Thursday 8 April 2021

భారతీయ జనతా పార్టీ ఆంధ్రలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి ఎలా వస్తుంది - ఆశకు కూడా హద్దు ఉండాలి!

ఆంధ్ర రాష్ట్రంలో అధికారం ఆశిస్తూ అధికారం తమకే దక్కుతుందని ఆశిస్తూ డయలాగులు దంచుతున్న ఆంధ్రా భాజపా మొద్దురాచిప్పలకి బుద్ధీ జ్ఞానం వివేకం లాంటివే గాక కనీసపు కామన్ సెన్సు కూడా లేదని అనుకోవాలి, లేదా ప్రజల వోట్లు అవసరం లేని దొడ్డిదారిలో అధికారంలోకి రాబోతున్న తమ నీచత్వాన్ని దాచుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారని అనుకోవాలి.

కేంద్రం నుంచి వివిధ పధకాల కింద వస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించేసింది!అసలు నిధుల్ని ఎవరు కేంద్రం నుంచి తీసుకున్నారు, ఎటువైపు మళ్ళించారు అనేది పార్టీలోని మంత్రుల స్థాయి నాయకులకే తెలియదు!మచ్చుకి ఒక పేరు చెప్పాలంటే జాతీయ గ్రామీణ ఉపాధి పధకం - ఇది కేంద్రం అధీనంలో ఉండి పని చేస్తున్నదే కదా!గత ప్రభుత్వం పెండింగులో ఉంచిన బిల్లులతో కలిపి గత అరెండేళ్ళకు కేంద్రం ఇలాంటి అన్నింటికీ కలిపి విడుదల చేసిన మొత్తం గాలిలో కలిసిపోయింది.అవును, సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు బకాయిల చెల్లింపు కోసం వేసిన కేసు విషయంలో హైకోర్టు న్యాయ్మూర్తికి కేంద్రం అసలు చెల్లించనే లేదని చెప్పారు.

చంద్రబాబు కేంద్రం పరిధిలో ఉన్న పోలవరాన్ని తను కడతానని తీసుకుని ప్రతి బిల్లునీ పంపిస్తున్నందుకే అతనేదో పోలవరాన్ని ఏటీయం చేసేసుకుని వాడేసుకుంటున్నాడని యేడ్చి చచ్చిన ఇద్దరు వీర్రాజులూ ఇవ్వాళ తమని వెర్రి వెధవల్ని చేస్తున్న జగన్ మీద విరుచుకు పడరేం?కనీసం బడ్జెట్ వెయ్యటానికి అసెంబ్లీని సమావేశపర్చటానికి ముఖం చెల్లక ఆర్డినెన్సులతో సరిపెడుతున్న జగన్ మీకు అంత నచ్చేశాడా!ఆంధ్రలో మీ బలం ఎంత?ఎన్ని వోట్లు ఉన్నాయి?ఎన్ని సీట్లు వస్తాయి? "రాష్ట్రంలో వోట్లు పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి?" అని భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఏనాడు మీరు నిజాయితీగా ఆలోచించారు!

1953 అక్టోబర్ 01 అవిభక్త మదరాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం కర్నూలును రాజధానిని చేసుకుని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిత్వంలో కొలువు దీరింది. ప్రకాశం పంతులు గారు కాంగ్రెసు పార్టీ తరపున 1953 అక్టోబర్ 01 మొదలు 1954 నవంబర్ 15 వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.అయితే కమ్యూనిష్టులు టంగుటూరు ప్రకాశం పంతులు గారి పాలనను వ్యతిరేకించి మద్దతును ఉపసంహరించుకుంటూ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పధ్నాలుగు నెలలకే ఆయన ప్రభుత్వం కూలిపోయింది.1954 నవంబర్ 15 ప్రకాశం గారి ప్రభుత్వం కూలిపోయాక కొన్ని నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన తర్వాత 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి.167 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన బెజవాడ గోపాల రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.నిజానికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకే కొనసాగాలి.కానీ, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల పదవీ కాలం 1962 వరకు ఉండడంతో ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు.

1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయేనాటికి నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు ప్రజలు 1948 సెప్టెంబర్ 17 నాటికే తన పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని అయితే పాకిస్తానులో కలపాలనీ లేదంటే స్వతంత్రదేశంగా ఉండాలనీ అనుకుంటున్న నిజాము పరిపాలన నుంచి విడివడి స్వతంత్ర భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పరచుకుని ఉన్నారు.1950 జనవరి  26 నిజాముకు ఇచ్చిన రాజ్ ప్రముఖ్ హోదా 1956 అక్టోబర్  31 వరకు కొనసాగింది.హైద్రాబాద్ సంస్థానం స్వాధీనం కాగానే మొదట 1950 జనవరి 26 M.K.Vellodiని ముఖ్యమంత్రిగా నియమించారు.అయితే, 1952 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గి బూర్గుల రామకృష్ణా రావు గారు ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి అయ్యారు.ఇదే 1952లో ఇతర ప్రాంతాల వారికే కీలకమైన ఉద్యోగాలు దక్కడం మీద వ్యతిరేకత పెరిగి ముల్కి ఉద్యమం ఉధృతమైంది.అయితే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన Reorganisation of the Indian States కమిటీ 1956లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనూ కలపాలని సూచించింది.అలా మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో చీలిన ఆంధ్ర రాష్ట్రమూ నిజాము రాజ్యం మీద తిరగబడి 1948లో జరిగిన పోలీసు చర్యతో భారతదేశంలో కలిసిన హైదరాబాద్ రాష్ట్రమూ కలిసి 1956 నవంబర్ 01 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.

నేనిక్కడ ఆంధ్ర ప్రాంతపు చరిత్రని చెప్పటం లేదు.ఆంధ్రలో అధికారం ఆశిస్తున్న స్థానిక భాజపా శ్రేణులకి పార్టీ ఆవిర్భావం జరగక ముందు ఆంధ్ర ప్రాంతపు స్థితిగతులు చెప్పాలనుకుంటున్నాను, అంతే!ఒకప్పుడు జన సంఘ్, మరొకప్పుడు జనతా పార్టీ అనే పేర్లతో భారత దేశపు రాజకీయ రంగం మీద వామపక్ష భావాలతో విభేదించి వ్యక్తిగత ప్రతిభతో సంచలనాలను సృష్టిస్తూ కొనసాగిన నాయకులు అందరూ ఒక గొడుగు కిందకి చేరి వ్యవస్థాపక నాయకులై ఇవ్వాళ మనం చూస్తున్న భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ ఆరున ఆవిర్భవించింది.

అయితే, 1983 నాటి ఆంధ్ర రాష్ట్రపు ఎన్నికల దృశ్యం ఆంధ్రుల ఆత్మాభిమానం పేరున రంగప్రవేశం చేసిన రామారావుకు రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టింది.తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 46.3% సంపాదించుకుని పోటీ చేసిన 289 స్థానాలకు  201 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 33.64% సంపాదించుకుని పోటీ చేసిన 294 స్థానాలకు  60 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 2.76% సంపాదించుకుని పోటీ చేసిన 81 స్థానాలకు 3 స్థానాలను దక్కించుకుంది.

1984 లోక్ సభ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి ప్రజాకర్షణ మరింత పెరిగి రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 44.8 % సంపాదించుకుని 30/42 లోక్ సభ స్థానాల ప్రాతినిధ్యం వచ్చింది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 41.8 % సంపాదించుకుని 6/42 లోక్ సభ స్థానాల ప్రాతినిధ్యం దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 2.2 % సంపాదించుకుని 1/42 లోక్ సభ స్థానాల ప్రాతినిధ్యం దక్కించుకుంది.

రామారావు తన పదవీ చ్యుతికి దారితీసిన వేరుపురుగుల్ని ఏరిపారెయ్యటానికి సభను రద్దు చేసి జరిపించిన 1985 ఎన్నిక తిరిగి తెలుగు దేశానికే అధికారం దక్కించించింది.తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 46.21% సంపాదించుకుని పోటీ చేసిన 250 స్థానాలకు 202 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 37.25% సంపాదించుకుని పోటీ చేసిన 290 స్థానాలకు 50 స్థానాలను దక్కించుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 1.32% సంపాదించుకుని పోటీ చేసిన 10 స్థానాలకు 8 స్థానాలను దక్కించుకుంది.ఇది భాజపా రామారావుకు తన పదవిని తిరిగి రప్పించుకోవటంలో సహాయం చేసినందుకు లభించిన ప్రతిఫలం.

తెలుగుదేశం మళ్ళీ 202 సీట్లు గెలుచుకున్నప్పటికీ వోట్ల శాతం కొంచెం తగ్గింది.తను స్వయాన "The election was called to teach a lesson to the defectors. The Telugu Desam was formed not with the intention of capturing power but to promote moral and ethical conduct in political and public life. We have got the people's mandate once again to complete the unfinished tasks." అని చెప్పుకున్నాడు గనక ఎన్నికల ఫలితాలను కొంచెం సూక్ష్మ పరిశీలన చేస్తే బాగుంటుంది కదా!

కొన్ని కాంగ్రెసు కంచుకోటల్ని కైవసం చేసుకుంది. కానీ 1983 ఎన్నికల్లో కాంగ్రెసుకి తెలంగాణ నుంచి 44 సీట్లు వస్తే ఈసారి 13 సీట్లు మాత్రమే వచ్చాయి.ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరిల నుంచి 74 సీట్లకి 67 సీట్లని బంపర్ మెజార్టీతో గెల్చింది.అయితే, దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది - 60 సీట్లకి 1983 నాటి 50 సీట్లకి 11 తగ్గి 39 సీట్లు వచ్చాయి.రాయలసీమలోనూ 53 సీట్లకి 1983 నాటి 40 సీట్లకి 03 తగ్గి 37 సీట్లు వచ్చాయి.

