Tuesday 26 May 2020

వలసకాండలో జరిగినది జంతుబలియా!నరబలియా?

"అర్ధరాత్రి పూట యహోవా విజృంభించి ఐగుప్తీయుల ప్రతి ఇంటి పెద్ద కొడుకునీ చంపేశాడు - ఫారో పెద్ద కొడుకు దగ్గిర్నుంచీ సామాన్య ఐగుప్తీయుల వరకు ప్రతి ఇంటి పెద్ద కొడుకునీ ఒక్కణ్ణి కూడా వదలలేదు, వాళ్ళ పశువుల మొదటి చూలు దూడలకీ చావు మూడింది!అంత భీబత్సం చూశాక కూడా నిబ్బరం చూపించగలిగిన మానవత్వం గల మనిషి ఎవడూ ఉండడు కదా - ఫారో అన్నదమ్ముల్ని పిలిచి “Up! Leave my people, you and the Israelites! Go, worship the Lord as you have requested. Take your flocks and herds, as you have said, and go. And also bless me.” అని చేతులెత్తేశాడు, పాపం!" అని క్రిందటి భాగంలో చెప్పినది అంత తక్కువ సమయంలొ ముగిసిపోలేదు. కల్పిత కధా సాహిత్యంలోని ఒక సన్నివేశమైన అక్కడ బైబిలు రచయితలు తమకు ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే మరియు వారి ప్రధాన దైవమమైన ఊహోవా కలిసి జరిపించారని అంటున్న భీబత్సమూ దుర్మారమూ వాస్తవ ప్రపంచ చరిత్రలో కూడా నియంతా కనీసం వూహించను కూడా వూహించలేదేమో అనిపిస్తుంది!
Exodus 12 - New International Version (NIV) ప్రకారం వాళ్ళ ద్యాముడు ఇక తాను తన మహిమను చూపించి వాళ్ళకి ప్రసాదించబోయే శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఒక ఉత్సవం చేసుకోమన్నాడు - అంతే కాదు, ప్రతి సంవత్సరం రోజును ఇలాగే జరుపుకోమని నొక్కి చెప్పాడు.అది ఇది:"This month is to be for you the first month, the first month of your year. Tell the whole community of Israel that on the tenth day of this month each man is to take a lamb[a] for his family, one for each household. If any household is too small for a whole lamb, they must share one with their nearest neighbor, having taken into account the number of people there are. You are to determine the amount of lamb needed in accordance with what each person will eat. The animals you choose must be year-old males without defect, and you may take them from the sheep or the goats. Take care of them until the fourteenth day of the month, when all the members of the community of Israel must slaughter them at twilight. Then they are to take some of the blood and put it on the sides and tops of the doorframes of the houses where they eat the lambs. That same night they are to eat the meat roasted over the fire, along with bitter herbs, and bread made without yeast. Do not eat the meat raw or boiled in water, but roast it over a fire—with the head, legs and internal organs. Do not leave any of it till morning; if some is left till morning, you must burn it. This is how you are to eat it: with your cloak tucked into your belt, your sandals on your feet and your staff in your hand. Eat it in haste; it is the Lord’s Passover." - ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది అంటే ఇది కాదూ!బానిసత్వం నుంచి స్వతంత్రతకు ప్రయాణించడం అనే వీళ్ళ ఆనందం కోసం జంతువులు హృదయవిదారకంగా ఏడుస్తూ గిలగిల తన్నుకుని చావడమా?
మనిషికి ఆకలి వేసినప్పుడు మాంసం తినడం తప్పు కాదు, కానీ సకలలోకసృష్టికర్త తన సృష్టి అయిన మనిషికి తన సృష్టి అయిన జంతువుల్ని చంపి తిని ఆనందించమని చెప్పడమే కాక తప్పనిసరి తంతును చేసి ప్రోత్సహించడం ఎంత ఘోరం!
తర్వాత తరాలు శుభదినాన్ని గుర్తుంచుకోవడానికి విందును మాత్రమే చేస్తున్నారు గానీ రోజున రోము నగరంలో రక్తం కార్చే విందును ఏర్పాటు చేసింది కేవలం ఆనందానికి కాదు.దానికి ఉన్న అసలైన ప్రయోజనం యహోవా-మోషే ద్వయం ఈజిప్షియనుల మీద చీకటి మాటున సాగించాలనుకున్న మారణకాండకి స్వజనం బలి కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం.Exodus 12 - New International Version (NIV) ప్రకారం మోషే ఇశ్రాయేలీయులలో పెద్దల్ని ఒకచోట చేర్చి "“Go at once and select the animals for your families and slaughter the Passover lamb. Take a bunch of hyssop, dip it into the blood in the basin and put some of the blood on the top and on both sides of the doorframe. None of you shall go out of the door of your house until morning. When the Lord goes through the land to strike down the Egyptians, he will see the blood on the top and sides of the doorframe and will pass over that doorway, and he will not permit the destroyer to enter your houses and strike you down." అని చెప్పాడు.దీని అర్ధం ఏమిటో మీకు తెలుస్తున్నది కదూ! రాత్రి అక్కడ ఈజిప్షియన్ల ప్రధమ సంతానాల్ని చంపింది యహోవా కాదు, మోషేయే తన మనుషులతో కలిసి చీకటి మాటున వూచకోత కోసేశాడు! భీబత్సం చేసేదీ చేస్తున్నదీ చేసిందీ యహోవా అని చెప్పడం పచ్చి మోసం - గుర్తులు మనుషులైన మోషే అనుచరులకి గుర్తులు అవసరం గానీ సకలలోకసృష్టికర్త యహోవాకి అవసరమా!ఎవరు ఈజిప్షియన్లో ఎవరు ఇశ్రాయేలీలో పోల్చుకోలేనంత అజ్ఞానియా యహోవా?
అంత భీబత్సం చూశాక కూడా నిబ్బరం చూపించగలిగిన మానవత్వం గల మనిషి ఎవడూ ఉండడు కదా - ఫారో అన్నదమ్ముల్ని పిలిచి “Up! Leave my people, you and the Israelites! Go, worship the Lord as you have requested. Take your flocks and herds, as you have said, and go. And also bless me.” అని చేతులెత్తేశాడు, పాపం! మొగుణ్ణి కొట్టి మొగసాలకు యెక్కినట్టు ఉన్న సన్నివేశం చరిత్రలో చాలాసార్లు జరిగింది - మచ్చుకు చూడాలంటే 1946, ఆగస్టు 14 కలకత్తాలో జరిగిన Direct Action Day నాటి హిందువుల వూచకోతని గుర్తుకు చేసుకోండి.ప్రత్యేకించి తెలుగువాళ్ళకి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉండనే ఉంది.
అన్ని సార్లూ ఆయా భీబత్సాలకి ముందు వలసకాండ జగన్నాటకం మొత్తం అవే రకం పాత్రలతో అదే రకం దృశ్యాలతో నడిచింది - అయినా క్లైమాక్సును ఎవరూ ఆపలేకపోయారు, నరబలిని గానీ ఘోరకలిని గానీ తప్పించలేకపోయారు:
పేరిందేవి!

విభుని కూడనైన కూడకయే విధవ యయ్యె!!
తనవారి రాజ్యకాంక్షకు తన మాంగల్యమే బలియయ్యె!!!
వయసుకు చిన్నదైనా ఒక్క కన్నీటిబొట్టు రాల్చలేదు.
పినతండ్రిని వరుసతో పిల్చి మరీ తిట్టింది,
చీరెసారె లివ్వాల్సిన చేతితోనే ముండకోకనూ ఇవ్వమని ఆడిగింది!
అంతటి నలగాముడూ సిగ్గుపడి మొగం దించుకుని నిలుచుండేటట్లు చేసింది.

"నువు విధవ్వి, దీపాలార్పడమే తెల్సు నీకు!
దీపమెట్టేవేళ బిడ్డలు గల తల్లులు నిన్ను తలవరు - నన్ను తలుస్తారు,
నా ఉసురు తగిలి నీపేర్న నాల్గుమణుగుల నల్లపూసలు తెగుతాయి చూడు!"మన్న
బాలికావధువు శాపానికి నల్ల నాగులేరు గజగజలాడింది!
"నాయుడూ నీమూతికి మీసముంటే నా ముంజేతికి మీసముంది"
అని రోషం చూపించిన నాయకురాలు నాగమ్మ కూడా బిత్తరపోయంది,
సిగ్గుపడి సంధి కొడంబడింది
చిన్నారి పేరిందేవి ధాటిగల మాటలకు జడిసి!

అనపోతు చావువార్త విన్న బాలచంద్రునికి వెర్రిపుట్టి
సంధి చెడింది,నాల్గుమణుగుల నల్లపూసలు తెగినవి,
నల్ల నాగులేటి నీరెర్రబారింది!
   
కళ్ళుమూసుకుని తలిస్తే చాలు
కాటికి కాళ్ళు చాపుకున్నవాడికయినా కండల్ని పొంగించగలిగిన వీరాధివీరులు
తమను తామే చంపుకున్న తీరును చూసి భూతరాట్కంబమొకటే పకపక నవ్వింది!

నాపసాని ఏడుగడియల మంత్రిత్వం ఇంత చేసింది!
ఆపలేని బ్రహ్మనాయుని మంత్రాంగం యాడబోయింది?
నాయుడూ నాగాంబా సన్నాసులై బిలముల జొచ్చినారు.
కోటపేటలు అన్నీ మంటిగలిసి,,
అన్నదమ్ములు కూడ మింటికరిగి
రాజొక్కడు ఒంటిగ మిగిలినాడు!

అంతేరా, నాయనా!
ఆది జంగమదేవర ఢమరుకం మోగించినాక
నువ్వెంత?నీ తెలివెంత?నీ హజమెంత?
నీ వైభవాల మైకం,నీ స్థగిణీల మాంగల్యం,నీ కోటపేటల గట్టిదనం -
ఏదీ మిగలదు,అంతా భస్మమే!!

శివోహం!శివోహం!శివోహం!
