Monday 4 January 2021

తండ్రి విషయంలో జరిగినట్టు ప్రకృతి శక్తులు రంగంలోకి దిగితే తప్ప మానవమాత్రుడు ఎవడూ మోసంలోనూ క్రౌర్యంలోనూ తండ్రిని మించిన తనయుడి అరాచకత్వాన్ని నిలువరించలేడు

సమైక్యాంధ్రను విడదీసి తెలంగాణను పుట్టించింది ఆంధ్ర ప్రాంతంలోని హిందువులను క్రైస్తవీకరించడానికే!ఇప్పటి విజృంభణ కాకతాళీయం కాదు, అయిదేళ్ళ ఆలశ్యానికి నష్ట పరిహారం తీసుకుంటున్నారు, అంతే!

రాజశేఖర రెడ్డి గారు కాన్స్టాంటినోపుల్ తర్వాత అంతటి హద్దులెరుగని స్థాయిలో క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత,ఆధునిక సెక్యులరిస్టు సిద్ధాంతం అమలులోకి వచ్చిన తర్వాత సెక్యులర్ చట్రాన్ని బద్దలు కొట్టి మరీ క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత అన్న ఖ్యాతిని గడించారు.2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు నదురూ బెదురూ లేని స్థాయిలో క్రైస్తవీకరణని ప్రోత్సహించారు.అప్పటివరకు హిందూ ముఖ్యమంత్రుల కాలంలో అణిగిమణిగి పడివున్న పాస్టర్లు క్రైస్తవుడైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వ్యాపించే వేగాన్ని పెంచారు - వాళ్ళ బైబిలు చెప్తున్న "దేవుడి రాజ్యం" అనేదాన్ని రాజశేఖర రెడ్డి గారి పాలనకి మారుపేరు చేసేశారు.పిచ్చి హిందువులు వాళ్ళు రామరాజ్యం గురించి చెప్తున్నారనుకుని మోసపోయారు.

2006 August నెలలో GO MS. No: 21 విడుదల చేసి Rs. 80, 000/- ప్రభుత్వ ధనాన్ని చర్చిల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు.Deccan Chronicle తన 2006 August 23నాటి సంచికలో "CM Reddy okays public money for churches" అనే వార్త వేసింది కూడాను.ఇదే ఆజ్ఞలో కొత్త చర్చిలు కట్టుకోవాలనుకునే వారికి ఒక్కో చర్చికీ 1.5 lakhs కేటాయించాలనే ఆదేశం కూడా ఉంది.ప్రభుత్వానికి అవసరమైన నిధుల కోసం సుమారు Rs.20,000 crores విలువ గల 7000 ఎకరాల విస్తీర్ణం ఉన్న హిందూ ఆలయ భూముల్ని అమ్మేశారు.వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడమే కాక కొన్నింటిని పాస్టర్లు ఆక్రమించుకుంటున్నప్పటికీ చూసీ చూడనట్టు ఉండిపోయారు.ఒక్క 2004 నుంచి 2009 మధ్య వేల సంఖ్యలో కొత్త చర్చిలు కట్టేశారు.ప్రతి ఏడుగురు క్రైస్తవులకీ ఒక చర్చి ఉండాలనే లెక్క చొప్పున 1,48,000 చర్చిలు తయారయ్యాయి!మరి, హిందూ ఆలయాలు?ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ అప్పటికి ప్రతి 350 మంది హిందువులకీ ఒక ఆలయం చొప్పున కట్టినట్టు 1,90,000 మాత్రమే ఉన్నాయి.

చర్చి నిర్మాణం కోసం ఉద్దేశించిన నిబంధనలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ చర్చిని నిర్మించటం అంత సులభమైన వ్యవహారం కాదని అనిపిస్తుంది.

️ ఏ చర్చి అయితే నిర్మిస్తున్నారో దాని తాలూకు వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి.

️ నిర్మించదలచిన చర్చి కోసం ముందుగా ఒక కమిటీ వేయాలి..

ఆ కమిటీలో ఈ క్రింది వారు సభ్యులుగా ఉండాలి 👇👇

👉 ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ - చర్చి కమిటీ అధ్యక్షుడు.

👉 మున్సిపల్ ఇంజనీరు - కమిటీ సభ్యుడు.