"The selection of candidates was not done carefully enough and we lost narrowly in several constituencies for want of luck" అని కా.బ్రహ్మానంద రెడ్డి గారూ "We have not been able to convincingly explain the weakness in the policies and programmes of the Telugu Desam" అని కొ.రోశయ్య గారూ "The voters have shown for the third time in two years that the Telugu Desam is the people's party" అని రామారావూ అనటాన్ని బట్టి అప్పటి పరాజయాన్ని కాంగ్రెసు నాయకులు తీసుకున్నంత తెలివితోనూ హుందాగానూ అప్పటి విజయాన్ని రామారావు తీసుకోలేకపోయాడనిపిస్తున్నది నాకు.తెలుగుదేశానికి కమ్మ కులస్థుల పార్టీ అనే ముద్ర పడటం సమయంలోనే మొదలైంది.అప్పుడు కాంగ్రెసుకు పడిన వోట్ల డెమోగ్రఫీని గమనిస్తే ఇతర కులాల వోట్లు కాంగ్రెసు వైపుకి వెళ్తున్నాయనేది అర్ధం అవుతుంది.భాజపా వంటి కొత్త మిత్రపక్షాలు కలవడం వల్ల అప్పుడు తెదెపాకు ప్రమాద సూచనలు ప్రముఖం కాలేదు.

కానీ 1989 వచ్చేసరికి కాంగ్రెసు పుంజుకుని తిరిగి అధికారం దక్కించుకుంది.తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 36.54% సంపాదించుకుని పోటీ చేసిన 241 స్థానాలకు 74 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 47.09% సంపాదించుకుని పోటీ చేసిన 287 స్థానాలకు  181 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 1.78% సంపాదించుకుని పోటీ చేసిన 12 స్థానాలకు 5 స్థానాలను దక్కించుకుంది.భాజపా రామారావుకు స్టెపెనీ స్థానం మించి రాష్ట్రంలో ఎదగకపోవడం వల్ల 10/8 నుంచి 12/5 అయ్యింది గానీ రామారావు ఇచ్చిన అవకాశం అందిపుచ్చుకుని సొంతబలం పెంచుకుని ఉంటే బాగుండేది.అప్పటినుంచీ చాలాసార్లు అవకాశం వచ్చినప్పటికీ సొంతబలం ప్రంచుకోవాలని ఎందుకు ప్రయత్నించలేదో అర్ధం కావటం లేదు నాకు.

స్వీయ లోపమ్ము లెరుంగుట మాని తన విజయాలకు తన సొంత తెలివినీ దేవుడి దయనీ తన పరాజయాలకు తన దురదృష్టాన్నీ శత్రు పార్టీల కుట్రనీ కారణం అని ఒక రాజకీయ నాయకుడు క్షణం అనుకుంటాడో క్షణం నుంచే అతను ప్రజలతో సంబంధం లేని పదవీ వ్యామోహపు రాజకీయాలు చేస్తున్న అధికార బధిరాంధక మదోన్మత్తుడు అయిపోయాడన్నది తధ్యం!అందుకే, 1978 నాడు 175 సీట్లతో కాంగ్రెసు పార్టీని గెలిపించిన మర్రి చెన్నారెడ్డి గారు మళ్ళీ దశాబ్దం తర్వాత 1989 నాడు పోటీ చేసిన 297 సీట్లకి 181 సీట్లను గెల్చుకుని,"People are the masters.They can say anything they choose to anyone" అని విజయామృత దరహాసం చేస్తుంటే తెలుగు దేశం పోటీ చేసిన 241 సీట్లకి 74 సీట్లు మాత్రమే గెల్చుకుని రామారావు అశ్రుసిక్త నయనాలతో "Lord Krishna said do your duty and don't worry about the results.I have served the people and respect their verdict" అని వేదాంతం చెప్పాల్సి వచ్చింది.

అతని స్వానురాగం నిర్మాణాత్మకమైన ఆత్మవిమర్శని అలవాటు చెయ్యకపోవడంతో ఆర్ధికశాస్త్రపరిజ్ఞానశూన్యత అనే అంతశ్శత్రువుని కాంగ్రెసు అనే బాహ్యశత్రువుకి ప్రత్యారోపణ చేసేసుకుని కాంగ్రెసుని భూస్థాపితం చేసే కొత్త లక్ష్యంతో జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టాడు.

రామారావూ చంద్రబాబూ అంత సుదీర్ఘ కాలం పాటు జాతీయ రాజకీయాల పేరుతో హడావిడి చేసి సొంతానికి గానీ రాష్ట్రానికి గానీ ఏమి సాధించారో అర్ధం కావడం లేదు నాకు.ఎందుకంటే, 1994లో మళ్ళీ రామారావు గెలవడంలో అతని జాతీయ స్థాయి మిత్రపక్షాల సహకారం కన్న మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు 1989 డిసెంబర్ 03 మొదలు 1990 డిసెంబర్ 17 వరకు ఒక సంవత్సరమూ నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు 1990 డిసెంబర్ 17 మొదలు 1992 అక్టోబర్ 09 వరకు రెండు సంవత్సరాలూ కోట్ల విజయభాస్కర రెడ్డి గారు 1992 అక్టోబర్ 09 మొదలు 1994 డిసెంబర్ 12 వరకు రెండు సంవత్సరాలూ చూపించిన ముఠాతత్వపు రెడ్ల కులపిచ్చియే కారణమైనప్పుడు సమయాన్ని ఇక్కడే వుండి తన పార్టీకి అప్పుడప్పుడే అంటుతున్న కులముద్రను తొలగించుకుని తనను తను ప్రజలకు మరింత దగ్గర చేసుకుని వుంటే ఎంత బావుండేది!

అప్పటి 1994 ఎన్నికల నాటికి తెలుగుదేశం తిరిగి అధికారం దక్కించుకుంది.తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 44.14% సంపాదించుకుని పోటీ చేసిన 251 స్థానాలకు 216 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 33.85% సంపాదించుకుని పోటీ చేసిన 294 స్థానాలకు 26 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 3.89% సంపాదించుకుని పోటీ చేసిన 280 స్థానాలకు 3 స్థానాలను దక్కించుకుంది.

"మళ్ళీ వచ్చెను మధుమాసం మా గండిపేట పార్టీకి!" అని ఆనంద తరంగాల మీద తేలియాడుతూ 1994 డిసెంబర్ 12 ముఖ్యమంత్రి అయిన రామారావు 1995 సెప్టెంబర్ 01 అనూహ్యమైన రీతిలో అల్లుడు కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరిగి చరిత్ర శిధిలాల్లోకి జారుకుని అనామకుడై పోయాడు!

1995 ఆగస్టు కల్లా రామారావు తన రెండవ భార్యకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనుకుంటున్నట్టు అందరికీ అనుమానం వచ్చేసింది.ఎవరు ఎవర్ని కెలికితే ఎవరు పిచ్చెక్కిపోయారో తెలియదు గానీ అప్పటి వాళ్ళిద్దరి ఆలోచనలూ చాలా వింతైన శైలిలో ఉండేవని తెలుస్తుంది.మొదటి ప్లాను, లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గానూ రామారావు భారతదేశానికి ప్రధానమంత్రిగానూ అద్భుతమైన పరిపాలన అందించి ఆచంద్రతారార్కం లక్ష్మీనారాయణులూ పార్వతీపరమేశ్వరుల తర్వాత మూడో ఆదిదంపతుల మాదిరి పూజలు అందుకోవాలనీ అందుకోగలమనీ అనుకునేవాళ్ళు - !రెండవ ప్లాను, రామారావు ఎటూ విశ్వామిత్రుడి వేషం వేసేసి విశ్వామిత్రుడు అయిపోయాడు కాబట్టి రామారావుకీ లక్ష్మీపార్వతికీ పిల్లలు పుడితే మూడో తరాని కల్లా వాళ్ళ ఇంట్లో బుజ్జి భరతుడు పుట్టేసి వాడు ఏదో ఒక నాడు భారతదేశానికి చక్రవర్తి అయి తీరుతాడని అనుకునేవాళ్ళు - !నేను వ్యంగ్యాలు విసుర్తున్నానని అనుకోకండి, రామారావుకి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మందులు వాడటమూ తను రీక్యానలైజేషన్ చేయించుని అబార్షన్ల పాలవటమూ సాక్షాత్తూ ననదమూరి లక్షమీ పారవతి గారే ఒప్పుకున్న నిజాలు.

చంద్రబాబుని మొదట విశాఖ పట్నం Dolphin Hotel దగ్గిర కలిసింది(చంద్రబాబుకి మొదట విశాఖ పట్నం Dolphin Hotel దగ్గిర దొరికింది) 20 మంది ఎమ్మెల్యేలు.“The MLAs told him that the mood among the TDP MLAs was anti-NTR and almost all of them would support Naidu if he took over. Naidu then dashed to Hyderabad and began contacting the TDP MLAs. They arrived in Hyderabad to meet Naidu, who lodged himself in Viceroy Hotel facing the Secretariat. By the time NTR got wind of what was happening, there were 150 MLAs inside the hotel,” అనేది అప్పటి కధలోని ఒక పాత్రధారి యొక్క స్వానుభవ కధనం.“A reporter told us over phone that N T Rama Rao had written to the governor recommending dissolution of the Assembly. None of us were prepared for polls within a year and a half of getting elected.” అని తర్వాత జరిగిన కధని అప్పుడు Viceroy Hotel లోపల ఉన్న Dr S A Khaleel Basha గారు చెప్పారు.ఇది రామారావు సహజ స్వభావమైన అహంభావంతో కూడిన మొండితనం వల్ల వేసిన అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడ!