Raja Ravi Prasad Moka "నువ్వింకా తెలివయిన వాడివనుకుని తెగ భయపడి చచ్చాను సుమా.....ఇది కదా కావలసింది.1. దేవుడు అడిగిన బలి ఇవ్వబడింది. అది నిజమే , అయినా ఫరో కు అన్నీ వివరం చెప్పాల్సిన అవసరమేం లేదు. మళ్ళీ వెనక్కి రాము అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ, మళ్ళీ వెనక్కి వస్తాము అని కూడా చెప్పలేదు.2. మూడు రోజుల పర్మిషన్ అడగలేదు,మూడురోజుల ప్రయాణమంత దూరం వెళ్ళి బలి ఇవ్వాలి అని చెప్పారు. పోనివ్వ లేదు గనక అక్కడే ఇచ్చేసారు." అంటున్నప్పుడు అతని దృష్టిలో బలి వుంది?పండగ కోసం చంపిన గొర్రెల బలి అయితే జంతుబలి, కానీ అక్కడ అదొకటే జరగలేదు, ఈజిప్షియన్ల ప్రతి కుటుంబ్మలోని పెద్ద కొడుకూ చచ్చిపోవడం కూడా జరిగింది కాబట్టి అది నరబలి. కడుపులో ఇంత క్రూరత్వం పెట్టుకున్న వాళ్ళు మా దేవుడు కరుణామయుడు, మా అంత సున్నిత హృదయులు లేరు, మమ్మల్ని తిట్టే వాళ్ళకోసం కూడా ప్రార్ధించే జాలిగండె మాది అని డప్పు కొట్టుకోవటం చూస్తుంటే మీకు అసహ్యం వెయ్యడం లేదూ!
మన పరిమిత జ్ఞానానికి అర్ధం కాని ప్రతిదీ నిరర్ధకం అనుకోవడమే అజ్ఞానంతో కూడీన అహంకారానికి మొదటి గుర్తు.ఇవ్వాళ అర్ధం కానిది జ్ఞానం పెంచుకుంటే రేపు అర్ధం కావచ్చు - కానీ నాకు ఇప్పటికి తెలిసిందే సమస్తం, ఇంతకు మించి ఏదీ లేదు, ఉందంటే నువ్వు ఛాందసుడివీ మతోన్మాదివీ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారులు.
నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు వైదిక ధర్మం తన జడత్వాన్ని వదిలించుకుని ఒకే ఒక్క సారి పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్య పరంపర నుండి సంక్రమించిన మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే జ్ఞానదృష్టితో నేను చెప్తున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

Saturday 23 May 2020

ఈజిప్షియన్ ఫారోలు మోషేగారు పులిమేసినంత దుర్మార్గులు కారు - బైబిలే సాక్ష్యం ఇస్తుంది!


“ఇప్పుడే గంట క్రిందట జరిగిన యధార్థ సంఘటన చెప్తున్నాను.మా బంధువొకామెకు బిపి టాబ్లెట్లు వాళ్ళ ఏరియాలో దొరక్కపోతే నా ఏరియాలో కొని ఇవ్వడానికి టు వీలర్ మీద వెళ్తున్నా, సగం దూరం వెళ్ళాక రోడ్ పక్కన ఒకడు బేగ్ తగిలించుకుని పడి పోయి ఉన్నాడు, ఎవరూ పట్టించుకోవట్లేదని తిట్టుకుని నేనే వెళ్ళాను, వాణ్ణి లేపి కూర్చో బెట్టాను చీమలు కుడుతున్నా పట్టించుకోవట్లేదు అతను, రోడ్ పక్జనే ఉంటే వెహికిల్ అయినా కొట్టేస్తాడేమోనని కాస్త ఎత్తుగా ఉన్న అరుగు మీద కూర్చోబెట్టా. గురుడు పుల్లుగా లోడయి పోయి ఉన్నాడు, అయితేమాత్రం తాగిన వాడు నీళ్ళు లేకపోతే దాహంతో చస్తాడేమోనని వాటర్ కోసం చూసా, లాక్ డవున్ కదా కిలో మీటర్ దూరం వరకూ ఏం షాపుల్లేవు, చివరికి కిలో మీటర్ వెనక్కు వెళ్ళి వాటర్ బాటిల్ కొని తీసుకొచ్చి చూసే సరికి గురుడు మళ్ళీ రోడ్ మీద పడుకున్నాడు, మళ్ళి లేపి నీళ్ళు తాగరా అంటే ఒక్క గుక్క తాగలేదు, ఎందుకురా జీవితం పాడుచేసుకుంటావు ఇంట్లో భార్యాబిడ్డలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని కాస్త మంచిమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే, బూతులు మొదలెట్టాడు. వాటర్ బాటిల్ వాడి పక్కన పెట్టేసి, ముందుకెళ్ళిపోయాను, పెద్దమ్మకు మెడిసిన్ ఇచ్చి, తిరిగి వచ్చేప్పుడు చూస్తే రోడ్ కి ఆపోజిట్ సైడ్ త్రాగుబోతు పక్కన నాలాటి ఇంకో రెండు గొర్రెలు తిప్పలు పడుతున్నాయ్ పందిని బురదలోనించి లేపడానికి. అయ్యయ్యో అనుకుంటూ వచ్చేసాను.ఏం జరిగి ఉండొచ్చు. నీకేం స్ట్రయిక్ అయ్యింది?”
Raja Ravi Prasad Moka అనే వెర్రి క్రైస్తవ గొర్రె "మోజేసు అనే పేరుతో చరిత్రలో ఎవరూ లేరు" పోష్టు దగ్గిర వేసిన కామెంటు అది.కామెంటు చివర "నీకేం స్ట్రయిక్ అయ్యింది?" అనే భాగం వరకు రాకముందే అతను కామెంటు వేసిన ఉద్దేశం నాకు అర్ధమయ్యింది.బహుశా, అతను కామెర్ల రోగి సామెతలా నన్ను కూడా తనలాంటి తోలుమందం వెర్రిగొర్రె అనుకున్నాడు కాబోలు! నేను విషయాన్ని అర్ధం చేసుకోవడంలో చాలా చురుకైన వాణ్ణి - ఎదుటి వ్యక్తి వాడిన పదాల్ని బట్టీ వాక్య సముచ్చయాన్ని బట్టీ భాషాశైలిని బట్టీ అక్కడ బైటికి కనిపిస్తున్న విషయం ఒక్కటే కాదు కనిపించని లోపలి ఉద్దేశాల్ని కూడా కనుక్కోగలను, ఇలాంటి ప్రజ్ఞని Reading Between the Lines అనీ Viewing Beyond the Horizons అనీ అంటారు!మానవత్వం కోశానా లేని అధమాధముడికి తనొక్కడే మర్యాదస్తుడిననీ తన మతమూ తనకు సంబంధించినవి మాత్రమే ఉన్నతమైనవనీ అనుకునే బలుపు స్థాయిలో ఉందో "నీకేం స్ట్రయిక్ అయ్యింది?" అనే ఒక్క మాటని బట్టి తెలుసుకోవచ్చును.అతని ఉద్దేశం ఏమిటంటే, "ఒరేయి హరిబాబూ!నువ్వూ తాగుబోతు లాంటివాడివేరా.నేను ఎంతో ప్రేమతో నీకోసం ప్రార్ధిస్తున్నాను.నువ్వు నన్నే తిడుతున్నావు.నువ్వు హిందువ్వి గాబట్టే అలా ప్రవర్తిస్తున్నావు, నేను క్రైస్తవుణ్ణి గాబట్టే అలా ప్రవర్తిస్తున్నాను - తేడా తెలుసుకో!రా, మా క్రైస్తవంలోకి వచ్చెయ్యి." అని నన్ను అవమానించి తనని తను పొగుడుకోవటం, పనిలోపని కన్వర్షన్ హిప్నటిజం వాడెయ్యటం.
నేనూ చాలాకాలం క్రితం ఇలాంటి సన్నివేశంలో ఇరుక్కున్నాను.అన్ని సిటీల్లో కన్న చెన్నైలో జనం ట్రాఫిక్ రూల్స్ పాటించే పద్ధతి వింతగా ఉంటుంది.నేను ఆఫీసుకి వెళ్ళే దారిలో ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గిర టర్నింగ్ తిరగ్గానే స్కైమాల్ అనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది.ట్రాఫిక్ పోలీస్ చూస్తుండగానే అతని వీపు వెనకాల అతను చెయ్యి చాపితే ఆందే దూరంలో ఒక వైపునుంచి వచ్చే ఆటోవాలా రాంగ్ సైడు టర్నింగ్ తీసుకుని పోయే హడావిడిలో ఒక స్కూటరువాలాని గుద్దేశాడు, ఆటోవాలా ఆయన కింద పడిపోవటం చూశాడు, అయినా ఆపకుండా వెళ్ళిపోయాడు.విచిత్రం ఏంటంటే, పోలీసు కూడా చూసి తల తిప్పేసుకుని ట్రాఫిక్ కంట్రోలింగులో బిజీ అయిపోయాడు.ఆ ట్రాఫిక్ పోలీసుని కూడా ఏమీ అనలేని స్థితి!
పోలీసు అలా నిబ్బరంగా ఉండటానికి అప్పటికే నేను కిందపడిన పెద్దమనిషికి సాయం చెయ్యటానికి రంగంలోకి దిగటాన్ని అతను గమనించడం కూడా ఒక కారణం కావచ్చు. నేను దాదాపు పక్కనే ఉన్నాను.వెంటనే నా బైక్ మధ్యలో ఉన్న డివైడర్ పక్కన ఆనుకునేటట్టు సైడ్ స్టాండ్ వేసేసి ముందు ఆయన్ని లేపి నిలబెట్టాను.మొదటి మాటలోనే తెలుగాయన అని తెలిసిపోయింది.వేలు చిట్లి కొంచెం బ్లడ్ రావటం వయసును బట్టి అదురును తట్టుకోలేకపోవటం తప్ప పెద్ద దెబ్బలేమీ తగల్లేదు.నేను సాయం పడితే తేలిగ్గానే లేచారు.విషయాలు కనుక్కుంటే - రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రస్తుతం అఫిలియేటెడ్ కాలేజిలో ఆనరరీ పోష్టులో ఉన్నారు. ఆయన బైకుని కూడా లేపి రోడ్డు క్రాస్ చేసి ఒక షాపుముందు పార్క్ చేసి అక్కడున్న సెక్యూరిటీకి విషయం చెబితే పాపం అతను కూడా వొద్దొద్దు అనలేదు. కీస్ తీసుకుని పెద్దాయనకి ఇచ్చి డెబిట్ కార్డ్ ఉంది, పక్క లైనులోనే  డిస్పెన్సరీ ఉంది డ్రస్సింగ్ చేయిస్తాను రమ్మని అడిగాను. ఇక్కడే వాళ్ళ సిస్టర్ ఉన్నారని చెప్పి అక్కడ దింపమన్నారు. తీరా ఆయన చెప్తున్న గుర్తులు చూస్తే వాళ్ళ సిస్టర్ ఉండే అపార్టుమెంటు నేను ఆఫీసుకి వెళ్ళే దారిలోనే  - ఆయన్ని దింపాక బై చెప్పి ఆఫీసుకి వచ్చేశాను.
