Wednesday 10 August 2022

రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న జో బైడెనుకి కోవిడ్ ఎలా వచ్చింది?

 "*1మార్షలు ప్రణాళిక"కు మన

*2సర్షణ్ముఖ చెట్టియారు స్వాగతమిస్తే

హర్షిద్దామని కొందరు

వర్షానికి చాతకాల వలె కలరు జరూ!

 

దోచేసే వాళ్ళను

దో చేస్తుందని శివాశతో చూస్తుంటే

దోచేస్తోంది కదా కం

చే చేనుమసినట్టు లీ ప్రభుత జరూ!

*1 - రెండో ప్రపంచ యుధ్ధం ముగిశాక కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి 1947లో అమెరికా దేశీయాంగ కార్యదర్శి జార్జి మార్షల్ ఒక ప్రణాళికను తయారు చేశాడు.ఆర్ధిక సాయం పేరుతో అన్ని దేశాలను తన గుప్పిట పట్టి పెత్తనం చెలాయించడమే దీని లక్ష్యం.

*2 - సర్ షణ్ముఖ చెట్టియార్ పేరును వ్యంగ్యం కోసం సంధి కలిపి మనసర్షణ్ముఖ అని శ్రీశ్రీ అన్నాడు.1. ధనస్వామి,2. న్యాయవాది, 3. బ్రిటిష్ వారి ఆత్మీయమిత్రుడు, 4. వాణిజ్యవర్గాల అగ్రపూజ్యుడు, 5. రాజకీయ వేత్త, 6. అర్ధశాస్త్ర పండితుడు అనే ఆరు రంగాల ప్రతినిధులు ప్రజలకి అన్యాయం చేస్తున్నారనేది అక్కడ చెప్పదల్చిన విషయం.అయితే సర్ షణ్ముఖ చెట్టియార్ వ్యంగ్యం కోసం శ్రీశ్రీ అనే కవి సృష్టించిన కల్పిత పాత్ర కాదు, వాస్తవ వ్యక్తియే - అతనికి ఆరు ముఖాలూ ఉన్నాయి కూడాను.

మార్షల్ ప్రణాళికను తీర్చి దిద్దే పనిమీద మనవాళ్ళు 1941 నాడు అమెరికాకు పంపిన మన దేశపు ఆర్ధిక వేత్తల ప్రతినిధి వర్గానికి నాయకుడు.1945 నుంచి ఇండియన్ టారిఫ్ బోర్డులో సభ్యుడు.అమెరికా లోని బ్రెట్టన్వుడ్స్ ఆర్ధిక మహాసభకు 1946 నాడు భారతదేశం తరపున హాజరయ్యాడు.International Monitary Fund(IMF),World Bank(WB) అనే రెండు సంస్థల్ని ప్రపంచ స్థాయి సామ్రాజ్య వాదపు ఆర్ధిక దోపిడీని ఆచంద్ర తారార్కం కొనసాగించడానికి పనికొచ్చే సయామీస్ కవలల వలె సృష్టించటానికి జరిగిన భూతబలియజ్ఞంలో మన దేశాన్ని కూడా ఒక సమిధను చేసిన పుణ్యచరితుడు మన సర్ షణ్ముఖ చెట్టియార్.1947 ఆగస్టు 15 ఏర్పడిన తొలి కేంద్ర మంత్రివర్గంలో సర్షణ్ముఖం గాడు ఆర్ధికమంత్రి అయ్యాడు - మన కొంప ముంచాడు!న్యాయమంత్రి స్థానంలో ఉన్న డంబేద్కర్రు సర్షణ్ముఖం దింపిన రాడ్డుని ఇంకొంచెం లోతుకి తొక్కేశాడు.ఇప్పుడు పీకాలంటే మన కళ్ళ నుంచి రగతం కార్రుద్ది.

మన మీద జరిగిన కుట్రలో మనవాళ్ళే ముఖ్యమైన పాత్ర ధరించి ఆపద్బాంధవుల మాదిరి కబుర్లు చెప్పి అనాధ రక్షకుల వేషాలు కట్టి మనమీద ఒక దోపిడీ వ్యవస్థనీ ఒక దుర్మార్గపు రాజ్యాంగాన్నీ ఒక మోసకారి ప్రభుత్వాన్నీ రుద్దేసి మనచేత  దేశభక్తుల పేరున చప్పట్లు కొట్టించుకున్నారు - మనల్ని ఎదవల్ని చేశారు, చేస్తున్నారు, చేస్తారు.ఎంత ఎదవలం కాకపోతే 1947 ఆగస్టు నాటికి అక్షరాల కేవలం 2332 కోట్లు మాత్రమే ఉన్న అప్పుని - తీర్చలేక కాదు లెండి, తీర్చాలని అనుకోక ఏయేటి కాయేటికి అప్పుచేసి పప్పుకూడు తినిపిస్తూ 2020 మార్చి నాటికి US$11.6 billion డాలర్లకి పెంచితే శంకరాభరణంలో చిన్నపిల్లకి తప్పులతడక సంగీతం పాఠాలు చెప్తున్న పిచ్చి పంతులు "కార్లు,బస్సులు,రైళ్ళు,జెట్లు,రాకెట్లు,జాకెట్లు - అన్నీ వచ్చేశాయా!" అని సంబరపడినట్టు "అబ్బో!ఎంత డెవ్లప్ అయ్యామో?" అని బట్టలు చింపుకుంటూ అంత స్థాయిలో అప్పుల్ని పెంచిన దేశద్రోహుల్ని దేశభక్తుల కింద పొగుడుతాము చెప్పండి!

11.6 అనేది ఒక చిన్న అంకె మాత్రమే అనీ బిలియన్ అనేది ఒక ఏడక్షరాల ఇంగ్లీషు పదం మాత్రమే అనీ అనుకుంటే అస్సలు భయం వెయ్యదు.కానీ, 01 zero makes Ten,02 zeroes make Hundred,03 zeros make Thousand,04 zeros make Ten Thousand,05 zeros make Hundred Thousands,06 zeros make One Million,07 zeros make Ten Millions,08 zeros make Hundred Millions,09 zeros make One Billion,10 zeros make Ten Billions అనే లెక్క తెలిశాక కొంచెం దడ అనిపిస్తుంది,కదూ!మన అప్పు 11,600,000,000 USD ఉన్న 2020 మార్చి నాటి బడ్జెట్ వేస్తున్న నిర్మలా సీతారామన్ గారు కొత్త పెట్టుబడుల కోసం కోసం విడుదల చేసిన 30,42,230 కోట్ల రూపాయలను ఎక్కణ్ణించి తెచ్చారు?ఒక కుటుంబ యజమాని ఒక ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యాక తన ఆదాయం 1000 రూపాయలు మాత్రమే అయి ఉండి తీర్చాల్సిన అప్పులు 1,00,000 అయినప్పుడు కుటుంబ సభ్యులకి విషయం చెప్పకుండా దాచెయ్యడమూ ఆదాయం మొత్తాన్ని సొంతానికి వాడుకోవడమూ న్యాయమా!మరి,మన ప్రభుత్వాలు మన అప్పుల గురించి మనకి ఎందుకు చెప్పడం లేదు?