👉చర్చి పాస్టర్ - కమిటీ సభ్యుడు.

👉ఆ చర్చి కమిటీలో మరో ఇతర ప్రభుత్వ అధికారి సభ్యుడిగా ఉండాలి.

️ కమిటీ ఏర్పాటు అయ్యాక కలెక్టర్ అనుమతి కోసం ఈ క్రింది పత్రాలు సమర్పించాలి.

️ఆ చర్చి పేరు, చిరునామా

️ఆ చర్చి పాస్టర్ పేరు, చిరునామా

️ ఆ చర్చి కమిటీ సభ్యుల వివరాలు

️ ఆ చర్చి నిర్మాణం జరపదలచిన స్థలం తప్పనిసరిగా ఆ చర్చి పేరిట రిజిస్టర్ అవ్వాలి.

(ఒకవేళ ఆలా రిజిస్టర్ అవ్వకపోతే అందుకు కారణాలు స్పష్టంగా పేర్కొనాలి.)

️లోకల్ మున్సిపాలిటీ అప్రూవ్ చేసిన ఆ చర్చి నిర్మాణం యొక్క ప్లాన్

️ లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా తయారుచేసిన ఆ చర్చి నిర్మాణం యొక్క ఖర్చుల estimation

️ ఆ estimation కాపీ మీద ఆ మండల మున్సిపల్ ఇంజనీరు సంతకం

️ ఆ చర్చి యొక్క సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ

️ తమకు విదేశీ నిధులు రావట్లేదంటూ ఆ చర్చి పాస్టర్ తన లెటర్ హెడ్ మీద రాసిచ్చిన డిక్లరేషన్

️ ఒకవేళ ప్రభుత్వం నుండి ఈ నిర్మాణానికి గత 05 ఏళ్లలో ఏవైనా నిధులు వచ్చి ఉంటే ఆ వివరాలు

️చర్చీ నిర్మాణం జరిగే గ్రామం యొక్క మొత్తం జనాభా

️ చర్చి నిర్మాణం జరిగే గ్రామంలోని క్రైస్తవ జనాభా, అప్పటికే ఉన్న ఇతర చర్చీల వివరాలు

ఈ డాక్యుమెంట్లతో పాటు ముఖ్యమైనది చుట్టుప్రక్కల నివసించే వారి నుండి No_Objection సర్టిఫికెట్.అన్నీ ఉండి ఈ ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా చర్చికి అనుమతి రాదు.ఇంత తతంగం ఉన్నప్పటికీ పుట్టగొడుగుల్లా కొత్త చర్చిలు పుట్టుకొస్తున్నాయంటే ప్రభుత్వాధినేతలు ప్రోత్సహించడం వల్లనే కదా!ఇంకో వైపున 30,000 హిందూ ఆలయాల నుంచి ఎంతో ఎక్కువ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ చట్టాలలో వాటి ఆదాయం నుంచి వాటి పోషణకు తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ అది జరగలేదు.అంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హిందూ మతాన్ని తగ్గించి క్రైస్తవ మతాన్ని పెంచాలనుకున్నట్టు అర్ధం కావడం లేదూ! వీటన్నింటి వల్ల 2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు చెప్పుకున్నారు.

ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే తేడా లేకుండా ఈ తరం తెలుగువాళ్ళలోని మేధావులు అందరూ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న religious polarization వల్ల జరగబోయే ప్రమాదాన్నీ తెలంగాణా ఏర్పాటులోని మత ప్రాతిపదికనూ గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారో అర్ధం కావడం లేదు నాకు.ఇటీవలి వరకు నాకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన క్రైస్తవ మత ప్రచారం గురించి ఎక్కువ వివరాలు తెలియదు.నేను వేరొక వ్యాసం కోసం పరిశోధన చేస్తున్నప్పుడు "2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు చెప్పుకున్నారు" అనేది తెలిసిన వెంటనే చర్చిల సంఖ్య తెలంగాణ వైపుకన్న ఆంధ్ర వైపునే ఎక్కువున్నాయని గుర్తొచ్చి "హిందువులు ఎక్కువున్న తెలంగాణను విడదీస్తే ఆంధ్రప్రాంతంలోని క్రైస్తవుల సంఖ్య ఆమాంతం రెండింతలు పైకి లేస్తుంది!" అనేది తళుక్కున మెరిసింది నాకు.మరి, ఎన్నికల్లో గెలుపు కోసం కులాల వారీ సీట్లు కేటాయించడం కోసం ఏ ప్రాంతంలో ఏ కులంవాళ్ళు ఎంతమంది ఉన్నారని కాకి లెక్కలు వేసుకుంటున్నవాళ్ళకి ఇది తెలియకపోవడం విచిత్రం కాదూ!ఇలాంటివి ఇతర దేశాల్లోనూ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని తెలియకనూ తెలిసినా ఇక్కడ జరిగేనా పెట్టేనా అని భరోసాతోనూ నిర్లక్ష్యం చేశారని నా నమ్మకం.

వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుకు దారి తీసిన ఆంధ్రప్రదేశ్ విభజన వెనక ఉన్నది మతపరమైన కారణమే - "ఒక వోటు, రెండు రాష్ట్రాలు!" అనే నినాదంతో అనుకుంటాను 1997లో మొదట BJP రాష్ట్ర శాఖ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.2000వ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు Telangana Congress Legislators Forum అనే సంస్థను స్థాపించి దాని తరపున తమ పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీకి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు.2001 ఏప్రిల్ 27Kalvakuntla Chandrashekar Rao (KCR) గారు Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

అయితే, స్వతంత్ర తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 1997లో మొదట తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసిన BJPకి చెవుల్లో పువ్వులు పెట్టి 2000వ సంవత్సరంలో తెలంగాణ కోసం సంకల్పించిన కాంగ్రెసుకు సుంతీ చేసి 2001 మొదలు 2014 వరకు అంత భీకరమైన పోరాటం చేసిన TRSకి అత్తెసరు మెజార్టీ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏమిటి?2014లో కూడా లాభసాటి కాని దాని కోసం ఒకరు 1997లోనూ ఇంకొకరు 2000లోనూ మరొకరు 2001లోనూ ఎందుకు ప్రయత్నం చేశారు?తెలంగాణ ప్రజలలో ఉన్న న్యాయమైన అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చటానికే అసమర్ధులైన వీళ్ళు తెలంగాణ ప్రజలలో లేని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటానికి అంత ఆసక్తిని ఎట్లా చూపించగలిగారు?

కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి రాజకీయ ప్రయాణం కాంగ్రెసులోనే మొదలైంది.మెదక్కు శాఖలో చేరారు.ఎప్పుడు చేరారో కూడా తెలియడం లేదు. కాంగ్రెసులో ఉండి 1983 వరకు ఏమి గోగునార కట్టలు పీకినారో తెలియడం లేదు గానీ 1983లో రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి అనంతుల మదన్ మోహన్ మీద పోటీ చేసి ఓడిపోయారు.అయితే, తర్వాత కొంచెం కష్టపడి పార్టీలో ముందుకెళ్ళి 1987 మొదలు 1988 వరకు రామారావు మంత్రివర్గంలో Drought & Relief శాఖతో మంత్రి అయ్యారు.1990లో Medak, Nizamabad, Adilabad జిల్లాలకు తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ అయ్యారు.1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో Transport minister అయ్యారు.2000 మొదలు 2001 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకి deputy speaker అయ్యారు.2001 April 27Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

మహా ఘనత వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి ఈ కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ ఆ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ ఆ అన్యాయంలో భాగస్వామియైన కల్వకుంట్ల చంద్రశేఖర రావుయే ఉద్యమించడం ఏమిటో, అలాంటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కాలంలోని అతి ముఖ్యమైన సన్నివేశాలలో నేను ఇక్కడ చూపించిన సన్నివేశాలు అందరికీ తెలిసినవే!2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు నేను చెప్పిన తర్వాత  BJP రాష్ట్ర శాఖ తెలంగాణ ఏర్పాటు కోసం 1997లో తీర్మానం చెయ్యడమూ తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు Telangana Congress Legislators Forum అనే సంస్థను 2000వ సంవత్సరంలో స్థాపించడమూ Kalvakuntla Chandrashekar Rao (KCR) గారు Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని 2001 ఏప్రిల్ 27న స్థాపించడమూ 2004 మే 14 తర్వాత మొదలైన రాజశేఖర రెడ్డి గారి మొదటి అధికారిక మతమార్పిడి తరంగం మొదలు కావడానికి చాలా యేళ్ళ ముందర జరగటాన్ని గమనిస్తే సమైక్యాంధ్రను విడదీసి తెలంగాణను పుట్టించింది ఆంధ్ర ప్రాంతంలోని హిందువులను క్రైస్తవీకరించడానికేనని నేను అంటున్నది బూటకం అని మీకు అనిపిస్తుంది, కదూ!