వీడికి లాగే నాకు కూడా ఆ సన్నివేశం హఠాత్తుగానే ఎదురైంది.అయినా నేను ఎక్కడా తడబడలేదు, పక్కా ప్లానింగ్ చూపించాను.మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు నేను చెయ్యగలిగింది సమస్తం చేశాను.తర్వాత గుర్తొస్తే "అయ్యో!అలా కాక ఇలా చేసుంటే బాగుండేది." ఆనుకునేలా చెయ్యలేదు - చేసిన ప్రతి చిన్న పనినీ మనసు పెట్టి చేశాను!
మరి వీడేం చేశాడు? తను అక్కడ రాసిన ప్రతి వాక్యంలోనూ నేను చూడండి ఎంత సౌజన్యం చూపించానో అని డబ్బా కొట్టుకోవాలనే దురద తప్ప నిజాయితీ లేదు. తను డబ్బా కొట్టుకోవడానికి చాన్స్ ఇవ్వకుండా వాడి అమాయకత్వం కొద్దీ కాస్త తిట్లకి లంకించుకోగానే ఓ వాటర్ బాటిల్ వాడి మొహాన కొట్టి చెయ్యాలనుకున్న మంచిపనిని మధ్యలో వదిలేసి పోయాడు.మళ్ళీ చూసినప్పుడు ఇంకో ఇద్దరు మంచివాళ్ళు వాడికి సాయం చేస్తుంటే ఆగి తను కూడా వాళ్ళతో కలవటానికి బదులు "ఆ త్రాగుబోతు పక్కన నాలాటి ఇంకో రెండు గొర్రెలు తిప్పలు పడుతున్నాయ్ ఆ పందిని బురదలోనించి లేపడానికి. అయ్యయ్యో అనుకుంటూ వచ్చేసాను." అని ఆ ఇద్దర్నీ పిచ్చోళ్ళ కింద ట్రీట్ చేస్తూ నాకు చెప్పి "ఏం జరిగి ఉండొచ్చు. నీకేం స్ట్రయిక్ అయ్యింది?" అని నన్ను చాలెంజి చేస్తున్నాడు - ఎంత నీచత్వం?
ఆ తాగుబోతు నాకు సాయం చెయ్యి, నన్ను ఉద్ధరించు అని వీణ్ణి పిలిచాడా? వీడికి మొదట పుట్టింది నిజమైన అనుకంప అయితే "ఆ వాటర్ బాటిల్ వాడి పక్కన పెట్టేసి, ముందుకెళ్ళిపోయాను" అని చెప్పుకునేవాడు కాదు.ఒకటి గమనించారా, వీడు నా పోష్టు దగ్గిర వేసిన మొదటి కామెంటు నుంచే నాపట్ల ఏకవచనం వాడుతూ రెచ్చిపోవటమే కాదు, ఇక్కడ తను ఎవరికైతే సాయం చేసి ఉద్ధరించాలని అనుకున్నాడో ఆ సాటి వ్యక్తిని గురించి కూడా మొదటినుంచే "వాణ్ణి లేపి కూర్చో బెట్టాను" అని అమర్యాద చూపించాడు.సబ్జెక్టుకి సంబంధించిన వీడి కామెంట్లలో కూడా ఒక హఠాత్ ప్రమాదానికి భయపడి మోషేని కేవలం నిలదీసినందుకే అతని వెంట వచ్చిన ఇజ్రాయేలీయుల పట్ల కూడా ఇదే అమర్యాద చూపించాడు.అన్ని సన్నివేశాల్లోనూ వీడిలో కనబడుతున్న మోటిఫ్ ఒకటే - వీడిలో లేని ఉన్నత గుణాల్ని ఉన్నట్టు ప్రదర్శించుకోవాలి, తను చెప్పే సొల్లు కబుర్లు జనం చెవులప్పగించి విని చప్పట్లు కొడితే చాలు.
వీడు ఆ తాగుబోతు గురించే కాదు, మోషే గురించీ ఐగుప్తీయులను గురించీ ఆఖరికి ఇశ్రాయేలీయులను గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నాడు.మోషేలో నిజమైన మంచితనం ఉందా లేదా అనేది తర్కించి చూడడు, బైబిలు జబదస్త్ పులుముడు ప్రదర్శన చేసి చూపించింది గాబట్టి నమ్మేశాడు, ఆ ప్రదర్శనని నమ్మని ఇజ్రాయేలీయుల్ని గురించి "చచ్చారు" అనే మాటని వాడాడు.ఒక మనిషి మీకోసం నేను ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సిద్ధపరిచానని చెప్పినప్పుడు తనని నమ్మి వచ్చినవాళ్ళు వైభవానికి బదులు ప్రమాదం ఎదురైనప్పుడు కూడా శంకించకూడదా!అంతమాత్రానికే కోపం వచ్చేసి "చచ్చారు" అని అమర్యాద ఎందుకు చూపించాడు?నా గురించి "పంది!" అనే మాటని వాడే స్థాయి ద్వేషాన్ని మనసులో పెట్టుకుని అదే నోటితో మాటిమాటికీ "నీ గురించి ప్రార్ధిస్తున్నాను!" అనడం కూడా నేను చూడు నువ్వు నన్ను తిడుతున్నప్పటికీ నీ క్షేమం కోసం ప్రార్ధిస్తున్నాను, నేను ఎంత ఉన్నతమైనవాణ్ణో అని నాకూ ఇతర్లకీ చూపించడానికే.
ప్రదర్శన!ప్రదర్శన!ప్రదర్శన! వీడొక్కడే కాదు, దాదాపు ప్రతి క్రైస్తవ మతబోధకుడూ ప్రదర్శనకే ఎక్కువ సమయం కేటాయిస్తారు.ఒక వాక్యం చదవటం, వెంఠనే "ఆహా!ఎంత గొప్ప వాక్యం?ఇంతకన్న గొప్ప అర్ధవంతమైన వాక్యం ఇంకెక్కడైనా ఉందా, మీరు చెప్పండి?" అని హడలగొట్టి గబుక్కున కూర్చున్నవాళ్ళలో ఉన్న నాబోటి కొంటె కుర్రాడు ఉందని అంటాడేమోనని కంగారుపడి "లేదు!లేదు!ఉండటానికి వీల్లేదు!" అని డయాసు మీద సునామీ సృష్టించుతూ బొంగరం తిరిగినట్టు గింగిరాలు తిరుగుతారు! "ధర తక్కువ బంగారానికి మెరుగు ఎక్కువ!","అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఎంగిలాకు ఎగిరి గంతులు వేస్తుంది!" లాంటి సామెతలు మనవాళ్ళు వూరికే పుట్టించలేదు.
Abraham గారు 2038 BCEలో పుడితే Moses అధర్యంలో నడిచిన the Exodus from Egypt అనేది 1250(13th century BCE)లో జరిగింది. Moses యూదు మతానికి అంతకు ముందు ఉన్న రూపాన్ని పూర్తి స్థాయిలో మార్చేసి తన సొంత రూపాన్ని పులిమేశాడు.ఇతర దేవతల్ని ద్వేషిస్తూ ఒక్క యహోవానే పూజించాలని చెప్పటం, విగ్రహారాధనని తీవ్రమైన పదజాలంతో ఖండించటం, ప్రశ్నించడమే నేరం అన్నంత ఎక్కువ విధేయతని పాలితులకి ఆదర్శం చెయ్యడం వంటి ఆకర్షణీయమైన విధివిధానాల రూపకల్పన చేసినది స్వార్ధపరులైన కొందరు అమాయకులైన అందరి మీద పెత్తనం చెయ్యడం సహజమైనదేనని భ్రమింపజెయ్యడానికే తప్ప మతాన్ని పాటించేవారిని ఉన్నత సంస్కారం గలవారిని చెయ్యటానికి కాదు. Moses తనకు గోచరించిన YHWHను అనుచరులకు "ehye asher ehye" అని విశదం చేశాడు - “I am/shall be what I am/shall be” అని అర్ధం. ఎట్లా మైండుకి తట్టిందో తెలీదు గానీ మాంఛి హుషారు మూడు ఝమాయించినప్పుడు నేను కూడా టీనేజిలో "I am what I am" అని అనుకునేవాణ్ణి, అంటే నేను కూడా యహోవా అంతటి దేవుణ్ణేనా? నాలుగు మతాలకి మూలకర్త అనే గానీ మతం రూపు దిద్దుకోవడంలో అబ్రాము వూడబొడిచిన ఘనకార్యం ఏమీ లేదు, మొదటి ark of covenant స్థాపించడం తప్ప.మోషే గారు కధలోకి వచ్చాకనే మతంలోకి కొంచెం సెంటిమెంటూ కొంచెం వయొలెన్సూ వచ్చి చేరాయి.
According to Egyptian accounts the last king of the XVth dynasty, named Apopi, “very pretty71” in Hebrew like Moses’ birth name (Ex 2:2), reigned 40 years in Egypt (1613-1573), then 40 years later he met Seqenenre Taa the last pharaoh of the XVIIth dynasty. The eldest son of Seqenenre Taa, Ahmose Sapaïr, who was crown prince died in a dramatic and unexplained way shortly before his father. Seqenenre Taa died in May 1533 BCE, after 11 years of reign, in dramatic and unclear circumstances. The state of his mummy proves, however, that his body received severe injuries and remained abandoned for several days before being mummified (Ps 136:15). Prince Kamose, Seqenenre Taa's brother, assured interim of authority for 3 years (1533-1530) and threatened to attack the former pharaoh Apopi, new prince of Retenu (Palestine). In the Stele of the Tempest he also blames Apopi for all the disasters that come to fall upon Egypt which caused many deaths. “ - ఇది బైబిలు రూపం మార్చిన మోషే గారి అసలు చరిత్ర!
Seqenenre Taa, Ahmose Sapaïr అనే ఫారోల వంశపు తండ్రీ కొడుకులు హతులయిన May 10, 1533 BCE తేదీన EXODUS జరిగినట్టు భావిస్తున్నారు - కానీ ఆనాటి చరిత్రక శిధిలాలను ఎన్నో శ్రమదమాదుల కోర్చి తవ్వి తీసిన ఎంతోమంది పరిశోధకుల్లో ఒక్కరికీ EXODUS జరిగిందనటానికి నికరమైన ఒక్క ఆధారం కూడా దొరకలేదు.ప్రతి నమ్మకానికీ సత్యం పునాది ఉండాల్సిన అవసరం లేదని సరిపెట్టుకోవటమే, తప్ప అబ్రహామిక మతాల వారు పరమసత్యం కోసం పట్టుపట్టకుండా ఉంటేనే మంచిది! "I belived somebody, took the medicine for my decease without knowing the farmulae details and everything about the medicine. I just believed. And I am cured." అనుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు.చాలామంది హిందువులు కూడా ఆధ్యాత్మికత విషయంలో అలాగే ఆలోచిస్తున్నారు.