2020వ సంవత్సరానికి 30,42,230 కోట్ల రూపాయలను మాత్రమే పెట్టుబడి కింద ఖర్చు చేస్తూ ఆ కుసింత కరెన్సీని సైతం పెట్టుబడి కూడా తిరిగి రాని చోట ఖర్చు పెట్టి లోటు బడ్జెట్లతో అఘోరిస్తూ 11,600,000,000 USD దాటి పెరుగుతున్న అప్పుని ఎట్లా తీర్చాలనే భయమూ జాగ్రత్తా నెహ్రూ మొదలు మోదీ వరకు ఏ ఒక్క దేశాధినేతకీ లేకపోవడం ఎంత దౌర్భాగ్యం?

మనం, అంటే హిందువులం పిచ్చిపుల్లయలం అని అందరూ ముద్ర కొట్టేశారు.మనమూ ఒప్పేసుకున్నాం - పోనివ్వండి.కానీ అమెరికా కమ్యూనిష్టుల్ని అణిచి వెయ్యటానికి ఉద్దేశించింది అనే దృశ్యాన్ని మాత్రమే చూసి "అదిగో కుట్ర!ఇదిగో సాక్ష్యం!" అని "యజ్ఞం" కధని మనమీదకి వదిలిన కారా మేష్షారుకి గానీ భారత్దేశం తాకట్టులోకి వెళ్ళిపోయిందని బల్ల గుద్ది చెప్పిన తరిమెల నాగిరెడ్డి గారికి గానీ కమ్యూనిష్టు సిధ్ధాంతం కూడా వీళ్ళు కమ్యూనిష్టుల్ని అణిచెయ్యటానికి కుట్ర పన్నుతున్నారని అంటున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళ ప్రయోజనాల కోసం వండివార్చిన దోపిడీ సిధ్ధాంతం అని తెలియక పోవడం ఎంత విచిత్రం?వీళ్ళలో ఒక్కర్నీ నేను దుర్మార్గులని అనడం లేదు - మంచివాళ్ళే,మాననీయులే,ప్రాతఃస్మరణీయులే,మహానుభావులే,మానవాళి సౌభాగ్యం పట్ల అంకితభావం ఉన్నవాళ్ళే - మేధావులే,సత్యం పట్ల నిబధ్ధత ఉన్నవాళ్ళే - అప్రస్తుతవీరవరేణ్యులే!అయితే,అసలు కుట్రదారులు వీళ్ళు ఎంతవరకు తెలుసుకుంటే అసలు నిజం తెలుస్తుందో అందులో తమకు నష్టదాయకమైన సమాచారాన్ని దాచేసి తమకు లాభం తెచ్చిపెట్టే సమాచారాన్ని మాత్రమే వీళ్ళకి చూపించారుఅది పూర్తి నిజం అని నమ్మేసిన అమాయకత్వం వీళ్ళది.

"నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అని గత చరిత్ర మీద ఒట్టు వేసి చెప్పి ప్రపంచ మానవాళిని దోపిడీ నుంచి విముక్తం చేసి పరపీడన పరాయణత్వం అసలు కుదరనే కుదరని వర్గరహితసమాజం గురించి ఎన్నెన్నో ఆకర్షణీయమైన వర్ణనలని చేసి అది వచ్చాక ఇక దోపిడీ అనేది ఉండదని భవిష్యత్తు గురించి వాగ్దానాలు చేసి దాన్ని సాధించడానికి వర్తమానంలో చెయ్యాల్సిన ప్రయత్నం కింద శ్రామికవర్గనియంతృత్వం అనే ఒక శాస్త్రీయమైన ప్రణాళికని ఇచ్చిన అసలు వ్యక్తి ఒక పైశాచిక మతాన్ని పాటించే మతోన్మాది అని చాలామందికి లాగే వీళ్ళకీ తెలియదు.

దాస్ క్యాపిటల్,కమ్యూనిష్టు మ్యనిఫెస్టో గాక అంతకు ముందర మార్క్సు కధలూ కవితలూ నాటకాలూ కూడా వ్రాశాడు.కానీ అవన్నీ సృజనాత్మకతని బట్టి చూస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి.అందుకే అభిమానులు వాటిని గురించి చెప్పడం లేదు. 1837ల నాడు కార్ల్ మార్క్స్ ఒక కవితలో “Thus Heaven I’ve forfeited, I know it full well. My soul, once true to God, is chosen for Hell.” అని వ్రాశాడు.దీని అర్ధం  ఏంటి?forfeit అనే పదానికి నిఘంటువు “lose or give up (something) as a necessary consequence of something else,lose or be deprived of (property or a right or privilege) as a penalty for wrongdoing” అనే అర్ధాలను చెప్తుంది.అతని కవితకి సరైన తెలుగు అనువాదం  - "అలా నేను స్వర్గానికి చెల్లు చీటీ ఫిరాయించేశాను,కావాలనే స్వర్గాన్ని తన్ని తగలేశాను;అస్మదీయ ఆత్మ ఒకప్పుడు దైవాన్ని నమ్మింది,ఇప్పుడు నరకాన్ని నమ్ముతున్నది" అయితే ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు కార్ల్ మార్క్స్ నాస్తికుడు కాదు, హేతువాది కూడా కాదు.యూదు,క్రైస్తవ,మహమ్మదీయ అనే మూడు అబ్రహామిక మతాల గ్రంధాల్లో దుష్టశక్తి అని చిత్రీకరించిన లూసిఫర్ అసలైన దేవుడు అని నమ్ముతున్న ఇల్యూమినాటీ మతస్థుడు!

పాస్టర్ల మతమార్పిడిని వ్యతిరేకిస్తున్న హిందూత్వ దృక్కోణం నుంచి చూస్తేనూ వేదంతో పోల్చి తులనాత్మమైన అధ్యయనం చేస్తేనూ క్రైస్తవమతసాహిత్యం తప్పులతడక అనిపించ వచ్చును.తెలుగే సరిగ్గా రాని మన పాస్టర్లని చూసి అందరు పాస్టర్లూ ఇలానే ఉంటారనుకోవడం తప్పు - మనం తప్పుల తడక అంటున్న బైబిలు కధల్ని ఒప్పుల కుప్పలని సమర్ధించగలిగిన Jon Paul Sydnor లాంటివాళ్ళు కొందరు ఉన్నారు.ఒక విధాన - పోషణ కోసం ప్రతిష్ఠ కోసం ప్రచారం కోసం చప్పట్ల కోసం పదవుల కోసం పెదవుల కోసం రోతశీల్డు మందకి వూడిగం చేస్తున్న ఇల్యూమినాటీ స్కాలర్లు చెడగొట్టడం వల్లనే క్రైస్తవం యొక్క ప్రతిష్ఠ దిగజారింది.అలా చూస్తే "అస్మదీయ ఆత్మ ఒకప్పుడు దైవాన్ని నమ్మింది,ఇప్పుడు నరకాన్ని నమ్ముతున్నది" అని కార్ల్ మార్క్స్ అనటం క్రైస్తవం ఒక దుర్మార్గపు మతం కాబట్టి మతవిమర్శ కోసం ఉత్ప్రేక్షించాడని అనుకోవటం కుదరదు ఇక్కడ.