కానీ, వాటన్నిటికీ పూలదండలోని దారంలాంటి బాదరాయణ సంబంధం ఉంది.కధ క్లైమాక్సుకు వెళ్ళాక చివరిలో ఒకసారి విహంగవీక్షణం చేయించుతాను.అప్పుడు మరింత విస్తృతమైన సమాచారం ఇస్తాను.2004 మే 14 మొదలు 2009 సెప్టెంబర్ 02 వరకు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లాంటి పరిపాలన ఆధునిక కాలంలో తమకంటూ రాజ్యాంగాలను రచించుకుని ప్రజాస్వామ్యపు సంప్రదాయాన్ని అనుసరించిన మరే ఇతర ప్రాంతంలోనూ జరగలేదు.మొదటి రోజైన 2004 మే 14నే free electricity for farmers ప్రాజెక్టును మొదలు పెట్టారు.కానీ, తర్వాత ఆర్ధిక మంత్రి రోశయ్య గారు గట్టి వ్యతిరేకతను వ్యక్తం చెయ్యడంతో ఆగిపోయింది.Indian IT sectorకి బిల్ గేట్స్ వంటి poster boy అయిన Satyam కంపెనీ అధినేత conceptualise చేసిన అంబులెన్స్ సర్వీసును adopt చేసుకుని మంచిపేరు తెచ్చుకున్నారు. పావలా వడ్డీ పధకం అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన డ్వాక్రా పధకానికి మరింత బలం చేకూర్చి గ్రామీణ మహిళలకి ఎక్కువగానే ఉపయోగపడింది.ఇందిరమ్మ ఇళ్ళ పధకం ఆర్భాటంగా మొదలై తర్వాత తర్వాత వివాదాస్పదం అయ్యి తర్వాత తర్వాత బలహీనం అయ్యింది.జలయజ్ఞం అని ప్రకటించినది ధనయజ్ఞం అయిపోయింది - Right to Information Act ప్రకారం ప్రభుత్వం నుంచి రాబట్టిన డాక్యుమెంట్ల ప్రకారమే టెండర్ల దశనుంచి పూర్తయిన పనులకు చెల్లించిన పేమెంట్ల వరకు గల అన్ని దశలలోనూ రాయలసీమ ఫ్యాక్షనిస్టు ముద్ర ధగద్ధగాయమానమై కనిపించింది.

“I don't want to become another Chandrababu Naidu” అని ప్రకటించి తొలినాళ్ళలో ఇప్పుడు కొడుకు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన సమస్తాన్నీ ధ్వంసం చేద్దామని అనుకున్నారు గానీ అలా చేస్తే తను మంచిపేరు తెచ్చుకోవాలని ప్రవేశ పెట్టిన పధకాలకి కూడా చిల్లి పడుతుందని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెట్టుబడులను కానీ అమర్చి పెట్టిన సౌకర్యాలను గానీ disturb చెయ్యలేదు సరిగదా సత్యం నుంచి యాంబులెన్సుల పధకాన్ని lift చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి పధకాల్ని modify చేసి వాడేసుకున్నారు. యె.సం.రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ రింగ్ రోడ్డు తప్ప రాష్ట్రానికి గానీ హైదరాబాదుకి గానీ చేర్చిన కొత్త చేర్పులు లేవు.