చెయ్యకూడని వెధవపని చేసేశాక వచ్చి బతిమిలాడుకోవడం అనే పిచ్చిపని చెయ్యకముందు బుద్ధిని కాస్త నేలమీద నడిపించి ఉంటే వీళ్ళు కూడా కొంత గొడవ చేసి తమకు లాభం అనుకున్న సంధి ప్రతిపాదనలతో సర్దుకు పోయేవాళ్ళు.కానీ, 1985లో తనకు ద్రోహం చేసిన భాస్కర్రావు మనుషుల్ని సభనుంచి తరిమి కొట్టడానికి వేసిన ఎత్తుగడనే రామారావు 1995లో తమమీద వేస్తున్నాడని తెలిసేసరికి వాళ్ళకి రామారావుతో రాజీ పడటం తమ ప్రసుత ఉనికికీ రాజకీయ భవిష్యత్తుకీ చాలా ప్రమాదం అనిపించింది.దాంతో, విధి లేక రామారావు వైస్రాయ్ హోటలు బయట చైతన్య రధం మీద నుంచుని చేసిన విజ్ఞప్తులకి వేరు గతి లేక తిరస్కరించి చంద్రబాబు వైపునే ఉండిపోవాల్సి వచ్చింది.తను అంతసేపు బ్రతిమిలాడుతూ ఎదురు చూస్తున్నప్పటికీ ఒక్కడు కూడా బయటికి రాకపోవటం చూశాక వెనక్కి తగ్గాల్సిన రామారావు తన ముఖం చూసినప్ప్పుడు పశ్చాతాప పడతారని ఆశపడి సభలో సెప్టెంబర్ 07న confidence-motion పెట్టినప్పుడు పదే పదే "I am the leader of the Telugu Desam Legislature Party (TDLP) and the president of the party" అని విజ్ఞప్తి చేసినప్పటికీ రామారావుకి 28/219 వోట్లు మాత్రమే వచ్చాయి.అలా రామారావు రాజకీయ జీవితం ప్రజానాయకుడి పాత్రతో మొదలై ప్రతి నాయకుడి పాత్రతో ముగిసిపోయింది!

నందమూరి తారక రామారావు తర్వాత 1995 సెప్టెంబర్ 01 మొదలు 2004 మే 13 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.ప్రకాశం పంతులు గారి తర్వాత ఆర్ధిక శాస్త్రం యొక్క శక్తిని తెలుసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే!ప్రకాశం పంతులు గారిలా స్వయాన ఆర్ధికశాస్త్రం చదవలేదు గానీ విషయ పరిజ్ఞానం ఉన్న అధికారులను ఉపయోగించుకుని సరైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చి రామారావు తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కుదేలయిన ఆర్ధిక రంగం కొంత తెరిపిన పడింది.

పార్టీ అంతర్గత విషయాల్లో తప్పులు చేసినప్పటికీ ప్రజాబాహుళ్యం యొక్క అభిమానాన్ని చూరగొన్న దైవసమానుడైన వ్యక్తిని రహస్యకుట్రతో పడగొట్టి అధికారం చేజిక్కించుకున్న వ్యక్తి అలసత్వం చూపించి అభివృద్ధిని చూపించడంలో అపజయం పాలైతే ప్రజలు అంతకు పదింతలు శిక్ష వేస్తారనేది తెలిసిన వాడు గనక 1999 వరకు ఒళ్ళు దగ్గిర పెట్టుకుని పని చేశాడు.ఒకసారి శోష వచ్చి పడిపోయిన దృశ్యం కూడా దినపత్రికలలో చూసినట్టు గుర్తుంది నాకు.1996 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన "జన్మభూమి" మంచి కార్యక్రమమే.ఇందులో స్థానిక పరిపాలనకు సంబంధించిన అంశాలలో ప్రజలని ఇన్వాల్వ్ చెయ్యడం చక్కటి ఆలోచన.1997 సంవత్సరంలో మొదలు పెట్టిన "పచ్చదనం-పరిశుభ్రత" కూడా మంచి కార్యక్రమమే.ముఖ్యమైన అన్ని ఉత్పత్తి రంగాలకీ "self help groups(SHG)" ఏర్పాటు చేసి ప్రోత్సహించడం కూడా బాగుంది.రైతు బజారు, డ్వాక్రా అనేవి కూడా మంచి ఐడియాలే.వీటన్నిటి హడావిడి వల్ల 1999 నాటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి 185/294 అసెంబ్లీ స్థానాలూ 29/42 లోక్ సభ స్థానాలతో కూడిన అద్భుత విజయాన్ని ఇచ్చాయి.

అప్పటి 1999 ఎన్నికల నాడు తెలుగుదేశం మళ్ళీ అధికారం దక్కించుకుంది.తెలుగుదేశం రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 43.87% సంపాదించుకుని పోటీ చేసిన 269 స్థానాలకు 180 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 35.61% సంపాదించుకుని పోటీ చేసిన 293 స్థానాలకు 91 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 3.67% సంపాదించుకుని పోటీ చేసిన 24 స్థానాలకు 12 స్థానాలను దక్కించుకుంది.

అయితే, ఇంత అద్భుతమైన విజయం తర్వాత బహుశా ఓటమి భయం తగ్గి ఖర్మ కొద్దీ నెత్తిన పడ్డాయన్నట్టు అతుక్కున్న నాయకత్వ లక్షణం, పరిపాలనా దక్షత వంటి ఉన్నత గుణాలు వూడిపోయాయి కాబోలు 2004 నాటి ఎన్నికలు 47/294 అసెంబ్లీ సీట్లనీ 05/42 లోక్ సభ సీట్లనీ మాత్రమే ఇచ్చేసరికి అశ్శరభ తశ్శరభ అంటూ తను నిద్రపోకుండా అధికారుల్నీ నిద్రపోనివ్వకుండా పడిన కష్టం సాంతం బూడిదలో పోసిన పన్నీరు చందం అయిపోయింది.

సాధించిన విజయాలు తక్కువవీ చిన్నవీ కావు.1995-1996 నాడు మూసివేతకి దగ్గరైన సింగరేణి కాలరీస్ సంస్థని లాభాల బాట పట్టించి దాని పరువు నిలబెట్టాడు!మొట్ట మొదటి సారి తన స్వంత ప్రజ్ఞని మాత్రమే చూపించి కేంద్రం పూచీకత్తు లేని Rs 2,200 Cr ఋణాన్ని World Bank నుంచి తెచ్చాడు!1992-1994 నాటికి నష్టాల్లోనూ లోటులోనూ ప్రావీణ్యాత్లోనూ అధమ స్థాయికి చేరి కునారిల్లుతున్న Andhra Pradesh State Electricity Board (APSEB) సంస్థని కేవలం అయిదేళ్ళు గడిచేసరికి cost and quality విషయాల్లో world class స్థాయికి చేర్చాడు!1998 నవంబర్ నాడు అటల్ బిహారీ వాజపేయి చేతుల మీద HITEC Cityకి అంకురార్పణ చేసి పెంచి పెద్ద చేసి హైదరాబాద్ నగరాన్ని సాటిలేని landmark కింద నిలబెట్టాడు!1999లో హైదరాబాదు నగరానికి Pharma City/Genome Valley అనే మరొక అద్భుతాన్ని అందించాడు!2001లో "ఈసేవ-మీసేవ" అన్నాడు!2003లో అప్పటి వరకు విడి విడి రవాణా వ్యవస్థలైన రైళ్ళనీ బస్సుల్నీ కలుపుతూ హైదరాబాదు నగరానికి multi-modal transport system (MMTS) విధానం ఏర్పాటు చేశాడు!ఇన్ని సంచలన విజయాలు సాధించినప్పటికీ అంత దయనీయమైన ఓటమి ఎందుకు ప్రాప్తించింది?

అప్పటి 2004 ఎన్నికల నాడు కాంగ్రెసు మళ్ళీ అధికారం దక్కించుకుంది.తెలుగుదేశం రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 37.59% సంపాదించుకుని పోటీ చేసిన 267 స్థానాలకు 47 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 38.56% సంపాదించుకుని పోటీ చేసిన 234 స్థానాలకు 185 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 2.63% సంపాదించుకుని పోటీ చేసిన 27 స్థానాలకు 2 స్థానాలను దక్కించుకుంది. రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాటు చేసుకున్న వామపక్షాలూ తెలంగాణా రాష్ట్ర సమితీ 15/26, 26/54 సీట్లు సాధించాయి.

ఒకసారి ఎన్నికల ఫలితాల విహంగ వీక్షణ చేసి చూస్తే తెలుగుదేశం అధ్యక్షుడు ప్రజల ఆకాంక్షలకీ తన అపురూప విజయాలకీ పొంతన లేకపోవడాన్ని గమనించే ప్రయత్నం చెయ్యకపోవడం అనేది ఎంత తప్పో తెలుస్తుంది.చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలను పసికట్టిన కాంగ్రెసులోని నిత్య అసమ్మతి వాది యె.సం.రాజశేఖర రెడ్డి గారు 2003 ఏప్రిల్ 09 పాదయాత్ర అని పిలుచుకునే "ప్రజా ప్రస్థాన యాత్ర" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుంచి మొదలై రంగా రెడ్డి, మెదక్, నిజామాబద్, కరీమ్నగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం తదాది 11 జిల్లాలను దాటుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద 2003 జూన్ 15 ఆగింది, మొత్తం నడిచినది 1,475 Kms!చంద్రబాబు నాయుడు గారు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ భయంకరమైన అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.మీదు మిక్కిలి ఎన్నికల వేళకు భారతీయ జాతీయ కాంగ్రెసు పార్టీ, భారత్ జాతీయ కమ్యూనిష్టు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిశారు.అభిమానులూ ప్రచార కర్తలూ రాజశేఖరరెడ్డి గారిలోని ఫ్యాక్షనిస్టుని సూపర్ మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

తర్వాతి 2009 ఎన్నికల నాడు కూడా కాంగ్రెసు మళ్ళీ అధికారం దక్కించుకుంది.తెలుగుదేశం రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 28.12% సంపాదించుకుని పోటీ చేసిన 225 స్థానాలకు 92 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 36.55% సంపాదించుకుని పోటీ చేసిన 294 స్థానాలకు 156 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 2.84% సంపాదించుకుని పోటీ చేసిన 271 స్థానాలకు 2 స్థానాలను దక్కించుకుంది.All India Majlis-e-Ittehadul Muslimeen రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 0.83% సంపాదించుకుని పోటీ చేసిన 8 స్థానాలకు 7 స్థానాలను దక్కించుకుంది.