ప్రతి కవిలోనూ ప్రతి రచయితలోనూ ఒక అధ్యాత్మిక దృక్కోణం ఉంటుంది.అది ఆయా వ్యక్తులని విశ్వానికి తాము కేంద్రం వలె వూహించుకునేలా చేస్తుంది.మొహమాటం కొద్దీ కొందరు రచయితలు "అబ్బెబ్బే!నేను నాకు నచ్చిన భావాల్ని అందరి మీద రుద్దాలని అనుకోవటం లేదు." అనటం కేవలం నటన మాత్రమే - అసలు తను కళాసృజన చేస్తున్నదే ఇతరుల్ని ప్రభావితం చేసి మనస్సు మీద ఒత్తిడి పెట్టి వాళ్లని తనకు నచ్చేటట్టు మార్చడం కోసం అయినప్పుడు అనవసరపు శషభిషలు దేనికి?అయితే, ఇక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది - తన కళాసృజన వల్ల ప్రేక్షకులలో వచ్చిన మార్పు మార్చిన తనకి స్వోత్కర్షను పెంచేది మాత్రమే గాక మారిన ప్రేక్షకులకి సంతృప్తిని ఇచ్చేలా ఉండాలి.అలా ఉండాలంటే ఆ కవిలో ఆ రచయితలో ఆ మేధావిలో ఆ సంస్కర్తలో ఆ ప్రవక్తలో అహంకారం గాక వినయం ఉండాలి.కార్లు మార్క్సులో వినయం లేదు,అహంకారం మాత్రం పుష్కళ యూరియా ఎరువులు వేసి పెంచిన వరిపంటలా ఉంది.

కార్ల్ మార్క్స్ యొక్క అధ్యాత్మిక దృక్కోణం ఇలాగే ఎందుకు తగలడిందో తెలియాలంటే అతని కాల్పనికతలో ప్రతిఫలిస్తున్న కొన్ని దృశ్యాలకీ అతని వ్యక్తిగత జీవితపు వాస్తవికతకీ ఉన్న పోలికల్ని పట్టుకోవాలి."మార్క్సు చాలా బీదవాడు.సిధ్ధాంత రచన చేస్తున్నప్పుడు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాడు.బూట్లూ సాక్సులూ అమ్ముకుంటూ గడిపాడు.ఎంగెల్సు చూట్టానికి వచ్చినప్పుడు అప్పులన్నీ తీర్చి డబ్బులిచ్చి ఆదుకున్నాడు" అంటూ రాదుగా వాళ్ళు మనకి చూపించిన మార్క్సు జీవిత దృశ్యాలు అన్నీ అబధ్ధాలు.వర్గరహితసమాజం వచ్చాకనే వ్యభిచారం మానేస్తానని తెగేసి చెప్పిన శ్రీశ్రీలా కార్ల్ మార్క్స్ సైతం కులీన కుటుంబపు దర్పం ఉన్న పైలా పచ్చీసు గాడు!తనకి అయిదారేళ్ళ వయస్సులో బాప్తిజం తీసుకున్నాడు.కొంచెం పెద్దయ్యాక తండ్రి దేవుడి ఉనికి గురించీ నమ్మకం గురించీ బైబిలు సూక్తుల్ని చూపించి చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు.తర్వాత తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి వెర్రెక్కిపోయి కమ్యూనిష్టు పార్టీలో చేరిపోయిన మా తరంలోని కొందరు కుర్రాళ్ళకి మల్లే బ్రూనో బ్రాయర్ లాంటి టీచర్లని హీరోల కింద చూసి మొదట అల్లరి కుర్రాడిలా మారిపోయాడు.తర్వాత అలా అలా తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు "see this sword, this blood dark sword, which stabs unerringly within my soul.See this sword.The prince of darkness sold it to me" అనే రకం కవితలు తన్నుకు వచ్చాయి.

పాలిపోయిన మొహాల్తో ఆత్మహత్యలు చేసుకుంటున్న కన్యకలను గురించి అతను చేసిన వర్ణనలకు ఆధారం అయిన అతని ఇద్దరు కూతుళ్ళూ ఎలా చచ్చిపోయారో తెలిసిన వెంటనే వాళ్ళెంత తెలివి తక్కువ వాళ్ళో కదా అని జాలేసింది నాకు!వాళ్ళని చేసుకున్న భర్తలు ఎంత దుర్మార్గులో అని కూడా అనిపించింది - కానీ ఏమి లాభం?కన్న కూతుళ్ళని బేఖారీ అల్లుళ్లకి ఇచ్చి పెళ్ళిచేసి తన బాధ్యతలేమికి బలై చచ్చిపోయిన కూతుళ్ళని కవితా వస్తువుల కింద వాడుకుంటూ రోజల్లా తప్ప తాగుతూ ముండల్తో పడుక్కుంటూ బతికిన ఒక నికృష్టపు ఆడపిల్ల తండ్రికి ప్రపంచ కార్మికుల కోసం ఇరవయ్యేళ్ళ పాటు అహోరాత్రులు  శ్రమించిన మహామానవతావాది స్థానం ఇచ్చారు - ఎంత పిచ్చితనం ఇది!

పెద్ద కూతురి భర్త భార్యని ఆత్మహత్యకు ప్రేరేపించాడు, విషం తీసుకొచ్చి పక్కన పెట్టాడు, సూయిసైడ్ నోటుని డిక్టేట్ చేసి రాయించాడు, విల్లు వ్రాయించి ఆస్తిని బదలాయించుకున్నాడు - Edward Eveling అనే ఒక వెధవ, హేతువాది, నాస్తికుడు, అభ్యుదయ కాముకుడు ఏం చెప్తే అది చేసి తన భర్తకి కేసు లేని చావుని తెచ్చుకున్న ఆడపిల్లని ఏమని పిలవాలి?కందకి లేని దురద కత్తిపీటకి దేనికి అన్నట్టు కన్నతండ్రి ఆలోచించ లేదు గానీ సమకాలికులు కొందరు వాణ్ణి కేసు పెట్టి చిప్పకూడు తినిపించాలని ఆలోచించారు.ఇక Paul Lafargue అనే చిన్న అల్లుడు మరీ విచిత్రుడు - ఆత్మన్యూనతలో అగ్రగణ్యుడు!జన్యుపరమైన క్యూబన్ వారసత్వం కలవడంతో తెల్లతోలు జాత్యహంకారుల దృష్టిలో అస్పృశ్య జాతి అయిన నీగ్రోతనం కనబడి అసహ్యాన్ని పుట్టించింది కార్ల్ మార్క్సుకీ ఎంగెల్సుకీ.కర్ణదుర్యోధన సములైన మిత్రద్వయం మార్క్సు గారి అల్లుడిలో నీగ్రోత్వం ఎంత అని శాస్త్రీయమైన విశ్లేషణ చేసి 1/8 అని ఒకరూ 1/12 అని ఒకరూ నిర్ధారించారు.ఇప్పుడు మార్క్సిస్టులు అందరూ ప్రపంచ మానవాళిని జాత్యహంకారుల దోపిడీ నుంచి బైటికి లాగటానికి పనిముట్లు ఇచ్చాడని పొగుడుతున్న కార్ల మార్క్స్ తన అల్లుణ్ణి "గొరిల్లా" పదంలా ధ్వనించే "నెగ్రిల్లా" అని పిలిచి పగలబడి నవ్వుకున్న జాత్యహంకారి అన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోలేక పోయారు?

