత్రం యొక్క భావం.పరిపాలనకీ వైద్యానికీ పోలిక చెప్తూ వ్యక్తుల శరీరాలకి పూషా కిరణాలు చేస్తున్న మేలునే రాజు ప్రజలకి చెయ్యాలి అనే సలహా ఇస్తున్నాడు సృష్టికర్త ఇక్కడ.

అయితే, ఈనాడు చెప్తున్నది ఒక ఆధునిక శాస్త్రజ్ఞుల పరిశోధన గురించి చెప్తుంటే అది వేదవిజయం ఎలా అవుతుంది?నిజమే కదా!మొదట ఆధునిక శాస్త్రజ్ఞుల పరిశోధన గురించి చెప్తాను.Molcular Jackhammers "good vibrations" eradicate cancer cella అన్న తలకట్టు పెట్టి RICE UNIVERSITY వారు ఒక రీసెర్చి పేపరును సైంటిఫిక్ జర్నల్సులో పబ్లిష్ చేశారు.{"news.rice.edu/news/2023/molecular-jackhammers-good-vibrations-eradicate-cancer-cells"} దగ్గిర పూర్తి పాఠం దొరుకుతుంది,చూడండి.ప్రయోగానంతరం light-induced whole-molecule vibration can rupture melanoma cells' membrane అని వాళ్ళు ధృవీకరించారు.అది ఈనాడు వార్తలోని విషయాన్ని ధృవీకరిస్తుంది.ప్రయోగం చేసిన స్కాలర్ పేరు Silvea Cernea Clark.ఆర్టికిల్ పబ్లిష్ అయినది - 2023 డిసెంబర్ 18.

వేదాస్ వరల్డ్ సంస్థ వారి చర్చలో  విషయం ప్రస్తావనకు వచ్చినది 2023 మే జూన్ల మధ్యన,అవునా!కేవలం వీడియోలు చేసి సరిపెట్టుకునే కల్లగురువు కాదు చాగంటి వెంకట్ గారు.ఈయన కూడా Vedic Medhodolgy That Highlights the Benefits of Sunlight Between Twilight and Sunrise/Sunset అన్న తలకట్టు పెట్టి University of Applied Vedic Sciences తరపున ఒక రీసెర్చి పేపర్ పబ్లిష్ చేశారు -{"rajournals.com/index.php/raj/article/view/402/140"} దగ్గిర పూర్తి పాఠం దొరుకుతుంది,చూడండి.ప్రయోగం చేసిన స్కాలర్ పేరు Murali Cheruvu.ఆర్టికిల్ పబ్లిష్ అయినది - 2023 ఆగస్టు 01.

 

అవాక్కయ్యారా!

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...