రాజశేఖరరెడ్డి గారి పరిపాలనలో ప్రపంచ స్థాయి సంచలనానికి కారణమైనది సత్యం ఫ్రాడ్ కేసు.రామలింగరాజు Satyam అనే IT కంపెనీ పెట్టి కొద్దికాలంలోనే వటవృక్షమై ఎదిగాడు.కానీ 2008 డిసెంబర్ 16న వాళ్ళబ్బాయి ముచ్చటపడి Satyam అన్న పేరుని తిరగేసి పేరు పెట్టిన Maytas కంపెనీ గురించిన ఒక వార్తతో రామలింగరాజు అదృష్టం కూడా తిరగబడింది.మొదట వీలున్నంత వరకు నిరపరాధి అనిపించుకోవాలని తపన పడి పిదప తనకు తనే నేరం ఒప్పుకుని జైలు పాలయ్యాడు. మొత్తం కేసులో అసలు విషయం రామలింగ రాజు చెప్పడానికి ఇష్టం లేక తను జైలుకు వెళ్ళే పద్ధతిలోకి కేసును తిప్పేశాడు. ఆ దారిలో ముందుకెళ్తే తను బయట పడతాడు గానీ కొడుకు ఇరుక్కుంటాడు.ఎందుకంటే, రామలింగ రాజు కొడుకు ఈ డబ్బుని మదుపు పెట్టింది వాపుని చూపించి బలుపులా  మోతెక్కించడానికి రాజశేఖరరెడ్డి గారి మిత్రబృందం చూపించిన ఎండమావిలో.అచ్చు ఎండమావిలానే రామలింగ రాజు కొడుకు పెట్టుబడి పెట్టేవరకు బంగారులేడిలా కనబడిన ప్రాజెక్టు పెట్టుబడి పెట్టి ఇరుక్కు పోయాక రాజశేఖరరెడ్డి గారి మిత్రబృందం పెంచిన ధరలు ఢమాల్న పడిపోయి తండ్రి కంపెనీల నుంచి తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించలేక పోయాడు.దాంతో సత్యం కంపెనీకి అప్పులు ఇచ్చినవాళ్ళు  తీర్చమని ఒత్తిడి చేస్తున్నారు. Maytas తన కొత్త ప్రాజెక్టులో లాభాలు గడించి ఉంటే Satyam ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చేవి, అప్పుడు Satyam తన అప్పులవాళ్ళకి చెల్లించేసి వూపిరి పీల్చుకునేది.కేసులో విచారణ ముందుకు వెళ్తే ఇది బయటపడుతుందని తెలిశాక విధి లేక కేసును ఇప్పుడు కనిపిస్తున్న రూపానికి మార్చి జైలు కెళ్ళాడు. తెలిసో తెలియకో ఫ్యాక్షనిష్టులు తమకోసం ఏర్పాటు చేసుకున్న చీమల పుట్టలో బయటివాడు వేలెడితే అట్లానే ఉంటుంది!

ఫ్యాక్షన్ హత్యల విషయానికి వస్తే 2005 జనవరి 24న జరిగిన పరిటాల రవీంద్ర హత్య చాలా ప్రముఖమైనది.అనంతపురం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి అతి సమీపాన బాంబులు పేల్చి హడావిడి సృష్టించి అతనికి దగ్గిరకి వెళ్ళి కాల్చేశారు.రవీంద్ర అక్కడి కక్కడే చచ్చిపోయాడు.ఇతను సుద్దపూస కాదు.2011 జనవరి 04న భాను కిరణ్ చేతిలో చచ్చిపోయిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అనబడు మద్దెలచెరువు సూరి కుటుంబానికీ పరిటాల రవీంద్ర కుటుంబానికీ పాత కక్షలు ఉన్నాయి.టీవీలో బాంబు పెట్టి సూరి కుటుంబాన్ని చంపించాడనే కేసు పరిటాల రవీంద్ర మీద వుంది.

ప్రతి చెడులోనూ కొంత మంచి ఉంటుంది, ప్రతి మంచిలోనూ కొంత చెడు ఉంటుంది, నూటికి నూరు శాతం మంచి గానీ నూటికి నూరు శాతం చెడు గానీ ఉండవు అన్నట్టు కాంగ్రెసు మీద ధ్వజమెత్తి స్థాపించిన తెలుగుదేశం అగ్రకులాలను మరీ ముఖ్యం రాయలసీమ రెడ్డి ఫ్యాక్షనిష్టులను మాత్రమే ప్రోత్సహించే కాంగ్రెసు అలవాటుకు విరుద్ధమైన నిమ్న కులాలను ప్రోత్సహించడం ఫ్యాక్షనిజాన్ని పదింతలు పెంచింది. అంతకుముందు కాంగ్రెసులోని ఫ్యాక్షనిష్టు నేతలకి పార్టీ రాష్ట్ర శాఖ తమ శత్రువర్గానికి ప్రాధాన్యం ఇస్తే ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్దల దగ్గర బలప్రదర్శన చెయ్యడం ఒక్కటే దారి అయితే తెలుగుదేశం వచ్చాక కాంగ్రెసుని వదిలి తెలుగుదేశంలోకి వెళ్ళడం అనే మరో దారి దొరికింది.తెలుగుదేశం ప్రోత్సాహం వల్ల ప్రజాజీవితంలోకి వచ్చిన కొత్త నిమ్నకులాల నేతలు ఆత్మరక్షణ కోసమనే పేరుతో రాయలసీమ రెడ్డి ఫ్యాక్షనిష్టుల్ని అనుకరించారు.