అయితే, బాధ కలిగించే విషయం ఏమిటంటే బైబిలు రచయితలు చెప్పిన అబద్ధాలు ఎవరిని గొప్ప చేసి చూపించాలని చెప్పారో పెద్దమనుషులను అవమానించేటట్టు ఉన్నాయి.నిజానికి నా పరిశోధన ప్రకారం అబ్రాము గారి సతీమణి మొదట ఫారో దగ్గిరకి వెళ్ళడానికీ పిదప Abimelech దగ్గిరకి వెళ్ళడానికీ శృంగారమో వ్యభిచారమో కారణం కాదు. స్వయాన ఫారో రాజు చెక్కించిన (1962 BCE) నాటి Sarai as an Offering Bearer  ప్రతిమల్ని బట్టి ఫారో ఆమెని దైవపూజకి వినియోగించినట్టు మనం అర్ధం చేసుకోవాలి.మోషేను పెంచుకున్న ఫారో యువరాణితో సహా ఆనాటి మహిళలు కన్యాత్వం చెడని బ్రహ్మచర్యంతో పూజల కోసం తమను తాము అర్పించుకోవడం బైబిలులోనే చాలా చోట్ల ప్రస్తావనకు వస్తాయి. అబ్రహాము స్థాపించని పాత మతానికి చెందిన విశిష్ట పూజలు సారాకి ఎట్లా తెలిశాయి అన్న ప్రశ్నని తప్పించుకోవడానికి బైబిలు రచయితలు ఆమెకు ఆ రెండు సార్లూ రంకును అంటగట్టేశారు - ఎంత నీచత్వం!
అబ్రాము గారి కధలో ఉన్న చప్పదనం వల్ల బోరు కొడ్తున్నదని మోషే గారి కధలో కొత్తదనం అద్దాలని ఇప్పటి సినిమా కధల్ని రాసేవాళ్ళు హీరో గొప్పతనాన్ని ఎలివేట్ చెయ్యడానికి విలన్ని బూచాడిలా చూపించి డిఫమేట్ చెయ్యడమనే గొప్ప ట్రిక్కుని అప్పటి బైబిలు రచయితలు మోషే గారు ఫారోల దుర్మార్గపు పాలన నుంచి అమాయకులైన ఇశ్రాయేలీయులను రక్షించి రోమునూ ఈజిప్టునూ వదిలి తనవెంట తీసుకెళ్ళి వారికోసం ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం అనే EXODUS కధలో ఇమిడ్ఛారు!అయితే, స్క్రిప్టూ స్కీన్ప్లే అదిరి పోయాయి గానీ డైలాగులూ కధనమూ తేలిపోయాయి - ప్రాచీనులు కదా పాపం!
The International Bible Society వారు ప్రచురించిన New International Version (NIV) మోషే గారి పుట్టుక సన్నివేశాన్ని ఫారో యువరాణి ముద్దులు మూటగడుతున్న చిన్నారి శిసువుని దత్తత తీసుకుని పేరు పెట్టడం మాత్రమే చెప్పింది గానీ Flavius Josephus అనే చరిత్ర కారుడు యువరాణి కతిపయ దినముల పిదప శిశువును కొంత ఎదిగిన దనుక తన తండ్రి వద్దకు తీసుకు వెళ్ళినట్టున్నూ ఆమె తన తండ్రితో శిశువును తన వారసుడిగా స్వీకరించినట్టు "I have brought up a child who is of a divine form, and of a generous mind; and as I have received him from the bounty of the river, in, I thought proper to adopt him my son, and the heir of thy kingdom" అని చెప్పి శిశువును తండ్రికి అందించినదనిన్నీ తండ్రి కూడ శిశువును ముద్దాడి రొమ్ములకు హత్తుకొని కూతురును సంతోషపెట్టుటకు తన కిరీటమును శిశువు తలపై ఉంచినాడనిన్నీ అది నచ్చని శిశువు వెర్రిగా అరిచి తలనుండి దానిని విసరివేసి తాత ఒడినుండి చెంగున నేలపైకి దూకి పాదములతో తొక్కినాడనిన్నీ వర్ణించాడు.ఆస్థాన జ్యోతిష్కుడు దూరమునుండి ఇది చూచి గొప్ప తొందర గలవాడై శిశువును చంపబోయినాడనిన్నీ "This, O king! this child is he of whom God foretold, that if we kill him we shall be in no danger; he himself affords an attestation to the prediction of the same thing, by his trampling upon thy government, and treading upon thy diadem. Take him, therefore, out of the way, and deliver the Egyptians from the fear they are in about him; and deprive the Hebrews of the hope they have of being encouraged by him" అని రాజుకు మొర్రలు పెట్టుకొనినాడనిన్నీ నొక్కి వక్కాణించాడు. రాజు మాత్రం తన మనమణ్ణి అతని చేతినుంచి లాగేసుకున్నాడట - అప్పటికప్పుడు చంపడానికి త్వరపడలేదట! (Jewish Antiquities II:232-233).కధనం అదిరిపోయింది గదూ - పంచగ్రంధి మొత్తాన్ని ఇతనితో రాయించితే బాగుండేదని నాకు అనిపించింది సుమండీ!
ఇందులో మీకేం అర్ధమైంది?"అర్ధం గాకే, మీరేం చెప్తారా అని చూస్తన్నామండీ!" అని నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సునీల్ మాదిరి తెల్లమొహం వేస్తున్నారు కదూ,"మంత్రసానుల్ని వదిలేసే మంచి బుద్ది ఉన్నవాడు అసలు మగపిల్లల్ని పురిటి బల్ల దగ్గిర చంపమని చెప్పడు, మగపిల్లల్ని పురిటి బల్ల దగ్గిర చంపమని చెప్పిన చెడ్డ బుద్ది ఉన్నవాడు మంత్రసానుల్ని అలా వదిలెయ్యడు - ఈపాటి కామన్ సెన్సు కూడా లేనివాళ్ళు మాత్రమే బైబిలు కధనం యదార్ధమని నమ్ముతారు." అని ఇదివరకు చెప్పాను కదూ!ఇక్కడా అదే లాజిక్ వర్తిస్తుంది.పుట్టిన ప్రతి ఇశ్రాయేలీ మగబిడ్డనీ నీటముంచి చంపెయ్యమని అంత క్రూరమైన ఆజ్ఞ ఇచ్చినవాడు ఒక ఇశ్రాయేలు శిశువు మీద అంత ప్రేమ చూపించడం ఎట్లా సాధ్యం?ఈపాటి కామన్ సెన్సు కూడా లేనివాళ్ళు మాత్రమే బైబిలు కధనం యదార్ధమని నమ్ముతారు.కాకపోతే Flavius Josephus బైబిలు రచయితల కన్న తెలివైన వాడు, ఈయన కున్న కామన్ సెన్సు బైబిలు రచయితలకి ఉండుంటే మంత్రసానులు “Hebrew women are not like Egyptian women; they are vigorous and give birth before the midwives arrive.” అని తెలివితక్కువ జవాబు చెప్పినప్పుడు God himself, inclining the king to spare them అనే ముక్క చెప్పి ఉండేవాళ్ళు. పోన్లెండి, నెరేషన్ ఎంత లూజుగా ఉంటే మాత్రం ఏం పోయింది లెండి - సినిమా హిట్టయింది కదా!ఇన్ని మిలియన్ల మందిని నమ్మించగలగడం ఎంత గొప్ప?
పాతాళ భైరవి సినిమాలో నేపాళ మాంత్రికుడు, "రే డింగరి!జనం కోరేది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని అడిగితే డింగరి "జనాన్ని అడిగితే మన షకల్ దెల్వనీకి కంఫ్యూజ్ అయితరు -  మనకి తోచింది శాయడమే బెటర్ గురూ!" అంటాడు. నాకా బాధ లేదు - "ఐగుప్తీయులు మంచివాళ్ళా?ఐగుప్తీయులు చెడ్డవాళ్ళా?" అని అడిగితే "ఐగుప్తీయులు మంచివాళ్ళే!" అని బల్ల గుద్ది చెప్తాను. సరే, కధలో “the Israelites have become far too numerous for us.  Come, we must deal shrewdly with them or they will become even more numerous and, if war breaks out, will join our enemies, fight against us and leave the country.”  అన్న పాడుబుద్ధిని చూపించిన ఫారోని వదిలేసి కాలంలో వెనక్కి వెళ్ళి Jacob చావు నాటికి వెళితే బావుంటుంది కదూ!Genesis 50 - New International Version (NIV) – 1).Joseph threw himself on his father and wept over him and kissed him. 2). Then Joseph directed the physicians in his service to embalm his father Israel. So the physicians embalmed him, 3). taking a full forty days, for that was the time required for embalming. And the Egyptians mourned for him seventy days. ఈజిప్షియన్లు కూడా ఆత్మబంధువు పోయినట్టు ఏడ్చారంటే వాళ్ళూ వీళ్ళూ ఎంత అరమరికలు లేని స్థితిలో ఉన్నారో చూడండి!
ఇందులో మీకేం అర్ధమైంది?"అర్ధం గాకే, మీరేం చెప్తారా అని చూస్తన్నామండీ!" అని నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సునీల్ మాదిరి తెల్లమొహం వేస్తున్నారు కదూ - Jacob దేహాన్ని కూడా mummify చేశారు, Jacob దేహాన్ని mummify చేసిన physicians అతని సొంత అజమాయిషీలో ఉన్నారు! అప్పటి రాజైన ఫారో Joseph తన తండ్రి పార్ధివ దేహాన్ని కనాను తీసుకెళ్ళి అక్కడ సమాధి చెయ్యాలనుకుని అనుమతి కోరినప్పుడు ఫారో ప్రభువు “Go up and bury your father, as he made you swear to do.” అని ఔదార్యం చూపించాడు."All Pharaoh’s officials accompanied him—the dignitaries of his court and all the dignitaries of Egypt","Chariots and horsemen also went up with him. It was a very large company." అని చెప్పడాన్ని బట్టి ప్రభుత్వ లాంచనాలనూ అధికారుల సేవలనీ సమకూర్చినట్టు తెలుస్తున్నది కదూ!ఆనాడూ ఈనాడూ ఏనాడూ ప్రభుత్వాలు అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులకు తప్ప సామాన్యులకు ఇవ్వడం దాదాపు అసంభవమే!