రాజశేఖర రెడ్డి గారి మొదటి విడత పాలనలో రెండవ సారి గెలిచేటంత అద్భుతమైన విజయాలు ఏమున్నాయి?మొదటి రోజైన 2004 మే 14నే free electricity for farmers ప్రాజెక్టును మొదలు పెట్టారు.కానీ, తర్వాత ఆర్ధిక మంత్రి రోశయ్య గారు గట్టి వ్యతిరేకతను వ్యక్తం చెయ్యడంతో ఆగిపోయింది.బీదలకు ఆరోగ్య భీమా ఇవ్వడానికి ఉద్దేశించిన ఆరోగ్య శ్రీ మధ్యలో కొంతకాలం అవినీతి రోగం వచ్చిందనే విమర్శలు వచ్చినప్పటికీ రాజశేఖరరెడ్డి గారి చిత్తశుద్ధి వల్ల మెరుగుపడి ఆయనకి ఎనలేని కీర్తి ప్రతిష్ఠల్ని తెచ్చిపెట్టింది.అది ఒక్కటి తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ అత్యంత దారుణమైన పెర్ఫామెన్సు రెడ్డి గారిది.

రాజశేఖరరెడ్డి గారి పరిపాలనలో ప్రపంచ స్థాయి సంచలనానికి కారణమైనది సత్యం ఫ్రాడ్ కేసు.ఫ్యాక్షన్ హత్యల విషయానికి వస్తే 2005 జనవరి 24 జరిగిన పరిటాల రవీంద్ర హత్య చాలా ప్రముఖమైనది.ఇతర నేరాలకు సంబంధించి చూస్తే 2007 డిసెంబర్ 27 ఆయెషా మిరాన్ అనే ముస్లిం బాలిక మానభంగానికీ హత్యకీ గురయిన సంఘటన పరమ భయానకమైనది.సత్యం బాబు నిర్దోషి అనీ అసలు దోషి రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో డెపుత్య్ ఛిఎఫ్ ంఇనిస్తెర్ అయిన కోనేరు రంగారావు గారి బంధువనీ ఆయేషా తలిదండ్రులు మొదటినుంచి చెప్తూనే ఉన్నప్పటికీ ఒక మొబైల్ ఫోను చొరీ కేసులో తమకు దొరికిన సత్యంబాబుని నిర్దోషి అని తెలిసి కూడా నేరస్థుడి కింద ఫిరాయించేసిన పోలీసుల్ని ఏమనాలి?తెలిసి తెలిసీ అన్యాయమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్ని ఏం చెయ్యాలి!ఒకసారి ఆయేషా తల్లి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారిని కలిసి న్యాయం చెయ్యమని కాళ్ళమీద పడి వేడుకుంటే కాళ్ళతోనే పక్కకి విదిల్చి వెళ్ళిపోయారట మండు వేసవిలో వర్షాల్ని కురిపించగలిగిన మహత్యాలు గల దేవుడి లాంటి ముఖ్యమంత్రి గారు!

2008లో రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు Krishna Nagar ప్రాంతంలోని 475 square yards వైశాల్యం గల స్థలంలో ఒక ఇల్లు కట్టుకుంటే 2010లో నీరజా రావు అనే ఒక మహిళ స్థలం తన తండ్రి పేరున రిజిస్టర్ అయిన భూమి అనీ రవీంద్రనాథ్ రెడ్డి గారిది కాదనీ ఆరోపిస్తూ న్యాయపోరాటం చేసి 2013 నాటికి కోర్టు తీర్పు ప్రకారం రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు Krishna Nagar ప్రాంతంలోని 475 square yards వైశాల్యం గల స్థలంలో కట్టిన అక్రమ కట్టడాన్ని GHMC అధికారుల చేతనే కూల్చి వేయించింది.

అప్పుడు నీరజా రావు ఉన్న సామాజిక ఆర్ధిక స్థాయిలోనే ఉన్న తండ్రీ కొడుకుల అభిమానులు విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు కబ్జా చేస్తే ఆనందించి కోర్టు నీరజా రావుకి అనుకూలమైన తీర్పు ఇస్తే దుఃఖించి వాళ్ళు సైతం "అది చంద్రబాబు యొక్క వ్యవస్థల్ని మ్యానేజి చెయ్యగల చాణక్యానికి ఉదాహరణ" అంటూ తమ నాయకుణ్ణి సమర్ధించుకున్నారు. బహుశః విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు నీరజా రావు ఇంటికి బదులు తమ ఇంటిని కబ్జా చేస్తే తమ దేవుడికి ఉపయోగపడగలిగినందుకు ఆనంద పడతారు కాబోలు!

ఇవన్నీ రహస్యమైన సన్నివేశాలు కావు, బహిరంగమైనవే - అందరికీ ఇవి జరిగాయని తెలిసేటంత సంచలనం పుట్టింది.వీటన్నిటి కంటె రాజశేఖర రెడ్డి గారు కాన్స్టాంటినోపుల్ తర్వాత అంతటి హద్దులెరుగని స్థాయిలో క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత, ఆధునిక సెక్యులరిస్టు సిద్ధాంతం అమలులోకి వచ్చిన తర్వాత సెక్యులర్ చట్రాన్ని బద్దలు కొట్టి మరీ క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత అన్న ఖ్యాతిని గడించారు.2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు నదురూ బెదురూ లేని స్థాయిలో క్రైస్తవీకరణని ప్రోత్సహించారు.అప్పటివరకు హిందూ ముఖ్యమంత్రుల కాలంలో అణిగిమణిగి పడివున్న పాస్టర్లు క్రైస్తవుడైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వ్యాపించే వేగాన్ని పెంచారు - వాళ్ళ బైబిలు చెప్తున్న "దేవుడి రాజ్యం" అనేదాన్ని రాజశేఖర రెడ్డి గారి పాలనకి మారుపేరు చేసేశారు.పిచ్చి హిందువులు వాళ్ళు రామరాజ్యం గురించి చెప్తున్నారనుకుని మోసపోయారు.

2006 August నెలలో GO MS. No: 21 విడుదల చేసి Rs. 80, 000/- ప్రభుత్వ ధనాన్ని చర్చిల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు.Deccan Chronicle తన 2006 August 23నాటి సంచికలో "CM Reddy okays public money for churches" అనే వార్త వేసింది కూడాను.ఇదే ఆజ్ఞలో కొత్త చర్చిలు కట్టుకోవాలనుకునే వారికి ఒక్కో చర్చికీ 1.5 lakhs కేటాయించాలనే ఆదేశం కూడా ఉంది.ప్రభుత్వానికి అవసరమైన నిధుల కోసం సుమారు Rs.20,000 చ్రొరెస్ విలువ గల 7000 ఎకరాల విస్తీర్ణం ఉన్న హిందూ ఆలయ భూముల్ని అమ్మేశారు.వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడమే కాక కొన్నింటిని పాస్టర్లు ఆక్రమించుకుంటున్నప్పటికీ చూసీ చూడనట్టు ఉండిపోయారు.ఒక్క 2004 నుంచి 2009 మధ్య వేల సంఖ్యలో కొత్త చర్చిలు కట్టేశారు.ప్రతి ఏడుగురు క్రైస్తవులకీ ఒక చర్చి ఉండాలనే లెక్క చొప్పున 1,48,000 చర్చిలు తయారయ్యాయి!మరి, హిందూ ఆలయాలు?ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ అప్పటికి ప్రతి 350 మంది హిందువులకీ ఒక ఆలయం చొప్పున కట్టినట్టు 1,90,000 మాత్రమే ఉన్నాయి.

చర్చి నిర్మాణం కోసం ఉద్దేశించిన నిబంధనలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ చర్చిని నిర్మించటం అంత సులభమైన వ్యవహారం కాదని అనిపిస్తుంది.

చర్చి అయితే నిర్మిస్తున్నారో దాని తాలూకు వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి.

నిర్మించదలచిన చర్చి కోసం ముందుగా ఒక కమిటీ వేయాలి..

కమిటీలో క్రింది వారు సభ్యులుగా ఉండాలి 👇👇

👉 ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ - చర్చి కమిటీ అధ్యక్షుడు.

👉 మున్సిపల్ ఇంజనీరు - కమిటీ సభ్యుడు.

👉చర్చి పాస్టర్ - కమిటీ సభ్యుడు.

👉 చర్చి కమిటీలో మరో ఇతర ప్రభుత్వ అధికారి సభ్యుడిగా ఉండాలి.

కమిటీ ఏర్పాటు అయ్యాక కలెక్టర్ అనుమతి కోసం క్రింది పత్రాలు సమర్పించాలి.

చర్చి పేరు, చిరునామా

చర్చి పాస్టర్ పేరు, చిరునామా

చర్చి కమిటీ సభ్యుల వివరాలు

చర్చి నిర్మాణం జరపదలచిన స్థలం తప్పనిసరిగా చర్చి పేరిట రిజిస్టర్ అవ్వాలి.

(ఒకవేళ ఆలా రిజిస్టర్ అవ్వకపోతే అందుకు కారణాలు స్పష్టంగా పేర్కొనాలి.)