ఇతర నేరాలకు సంబంధించి చూస్తే 2007 డిసెంబర్ 27 ఆయెషా మిరాన్ అనే ముస్లిం బాలిక మానభంగానికీ హత్యకీ గురయిన సంఘటన పరమ భయానకమైనది.నేరం జరిగిన పద్ధతి పెద్ద కరుణామృతము జాలువారు నవనీత మనస్కుడు కానక్కర లేదు,కనీసపు మానవత్వం ఉన్నవాడు సైతం సాటి మనిషి ఒకడు అలా చెయ్యగలడని వూహించలేనంత కిరాతకమైనది!అయితే, నేరస్తుడి కన్న క్రూరమైన మనస్తత్వం ఉన్న పోలీసువ్యవస్థలోని పెద్దలూ, న్యాయవ్యవస్థలోని పెద్దలూ ప్రభుత్వం యొక్క రాజముద్ర నిత్యం కళ్ళముందు చూపించి చెప్తున్న "సత్యమేవ జయతే" అన్న కనీసపు బాధ్యతను విస్మరించి కేసును ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పి 2008 నాటికి సత్యంబాబు అనే వ్యక్తిని పట్టుకొచ్చి కోర్టుముందు నిలబెట్టారు.అప్పుడు Vijayawada women's special sessions court వారు 376 of IPC ప్రకారం మాంభంగానికీ 302 of IPC ప్రకారం హత్యకీ కలిపి పదేళ్ళు కఠిన కారాగార వాస శిక్ష వేశారు.కానీ, 2017 మార్చి  31Hyderabad High Court సత్యంబాబు నిరపరాధి అని ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది - ఎనిమిదేళ్ళ పాటు ఒక నిరపరాధిని జైలులో ఉంచినందుకు compensation ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆదేశించింది!

సత్యం బాబు నిర్దోషి అనీ అసలు దోషి రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో Deputy Chief Minister అయిన కోనేరు రంగారావు గారి బంధువనీ ఆయేషా తలిదండ్రులు మొదటినుంచి చెప్తూనే ఉన్నప్పటికీ ఒక మొబైల్ ఫోను చొరీ కేసులో తమకు దొరికిన సత్యంబాబుని నిర్దోషి అని తెలిసి కూడా నేరస్థుడి కింద ఫిరాయించేసిన పోలీసుల్ని ఏమనాలి?తెలిసి తెలిసీ అన్యాయమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్ని ఏం చెయ్యాలి!ఒకసారి ఆయేషా తల్లి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారిని కలిసి న్యాయం చెయ్యమని కాళ్ళమీద పడి వేడుకుంటే కాళ్ళతోనే పక్కకి విదిల్చి వెళ్ళిపోయారట మండు వేసవిలో వర్షాల్ని కురిపించగలిగిన మహత్యాలు గల దేవుడి లాంటి ముఖ్యమంత్రి గారు!