Jacob కాలం నుంచి అంతటి ప్రాభవాన్ని సంపాదించిన వాళ్ళలో Seqenenre Taa కాలం దగ్గిరకి వచ్చేసరికి అదేదో సినిమాలో ప్రకాష రాజ్ చెప్పినట్టు గిల్లితే గిల్లించుకుంటూ చంపితే చంపించుకుంటూ అలమటించాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తుంది?సాక్షాత్తూ బైబిలే చెప్పిన "ఇశ్రాయేలీయులు ప్రాంతం మొత్తం వ్యాపించి పోయారు!","ఇశ్రాయెలీయులు ప్రభుత్వం వైపునుంచి రాచమర్యాదలు అందుకుంటున్నారు!" అనే రెండు విషయాల్లో ఒక్కటి నిజమయినప్పటికీ Seqenenre Taa “వాళ్ళతో కఠినంగా వ్యవహరించి అణిచివెయ్యకపోతే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగి యుద్ధం వస్తే శత్రువుల పక్షాన చేరడమో మనకు వ్యతిరేకమై పోరాడటమో దేశం వదిలి  పోవడమో చేస్తారు” అని అనుకోవడమూ వాళ్ళని అణిచివేసి వెట్టి చాకిరీ చేయించుకోవడానికి వాళ్ళ మీదకి slave masters అనే వర్గాన్ని ప్రయోగించడమూ జరగటానికి వీల్లేని విషయాలు - వాస్తవ చరిత్రలో జరిగిన అన్ని రాజకీయ పరమైన తిరుగుబాట్లూ అంతర్యుద్ధాలూ రెండు విషయాల్లో ఏదో ఒకటి సంభవించిన చోటనే జరిగాయి!
బైబిలు మోషేగారు ఈజిప్టు నుంచి పారిపోవడానికి చెప్తున్న కారణం ఇది:"Exodus 2 - New International Version (NIV) 11): One day, after Moses had grown up, he went out to where his own people were and watched them at their hard labor. He saw an Egyptian beating a Hebrew, one of his own people. 12). Looking this way and that and seeing no one, he killed the Egyptian and hid him in the sand. 13). The next day he went out and saw two Hebrews fighting. He asked the one in the wrong, “Why are you hitting your fellow Hebrew?” 14). The man said, “Who made you ruler and judge over us? Are you thinking of killing me as you killed the Egyptian?” Then Moses was afraid and thought, “What I did must have become known.” 15). When Pharaoh heard of this, he tried to kill Moses, but Moses fled from Pharaoh and went to live in Midian, where he sat down by a well." - ఇందులో మీకేం అర్ధమైంది?"అర్ధం గాకే, మీరేం చెప్తారా అని చూస్తన్నామండీ!" అని నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సునీల్ మాదిరి తెల్లమొహం వేస్తున్నారు కదూ!Are you thinking of killing me as you killed the Egyptian? అని ఒక ఇశ్రాయేలు జాతీయుడైన వ్యక్తి మోషేను గద్దిస్తున్నట్టు అడుగుతున్న ప్రశ్నకి సంబంధించిన విషయం అక్కడ లేదు గనక కొంచెం అయోమయం అనిపిస్తున్నది మీకు, అంతే! మరేం లేదు, అంతకు ముందు ఒక ఈజిప్షియన్ని మోషేగారు చంపేసి శవాన్ని మట్టి కింద కప్పెట్టి మాయం చేశాడు, బహుశా ఇశ్రాయేలీ వ్యక్తితో పోట్లాడుతున్నందుకు కాబోలు!
పుట్టుక నుంచి ఇప్పటి వరకు బైబిలు రచయితల వచనాల ప్రకారమే మోషేగారు పెద్ద మెంటల్ కృష్ణ లాంటి క్యామికోవిలన్ అనిపించడం లేదూ!తన సాటి మగ పిల్లల్ని రాజు చంపెయ్యమని ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితిలో ఎకాఎకిన రాజుగారి మనవడైపోయాడు, కిరీటం అంటే తెలియని వయస్సులోనే రాజమకుటాన్ని కాళ్ళకేసి తొక్కాడు, అదే రాజు పోషణలో నలభయ్యేళ్ళు పెరిగాడు, తన దాసత్వం గురించి తెలిసీ తనది కాని రాజత్వాన్ని హాయిగా అనుభవించాడు, తన జాతివాణ్ణి హింసించినందుకు అన్యజాతి వాణ్ణి బహిరంగ శిక్షతో కాక రహస్యకుట్రతో చంపేశాడు, తన నేరం బయట పడనంతకాలం యధావిధి తనది కాని రాజత్వాన్ని స్వేచ్చగా అనుభవించాడు, తన నేరం బయటపడిన మరుక్షణం ప్రాణం కాపాడుకోవటానికి దూరదేశం పారిపోయాడు - ఇటువంటివాడిని సకలలోక సృష్టికర్త ప్రపంచ స్థాయి మానవోత్తముడని ప్రకటించా డు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు ఇశ్రాయేలీయుల్ని వాళ్ళకి లేని దాస్యం ఉందని నమ్మించాడు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు ఐగుప్తీయులకి లేని క్రూరత్వాన్ని అంటగట్టాడు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు అమాయకులైన ఇశ్రాయేలీయులను అమాయకులైన ఐగుప్తీయులను దోచుకోమని చెప్పాడు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు ఈజిప్టులో తమ కష్టార్జితం తాము అనుభవిస్తూ బతుకుతున్న ఇశ్రాయేలీయుల్ని నలభయ్యేళ్ళు కారడవుల్లో తిప్పి తిప్పి కేవలం తనని ధిక్కరించినందుకు తనని నమ్మి వచ్చిన ఇశ్రాయేలీయుల్నే చంపేస్తూ తన పెత్తనం కింద ఒక మతాన్నీ ఒక రాజ్యాన్నీ స్థాపించి ఒక ధర్మశాస్త్రాన్ని కూడా రచించాడు - ట!
ఆ చివరి దానికి కూడా "డు - ట!" అని ఎందుకు చేర్చానో తెలుసా - అబ్రాము కనాను వెళ్ళినట్టే వలస జరిగింది కూడా 12వ లేక 13వ లేక 14వ లేక 15వ BCEల నాడు అయితే అబ్రహామును గురించి చర్చించిన మొదటి భాగంలో చెప్పుకున్నట్టు 950 BCEల నాడు సంకలించిన “J” లేక Yahwistic(Jahweh in German) source, 850 BCEల నాడు సంకలించిన “E” లేక Elohist source, 600 BCEల నాడు సంకలించిన “D” లేక Deuteronomist source, 500 BCEల నాడు సంకలించిన “P” లేక Priestly source అనే నాలుగు మూలగ్రంధాల మీద బైబిలు ఆధారపడి వుంది!ఈ నాల్గింటిలోనూ ఉన్న అవకతవకల్ని సరిచెయ్యటం కోసం ఒక పుస్తకాన్ని రాసేసుకుని అన్నింటినీ కలిపి Pentateuch అంటున్నారు. "In fact, no manuscript evidence of the J,E,P,D - documents or any of the other supposed fragments have ever been discovered and there are no ancient Jewish commentaries that mention any of these imaginary documents or their alleged unnamed authors." అని Gérard GERTOUX బల్ల గుద్ది చేప్పేశాడు.
మొత్తం బైబిలు సాహిత్యంలో నాకు పిచ్చపిచ్చగా నచ్చేసిన భాగం అబ్రాము గారి ద్యాముడు తన గురించి “I am who I am." అని చెప్పుకోవటం - అది చిన్నప్పుడు నాకు నేను పెట్టుకున్న ముద్దుపేరు కదా!ఆ యేహ్వేహే ద్యాముడి కంటే నేను వెయ్యి రెట్లు తెలివైనవాణ్ణి, నిజం.అబ్రాము గారి ద్యాముడు Exodus 4 - New International Version (NIV) దగ్గిర మోషేగారికి చెప్పింది ఇది:21). The Lord said to Moses, “When you return to Egypt, see that you perform before Pharaoh all the wonders I have given you the power to do. But I will harden his heart so that he will not let the people go. 22). Then say to Pharaoh, ‘This is what the Lord says: Israel is my firstborn son, 23). and I told you, “Let my son go, so he may worship me.” But you refused to let him go; so I will kill your firstborn son.’”మరి, అక్కడ జరిగింది ఏంటి?
Exodus 5 - New International Version (NIV) చెప్పిన దాని ప్రకారం మోషేగారు ఫారో దగ్గిర “This is what the Lord, the God of Israel, says: ‘Let my people go, so that they may hold a festival to me in the wilderness.’” అని యేహ్వెహే ద్యాముడి పాఠం అప్పజెప్పాడు.సరే, బైబిలు రచయితల స్క్రీన్‌ప్లే ప్రకారం ఫారో కూడా “Who is the Lord, that I should obey him and let Israel go? I do not know the Lord and I will not let Israel go.” అని యేహ్వెహే ద్యాముడి పాఠం అప్పజెప్పాడు.