అసలు కుట్రదారులు వీళ్ళు ఎంతవరకు తెలుసుకుంటే అసలు నిజం తెలుస్తుందో అందులో తమకు నష్టదాయకమైన సమాచారాన్ని దాచేసి తమకు లాభం తెచ్చిపెట్టే సమాచారాన్ని మాత్రమే వీళ్ళకి చూపించారుఅది పూర్తి నిజం అని నమ్మేసిన అమాయకత్వం వీళ్ళది.కార్ల్ మార్క్స్ చరిత్ర గురించి అంత పెద్ద ఎత్తున టముకేసి చెప్పటం ఇల్యూమినాటీల "If you want to control/expoit a person,race,nation or a country - first control his or its past or hisory!" అనే లూసిఫరియన్ సామ్రాజ్యవాదపు మూలసూత్రాన్ని ప్రజల, మార్క్సిస్టుల, శత్రువుల మెదళ్ళలోకి ఎక్కించి ఇల్యూమినాటీల దోపిడీకి అందర్నీ అలవాటు పడేలా చెయ్యటానికే పనికొస్తుంది - కార్ల్ మార్క్సు చేసిన చారిత్రక విశ్లేషణలో శాస్త్రీయత లేదు..

రోతశీల్డు మంద కొత్త చోటుకి వెళ్ళినప్పుడు చేసిన, చేస్తున్న, చెయ్యబోతున్న మొదటి పని అక్కడి ప్రజల చరిత్రని భ్రష్టు పట్టించటం.మన దేశపు చరిత్రలోకి గౌతమ బుధ్ధుణ్ణీ బింబిసారుణ్ణీ అశోకుణ్ణీ కల్పించి ఇరికించారు.మన దేశపు చరిత్రలోని సుగత బుధ్ధుణ్ణీ బిందుసారుణ్ణీ అజాతశత్రుణ్ణీ కల్పితాలను చేర్చి వాస్తవ చరిత్రను కట్టుకధలకింద ఫిరాయించేశారు - మార్క్సు గాడు చేసిన "స్వర్గాన్ని ఫిరాయించి నరకానికి అమ్ముడు పోయిన" చెత్త పనిని మన చేత కూడా చేయించారు, చీ!

కార్ల్ మార్క్స్ విమర్శించడానికి తీసుకున్న క్లాసికల్ స్మిత్సోనియన్ ఎకనామిక్స్ అతి పెద్ద చెత్త.ఆ అతి పెద్ద చెత్తని ప్రపంచం మీద రుద్దింది కూడా మార్క్సు చేత ఒక చిన్న చెత్తని ఎత్తి పోయించిన క్రైస్తవం లోపల ఉన్న లూసిఫర్ మతస్థులే.వీళ్ళు అడుగు పెట్టిన ప్రతి చోట స్థానికుల్లో వీళ్ళకి అమ్ముడుపోయిన ప్రభుత్వాధినేతల్ని తమకు కట్టుబానిసల్ని తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని తోలుబొమ్మల మాదిరి ప్రజల ముందు చూపించి తెర చాటు నుంచి  ఆ మరబొమ్మలకి ఆజ్ఞలు జారీ చేస్తూ కరువుల్నీ యుధ్ధాల్నీ రోగాల్నీ వ్యాప్తి చేయించి పెద్ద ఎత్తున మనుషుల్ని చంపేసిన ఒక్కొక్క సంఘటనని పరిశీలించి చూస్తే వీళ్ళు వ్రాసిన చరిత్ర లోని లక్షమందిని చంపినందుకే పశ్ఛాత్తాప పడి ప్రియదర్శి ఇక యుధ్దాలు చెయ్యడని గొప్పలు చెప్పుకున్న అశోకుడు అనే శాంతిదూత ఒక పిచ్చి పుల్లయ్య అనిపిస్తాడు, నిజం!



“Crop failure in autumn 1768 and summer 1769 and an accompanying smallpox epidemic were thought to be the manifest reasons for the famine” అని మనకు చెప్తున్న మొదటి బెంగాల్ కరువు Warren hastings అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి wealth of the nations లాంటి ఆర్ధిక శాస్త్రపు మతగ్రంధాలను వండివార్చిన యాడమ్ము స్మిత్తు గారి మొదటి సూచన అయిన "తినటానికి మాత్రం పనికొచ్చే ఆహార పంటలని తగ్గించి చెట్లకి డబ్బుల్ని కాయించే వ్యాపార పంటలని పెంచాలి" అన్న వేదవాక్కుని అనుసరించి Opium, Indigo, jute పంటల్ని విపరీత స్థాయిలో వెయ్యటం వల్ల వచ్చింది.కరువుకి Crop failure కారణం అనే ఒక్క మాట తప్ప Crop failure అంటే ఏమిటి,అదెలా ఉంటుంది, అసలెలా వస్తుంది అనేది ఎవరూ చెప్పడం లేదు - ఎందుకని?


కేవలం 1858 - 1947 నడుమ వచ్చిన ఒక్కొక్క కరువుకీ 1 మిలియనుకి తగ్గని జనం చచ్చిన 12 కరువులకి కారణం ఏమిటి?అలనాటి  1769–1770 కరువు పది మిలియన్ల మందిని పొట్టన పెట్టుకున్నది.1791 - 1792 మధ్యన మద్రాసు ప్రెసిడెన్సీలో వీళ్ళు తెచ్చిన పుర్రెల కరువు ఎంత భయానకమైనదో తెలుసా - 1788 మొదలు 1794 వరకు 11 మిలియన్ల మంది చచ్చిపోయారు,తగలబెట్టేవాళ్ళూ పూడ్చిపెట్టేవాళ్ళూ కూడా లేని శవాల గుట్టలై పోయాయి వూళ్ళకి వూళ్ళు!1865-1867 మధ్యన వచ్చిన ఒరిస్సా కరువు ఒరిస్సాని మాత్రమే లెక్క్కై తీసుకుంటే 1 మిలియన్ మందినీ బీహారూ బళ్ళారీ గంజామూ లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్ని కలిపితే 4 మిలియన్ల మందినీ పొట్టన పెట్టుకుంది.1876-1878 మధ్యన వచ్చిన దక్షిణ భారత దేశపు అతి పెద్ద కరువు 10 మిలియన్ల మందిని చంపేసింది.1896-1897 మధ్యన వచ్చిన భారత్దేశపు కరువులోకల్లా తలమానికమైన గొప్ప కరువు ఎంతమందిని బలి తీసుకున్నదో సరైన లెక్క తెలియడం లేదు - తమ నిర్వాకం వల్ల చచ్చినవాళ్ళ లెక్కలు తియ్యడం అనవసరం అనుకుని ఉంటారు, దొంగ లంజ కొడుకులు!తమ జాతి వాళ్ళు ఇతర్లకి చేస్తున్న దారుణాలకి కినిసిన కొంతమంది పాశ్చాత్య సత్యాన్వేషులు ఒక్క ఈస్టిండియా కంపెనీ పాలిత ప్రాంతాల్లోనే సుమారు 16 మిలియన్ల మంది చచ్చిపోయారని లెక్క కట్టారు - వాళ్ళ దయ, మన ప్రాప్తం.