ఇవన్నీ రహస్యమైన సన్నివేశాలు కావు, బహిరంగమైనవే - అందరికీ ఇవి జరిగాయని తెలిసేటంత సంచలనం పుట్టింది.కోర్టు నీరజా రావుకి అనుకూలమైన తీర్పు ఇవ్వడానికి కారణం ఆమె ఎవర్నీ మోసం చెయ్యలేదు, ప్రభుత్వం ఇచ్చిన అధికారికమైన పత్రాలనే ఆమె చూపించింది.మరి, తను చేసింది తప్పని రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి తెలియదా!రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు తప్పు చేశారని రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి కన్నబిడ్డ జగన్మోహాన్ రెడ్డి గారికి తెలియదా!నీరజా రావు జగన్మోహాన్ రెడ్డి గారిని ఎందుకు కలిసింది?రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసింది తప్పని తెలిసిన రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి కన్నబిడ్డ జగన్మోహాన్ రెడ్డి గారు తను చొరవ తీసుకుని ఆమెకి న్యాయం చేస్తాడని కదా!తన బంధువు వల్ల అన్యాయానికి గురై తన దగ్గిరకి వచ్చిన ఒక ఒంటరి ఆడదానికి న్యాయం చెయ్యడం కోసం బంధుప్రీతిని పక్కన పెట్టి ఆమెకి న్యాయం జరిపించలేని అసమర్ధుడు కొన్ని కోట్లమందికి ముప్పయ్యేళ్ళ పాటు న్యాయం చెయ్యగల సమర్ధుడనని తనెట్లా నమ్మాడు, ఇతర్ల నెందుకు నమ్మించాడు?

2009 ఫిబ్రవరి 14 నాడు Muslim Forum for Telangana (MFT) అనే సంస్థ తెలంగాణ కోసం డిమాండు చేసిందని తెలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది "Pseudo propaganda against Telangana Muslims" అని దాన్ని కొట్టి పారేశారు.అయినప్పటికీ అది బలం పెంచుకుంటూనే ఉంది.ఇప్పటికీ కొందరు రాజశేఖరరెడ్డి గారు బతికుంటే రాష్ట్రం విడిపోయి వుండేది కాదని అనుకుంటారు గానీ రాజశేఖరరెడ్డి గారు అణిచెయ్యాలనుకున్నదీ అణిచేసిందీ కేసీయారునే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని కాదు.

మిగిలిన అన్ని విషయాల్లోనూ శ్రీమతి సోనియా గాంధీ దగ్గిర తన మాటనే నెగ్గించుకోగలిగిన రాజశేఖర రెడ్డి గారు మరి చంద్రశేఖర రావు గారు శ్రీమతి సోనియాగాంధీ గారిని కలవటాన్నీ పార్టీ నాశనం అవుతుందని చెప్పినా వినిపించుకోకుండా సోనియా అతనికి తెలంగాణ ఏర్పాటుకు అంత ధారాళంగా వాగ్దానం ఇవ్వటాన్నీ ఎందుకు ఆపలేకపోయారు.అప్పటి వరకు జరుగుతున్న వాటిల్లో ఏ ఒక్క సన్నివేశాన్నీ ఆపలేని రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఒక రెండు సంవత్సరాల తర్వాతో అయిదు సంవత్సరాల తర్వాతో తెలంగాణ ఏర్పాటుని ఆపగలిగేవారని ఎట్లా నమ్ముతున్నారు?

అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అధికారం గుంజుకోవటానికి రాజశేఖర రెడ్డి గారు వేసిన అనేకమైన ఎత్తుగడలలో ప్రమాదకరమైనవి రెండు - నక్సలైట్లతో పొత్తు కలపటం,తెరాసతో కత్తు కలపటం!నక్సలైట్లని ఔరంగజేబు శివాజీని పట్టి బంధించడానికి ఎత్తు వేసిన రీతిలో చర్చలకి పిలిచి అరెస్టు చేసి అణిచేశాడు.కానీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మాత్రం రాజశేఖర రెడ్డి గారికి అందనంత ఎత్తులో ఉన్నారు, శ్రీమతి సోనియా గాంధీకి చాలామంది కాంగ్రెసు వాళ్ళకన్న ప్రీతిపాత్రు లయ్యారు. అది ఎలా సాధ్యం!

ఇక్కడే అసలు మెలిక ఉంది.రాజశేఖరరెడ్డి గారు రాష్ట్ర విభజనకి బద్ధ వ్యతిరేకి.తెరాసతో పొత్తు అస్సలు ఇష్టం లేదు.కేవలం అధిష్ఠానం ఒత్తిడి మేరకు మాత్రమే ఒప్పుకున్నారు.బయటివాడైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి తెలంగాణ ఏర్పాటుకు వాగ్దానం ఇచ్చే విషయంలో తన ఒక్క చేతి మీద పార్టీని గెలిపించగలిగిన రాజశేఖర రెడ్డి గారి వంటి సొంత పార్టీ నాయకుడి బలమైన వ్యతిరేకతను కూడా కాంగ్రెసు అధిష్ఠానం లెక్కచెయ్యలేదు - ఎంత విచిత్రం!