ఫారో కేవలం పాఠం అప్పజెప్పి వూరుకోలేదు - “You are no longer to supply the people with straw for making bricks; let them go and gather their own straw. But require them to make the same number of bricks as before; don’t reduce the quota. They are lazy; that is why they are crying out, ‘Let us go and sacrifice to our God.’ Make the work harder for the people so that they keep working and pay no attention to lies.” అని ఇశ్రాయేలీయుల్ని పెనమ్మీద నుంచి పొయ్యిలోకి తోసేశాడు.దెబ్బకి ఇశ్రాయేలీయులకి పులుసు నీళ్ళు కారిపోయి అలోపొలో అమంటూ ఫారో దగ్గిరకి పోయి “Why have you treated your servants this way? 16 Your servants are given no straw, yet we are told, ‘Make bricks!’ Your servants are being beaten, but the fault is with your own people.” అని వేడుక్కున్నారు.వారి వీరి మాటల మధ్యన ఇశ్రాయేలీయులకి అసలు విషయం తెలిసి బయట వీళ్ళ కోసం కాచుకుని ఉన్న Moses, Aaron సుందోపసుందుల్ని చూడగానే “May the Lord look on you and judge you! You have made us obnoxious to Pharaoh and his officials and have put a sword in their hand to kill us.” అని ముఖం మీదనే తిట్టేశారు.మరి అబ్రాము గారి ద్యాముడు తనకి ఇచ్చిన శక్తులు గుర్తుకు రాకనో ఏమో Moses తన ద్యాముడి దగ్గిరకి పరుగెత్తుకెళ్ళి “Why, Lord, why have you brought trouble on this people? Is this why you sent me? 23 Ever since I went to Pharaoh to speak in your name, he has brought trouble on this people, and you have not rescued your people at all.” అని బ్యారుమన్నాడు, పాపం!అప్పుడు యేహ్వెహే ద్యాముడు  “Now you will see what I will do to Pharaoh: Because of my mighty hand he will let them go; because of my mighty hand he will drive them out of his country.” అని ధైర్యం చెప్పి మోషేగార్ని మళ్ళీ వెనక్కి పంపించాడు.మోషేగారు ఇశ్రాయేలీయుల ముందు అబ్రాము గారి ద్యాముడు పాఠం అప్పజెప్పాడు.ఒకసారి మోషే మాట విన్నందుకే ఆ లెవెల్లో ఒళ్ళు పులిసిపోయి పులుసు నీళ్ళు కారిపోతున్న స్థితిలో మెడ మీద తలకాయే వుండి ఆ తలకాయలో మట్టి కాక గుజ్జు వున్నవాడు ఎవడు వింటాడు ఆ సోదిని?మళ్ళీ తన ద్యాముడి దగ్గిరకి పరుగెత్తుకెళ్ళి బ్యారుమన్నాడు.ఈసారి యెహ్వెహే ద్యాముడు ఫారోని కలవమన్నాడు.ఇప్పటికి ఆసులో కండెలా అన్నిసార్లు తిరిగిన చిరాకులో ఉండి కాబోలు మోషే కూడా మొహమాటం లేకుండా “If the Israelites will not listen to me, why would Pharaoh listen to me, since I speak with faltering lips?” అని అడిగేశాడు అబ్రాము గారి ద్యాముణ్ణి!దీనితో యెహ్వెహే ద్యాముడికి కూడా మోషే ఒక్కడికీ ధైర్యం చాలట్లేదని గ్రహించి Aaron, Moses ఇద్దరికీ పని పురమాయించినప్పటికీ మోషే గారు మాత్రం,“Since I speak with faltering lips, why would Pharaoh listen to me?” అని మొత్తుకుంటూనే ఉన్నాడు.ఇంక లాభం లేదని ఫారో ముందు మాట్లాడే పని Aaron చూసుకుంటాడని చెప్పి పంపించాడు.పాపం ఫారో ముందు నిలబడే సమయానికి మోషేకి ఎనభయ్యేళ్ళుట,అతని అన్నకైతే ఎనబైమూడేళ్ళుట!పిచ్చి పుల్లయ్యలు కాకపోతే హాయిగా మనవలూ మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన వయసులో అబ్రాము గారి ద్యాముడి కుట్రకి లొంగి ఎదవ పాలిటిక్సులో ఇరుక్కుని కోరి కష్టాలు తెచ్చుకున్నారు, పాపం పాపం!
ఈసారి తను చెయ్యమన్న మ్యాజిక్కులు చెయ్యటం మర్చిపోవద్దని గుర్తు చేశాడు గానీ ఫారో దగ్గిర ఉన్న ప్రతి మంత్రగాడూ అదే మ్యాజిక్కు చేసి చూపించారు - వార్నీ, ఏం విచిత్రం?సకలలోకసృష్టికర్తకి ఫారో దగ్గిరున్న మాంత్రికులకి కూడా ఈ ట్రిక్కులు వచ్చునని తెలియకపోవడం ఏంటి - అందుకే, ఫారో కూడా "పోవాయ్,పుల్లాయ్!" అనేసి వూర్కున్నాడు తప్ప ఇశ్రాయేలీయుల్ని మోషే వెంట పంపించటానికి ఆజ్ఞ ఇవ్వలేదు.
ఫారోకి చిన్న చిన్న వచనాలు ఎక్కట్లేదని ఈసారి యెహ్వెహే ద్యాముడు ‘The Lord, the God of the Hebrews, has sent me to say to you: Let my people go, so that they may worship me in the wilderness. But until now you have not listened. This is what the Lord says: By this you will know that I am the Lord: With the staff that is in my hand I will strike the water of the Nile, and it will be changed into blood. The fish in the Nile will die, and the river will stink; the Egyptians will not be able to drink its water.’” అని కొంచెం పొడుగాటి వచనం చెప్పి మోషేని ఈసారి ఫారో ఉదయం పూట నదీతీరానికి చెంబట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ అడ్డం పడి ఆపి తన కొంకికర్రని పాములా మార్చి ఈ పాఠం అప్పజెప్పమన్నాడు.సుందోపసుందులు అలానే వెళ్ళారు, కర్రని పాములా మార్చారు, నీళ్ళని రక్తంలా మార్చారు గానీ ఫారో దగ్గిర ఉన్న ప్రతి మంత్రగాడూ అదే మ్యాజిక్కు చేసి చూపించారు - వార్నీ, ఏం విచిత్రం?సకలలోకసృష్టికర్తకి ఫారో దగ్గిరున్న మాంత్రికులకి కూడా ఈ ట్రిక్కులు వచ్చునని తెలియకపోవడం ఏంటి - అందుకే, ఫారో కూడా "పోవాయ్,పుల్లాయ్!" అనేసి వూర్కున్నాడు తప్ప ఇశ్రాయేలీయుల్ని మోషే వెంట పంపించటానికి ఆజ్ఞ ఇవ్వలేదు.
వీళ్ళూ వీళ్ళ ద్యాముడూ ఫెయిలవుతున్నారని కాలం ఆగదు కదా, వారం గడిచింది!ఇక లాభం లేదని యెహ్వెహే ద్యాముడు కప్పల వర్షం కురిపించడానికి నిశ్చయించుకున్నాడు.సుందోపసుందులు అలానే వెళ్ళారు, కప్పల వర్షం కురిపించారు గానీ ఫారో దగ్గిర ఉన్న ప్రతి మంత్రగాడూ అదే మ్యాజిక్కు చేసి చూపించారు - వార్నీ, ఏం విచిత్రం?సకలలోకసృష్టికర్తకి ఫారో దగ్గిరున్న మాంత్రికులకి కూడా ఈ ట్రిక్కులు వచ్చునని తెలియకపోవడం ఏంటండీ!ఫారోకి విసుగుపుట్టి ఉంటుంది,సుందోపసుందుల్ని తన దగ్గిరకి పిలిపించుకుని “Pray to the Lord to take the frogs away from me and my people, and I will let your people go to offer sacrifices to the Lord.” అని బేరం పెట్టాడు.మోషే కూడా ఒప్పుకుని వెనక్కి వచ్చి ద్యాముడి దగ్గిర అరిచి గగ్గోలు పెట్టి కప్పల్ని చంపించేశాడు.అయితే కప్పల నుంచి రిలీఫ్ వచ్చేసరికి ఫారో మళ్ళీ ఇశ్రాయేలీయుల్ని మోషే వెనక పంపనని మొండికెత్తి కూర్చున్నాడు.ఇలా అనేక తూర్లు అనేక వర్షాల క్రికెట్ ఇన్నింగ్సులో జరిగిన మోషే బెదిరించటం,వ్యాధుల వర్షం కురవటం, మొదట ఫారో భయపడి వెళ్ళనిస్తానని అనడం, తీరా మోషే రిలీఫ్ తెచ్చిన పిదప మళ్ళీ మొండికెత్తడం జరిగాక పురుగుల వర్షం తర్వాత ఒక స్థలం చూపించి ఫారో “Go, sacrifice to your God here in the land.” అని బ్రహ్మాండమైన రాజీమార్గం చూపించాడు!కానీ మొండిఘటం మోషేగారు “That would not be right. The sacrifices we offer the Lord our God would be detestable to the Egyptians. And if we offer sacrifices that are detestable in their eyes, will they not stone us? We must take a three-day journey into the wilderness to offer sacrifices to the Lord our God, as he commands us.” అని కొట్టి పారేశాడు.ఆఖరికి ఫారో “I will let you go to offer sacrifices to the Lord your God in the wilderness, but you must not go very far. Now pray for me.” అంటూ కాళ్ళబేరానికి వచ్చాడు.“As soon as I leave you, I will pray to the Lord, and tomorrow the flies will leave Pharaoh and his officials and his people. Only let Pharaoh be sure that he does not act deceitfully again by not letting the people go to offer sacrifices to the Lord.” అంటూ మోషేగారు కూడా భరోసా ఇచ్చాడు - హమ్మయ్య!
మోషే కూడా ఒప్పుకుని వెనక్కి వచ్చి ద్యాముడి దగ్గిర అరిచి గగ్గోలు పెట్టి పురుగుల్ని చంపించేశాడు.అయితే పురుగుల నుంచి రిలీఫ్ వచ్చేసరికి ఫారో మళ్ళీ ఇశ్రాయేలీయుల్ని మోషే వెనక పంపనని మొండికెత్తి కూర్చున్నాడు. ఆఖరికి మిడతల వర్షం ఇన్నింగ్స్ కూడా గడిచాక ఫారో గారి ఉద్యోగ బృందం “How long will this man be a snare to us? Let the people go, so that they may worship the Lord their God. Do you not yet realize that Egypt is ruined?” అని విసుక్కున్నాక ఫారోకి కూడా మనసు మారి అన్నదమ్ముల్ని పిలిచి “Go, worship the Lord your God,” అని అనుజ్ఞ ఇస్తూ “But tell me who will be going.” అని ప్రశ్నించాడు.అప్పుడు మోషేగారు “We will go with our young and our old, with our sons and our daughters, and with our flocks and herds, because we are to celebrate a festival to the Lord.” అని చెప్పేసరికి ఫారోకి మండిపోయి “The Lord be with you—if I let you go, along with your women and children! Clearly you are bent on evil. No! Have only the men go and worship the Lord, since that’s what you have been asking for.” అని చావుతిట్లు తిట్టి ఇద్దర్నీ సభనుంచి వెళ్ళగొట్టాడు.దీంతో ఈసారి చీకట్ల వర్షం రప్పించారు ముగ్గురు మరాఠీలు.మూడు రోజుల పాటు కురిసిన చీకట్ల వర్షం దెబ్బకి ఫారో బెట్టును తగ్గించుకుని “Go, worship the Lord. Even your women and children may go with you; only leave your flocks and herds behind.” అని ఒక మెట్టు దిగాడు.ఈసారి రాజు వాలకం కనిపెట్టిన మోషే “You must allow us to have sacrifices and burnt offerings to present to the Lord our God. Our livestock too must go with us; not a hoof is to be left behind. We have to use some of them in worshiping the Lord our God, and until we get there we will not know what we are to use to worship the Lord.” అని చెట్టెక్కి కూర్చున్నాడు!