వాళ్ళు కరువుల్ని రప్పించడం అనే నీచమైన పనిని సైతం అసలు పాపభీతియే లేని నిండుమనస్సుతో ఎంత ప్లాను ప్రకారం చేస్తారో తెలుసుకోవడానికి 1832 నాటి మన గుంటూరు కరువుని గురించి తెలుసుకోవాలి."డొక్కల కరువు" అని దీనికి ముద్దుపేరు పెట్టుకున్నారు మనోళ్ళు - నందన నామ సంవత్సరంలో వచ్చిందని గుర్తుంచుకోవటానికి నందన కరువు అని కూడా పేరెట్టేసుకున్నారు."దొబ్బేసిందిరా నాయ్న!" అనుకుంటూ పెట్టారో ఏమో "దొబ్బ కరువు" అనే పేరు కూడా పెట్టుకున్నారు."పెద్ద కరువు, ముష్టి కరువు, వలస కరువు" - ఏడ్చిన ఏడ్పులకి కూడా ముద్దుపేర్లు పెట్టుకుని పులకించిపోయిన పిచ్చోళ్ళు మన తాతలు.దీనికి  మట్టుకు చరిత్రకారులు చెప్పిన కారణం న్యాయమైనదే - "crop failure as well as excessive and uncertain levels of taxation on peasants by British East India Company" అట!అప్పటి గుంటూరు ప్రాంతపు జనసంఖ్యలో మూడొంతుల మంది అంటే 5,00,000 మందికి 1,50,000 మది తిండి దొరక్క చచ్చారు.74,000 ఎద్దులు చచ్చాయి.1,59,000 పాడి పశువులు చచ్చాయి.గొర్రెలూ మేకలూ కలిసి 3,00,000 లక్షలు చచ్చాయి.చచ్చిన వాళ్ళు చస్తే బతికిన వాళ్ళు ఇక అక్కడ ఉండి ఉధ్ధరించేది లేదని తెలిసి వేరే చోట్లకి వలస పోయారు.వలస పోయిన వాళ్లలో కొంతమంది 1834 నాడు మహా మానవతా వాదులం అని చప్పట్లు కొట్టించుకోవడానికి బానిసత్వాన్ని రద్దు చేసిన చట్టం ప్రకారం స్వేచ్చను పొందిన నల్ల బానిసలు వదిలేసిన వెట్టి పనుల్ని అందుకున్నారు.బ్రిటిష్ ప్రభుత్వానికి బానిసత్వాన్ని రద్దు చేసిన ఖ్యాతీ దక్కింది, వాళ్ళు బానిసల చేత చేయించుకుంటున్న పనులూ ఆగలేదు - ఎంత లాభసాటి కరువురా అది!


అవ్వన్నీ పాతవి,వాళ్ళే తెచ్చారని చెప్పటం హరిబాబు అనే హిందూమతపిచ్చగాడి పులుముడు పాండిత్యం అనుకునే వాళ్ళకి 1943 నాడు చర్చిలు తెచ్చిన బెంగాలు కరువు ఎన్నో నిజాల్ని చెప్తుంది - విన్నదీ చూసిందీ మాత్రమే గాక బయటికి కనిపించని చీకటి మనుషుల ఉనికిని కూడా నిజం అని ఒప్పుకోగలిగిన దమ్మున్న వాళ్ళు మాత్రమే అర్ధం చేసుకోగలిగిన దుర్మార్గమైన కారణం బెంగాల్ కరువు వెనక ఉంది.


అప్పటి వరకు మోహనదాసును జాతిపిత ఆని నమ్మిన సుభాష్ చంద్ర బోసు తన భ్రమల్ని వదిలించుకుని బెంగాల్ ప్రజల్ని నిజమైన స్వాతంత్య్ర పోరాటం వైపుకి నడిపించడంలో కృతకృత్యుడై తమకు రెండవ ప్రపంచ యుధ్ధపు ఖర్చుని పెంచినందుకు పగబట్టి scorching the earth(ముడ్డి కింద మంట పెట్టటం/పెనం మీద నుంచి పొయ్యి లోకి తొయ్యటం) పేరున Winston Churchill అనే పరమ నికృష్టుడు కసి కొద్దీ బెంగాలు మీద రుద్దాడు 1943 నాటి కరువుని!

బోసు కాంగ్రెసు నుంచి బయటికి రావటం ఒక్క రోజులో జరిగిన సన్నివేశం కాదు.తొలినాళ్లలో నెహ్రూ,బోసుల మధ్య మంచి స్నేహం నడుస్తూ ఉండేది.కాంగ్రెసు పార్టీ చేసిన అన్ని కార్యక్రమాలలోనూ జిగ్రీ దోస్తుల మాదిరి కలిసి పని చేశారు,కాంగ్రెసు పార్టీ తీసుకున్న అన్ని నిర్ణయాలలోనూ ఒకే గొంతును వినిపించారు.అయితే, కలిసి పని చేస్తున్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలలోనూ సహజమైన నాయకత్వం విషయంలో నువ్వా నేనా అన్న పోటీ వచ్చినప్పుడు గాంధీ అన్ని సార్లూ నెహ్రూని వెనకేసుకుని రావడం అందరికీ తెలిసేలానే జరిగింది.దాంతో బోసు INA స్థాపించి జపాను వాళ్ళతో కలిసి ఇంగ్లీషు వాళ్ళ మీదకి యుధ్ధానికి వచ్చాడు.ఎంత చిత్రమైన వ్యూహం బోసుది - అటువైపున జపాను సైన్యంలోనూ ఇటువైపున బ్రిటిషు సైన్యంలోనూ ఉండి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాల్సిన వాళ్ళు మనవాళ్ళే!

అంత దయనీయమైన స్థితి ఎందుకు దాపరించింది బోసుకి?ఇంగ్లీషువాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళ లాభం కోసం వాళ్ళ అహాల్ని చల్లార్చుకోవటం కోసం చేసుకుంటున్న మోసకారి యుధ్ధానికి మనవాళ్ళనుంచి నిధుల్ని సేకరించి మనవాళ్లని వాళ్ళతో కలిసి యుధ్ధం చేసి ఇంగ్లీషువాళ్ళ శత్రువుల్ని చంపమని పంపించిన పరమ నికృష్టపు వెధవని ఇప్పటికీ జాతిపిత పేరున గౌరవిస్తున్న బానిసజాతిలో పుట్టి వీళ్ళకి అవసరం లేని స్వాతంత్య్రాన్ని తెచ్చిపెడదామని అనుకున్నందుకు కాదూ!