లోకల్ మున్సిపాలిటీ అప్రూవ్ చేసిన చర్చి నిర్మాణం యొక్క ప్లాన్

లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా తయారుచేసిన చర్చి నిర్మాణం యొక్క ఖర్చుల estimation

estimation కాపీ మీద మండల మున్సిపల్ ఇంజనీరు సంతకం

చర్చి యొక్క సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ

తమకు విదేశీ నిధులు రావట్లేదంటూ చర్చి పాస్టర్ తన లెటర్ హెడ్ మీద రాసిచ్చిన డిక్లరేషన్

ఒకవేళ ప్రభుత్వం నుండి నిర్మాణానికి గత 05 ఏళ్లలో ఏవైనా నిధులు వచ్చి ఉంటే వివరాలు

చర్చీ నిర్మాణం జరిగే గ్రామం యొక్క మొత్తం జనాభా

చర్చి నిర్మాణం జరిగే గ్రామంలోని క్రైస్తవ జనాభా, అప్పటికే ఉన్న ఇతర చర్చీల వివరాలు

డాక్యుమెంట్లతో పాటు ముఖ్యమైనది చుట్టుప్రక్కల నివసించే వారి నుండి No_Objection సర్టిఫికెట్.అన్నీ ఉండి ఒక్క సర్టిఫికెట్ లేకపోతే మాత్రం చర్చికి అనుమతి రాదు.

 

ఇంత తతంగం ఉన్నప్పటికీ పుట్టగొడుగుల్లా కొత్త చర్చిలు పుట్టుకొస్తున్నాయంటే ప్రభుత్వాధినేతలు ప్రోత్సహించడం వల్లనే కదా!ఇంకో వైపున 30,000 హిందూ ఆలయాల నుంచి ఎంతో ఎక్కువ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ చట్టాలలో వాటి ఆదాయం నుంచి వాటి పోషణకు తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ అది జరగలేదు.అంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హిందూ మతాన్ని తగ్గించి క్రైస్తవ మతాన్ని పెంచాలనుకున్నట్టు అర్ధం కావడం లేదూ! వీటన్నింటి వల్ల 2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు చెప్పుకున్నారు.అప్పుడు హిందూత్వ పరిరక్షకులు ఎక్కడున్నారు?ఏమి చేస్తున్నారు?తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారు!

వాస్తవానికి 2014 నాటి తెలంగాణ ఏర్పాటుకు దారి తీసిన ఆంధ్రప్రదేశ్ విభజన వెనక ఉన్నది మతపరమైన కారణమే!"ఒక వోటు, రెండు రాష్ట్రాలు!" అనే నినాదంతో అనుకుంటాను 1997లో మొదట BJP రాష్ట్ర శాఖ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.2000 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు Telangana Congress Legislators Forum అనే సంస్థను స్థాపించి దాని తరపున తమ పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీకి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు.2001 ఏప్రిల్ 27 Kalvakuntla Chandrashekar Rao (KCR) గారు Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

తెలంగాణ ఉద్యమం అనేది భాజపా వాళ్ళకి అవాసరమా?హైదరాబాదు పాత బస్తీ దాటి కదలని ఒవైసీలు 8కి 7,10కిస్థానాలను గెలుస్తుంటే 27కీ 2, 270కీ 2 వస్తుంటే సిగ్గు కూడా లేని మందకి తెలంగాణ ఏర్పాటు కోసం అంత ఆతురత దేనికి వచ్చింది?స్వతంత్ర తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 1997లో మొదట తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసిన BJPకి చెవుల్లో పువ్వులు పెట్టి 2000 సంవత్సరంలో తెలంగాణ కోసం సంకల్పించిన కాంగ్రెసుకు సుంతీ చేసి 2001 మొదలు 2014 వరకు అంత భీకరమైన పోరాటం చేసిన TRSkకి అత్తెసరు మెజార్టీ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏమిటి?2014లో కూడా లాభసాటి కాని దాని కోసం ఒకరు 1997లోనూ ఇంకొకరు 2000లోనూ మరొకరు 2001లోనూ ఎందుకు ప్రయత్నం చేశారు?తెలంగాణ ప్రజలలో ఉన్న న్యాయమైన అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చటానికే అసమర్ధులైన వీళ్ళు తెలంగాణ ప్రజలలో లేని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటానికి అంత సమర్ధత ఎట్లా చూపించగలిగారు?

ఎన్నికల సమయానికి మాతృరాష్ట్రం విడిపోలేదు గాబట్టి అప్పటి 2014 ఎన్నికల నాడు తెలుగుదేశం రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 32.53% సంపాదించుకుని పోటీ చేసిన 237 స్థానాలకు 117 స్థానాలను దక్కించుకుంది.భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 11.71% సంపాదించుకుని పోటీ చేసిన 286 స్థానాలకు 21 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 4.13% సంపాదించుకుని పోటీ చేసిన 58 స్థానాలకు 9 స్థానాలను దక్కించుకుంది.All India Majlis-e-Ittehadul Muslimeen రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 1.52% సంపాదించుకుని పోటీ చేసిన 35 స్థానాలకు 7 స్థానాలను దక్కించుకుంది.YSR Congress Party రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 27.88% సంపాదించుకుని పోటీ చేసిన 266 స్థానాలకు 70 స్థానాలను దక్కించుకుంది.Telangana Rashtra Samithi రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 13.68% సంపాదించుకుని పోటీ చేసిన 119 స్థానాలకు 63 స్థానాలను దక్కించుకుంది. అయితే వీటిని విడిపోయిన రెండు రాష్ట్రాల మధ్యన చీల్చితే ఆంధ్రలో తెలుగుదేశం 102 స్థానాలను దక్కించుకుంది.YSR Congress Party  21 స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 4.13% సంపాదించుకుని పోటీ చేసిన 58 స్థానాలకు 9 స్థానాలను దక్కించుకుంది.

రాష్ట్రాన్ని రెండు ముక్కల కింద విడగొట్టాక ఆయా పార్టీల స్థానాలను కూడా చీల్చితే పరిస్థితి ఇట్లా ఉంది.ఆంధ్రలో 102 స్థానాలతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.YSR Congress Party 67 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చంది.భారతీయ జనతా పార్టీకి 4 సీట్లే దక్కాయి. మాతృరాష్ట్రం చీలక ముందు జరిగిన 2014 నాటి ఎన్నికల వరకు ఆ ఫలితాలు అలా ఎందుకు వచ్చాయనేది తెలుస్తూనే ఉంది గానీ మొన్నటి 2019 నాటి ఫలితం మాత్రం హేతువుకు అందని వింత!

2019 ఎన్నికల నాడు YSR Congress Party అధికారం దక్కించుకుంది.తెలుగుదేశం రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 39.17% సంపాదించుకుని పోటీ చేసిన 175 స్థానాలకు 23(102 -79) స్థానాలను దక్కించుకుంది.YSR Congress Party రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 49.95% సంపాదించుకుని పోటీ చేసిన 175 స్థానాలకు 151(67+84) స్థానాలను దక్కించుకుంది.భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 0.84% సంపాదించుకుని పోటీ చేసిన 175 స్థానాలకు 0 స్థానాలను దక్కించుకుంది.

దాదాపు ప్రతి ఎన్నికలోనూ ప్రతి రాజకీయ పార్టీ గెలుపు కోసమే ప్రయత్నిస్తుంది, గెలుస్తామనే ఆశిస్తుంది, గెలిస్తే సంబరాలు చేసుకుంటుంది,ఓడితే ఎదిరి పక్షం మోసం చేసిందంటుంది.కానీ, ఆంధ్రలో జగనూ తెలంగాణలో నేనూ ముఖ్యమంత్రులం అవుతాం అని కేసీయారు బల్ల గుద్ది చెప్పినప్పటికీ 2014 నాడు 67 స్థానాలను మాత్రమే తెచ్చుకోగలిగినవాడు కేవలం అయిదేళ్ళు గడిచేసరికి 151/175 స్థానాలు గెలవడానికి జగన్మోహన రెడ్డి యొక్క వ్యక్తిత్వంలో గానీ చరిత్రలో గానీ వ్యూహాలలో గానీ ఏ అంశం పని చేసిందన్నది ఆ పార్టీని సమర్ధించేవారికే కాదు వ్యతిరేకించేవారికి సైతం అంతుపట్టడం లేదు - ఇప్పటికీ!

అలాగే, మొత్తం తెలంగాణ ఉద్యమంలోని ప్రతి మలుపులోనూ ప్రతి నాయకుడూ ప్రతి విశ్లేషకుడూ తెలంగాణ అనివార్యం అనే స్థాయిలో పెరిగిన  ప్రాంతీయ అసమానతలకు అతడే కారణం అని చిత్రించి "రెంటికీ న్యాయం చెయ్యండి" అనే అత్యంత న్యాయమైన అభ్యర్ధనను కూడా అవహేళన చేసి ఇక చంద్రబాబుని భూస్థాపితం చేసేశాం అని శత్రువులు సంబరపడుతున్న సమయంలోనే 102 సీట్లు తెచ్చుకోగలిగినవాడు కేవలం అయిదేళ్ళు గడిచేసరికి 23/175 స్థానాలకు దిగజారడానికి చంద్రబాబు వ్యక్తిత్వంలో గానీ చరిత్రలో గానీ వ్యూహాలలో గానీ ఏ అంశం పని చేసిందన్నది ఆ పార్టీని వ్యతిరేకించేవారికే కాదు సమర్ధించేవారికి సైతం అంతుపట్టడం లేదు - ఇప్పటికీ!

అమరావతికి, 2015 అక్టోబర్ 22 భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శంకుస్థాపన జరిగింది.అప్పుడే అమరావతిని ప్రపంచ స్థాయి నగరం కింద తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని వివరిస్తే అతిధులు ఆనందించి ఆశీస్సులు ఇచ్చారు.ఏప్రిల్ 2016 నాటికి చంద్రబాబు అమరావతి పక్కనున్న వెలగపూడి నుంచే పరిపాలన మొదలుపెట్టాడు.మార్చి ఇరవయ్యేడుకల్లా లెజిస్లేచర్ అసెంబ్లీ భవనం పూర్తయ్యింది.అక్టోబరు నాటికి ఉన్నతాధికారులు తమ శాఖలలో కూర్చుని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.కేవలం ఒక్క సంవత్సరంలోనే ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ, నిక్కచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భౌతికపరమైన శరీరం అనదగ్గ అన్ని మంత్రిత్వ శాఖలూ వెలగపూడిలో కనిపిస్తున్నాయి.అప్పటికే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయ్యింది.