ఇన్ని భీబత్సాల్ని సృష్టించగలిగిన సకలలోకసృష్టికర్తకి కోట తలుపుల్ని బద్దలు కొట్టేపాటి శక్తి లేదా!ఈ అనుమానం మీలో ఎంతామందికి వచ్చిందో నాకు తెలియదు గానీ మొదటి రెండు వర్షాల భాగోతాల్ని చదువుతుండగానే వచ్చేసింది నాకు. Raja Ravi Prasad Moka లాంటి వెర్రి క్రైస్తవ గొర్రెలకి మాత్రం రోజూ చదువుతున్నప్పటికీ ఈ అనుమానం రావడం లేదు,పైన "మూడు రోజుల పర్మిషన్ అడగలేదు,మూడురోజుల ప్రయాణమంత దూరం వెళ్ళి బలి ఇవ్వాలి అని చెప్పారు. పోనివ్వ లేదు గనక అక్కడే ఇచ్చేసారు" అని అంటున్నాడు.అలాంటప్పుడు ఫారోను ఒప్పించి అతను వెళ్ళమన్నాకనే వెళ్ళాలని పంతం పట్టి కూర్చోవడమూ అతన్ని భయపెట్టి అనుమతి ఇప్పించుకోవడానికి కప్పల వర్షాలూ మిడతల వర్షాలూ కురిపించడం లాంటి తంతులూ దేనికండీ!అందుకే అన్నాను నేను ఈ యెహ్వేహే ద్యాముడి కన్న చాలా రెట్లు తెలివైన వాణ్ణని.ఇంత సుదీర్ఘమైన వర్షాల క్రికెట్ ఇన్నింగ్సుకి రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్న అలవాటులో పొరపాటులా ఇక్కడ, బైబిలు రచయితలు అతి పెద్ద రాజకీయరహస్యాన్ని బట్టబయలు చేసేశారు – “But the Lord hardened Pharaoh’s heart, and he was not willing to let them go.” అని వ్రాసి అసలు విలన్ ఫారో కాదు వీళ్ళ ద్యాముడే అని ఎక్స్పోజ్ చేసేశారు!ఈ వచనం చెప్పి 1917ల నాడు Jewish State కోసం ఇటువైపునుంచి బ్రిటిష్ ప్రభుత్వాన్నీ అటువైపునుంచి జర్మన్ ప్రభుత్వాన్నీ పుల్లలు పెట్టి యుద్ధానికి దించి సుదీర్ఘమైన యుద్ధనష్టాల తర్వాత వాళ్ళిద్దరూ సంధికి రాబోయే ఆఖరి క్షణంలో అమెరికాను తెర మీదకి లాగడం లాంటి స్క్రీన్‌ప్లే ఇక్కడ నడుస్తున్నదని బైబిలు రచయితలు నాకో గొప్ప క్లూను అందించారు.
ఇంతకు ముందు “Go, worship the Lord. Even your women and children may go with you; only leave your flocks and herds behind.” అని మంచితనం చూపించినవాడు యెహ్వేహే ద్యాముడు అతని మనస్సును కఠినం చెయ్యడంతో పిచ్చెక్కిపోయినట్టు తయారై “Get out of my sight! Make sure you do not appear before me again! The day you see my face you will die.” అని మోషే మీద కేకలు వేశాడు. ఇదే మరి, నోరు జారడం అంటే - ఇక్కడ ఫారో మనస్సుని కఠినం చెయ్యగలిగిన యహ్వెహే ద్యాముడు మొదటనే మృదువు చేస్తే ఇంత భీబత్సమూ అవసరం లేదు కదా!
బాబోయ్!ఇంత బోరు కొట్టించే కధని నేనెప్పుడూ చదవలేదు.మీకూ బోరు కొట్టేస్తున్నట్టుంది.ఇక కధ క్లైమాక్సుకు వచ్చేసింది లెండి. యెహ్వహే ద్యాముడు కూడా “I will bring one more plague on Pharaoh and on Egypt. After that, he will let you go from here, and when he does, he will drive you out completely. Tell the people that men and women alike are to ask their neighbors for articles of silver and gold.” అని ఆఖరి దెబ్బకి రంగం సిద్ధం చేశాడు.
అర్ధరాత్రి పూట యహోవా విజృంభించి ఐగుప్తీయుల ప్రతి ఇంటి పెద్ద కొడుకునీ చంపేశాడు - ఫారో పెద్ద కొడుకు దగ్గిర్నుంచీ సామాన్య ఐగుప్తీయుల వరకు ప్రతి ఇంటి పెద్ద కొడుకునీ ఒక్కణ్ణి కూడా వదలలేదు, వాళ్ళ పశువుల మొదటి చూలు దూడలకీ చావు మూడింది!
అంత భీబత్సం చూశాక కూడా నిబ్బరం చూపించగలిగిన మానవత్వం గల మనిషి ఎవడూ ఉండడు కదా - ఫారో అన్నదమ్ముల్ని పిలిచి “Up! Leave my people, you and the Israelites! Go, worship the Lord as you have requested. Take your flocks and herds, as you have said, and go. And also bless me.” అని చేతులెత్తేశాడు, పాపం!
యూదుమతం లోపలి ఉదారవాద మతప్రచారకులే వాస్తవ చరిత్ర గమనానికీ  ఇక్కడ వర్ణించబడిన కధనానికీ అసలు సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు - అది నిజం!ఆ చరిత్ర చాలా చిన్నది.Hyksos, Apopi పేర్లు గుర్తున్నాయి కదూ!వాటిని ఇప్పుడు Moses పేరుతో కలిపేసి విహంగదృష్టితో జరిగిన కధను చెప్తాను.అప్పటి ఫారో ఇశ్రాయేలీయుల మగపిల్లల్ని చంపాలనుకోవడం అనేది అసలు జరగలేదు - అది బైబిలు రచయితల చేర్పు.జరిగింది, యువరాణికి పెళ్ళిమీద ఆశలు లేక పూజారిణి అయింది.అయితే, ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి రాచవిద్యలు నేర్పించి తన తరపున ఒక కీలకవ్యక్తిని రాజ్యానికి కానుక ఇవ్వాలనుకుంది. అందరిలోనూ, ముఖ్యం ఆడవాళ్ళకి ఉండే ముచ్చట వల్ల ముద్దులు మూట గట్టే అందమైన శిశువు కోసం వెతుకుతుంటే Jochebed కడుపున పడిన ఈ శిశువు నచ్చి వుంటుంది.లేదంటే, అసలు తల్లి అనామకురాలు అయితే బైబిలు రచయితలు అబ్రాము రక్తసంబంధీకులకే మతపరమైన ఆధిక్యతను కట్టబెట్టడం కోసం Jochebed వివరాలను తెచ్చి ఇరికించి వుంటారు. ఎదిగే వయస్సులో Moses పుట్టుకకూ పెంపకానికీ మధ్యన చెలరేగిన గందరగోళం ఆత్మన్యూనతని పెంచింది.రాజకుటుంబంలో మరొక శిశువు జన్మించడంతో తన భావి రాజరికానికి ఇతని ప్రాధాన్యత తగ్గిపోయింది.ఒక Hebrew అతన్ని Who made you ruler and judge over us?” అని ప్రశ్నించడం అప్పటికి అతని ప్రాధాన్యత తగ్గి చాలా కాలం అయ్యిందనే దానికి సాక్ష్యం.ఆ Hebrew అలా ప్రశ్నించేనాటికి Moses వయసు 40 అనడాన్ని బట్టి మొదటి నేరం అంతకు ముందు జరిగి ఉంటుందని అనుకుంటే తొలి యవ్వనం నుంచీ  నేరప్రవృత్తి కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉన్నదని అనుకోవాలి.ఆ గొడవ అసలు రాజు వరకు వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ నేరస్తుడికి ఉండే సహజమైన భయం వల్ల "వెళ్తే?" అనే ప్రశ్నకి జవాబు చెప్పుకోలేక పారిపోయాడు.Midian వద్ద తన ఈజిప్షియన్ రాజవిద్యల వల్ల సమకూరిన పాండిత్యాన్ని ఉపయోగించుకుని అక్కడ మంచి పేరును తెచ్చుకున్నాడు.అప్పుడు పాత పగలను తీర్చుకోవడానికి ఈజిప్టు వచ్చాడు.తండ్రీ కొడుకుల్ని క్రూరంగా చంపేశాడు.దాని ఫలితమే May 10, 1533 BCE తేదీన చనిపోయాడని రుజువైన Seqenenre Taa శరీరం మీద కనిపిస్తున్న గాయాలు. చారిత్రక వివరాలను ఒక చోట చేర్చి చూస్తే నాకు తోచిన మోషే కధ ఇది!
వాస్తవ చరిత్రతో పొలిస్తే బైబిలు చాలా అబద్ధాలు చెప్పింది.అయితే, బైబిలు రచయితల ఉద్దేశం చరిత్ర రచన కాదు కాబట్టి అందుకు తప్పు పట్టి ప్రయోజనం లేదు.మన దేశపు పౌరాణిక సాహిత్యంలో కూడా ఇలాంటి కధలు ఉన్నాయి.కానీ, అవి పూర్తి కల్పిత పాత్రలు.వాటినీ బైబిలు కధల్నీ పోల్చటం తప్పు.హిందువులు పురాణ కధల్ని బైబిలు మాదిరి చారిత్రక వ్యక్తుల కధలను తీసుకుని రాయలేదు.చారిత్రక వ్యక్తుల కధలలోని ముఖ్యమైన సన్నివేశాలను తీసుకుని కొన్ని అదనపు సన్నివేశాలను కలుపుతూ కొంత మార్చి రాయడం అనేది నోరి నరసింహ శాస్త్రి లాంటి మన దేశంలోని రచయితలు కూడా చేశారు. కానీ. బైబిలు రచయితలు చేసిన తప్పు చారిత్రక వ్యక్తుల స్వభావాల్నీ కాల్పనిక పాత్రల స్వభావాల్నీ మార్చటం.అబ్రాము గారి భార్య సారాను దైవపూజకు నియోగించబడిన చోట కామతృష్ణను పులిమెయ్యటం అందుకు చక్కని ఉదాహరణ.లోతు వంటి వారి కధల్లో అక్కడ కనబడుతున్న అనైతిక శృంగారం కూడా యదార్ధ వ్యక్తులు చేసి ఉండకపోవచ్చు.అలాంటి నీచమైన విషయాలు అక్కడ ఉన్నాయని తెలిసినప్పటికీ అంతమంది అనుసరించడం విచిత్రమే గానీ అది అనుకోకుండా జరిగినది మాత్రం కాదని నేను అనుకుంటున్నాను.ఎందుకంటే, బైబిలు రచయితల యొక్క ముఖ్యమైన లక్ష్యం తమ మతాన్ని అనుసరించేవారిని అందరినీ నైతికపరమైన ఉన్నత జీవనం సాగించేటట్లు తయారు చెయ్యడం కానే కాదు - సామాన్య ప్రజలను మోసం చేస్తూ వారిచేత సృష్టించబడిన సంపదలో సింహభాగాన్ని అనుభవించే దోపిడీదారుల్నీ నిత్యం తమ శ్రమను ఇతరులు దోచుకుంటున్నప్పటికీ ఆ దోపిడీదారుల్నే తమ రక్షకులుగా భావిస్తూ దోచుకోబడేవార్నీ పక్కపక్కన నిలబెట్టి సహజీవనం చేయించడం!