1943, అంటే ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఉధృతమైన స్థాయిలో జరుగుతున్న కాలం.ఇంకొక్క అయిదేళ్ళలో ఆకుంఠిత దేశభక్త శ్రేష్ఠుల శ్రేణి ఆహితాగ్నుల వలె రగిలిపోయి చూపించిన పోరాటస్పూర్తికి దడుచుకుని ఇంగ్లీషోళ్ళు స్వాతంత్య్రం ఇచ్చిన 1947కి అయిదేళ్ళ ముందు లండనులో కూర్చున్న చర్చిలు ఇండియాలోని ఒక ప్రాంతం మీద ప్రచండమైన కరువుని రుద్దుతుంటే ఒక్కడంటే ఒక్క దేశభక్తుడు బెంగాలు వైపు చూడలేదు,అయ్యో అనలేదు,ఆపాలని ప్రయత్నించలేదు.కమ్యూనిష్టోళ్ళు కూడా కరువును రుద్దుతున్న దొంగ నాటకం నడుస్తున్నప్పుడు పోలేదు, ఆపలేదు - అయిపోయాక పాటలు రాశారు, పేరు తెచ్చుకున్నారు!

నిజానికి చర్చిల్ అష్టదిగ్బంధనం చేసి బెంగాలును పగబట్టి వేధించడం వల్లనే అంతమంది జనం చచ్చిపోయారు.ఇంగ్లీషువాళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీ తర్వాత బెంగాలు ప్రెసిడెన్సీని ఎక్కువ దెవలప్ చేశారు.రాకపోకలకి ఇబ్బంది లేదు.మిగిలిన దేశంలో కరువు లేదు.అలాంటప్పుడు అంత పెద్ద కరువు ఎట్లా వచ్చింది?యుధ్ధ సమయపు జాగ్రత్తల పేరున వరి ధాన్యపు ఎడ్లబళ్ళని కూడా బెంగాలు వైపుకి వెళ్ళనివ్వలేదు.అక్కడ లండను చట్టసభలో ప్రతిపక్షాల వాళ్ళు తమ ఇతర వలసల నుంచి ధాన్యాన్ని తరలించమని చేస్తున్న గొడవల్ని కూడా రోతశీల్డు మందలోని ఒక గాండ్లసంగు కొడుకు " ఏంటీ, ఇండియాలో కరువొచ్చిందా?అవునా, అయితే గాంధీ ఇంకా చచ్చిపోలేదేం!" లాంటి లేకిమాటలతో కొట్టిపారేసి బెంగాలు ప్రజల మీద కరువుని రుద్దుతుంటే మహాత్ముడికీ తెలియదు, శాంతిదూతకీ తెలియదు, ఉక్కుమనిషికీ తెలియదు, విప్లవ సింహాలకీ తెలియదుహవ్వ, మరీ అంత అమాయకత్వమా!

ఆరవ శతాబ్దం నాడు మొదలై చెదురు మదురైన ముసల్మాన్ల దాడులు 13వ శతాబ్దం మొదలు మొదలై 17వ శతాబ్దం వరకు ముమ్మరమైన తర్వాత 17వ శతాబ్దం నాటికి ప్రపంచం మొత్తం కలిసి పుట్టించిన సంపదలో మూడోవంతును పుట్టిస్తున్న వాళ్ళకి పంటలు ఎలా పండించాలో తెలియకనా 17వ శతాబ్దం నుంచి ఇన్ని కరువులు వచ్చింది?

ఇన్ని కరువులు రప్పించి తమ తాతల్ని చంపేసిన ఇంగ్లీషువాళ్ళని పట్టుకుని "అయ్ బాబోయ్, ఇంగ్లీషోళ్ళు వచ్చి మనకి ఇంగ్లీషు నేర్పబట్టీ బతికి బట్టకట్టి ఇట్టా ఉన్నాం గానీ లేప్పోతే బ్యామ్మర్లు మన కులాన్ని తొక్కి నారతీసే వోళ్ళు!" అని పొగుడుతున్న అంబేద్కరిస్టులకి ఏ చెప్పుతో కొడితే వాళ్ళ కళ్ళకి పట్టిన బానిసత్వపు కొవ్వు కరిగి మంచి బుధ్ధి వస్తుంది?

మూడేళ్ళ నుంచి కరోనా పేరున ఎన్ని అబధ్ధాలు చెప్పి ఎంత హడావిడి చేస్తున్నారు? కరోనా వ్యాప్తి గురించి గానీ కరోనా వ్యాధి లక్షణాల గురించి గానీ కరోనా వ్యాధికి జరిగిన జరుగుతున్న వైద్యం గురించి గానీ పోస్ట్ వ్యాక్సినేషన్ సిండ్రోంస్ గురించి గానీ పోస్ట్ కరోనా పాజిటివ్ సిండ్రోంస్ గురించి గానీ ఎంతమంది హేతువాదులకి ఖచ్చితమైన సమాచారం తెలుసు?"అన్ని సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న జో బైడెనుకి కరోనా ఎలా వచ్చింది?" అనే ప్రశ్న హేతువాదులకి ఎందుకు రావడం లేదు?చికెన్ గన్యాకి గానీ ఫ్లూ వైరసుకి గానీ అక్కర్లేని సోషల్ డిస్టాన్సింగ్ మొదలు నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపుల లాంటి ఐసొలేషన్ వార్డుల వరకు గల ప్రత్యేకతలు ఒక్క కరోనాకే ఎందుకు అవసరం అయ్యాయి అనే ప్రశ్నకి ఏ విశ్లేషకుడు ఎంత చక్కటి జవాబును చెప్పాడు?కుటుంబ సభ్యులు చచ్చిపోతే వాళ్ళు కరోనాతో చచ్చిపోయారు అన్న ఒకే ఒక కారణంతో దగ్గరకి కూడా వెళ్ళని స్థాయి భయోత్పాతాన్ని సృష్టించినది ఎవరు?బాబాలూ సన్యాసులూ పాస్తర్లూ చేసేవి మాత్రమే మోసాలా - మోడర్న్ సైన్సు పేరు చెప్పి గందరగోళాన్ని సృష్టించి ప్రాణభయం పుట్టించి ఒక రోజు కరోనా ట్రీట్మెంటుకి లక్షల సొమ్ము గుంజడం మోసం అనిపించదా ఈ అభ్యుదయ హేతువాద నాస్తిక శిఖామణులకి?ఎంతమంది అభ్యుదయ హేతువాద నాస్తిక శిఖామణులు ఎంతమంది కార్పొరేట్ డాక్టర్లని నిలదీశారు?

మూడేళ్ళ పాటు ఏ పనీ చెయ్యనివ్వక పోవడం వల్లనే కదా శ్రీలంక పన్నుల వల్ల వచ్చే ఆదాయం లేక కొత్త అప్పులు పుట్టక అవమానం పాలయ్యింది.ఆత్మ నిర్భర భారత్ పేరున విదుదల చేసిన ఇరవై వేల కోట్లూ నిలవలో ఉన్న నికర ఆదాయం నుంచి తియ్యనప్పుడు రేపు కొత్త అప్పులు ఇవ్వం అని IMF చెప్తే మన దేశం కూడా శ్రీలంక లాగే అఘోరించాల్సిందే కదా!నేను హిందూత్వవాదిని గనక అక్కడున్నది హిందూ ప్రభుత్వం కాబట్టి నిలదియ్యడానికి వెనుకాడితే అర్ధం చేసుకోవచ్చును.కానీ, ఒక మతచాందసవాద పార్టీ "2020వ సంవత్సరానికి 30,42,230 కోట్ల రూపాయలను మాత్రమే పెట్టుబడి కింద ఖర్చు చేస్తూ ఆ కుసింత కరెన్సీని సైతం పెట్టుబడి తిరిగి రాని చోట ఖర్చు పెట్టి లోటు బడ్జెట్లతో అఘోరిస్తూ 11,600,000,000 USD దాటి పెరుగుతున్న అప్పుని" దాచేస్తుంటే నిలదియ్యటానికి అభ్యుదయ హేతువాద నాస్తిక శిఖామణులకి గొంతు పెగలడం లేదు,ఎందుకని?