అయితే ఇది ప్రపంచస్థాయి రాజధాని కాదు కదా, తాత్కాలిక నిర్మాణాలని చూపిచటం మోసం చెయ్యటమే కదా అనేవాళ్ళకి ఒకటే జవాబు - ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రిటైరయ్యాక తన కలల భవంతిని నిర్మించుకోవాలంటే శంఖుస్థాపాన చేసిన వెంటనే గృహ ప్రవేశం చెయ్యలేడు కదా, మరి ఆలోపు అతను ఆరుబయట ఉండలేడు కదా, తను కట్టుకోబోయే ఇంటికి దగ్గిర్లో ఒక అద్దె ఇంటిని తీసుకుని సర్దుకుపోవడం లేదా!

తాత్కాలిక నిర్మాణాలను ఇలా ఉంచితే అసలైన రాజధానిని నిర్మించడాన్ని ascendas అనే సింగపూర్ సంస్థకి అప్పగించారు.ఇది అర్బన్ డెవలప్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న సంస్థ.ఆరు నుంచి ఏడు సంవత్సరాలలో పూర్తి స్థాయి అమరావతి నగర నిర్మాణం కోసం టార్గెట్ పెట్టారు.ఆలస్యం జరిగితే కంపెనీ మనకి నష్టపరిహారం ఇచ్చే క్లాజు కూడా చేర్చారు.వీళ్ళు వచ్చి నిర్మాణాలు మొదలుపెట్టారు.చాలా వేగంగానే పనిచేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూనే పోలవరం పనుల్ని వారానికోసారి సమీక్షిస్తూ శరవేగాన నడిపించారు.అది పూర్తవడానికి చాలాకాలం పడుతుంది కాబట్టి మొదట పట్టిసీమని రికార్డు టైంలో పూర్తి చేసి రాయలసీమకి అందించారు.నిలవలో వచ్చిన రాష్ట్రం కాదు.అక్షరాల 73, 856 కోట్ల అప్పుతో విడిపోయింది.ప్రత్యేక హోదా ఇవ్వలేదు.తనే పూనుకుని ప్యాకేజీ తయారు చేస్తే బాబు-జైట్లీ-ప్లాను అని పేరు తగిలించుకున్నారు గానీ దాని ప్రకారం నిధులు ఇవ్వటానికి మాత్రం రోజుకోసారి యేడ్చి చచ్చారు, వాళ్ళ బాబుగాడి ముల్లె యేదో వాళ్ళ సొంత జేబుల్లోనుంచి తీసి ఇస్తున్నట్టు పూటకోసారి లెక్కలు అడిగారు.

2014 నుంచి 2019 మధ్య అయిదేళ్ళలోనే SRM University, VIT AP,AMITY UNiversity,Amriita University వంటి ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయి,స్థలాలు కొనుక్కున్నాయి, భవనాలు కట్టుకున్నాయి, పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా మొదలుపెట్టాయి.ఇంక అమరావతి అనంతపూర్ హైవే, దీన్ని క్రాస్ చేస్తూ కడప కర్నూలును కలుపుతూ వెళ్ళే ఫీడర్ వే - విల్లునుంచి ఎక్కుపెట్టిన బాణంలా ఉండి 16 జాతీయ రహదారితో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాలను కలిపేస్తున్న పనులు మొదలయ్యాయి.ఇది హైదరబాదులోని ఔటర్ రింగు రోడ్డుకి బాబు లాంటిది!

ఇవన్నీ పక్కాగా జరగాలి కాబట్టి Norman Fostar అనే సంస్థనీ Haffez Contractor అనే సంస్థనీ NRDC అనే సంస్థనీ సంప్రదించి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు అప్పగించారు.వీటిలో వేటిలోనూ A1, A2 స్థాయి నేరచరిత్ర ఉన్నవారు లేకపోవడం వల్లనే ప్రస్తుత ప్రభుత్వానికి ఆయా కంపెనీల పట్ల అంత వ్యతిరేకత వస్తున్నదేమో మరి!ఇక అమరావతి రైల్వే స్టేషనును గుంటూరు, తెనాలి, విజయవాడ  వంటి ప్రముఖమైన రైల్వే స్టేషన్లకు అనుసంధానించే ప్రాజెక్టు కూడా మొదలైంది - దీనికయ్యే ఖర్చు పదివేల కోట్లు, సెంట్రల్ గవర్నమెంటుతో మాట్లాడి ఒప్పించి పనులు మొదలు పెట్టారు.

కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ బ్రాంచీల్ని ఇక్కడ తెరిచాయి.వీటిలో ప్రముఖమైన వాటిని మాత్రమే నేను చెప్తున్నాను.మొత్తం చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది.Pi Data centre - ఇది ఆయియా ఖండంలోనే నాల్గవ ర్యాంకులో ఉన్న అతి పెద్ద ఫెసిలిటీ సెంటర్ - అమరావతిలో తమ సంస్థను పెట్టడానికి వాళ్ళు 600 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధపడ్డారు!HCL - భారతదేశంలో అతి పెద్ద కంప్యూటర్ సంబంధిత సేవలు అందిస్తున్న కంపెనీ - అమరావతిలో క్యాంపస్ పెట్టడానికి భూమిని కొన్నారు!BRS Medicity - 1.8 మిలియన్ డాలర్లు అమరావతిలో తమ సంస్థను పెట్టడానికి కేటాయించుకున్నారు, ప్రభుత్వం స్థలం ఇచ్చింది, పనులు చేస్తూ కొనసాగుతున్నారు!ఇదీ 2014 నుంచి 2019 మధ్య అయిదేళ్ళలో ప్రపంచ స్థాయి గల ప్రముఖ వాణిజ్య సంస్థలు అమరావతిని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అని గురించి చూపిస్తున్న నమ్మకంతో కూడిన అభిమానం.

అమరావతి అనే ప్రాజెక్టు విలువ 33,000 కోట్లు.HUDCO సంస్థ 7500 కోట్లు పెట్టుబడి పెట్టింది.ప్రపంచ బ్యాంకు కూడా తన వంతు సహాయం కింద 300 మిలియన్ల USD పెట్టుబడి పెట్టింది.కేంద్రం కూడా ముందుకు వచ్చి 2500 కోట్ల వరకు నిధులు కేటాయించింది, అందులో 1500 కోట్లు గ్రాంటు కింద విడుదల కూడా చేసింది.ఇక రాష్ట్రప్రభుత్వం తన వంతు 500 కోట్లను ఇందులో పెట్టింది.ఇది జమాఖర్చుల వివరం అయితే ఆకారం ఎలా ఉంటుందో చూస్తే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన రాజధాని నగరం ఇంకెక్కడా లేదనిపించేటట్టు ప్లాన్ చేశారు.అమరావతి అనేది ఒక నగరం కాదు, తొమ్మిది నగరాలతో కూడిన మహేంద్రనగరం!

Sports City, Media City, Health City, Justice City, Finance City, Tourism City, Knowledge City, Electronics City వంటి స్వయం నిర్ణయాత్మక శక్తి కలిగినవి, మొత్తం రాష్ట్రానికి తేజస్సునీ ఓజస్సునీ రాజసాన్నీ గర్వాన్నీ ఇవ్వగలిగినవి, దేవసభలోని ఐరావతాలతో మాత్రమే పోల్చగలిగినవి - వికసిత మానవాత్మలు నిత్యం ప్రఫుల్ల వదనాలతో సంచరించే కల్పవృక్షాలు అవి!ఆరోగ్యం అనగానే గుర్తొచ్చే మెడికల్ కాలేజిలు, అన్ని రకాల సౌకర్యాలూ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్, పిలవగానే "కుయ్యి కుయ్యి"మంటూ వచ్చే ambulance సౌకర్యాలు - అన్నింటినీ ఒకచోట చేరిస్తే సాధారణం నుంచి అత్యవసర వైద్యసేవల్ని ఎంత త్వరగా అందించవచ్చునో వూహించుకోండి.ఇప్పటివరకు రాజధానులను నిర్మించినవారిలో ఎవరికీ ఇలాంటి వూహయే రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు - పూర్తయిన అమరావతిలో నివసించడానికి ఎంతో అదృష్టం కావాలని అనిపిస్తుంది ఇందులో ఇమిడ్చిన అంశాలను చూస్తే! ఇరుగువాళ్ళ పొరుగువాళ్ళ అక్కడివాళ్ళ ఇక్కడివాళ్ళ ఈర్ష్యాదృష్టులు తగిలి అంత గొప్ప నగరంలో నివసించే అదృష్టం ఆంధ్రులకు లేకనే చంద్రబాబు నాయుడు గారు వోడిపోయి జగన్మోహన రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారేమో అనిపిస్తున్నది నాకు!

వీటన్నిటినీ మించి రాజకీయ విశ్లేషకుల మతులను పోగొడుతున్న మరొక వింత, పుట్టిన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆటలో అరిటిపండులా ఉన్నప్పటికీ 1980 నుంచి 2014 వరకు ఎంతో గౌరవప్రదమైన రాజకీయ సంస్కృతిని ప్రదర్శించిన భారతీయ జనతా పార్టీకి చెందిన స్థానిక నేతలు అప్పటినుంచే అత్యంత నీచమైన ధోరణిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు?