తన రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని సరదాకి "భూమి ఆకారం గురించి బైబిల్ ఎందుకు తప్పుగా చెప్పింది?తండ్రితో కూతురు కామాలీలల్లో పాల్గోవచ్చు అని ఉంది...ఇంతకు బైబిల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి?ఒక మతగ్రంధంలో ఇలాంటి వాటికి ఎలా స్థానం కల్పించారు?"  అని కెలికితే "ఇంకా దిగ జారిపోతున్నావ్. తండ్రీ కూతుర్లు సెక్స్ చేసుకోవచ్చని బైబిల్లో ఎక్కడుంది. నన్ను ఇరిటేట్ చేసి వాదం గెలవాలనుకుంటున్నావ్ కానీ సత్యం తెలుసుకోవాలనుకోవటం లేదు. వయసు పెరిగితే స్రిపోదు బుద్ది కూడా పెరగాలి. లోతు కథ చూపిస్తావ్ ఆ కత చెప్పి మీరు కూడా ఇలా చేస్కోవచ్చు తప్పు లేదు అని ఉందా? ఎందుకిలాంటి దౌర్భాగ్యపు జీవితాలు జీవిస్తారు. ఇందాక చెప్పవే పిచ్చికుక్క ఎగ్జాంపుల్ అలా లేనిదాన్ని బైబిల్ మీద ముద్ర వేసి అబద్ద ప్రచారాలు చెయ్యడానికి సిగ్గులేదూ? అలా చేస్తే తప్ప నీ మతాన్ని కాపాడుకోలేనని నిశ్చయించుకున్నావా? చూపించు తండ్రీకూతుర్లు సెక్స్ చేసుకోవచ్చని?" అని రెచ్చిపోయి, నేను "లోతు ఎవరు?దేవుని కృపకు పాత్రుడైన గొప్పవాడు!అవునా కాదా?అతను రాజ్యం చేశాడు, మతపరమైన గిప్పతనం ఉంది - అంతటి ఆదర్శవంతుడు ఆ పని చెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడు గానీ చేస్తున్నప్పుడు గానీ చేశాక గానీ మీ ద్యాముడు కోపగించుకోలేదు, నష్టపరచలేదు, రాజరికం లాక్కోలేదు.మరి అదే తప్పు ఆ రాజ్యంలోని ప్రజల్లో ఎవరన్నా చేస్తే వాళ్ళని ఆ రాజు తప్పని చెప్పగలడా!మీ ద్యాముడికి ఆ వావివరసల నీతి మీద దృష్టి ఉంటే లోతుని ఒక్క క్షణం రాజుగా ఉండనిస్తాడా?ఆ తప్పు చేశాక కూడా రాజుగా ఉండనిచ్చాడు, మరిన్ని వైభవాలు కూదా దఖలు పర్చినట్టున్నాడు కదా!" అని గడ్డి పెడితే నోరు మూశాడు ఈ Raja Ravi Prasad Moka అనే వెర్రి క్రైస్తవ గొర్రె!
రాజ్యం తనకు క్షేమాన్ని ఇచ్చే చట్టాలను చేసినప్పుడు పాటిస్తూ తనకు ప్రమాదం తెచ్చిపెట్టే చట్టాలను చేసినప్పుడు ధిక్కరిస్తూ ఉంటే అది బానిసత్వం కాదు,తనకు ప్రమాదం తెచ్చిపెట్టే చట్టాలను చేసినప్పుడు కూడా పాటించడం మాత్రమే బానిసత్వం అవుతుంది.లోతు కథ లాంటివి అనేకం ఉన్నప్పటికీ తన మతగ్రంధం పవిత్రమే అని నమ్ముతున్న అమాయకులు రాజ్యం చేసిన దుర్మార్గమైన చట్టాల్ని ఎలా ధిక్కరించగలరు?ఆ బూతుకధలు అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడం లాంటి నిజాయితీ వల్ల మతగ్రంధంలోకి రాలేదు, దోపిడీదారులైన రాజ్యాధినేతల మీద తిరగబడనివ్వని నిర్బంధ బానిసత్వాన్ని ఆదర్శవంతమైన దేవుడి పట్ల విధేయత పేరున అలవాటు చెయ్యటానికే వాటిని పనిగట్టుకుని అక్కడ ఉంచారు!
బైబిలు రచయితలు తెలివితక్కువ వాళ్ళు కాదు.ఇవ్వాళ ప్రపంచ స్థాయిలో సమస్త ప్రజల కష్టార్జితం నుంచి పుట్టిన  సంపదలో మూడు వంతుల భాగం లాటికన్ మరియు దాని అనుబంధ సంస్థల వద్ద పోగుపడటానికి కారణం బైబిలు లోని వలసకాండ కధనం యొక్క నాటకీయత ప్రజల మనస్సుల మీద చూపిస్తున్న ప్రభావమే ముఖ్యమైన కారణం."1917ల నాడు Jewish State కోసం ఇటువైపునుంచి బ్రిటిష్ ప్రభుత్వాన్నీ అటువైపునుంచి జర్మన్ ప్రభుత్వాన్నీ పుల్లలు పెట్టి యుద్ధానికి దించి సుదీర్ఘమైన యుద్ధనష్టాల తర్వాత వాళ్ళిద్దరూ సంధికి రాబోయే ఆఖరి క్షణంలో అమెరికాను తెర మీదకి లాగడం" ఒక్కటే కాదు, Adam Weishaupt ఫ్రెంచి విప్లవాన్ని తీసుకురావడానికి వేసిన ప్లానుకీ Rothschilds నెపోలియనుకీ విల్‌హెల్ముకీ మధ్యన యుద్ధం పుట్టించి ఇద్దరికీ యుద్ధరుణం ఇచ్చి రెండు చేతులా ఆర్జించినప్పుడు వేసిన ప్లానుకీ ఈజిప్టు రంగస్థలం మీద యహోవా-మోజేసు ద్వయం ఆడిన జగన్నాటకమే ప్రేరణ ఇచ్చింది.అసలైన విచిత్రం ఏమిటంటే, దోపిడీని అంతం చెయ్యటానికి పుట్టిన్ అసిద్ధాంతం అని అందరూ భ్రమిస్తున్న కమ్యూనిష్టు సిద్ధాంతం కూడా ఈజిప్టు రంగస్థలం మీద యహోవా-మోజేసు ద్వయం ఆడిన జగన్నాటకాన్నే అనుకరించింది.
ఎంత ఆకర్షణీయమైనవి అయినప్పటికీ అబద్ధాల్ని నమ్మితే ఆత్మవిధ్వంసం తప్పదు.నిజాల్ని నమ్మడం వల్లనే విధ్వంసం నుంచి వైభవానికి చేరడం సాధ్యం!వేదవ్యాసుడు కలియుగ ధర్మాల్ని వివరించినప్పుడు జనమేజయునికి "ఇంతటి ఘోరమైన పరిస్థితుల నుండి శుభప్రదమైన కృతయుగం ఎలా అవతరిస్తుంది?" అని సందేహం వచ్చింది.దానికి వేదవ్యాసుడు,"ఈ భంగి కాలంబు దవ్వున నరుగ నిర్వేదంబు పుట్టు.నిర్వేదంబున సత్వగుణమును,సత్వగుణమున జిజ్ఞాసయు గల్గు.కల్గ సాధుజనులను వెదకికొని పోయి ఎయ్యది శోభనం బెయ్యది యొనర్చిన యశేష దోషనివృత్తి యగు? నెట్టిది ధర్మంబని అడుగుదురు.అట్టి తలపువారును పెక్కండ్రై ఎల్లెడల నొదవ నది కారణంబుగ నెంతెంత హానియై వచ్చె నంతంతియ వృద్ధియు సంభవించు"నని గతితార్కిక చారిత్రకభౌతికవాదానికి అమ్మామొగుడు లాంటి సిద్ధాంతం చెప్పాడు.కొంకికర్రలు తిప్పడాల్లేవ్!కర్రల్ని పాముల్లా చెయ్యడాల్లేవ్!కప్పల్ని కురిపించడాల్లేవ్!మిడతల్ని ఉరికించడాల్లేవ్!అయినోళ్ళకి వెలుగుల్నీ కానోళ్ళకి చీకట్లనీ పంచడాల్లేవ్!ఇక మాటల్లేవ్!లే!శంఖం వూదు!గెలుపు నీదే!ఇవ్వాళ్టి పార్ధుడికి ఈనాటి గీతాచార్యుడు యుద్ధం గురించి చెప్పడం లేదు, ఒక భోగయాత్రని గురించి చెప్తున్నాడు - చెవులు రిక్కించుకుని విను!
మన పరిమిత జ్ఞానానికి అర్ధం కాని ప్రతిదీ నిరర్ధకం అనుకోవడమే అజ్ఞానంతో కూడీన అహంకారానికి మొదటి గుర్తు.ఇవ్వాళ అర్ధం కానిది జ్ఞానం పెంచుకుంటే రేపు అర్ధం కావచ్చు - కానీ నాకు ఇప్పటికి తెలిసిందే సమస్తం, ఇంతకు మించి ఏదీ లేదు, ఉందంటే నువ్వు ఛాందసుడివీ మతోన్మాదివీ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారులు.
నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు వైదిక ధర్మం తన జడత్వాన్ని వదిలించుకుని ఒకే ఒక్క సారి పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్య పరంపర నుండి సంక్రమించిన మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే జ్ఞానదృష్టితో నేను చెప్తున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...