2022 నాడు,1947 నుంచి 75సంవత్సరాల తర్వాత, ఇప్పుడు అంటే నవ్వొస్తుంది గానీ మనకి స్వతంత్రం అనవసరం అనిపిస్తుంది నాకు.ఎందుకంటే, "మిగిలిన భారత దేశం ఒక శతాబ్దం తర్వాత ఆలోచించే దాన్ని బెంగాలు ఇవ్వాళ ఆలోచిస్తుంది!" అని గొప్పలు చెప్పుకున్న బెంగాలు నడిబొడ్డున చర్చిలు తెచ్చిన అక్షరాల 5.2 మిలియన్ల మంది బెంగాలీల్ని చంపిన బెంగాలు కరువుకి దిక్కుమాలిన హిండియాలోని వాపిరిగొట్టు మూక ప్యానిక్ అవ్వడమూ లోకల్ బెంగాలీ భద్రలోక్ దగుల్బాజీ ప్రభుత్వాధికార్లు అలగా జనాన్ని అదుపు చెయ్యడం చేతగాక చేతులెత్తెయ్యడమూ బేచారా హిండియన్ కోమట్లు ధాన్యాన్ని దాచేసి విదేశాలకి బ్లాకులో హమ్మడమూ కారణాలని టముకేసి చెప్పి అమర్త్య సేన్ అనే ఒక దగుల్బాజీ గాడు నోబెల్ ప్రైజు తెచ్చుకున్న 1998 నాడు 10.4  మిలియన్ల మంది బెంగాలు కుర్రాళ్ళు "మనోడికి నోబుల్ ప్రైజొచ్చిందిరోయ్!" అని పండగ చేసుకున్నారు.ఇలాంటి అజ్ఞానపు మందకి స్వతంత్రం అవసరమా - మీరు చెప్పండి!

బ్రిటిషు వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారమే వాళ్ళు 70,000 పడవల ధాన్యాన్ని confiscate చేసి బెంగాలు ప్రజలకి అందని చోట దాచేశారు!చర్చిలు రప్పించిన కరువుని ఇండియన్ల మీదకి తోసేసిన అమర్త్య సేన్ వామపక్ష మేధావులకి మాత్రం ఎట్లా గౌరవనీయుడు అయ్యాడు?దోపిడీని అణిచివేసి ప్రజలకి సమసమాజపు సౌఖ్యాల్ని అందివ్వటం కోసం నడుం కట్టిన విప్లవ వీరులు సైతం దోపిడీ దారులకు వూడిగం చేస్తుంటే ఇంక దోపిడీని నిరోధించటం ఎట్లా సాధ్యం?పైన చెప్పిన కొంతమంది అమాయకత్వం వల్ల చేశారని సరిపెట్టుకోవచ్చు.కానీ, నక్సలైట్లు దోపిడీ ప్రభుత్వాల్ని కూల్చటానికి వాడుతున్న తుపాకులూ మందు పాతర్లూ ఎవరి దగ్గిర కొంటున్నారు?ఇస్లామిక్ జెహాదీల నుంచి ఆయుధాలు కొని వీళ్ళు తెచ్చే సమసమాజం ఇస్లామిక్ జెహాదీలని ఎలా అణిచి వేస్తుంది?వీళ్ళు ఇస్లామిక్ జెహాదీలతో కలిసి పంచుకునే అధికారం హిందువులకి ఏం న్యాయం చేస్తుంది?

అమర్త్య సేన్ నోబుల్ ప్రైజు తెచ్చుకున్న పుస్తకం పేరు "Development as freedom" వూరేగింపులు తీసి మిఠాయిలు పంచిపెట్టి సంబరపడిన 10,400.000 మందిలో ఎంతమంది చదివి ఉంటారు?ఒక్కడు కూడా చదివి ఉండడు - ఎందుకంటే,అంత గొప్ప పుస్తకానికి కేవలం 2800 కాపీలు మాత్రమే చెల్లి పోయాయి,అదీ రోతశీల్డు వెధవలు వేసిన ఉచిత పంపిణీ పధకం వల్ల!

తనకి నోబుల్ ప్రైజు ఇచ్చిన రెండేళ్ళకి అమర్త్య సేన్ Emma Rothschild అనే ఆణిముత్యాన్ని పెళ్ళి చేసుకున్నాడు.ఇదేమీ అలా అనుకోని విధాన జరిగిన లేత యవ్వనపు తొట్టతొలి ప్రణయం కాదు.1985 నాడు Eva Colorni అనే రెండవ భార్య చచ్చిపోయిన(?) నాటినుంచి లైనేస్తూ అప్పటికి పడగొట్టాడు.1959ల నాడు వీడికి మొదటి భార్య అయిన నవనీతా దేవి వీడిలో ఉన్న తెల్లవాళ్ళ చెప్పులు నాకే బుధ్ధిని చూసి అసహ్యించుకుని 1976ల నాడు విడాకులు తీసుకునేశాక పీడా పోయిందని ఇక తెల్ల చర్మం వాళ్ళ కాళ్ళని నాకెయ్యటం మొదలు పెట్టాడు.దోపిడీని విముక్తం చెయ్యాల్సిన కమ్యూనిష్టు అమర్త్య సేన్ ఇల్లరికం వెళ్ళిన కుటుంబమే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వెనక దాక్కుని ప్రపంచ స్థాయిలో దోపిడీని నడిపిస్తున్నది. ఆనాటి కారా మేష్టారూ కామ్రేడ్ సుందరయ్యా ఈనాటి తెలకపల్లి రవీ సీపీఐ నారాయణా కూడా అమర్త్య సేన్ నిజమైన చరిత్ర తెలియకనే అతన్ని గౌరవనీయుడైన మేధావి కింద పొగిడేశారా? ఏమో, వీళ్ళు సైతం అన్నీ తెలిసే ఇతరుల్ని మోసం చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు - మీరు చెప్పండి!

"PEACE OUT OF THE CHAOS!" అని ఒక దుర్మార్గపు నీతిని పాటిస్తూ ప్రజల్ని గందరగోళానికి గురిచేసే రహస్య ప్రణాళికలో ఆనాటి కారా మేష్టారూ కామ్రేడ్ సుందరయ్యా ఈనాటి తెలకపల్లి రవీ సీపీఐ నారాయణా కూడా ఒక భాగం కావడమే ప్రజలు దోపిడీకి అలవాటు పడిపోవటానికీ దేశద్రోహుల్ని గుర్తించలేక వాళ్ళని దేశభక్తులని పొగడటానికీ అతి ముఖ్యమైన కారణం - ఎంత విషాదం మనది?