ప్రశ్నకు జవాబును తెలుసుకోవాలంటే ఆంధ్ర నుంచి మన దృష్టిని జాతీయ స్థాయికి విస్తరించాలి.ఆంధ్రలో 1983 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 2.76% సంపాదించుకుని పోటీ చేసిన 81 స్థానాలకు 3 స్థానాలను,1984 ఎన్నికల నాడు మొత్తం పోలయిన వోట్లలో 2.2 % సంపాదించుకుని 1/42 లోక్ సభ స్థానాల ప్రాతినిధ్యం, 1989 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 1.78% సంపాదించుకుని పోటీ చేసిన 12 స్థానాలకు 5 స్థానాలను, 1994 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 3.89% సంపాదించుకుని పోటీ చేసిన 280 స్థానాలకు 3 స్థానాలను, 1999 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 3.67% సంపాదించుకుని పోటీ చేసిన 24 స్థానాలకు 12 స్థానాలను, 2004 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 2.63% సంపాదించుకుని పోటీ చేసిన 27 స్థానాలకు 2 స్థానాలను, 2009 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 2.84% సంపాదించుకుని పోటీ చేసిన 271 స్థానాలకు 2 స్థానాలను, 2014 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 4.13% సంపాదించుకుని పోటీ చేసిన 58 స్థానాలకు 9 స్థానాలను, 2019 ఎన్నికల నాడు రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 0.84% సంపాదించుకుని పోటీ చేసిన 175 స్థానాలకు 0 స్థానాలను దక్కించుకుని CPI,CPM,MIM,PRJ,JNS వంటి చిన్న పార్టీల కన్న వెనక నిలబడిన చరిత్ర స్థానిక నాయకుల బద్ధకాన్ని వెక్కిరిస్తున్నట్టు ఉంటే దేశంలో 1984 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 8% సంపాదించుకుని 2 స్థానాలను,1989 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 11% సంపాదించుకుని 85 స్థానాలను, 1991 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 20% సంపాదించుకుని 120 స్థానాలను, 1996 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 20% సంపాదించుకుని 161 స్థానాలను, 1998 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 26% సంపాదించుకుని 182 స్థానాలను,1999 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 24% సంపాదించుకుని 182 స్థానాలను,2004 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 22% సంపాదించుకుని 138 స్థానాలను,2009 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 19% సంపాదించుకుని 116 స్థానాలను,2014 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 31% సంపాదించుకుని 282 స్థానాలను,2019 ఎన్నికల నాడు దేశం మొత్తం పోలయిన వోట్లలో 37% సంపాదించుకుని 303 స్థానాలను దక్కించుకున్న చరిత్ర జాతీయ నాయకుల సమర్ధతను ప్రశంసిస్తున్నట్టు నడుస్తున్నది.

నిజానికి ఎన్నికల విశ్లేషణ అస్సలు రుచించని మనస్తత్వం నాది." ఎన్నికలో ఎవరు గెల్చారు? ఎన్నికలో ఎవరు గెలుస్తారు?" అనేది జూదరులు పందేలు వేసుకోవటానికి తప్ప ఇంకెందుకూ పనికి రాకూడదు, కానీ ఇవ్వాళ అందరికీ అవే సమస్తం అయ్యాయి.ప్రజలకి మంచి పరిపాలన అందాలంటే ప్రజల్లో పాతుకుపోయిన జూదరుల మనస్తత్వం పోయి గెల్చినవాళ్ళని తమకు మంచి పరిపాలన అందించేలా వొత్తిడి చెయ్యాలి.సరే, ఇప్పుడు వీటి గురించి లెక్చర్లు దంచటం అనవసరం గానీ  మన ప్రశ్నకు సమాధానం దొరికేసింది, చూడండి!

జాతీయ స్థాయి నాయకత్వం 2 నుంచి 303 వరకు పార్టీని నడిపించటం నల్లేరు మీద బండి నడకలా సాగిన సుఖ ప్రయాణం కాదు - ఆనాటి రధయాత్ర మొదలు ఈనాటి రామమందిర శిలాన్యాసం వరకు ఎదురైన ప్రతి సన్నివేశంలోనూ ప్రతికూలతలను సైతం అనుకూలతల కింద మార్చుకున్న పోరాట పటిమ సాధించిన, సాధిస్తున్న విజయ పరంపర అది! అలాంటిది, అదే ఆశయాలతో నడవాల్సిన ఆంధ్ర రాష్ట్రపు ప్రాంతీయ నాయకత్వం రామారావుకు జాతీయ స్థాయిలో సహకారం అందించి రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థానాలను గెల్చుకున్న నాటినుంచి 2019 వరకు ఎన్ని అవకాశాలను ఆ పార్టీ చేజార్చుకుందో తెలుసా!తమకు రాష్ట్రంలో కొంత గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చినప్పటికీ అతని స్వయంకృతమైన ఒంటెత్తు పోకడతో తప్పులు చేసి అల్లుడి చేతిలో పరాభూతం అవుతున్నప్పుడు అతని స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించలేదు!చంద్రబాబును కూలదోసి రాజశేఖరెడ్డి వస్తున్నప్పుడు కూడా ప్రేక్షకపాత్ర వహించారు తప్పితే అధికారం చేజిక్కించుకోవటానికి ఆత్రుత చూపించలేదు!రాజశేఖర రెడ్డి దుర్మార్గపు పాలన మీద వ్యతిరేకతని చూపించలేదు. అంతే గాక, అతని అధ్వర్యంలో జరుగుతున్న అధికారికమైన క్రైస్తవీకరణను అసలు గమనించనే లేదు!

"2014 నాటి తెలంగాణ ఏర్పాటుకు దారి తీసిన ఆంధ్రప్రదేశ్ విభజన వెనక ఉన్నది మతపరమైన కారణమే!" అని బల్లగుద్ది చెప్తున్న నాకు అతీతశక్తులు ఏమీ లేవు - షెర్లాక్ హోంస్ లాంటి గూఢచారినీ కాదు.తెలంగాణ ఏర్పడిన మొదటి రోజుల్లోనే హరికాలం బ్లాగు దగ్గిర ఒక ఆజ్ఞాత వ్యాఖ్యాత అదే అభిప్రాయం చెప్తే సాక్ష్యాలు ఉన్నాయా అని నిలదీశాను.సాక్ష్యాలు లేవు గానీ నాకు తెలిసిన కొందరు రాజకీయవాదులు లోపాయకారీ అనుమానాలు వ్యక్తం చేశారు అని అన్నాడు.అప్పటి సంఘటనలు అలా అనుమానించడానికి ఆస్కారం ఇస్తున్నాయి గానీ సాక్ష్యాలు లేనప్పుడు వాటిని భుజాన వేసుకు తిరగడం దేనికని ఎక్కడా ఆ ప్రస్తావన చెయ్యలేదు.కానీ, 2019 తర్వాతనే నుకుంటాను, దేశం మొత్తం మీద జరుగుతున్న క్రైస్తవీకరణ గురించిన ఒక పోష్టు కోసం వెతుకుతుంటే "2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు చెప్పుకున్నారు" అనేది తెలిసి చర్చిల సంఖ్య తెలంగాణ వైపుకన్న ఆంధ్ర వైపునే ఎక్కువని గుర్తొచ్చి "హిందువులు ఎక్కువున్న తెలంగాణను విడదీస్తే ఆంధ్రప్రాంతంలోని క్రైస్తవుల సంఖ్య ఆమాంతం రెండింతలు పైకి లేస్తుంది!" అనేది తళుక్కున మెరిసింది నాకు.మరి, ఎన్నికల్లో గెలుపు కోసం కులాల వారీ సీట్లు కేటాయించడం కోసం ఏ ప్రాంతంలో ఏ కులంవాళ్ళు ఎంతమంది ఉన్నారని కాకి లెక్కలు వేసుకుంటున్నవాళ్ళకి ఇది తెలియకపోవడం విచిత్రం కాదూ!మిగిలినవాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశారో గానీ, జాతీయ స్థాయిలో హిందూత్వ పరిరక్షణ కోసం అంత పోరాటం చేస్తున్న పార్టీ రాష్ట్రంలో వాళ్ళకీ వీళ్ళకీ స్టెపెనీలానూ నిచ్చేనలానూ ఉపయోగపడుతూ "కోడి పోయి కత్తి వచ్చే డండండం!కట్టి పోయి సుత్తి వచ్చే డండండం!" అన్నట్టు వేరే పార్టీలు వాళ్ళలో వాళ్ళు అధికారాన్ని పంచుకుంటుంటే  ఈసారి చాన్సు మనదే ఈసారి చాన్సు మనదే అని లొట్టలేసుకుంటూ గోతికాడి నక్కలా ఎదురు చూస్తూ కూర్చోవడం ఎంత దారుణం!

విజయాన్ని ఆశించే ప్రతి ఒక్కరికీ అనుభవజ్ఞులు "ఒక్క క్షణాన్ని కూడా దుర్వినియోగం చెయ్యకు!" అని నెత్తీ నోరూ కొట్టుకుని చెప్తున్నారే - ఆంధ్ర ప్రాంతపు భారతీయ జనతా పార్టీ నాయకులు అత్యంత సుదీర్ఘమైన ముప్పయ్యయిదేళ్ళ కాలాన్ని ఎట్లా దుర్వినియోగం చేశారు?మానవ జీవితంలోనూ సమాజ గమనంలోనూ ఒక రోజు ఉన్నట్టు మరుసటి రోజు ఉండటం లేదు.నేడు కేంద్రంలో ఉన్న అప్రతిహతమైన అధికారం రేపు ఉంటుందనే నమ్మకం లేదు.పార్లమెంటులో 303/545 మెజారిటీ ఉంది గానీ అది దేశప్రజలు అందరూ కలిసి సమానమైన ఆదరణ చూపించితే వచ్చిన నిజమైన అధికారం కాదు - బలంలా కనబడుతున్న రోగం!

దేశంలోని అన్ని రాష్త్రాలలోనూ కలిపి ఉన్న శాసనసభా స్థానాల సంఖ్య 4036 ఉంటే భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యుల సంఖ్య 1374 మాత్రమే! అంటే రూఢి లెక్క వేస్తే 35 శాతమూ లూజు లెక్క వేస్తే 30 శాతమూ అవుతుంది.మళ్ళీ వీళ్ళలో మధ్య బహరతం నుంచి ఎక్కువ మందీ ఈశానయ్ రాష్ట్రాల నుంచి తక్కువమందీ ఉన్నారు.ఎక్కువ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్,మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్,తమిళనాడులాలో కేవలం తెండు రాష్ట్రాల్లోనే అధొకారంలో ఉన్నారు.బీహారు, నాగాలాండూ మిజోరమూ సంకీర్ణ ప్రభుత్వాలే తప్ప సొంత బలం కాదు.అంటే, దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి పోలవుతున్న వోట్లలో యాభై సాతం ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్,కర్ణాటక, గుజరాత్,రాజస్థాన్ అనే అయిదు రాష్ట్రాల నుంచే వెళ్తున్నాయి.303 లోక్ సభ స్థానాలలో కూడా 90 శాతం కేవల పది రాష్ట్రాలనుంచే వచ్చాయి.