P.S:”భారత్దేశంఅనే మాటని కమ్యూనిష్టు భావజాలం పట్ల అభిమానం ఉన్న గుంటూరుకు చెందిన ఒక పిచ్చివాళ్ళ డాక్టరు యా.రమణ చాలా ఎక్కువ సార్లు వాడేవాడు. ఎక్కువ సార్లు కూడా కాదేమో, అతను "అందరికీ దొరకను,కొందరికే చెబుతాను" అని తన బ్లాగుల్ని ప్రైవేట్ చేసేవరకు రెగ్యులర్ విజిటర్ని అయ్యి చాలా పోష్టుల్లో మంచి కామెంట్లు కూడా వేశాను గానీ తన పోష్టుల్లో "భారత దేశం" అనే చక్కటి పదాన్ని ఒక్క సారి కూడా వాడినట్టు గుర్తు లేదు నాకు.అప్పుడు ఇతర్ల దృష్టికోణం గురించి చెప్తూ వ్యంగ్యానికి వాడేవాడని అనుకున్నాను గానీ ఇప్పుడు అది మన దేశం పట్ల మన ధర్మం పట్ల మన సంస్కృతి పట్ల అతనిలో గూడు కట్టుకున్న స్వంత అసహ్యం అని అర్ధం అవుతున్నది నాకు.

3 comments:

  1. @Chiru Dreams20 August 2022 at 22:17
    "బాబూ శ్యామలీయం! నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వడూ ఏమీ చదవడు అనే కుతినుబంచి బయటకురా ముందు. సమాధానం చెప్పలేక దాటేసేవేశాలు నీదగ్గర, నీలాంటోల్లదగ్గర చాలా చూశాం."

    hari.S.babu
    ఒరేయి చిరూడ్రీంస్సూ!
    ఏమీ చదవకుండానే మాకు సర్వం తెలుస్తాయి అనే కుతినుంచి బయటకురా ముందు.చెప్పిన సమాధానం అర్ధం కాక ట్రోలింగేశాలు నీదగ్గిర,నీలాంటోల్లదగ్గిర చాలా చూశాం.

    నీకు తెలియని కొత్త విషయం తెలుసుకోవటానికి ఇంకోడు రిఫరెన్సులు ఇవ్వాలా?"జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు." అనేది నీకు తెలియని విషయం ఎందుకయ్యింది?మూల భారతం నువ్వు చదవలేదు గనక,అవునా?

    అది చదవమని చెప్తే నువ్వేమో "నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వడూ ఏమీ చదవడు అనే కుతినుబంచి బయటకురా ముందు." అనీ "రిఫరెన్సు అడిగాను. దానిగురించి చెప్పండి. అంతేగానీ.. ఫలానా గ్రంధంలోవుంది అంటే పై అనామక పండితులుగారి వ్యాఖ్యలాగే వుంటుంది." అనీ అనామకం గాడేమో "ఏ లైనో ఎన్నో పేజీయో చెబ్తే ఏమన్నా సొమ్ములు పోతాయా ? అంతా పండితుల పైత్యం కాదా యిది?" అనీ వాగడం ఏంటి?

    మరోసారి కంటెంటు లేని ట్రోలింగు కామెంట్లు వేస్తే చెప్పు తెగుద్ది!

    ReplyDelete
  2. Chiru Dreams:16 Oct 2022
    ఒరేయ్ వాడికంటే కాన్సెన్సు లేదు........ఎర్రిపూకు బూతులకిలేస్తే తోలుతీస్తా నాకొడక.

    hari.S.babu:ఒరేయ్ వాడికంటే కాన్సెన్సు లేదు. నీకేమైందిరా మేరీకి బత్షీబకీ లోతు కొతుళ్ళకీ పుట్టిన మతపిచ్చ పట్టిన క్రైస్తవ నా కొడకా. ఒక గజ్జికుక్కకి తోడు ఇంకో గజ్జికుక్కొచ్చాడు. మీరిద్దరూ కలిసి ఏం పీకుతారా నా ఆతులు గొరగడం తప్ప. మాయ జూదం ఆడితే అది కౌరవులకి దఖలు పడిందిరా తాయిగండవెధవా.. అసలు భారతం గురించీ రామాయణం గురించీ మీకెందుకురా వెర్రి నాకొడకల్లారా. బుర్ర వాడండిరా. ఏదో ట్రోలింగు ట్రిక్కులు రెండు బట్టీపట్టేశాం.. ఇక మాకంతా తెలుసు అనుకుంటూ ఎర్రిపూకు బూతులకిలేస్తే తోలుతీస్తా నాకొడక.

    నీ నల్లట్ట బూతుల పుస్తకం సదువుకునేడు.హిందువులకి నువ్వు నీతులు చెప్పక్కర్లేదు.మూసుకు పో!

    ReplyDelete
  3. Chiru Dreams commented at Yesterday
    ఒరే మగాల్లకి ఎంకనుంచి పుట్టిన నాకొడక! మొడ్డుంటే ఆతులుంటాయిరా. కొజ్జా నాకొడుకువి.... నువ్వు కామెంటుగా కాపీ చేసుకున్న పోష్టు డేటూ చూస్తేనే అర్ధమౌతుందిరా.


    hari.S.babu
    నీలాంటి గజ్జికుక్క ఐడీతో నా బ్లాగుని చెడగొట్టటం నచ్చక నీ కామెంటు పబ్లిష్ చెయ్యలేదు.ఎప్పుడు పబ్లిష్ చేస్తానో తెలుసా!మాంఛి హ్యాకర్ని పట్టుకుని నీ కామెంటు నుంచి నువ్వీ బూతుల బుంగ పాండిత్యం ఎత్తిపోస్తున్న కంప్యూటరు అడ్రసు కనుక్కుని నీ ముందుకి వచ్చి కూర్చుందామని నా మాస్టర్ ప్లాను.ఇక నీ ఇష్టం వచినట్టు ఎన్ని బూతులు వాడతావో వాడు.నాకేం నొప్పి లేదు.

    ఒకసారి ప్రజ బ్ల్లాగు పెద్దాయనకి నువ్వు నీదని ఇచ్చిన మెయిలైడీకి నేను రెండు మెయిల్స్ ఇచ్చాను.రిప్లై ఇవ్వలేదేం?అది నీ సొంత మెయిలైడీ కాదు గనక,కదూ!పోనీ నేను ఏం రాశానో తెలుసా నీకు?నీకు తెలవదని నాకు తెలుసులే!

    చిరంజీవి అని హనుమంతుడి పేరెట్టుకుని వివరాలు తెలియనివ్వని ముసుగులో "వ్యభిచారం తప్ప ఇంకేం లేని మతాన్ని నెత్తినేసుకొనొచ్చి" అంటూ ఎర్రిపూకు ఏశాలు దెంగుతున్నది నువ్వు."చంద్రుడు గురువు పెళ్ళాన్ని దెంగినట్టు నీ పెళ్ళాన్ని ఇంకెవడో దెంగితే పిల్లలు కని తుత్తిపడుతున్న సన్నాసీ." ఆనెది నీకూ మీ నాన్నకే ఎక్కువ వర్తిస్తది అని నీకు తెలియట్లా?

    వ్యభిచారం తప్ప ఇంకేం లేని మతాన్ని నెత్తినేసుకొనొచ్చి.....మడత లంజకొడక. ఏం బతుకురా నీది. చావు ఫో తొత్తు లంజకొడక.

    జై శ్రీ రాం!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...