ఇది భారతీయ జనతా పార్టీ చేతిలో చిత్తు చిత్తై కుములుతున్న కాంగ్రెసు యొక్క ఒకప్పటి పరిస్థితికి నకలు లాంటిది.కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో అధికారం లేకపోవడం,రాష్ట్రాల్లో అధికారం  ఉన్నప్పుడు కేంద్రంలో అధికారం లేకపోవటం అనే సమస్యల్ని పదే పదే ఎదుర్కొంటూ ఆ లోపాన్ని సరిచేసుకోలేక అవస్థలు పడుతుండటం వల్లనే భారత జాతీయ కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ చేతిలో చావుదెబ్బ తినాల్సి వచ్చింది.ఇవ్వేళ్టి భారతీయ జనతా పార్టీ నిన్నటి భారత జాతీయ కాంగ్రెసులా ఉన్నప్పుడు రేపటి భారతీయ జనతా పార్టీ ఇవ్వేళ్టి భారత జాతీయ కాంగ్రెసులా ఉండదని గ్యారెంటీ ఏంటి?

పోలవుతున్న వోట్ల శాతం ఎన్నికల్లో గెలుపుని ఇవ్వదు.ఎన్నికల విశ్లేషణ ఇష్తం లేక చెయ్యడం లేదు గానీ ప్రణయ్ రాయ్ కలం నాటి నుంచి ప్రతి ఎన్నికనీ పరిశీలిస్తూనే ఉన్నాను.ప్రతి ఎన్నికకీ "స్వింగ్ ఫ్యాక్టర్" అనేది కీలకం.ఒక ఎన్నిక మొదలు అయ్యే సమయానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఎన్నికలో పాల్గొనే ఒక పార్టీ చేసిన  వాగ్దానాల వరకు ఏది స్వింగ్ ఫ్యాక్టర్ అవుతుందో తెలియదు.ఒక పార్టీ తన విజయావకాశాల కోసం సృష్టించిన స్వింగ్ ఫ్యాక్టర్ ఆ పార్టీకి అపజయాన్ని కూడా తీసుకు రావచ్చు.అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది.భారతీయ జనతా పార్టీ చాలా కాలం క్రితం తనకోసం సృష్టించుకున్న హిందూత్వం అనే స్వింగ్ ఫ్యాక్టర్ ఇప్పటికీ ఆ పార్టీకి అనుకూలంగానే ఉంది.కానీ, ముందుముందు ప్రతికూలం కాదని బల్లగుద్ది చెప్పలేం!డబ్బు తీసుకుని ప్రశాంత్ కిశోర్ చేస్తున్నది తనకు డబ్బిచ్చిన పార్టీకి అనుకూలమైన స్వింగ్ ఫ్యాక్టరుని సృష్టించడమే.2014 నాడు తన మొదటి జాతీయ స్థాయి క్లయింటు మోదీ - గెలిపించాడు,2015 నాడు అతని క్లయింటు బీహారులో నితిశ్ కుమార్ - గెలిపించాడు,2017 నాడు అతని క్లయింటు పంజాబులో కాంగ్రెస్ - గెలిపించాడు("As I have said many times before, PK & his team and their work was absolutely critical to our victory in Punjab!" అని శంకర్ సింగ్ వాఘేలా గారు ఒప్పేసుకున్నాడు కూడాను),2017 నాడు అతని మరో క్లయింటు ఉత్తరప్రదేశ్ కాంగ్రెసు - గెలిపించలేకపోయాడు,2019 నాడు అతని క్లయింటు జగన్మోహాన్ రెడ్డి - గెలిపించాడు,2020 నాడు అతని క్లయింటు ఢిల్లీకి చెందిన కేజ్రీవాల్ - గెలిపించాడు.ప్రజలకు న్యాయం చెయ్యకపోయినప్ప్పటికీ అధికారం తమకే దక్కాలని ఆశించే దురాశాపరులు ఎన్నుకునే వక్రమార్గం ఇది.తమ పార్టీ యొక్క ప్రత్యేకతని ప్రజలకి వివరించి చెప్పగలిగిన వాగ్ధాటి ఉన్న నాయకులను ప్రోత్సహిస్తూ ప్రతి నియోజకవర్గానికీ ఎన్నికల సమయంలో కొత్త పరిచయాలు అక్కర్లేని మంచి అబ్యర్ధులను నిలబెట్టగలిగిన పార్టీకి రాజమార్గంలోనే అధికారం ప్రాప్తిస్తుంది.

అంత సుదీర్ఘ కాలం పాటు మన్ను తిన్న పాముల్లా పడిఉండి 2019 నాటికి కూడా రాష్ట్రం మొత్తం పోలయిన వోట్లలో 0.84% సంపాదించుకుని పోటీ చేసిన 175 స్థానాలకు 0 స్థానాలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి ఎలా వస్తుంది - ఆశకు కూడా హద్దు ఉండాలి!ప్రస్తుతం సభకు ఉన్న 175 స్థానాలకు చంద్రబాబుకిలా కొయ్యకాళ్ళూ చెక్కచేతులూ అక్కర్లేని నిక్కచ్చి గెలుపుకి 116 సీట్లు అవసరం - తన ఒక్కడి ఛరిష్మా ఉపయోగించి పార్టీకి అన్ని  స్థానాలను రప్పించగలిగిన మొనగాడు రాష్ట్ర స్థాయిలో ఎవరున్నారు?పోనీ మొనగాడు ఉన్నప్పటికీ పూర్తిగా అతని చరిష్మా మీదనే ఆధారపడక తాము నిలబడిన స్థానాల ప్రజల్ని మెప్పించగలిగి సభకు వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?

వాళ్ళకీ వీళ్ళకీ స్టెపెనీలానూ నిచ్చేనలానూ ఉపయోగపడుతూ "కోడి పోయి కత్తి వచ్చ డండండం!కట్టి పోయి సుత్తి వచ్చే డండండం!" అన్నట్టు వేరే పార్టీలు వాళ్ళలో వాళ్ళు అధికారాన్ని పంచుకుంటుంటే  ఈసారి చాన్సు మనదే ఈసారి చాన్సు మనదే అని లొట్టలేసుకుంటూ గోతికాడి నక్కలా ఎదురు చూస్తూ కూర్చుంటే రాదు అధికారం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆకాంక్షల్ని తెలుసుకుని వాటికోసం అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతల మీద పోరాడి గెలిచి ప్రజలకి తమకు అధికారం ఇస్తే ఇప్పటి ప్రభుత్వాధినేతల కన్న మంచి పరిపాలన అందిస్తారని నమ్మకం కలిగించుకుంటే వస్తుంది!

ఒక విశ్లేషకుడి స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పకూడదు గనక నేను చూపించిన వాస్తవాలు కఠినంగా ఉన్నప్పటికీ హిందువునైన నేను ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాననేది నిజం.ఆంధ్ర రాష్టంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలూ నాయకులూ వాస్తవాలను గమనించి ప్రజలలో తిరిగి ప్రజల కోసం బతికి ప్రజల మద్దతును పొందినప్పుడు ఆనందించేవాళ్లలో నేనూ ఒకడినై ప్రోత్సహిస్తానే తప్ప వ్యతిరేకించననేది కూడా నిజం.

నిరంతరం ప్రజల మధ్యన తిరగడమే అవిఛ్చిన్నమైన అధికారం పొందడానికి రాజమార్గం అనేది చతుర్యుగ పర్యంతం ఉన్న వ్యాసపరాశరాది ఆచార్య పరంపర పాదాల మీద ప్రమాణం చేసి మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగిన నేను చెప్తున్న పరమ సత్యం.ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది.ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది.

సత్యం శివం సుందరం!!!

1 comment:

  1. unknown:"వైఎసార్సీపీ & తేదేపా: రండి ...... సమ్మగా దించుకోని కూర్చుంటా"
    hari.S.babu
    "బీజేపీ & తేదేపా: రండి unknownగారూ, ఈ కుర్చీలో కూర్చోండి. వైఎసార్సీపీ: అర్రే unknownగా, వొచ్చి నా మొడ్డ నీ గుద్దలో దింపుకోని కూర్చుందుగాని రారా. unknown: నేను హిందూద్వేషిని, వైఎసార్సీపీ మొడ్డే కావాలి నాకు. సమ్మగా దించుకోని కూర్చుంటా"

    P.S:బూతులు మాట్లాడ్డం మీకొక్కరికే వచ్చా?బూతులు లేందే ఒక్క కామెంటు కూడా రాయలేని మీరు ఇక్కడికి రావడం అవసరమా?నేను మొదట హిందువుని.వాళ్ళు రామజన్మభూమి కట్టినందుకు చాలా ఆననదిస్తున్నాను.వాళ్ళు మావాళ్ళు.తమ్ముడు తనవాడైనా ధర్మమే చెప్పాలి కాబట్టి తప్పులు చెప్తున్నాను.అంత మాత్రాన వాళ్ళు నాకు శత్రువులవుతారని నువ్వెలా అనుకున్నావు.

    వాళ్ళు అధికారంలోకి రావాలంటే ప్రజల్లోకి రావాలని చెప్పిందే వాళ్ళకి ప్రజలే గడ్డి పెట్టి సరైన దారిలోకి తెస్తారని - వాళ్ళు ప్రజల్లోకి రాకపోతే విశ్వతోభద్ర పేరుతో నేను రంగంలోకి దిగుతాను.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...