నీరజా రావు ఇంటిని విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు కబ్జా చేశారని ప్రభుత్వ రికార్డుల సాయంతోనే ఆమె రుజువు చేసి గెలిస్తే కేవలం ఆమె న్యాయం కోసం పోరాడుతున్న్నప్పుడు కొంచెం మాట సాయమూ చేతి సాయమూ చేసిననదుకు అప్పటి నుంచి ఇప్పటి దాక తండ్రీ కొడుకుల అభిమానులు అది చంద్రబాబు యొక్క వ్యవస్థల్ని మ్యానేజి చెయ్యగల చాణక్యానికి ఉదాహరణ అంటూ ఉంటారు - నీరజా రావు కలగజేసుకోకపోతే అక్కడ విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి వస్తుందనుకున్న లాభం గూబల్లోకి వచ్చినందుకు ఆయన చంద్రబాబు మీద పడి ఏడ్చాడంటే కొంత అర్ధం వుంది, కానీ నీరజా రావు ఉన్న సామాజిక ఆర్ధిక స్థాయిలోనే ఉన్న తండ్రీ కొడుకుల అభిమానులు విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు కబ్జా చేస్తే ఆనందించి కోర్టు నీరజా రావుకి అనుకూలమైన తీర్పు ఇస్తే దుఃఖించి వాళ్ళు సైతం "అది చంద్రబాబు యొక్క వ్యవస్థల్ని మ్యానేజి చెయ్యగల చాణక్యానికి ఉదాహరణ" అంటున్నారంటే అర్ధం ఏమిటి?విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు నీరజా రావు ఇంటికి బదులు తమ ఇంటిని కబ్జా చేస్తే తమ దేవుడికి ఉపయోగపడగలిగినందుకు ఆనంద పడతారు కాబోలు!

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి కడుపున పుట్టిన వంశోద్ధారకుడూ కులభాస్కరుడూ అయిన జగన్మోహన రెడ్డి గారు మోసంలోనూ క్రౌర్యంలోనూ దౌష్ట్యంలోనూ  తండ్రిని మించిన తనయుడు.ఆటలో అరటిపండు లాంటి ఒక చిత్రమైన సన్నివేశం ఏమిటంటే, నీరజా రావు న్యాయపోరాటం మొదలు పెట్టే ముందు  రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి కడుపున పుట్టిన వంశోద్ధారకుడూ కులభాస్కరుడూ అయిన జగన్మోహన రెడ్డిగారిని కలిసిందట!బహుశః, జగన్మోహాన్ రెడ్డి గారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ బహిరంగ వేదికల మీద "బీదాసాదల కోసం బ్రాణమిస్తా"ననీ "అషహాయులను ఆడుకోవడానికి ముఖ్యమంత్రిని సైతం నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యడానికి వెనుకాడబో"ననీ "మాట తప్ప"ననీ "మడమ తిప్ప"ననీ చెప్పిన గంబీరమైన అసత్యాలని నిజమనుకుని నమ్మేసింది కాబోలు!ఆమె ఈయన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని వారంలో పనైపోతుందని ధీమాగా ఉంటే ఆయన గారు చిన్నపిల్లాడి కన్న అమాయకమైన మొహంతో "officials had done whatever they can" అనేశారట!

తండ్రి జీవించి ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు తెలంగాణ ఉద్యమంలోని మతపరమైన కోణాన్ని ఎత్తి చూపించడానికి ఉపయోగపడవు.కానీ,తండ్రి చనిపోయిన వెంటనే కొడుకు ముఖ్యమంత్రిత్వానికి పోటీ పడటం,అధిష్ఠానం ఒప్పుకోకపోవటం,కొడుకు వేరే పార్టీ పెట్టి సొంత బలం చూపించి కాంగ్రెసును దెబ్బతియ్యడం,కాంగ్రెసు అతన్ని జైలుకి పంపించడం అనే వ్యవహారంలో సీనియర్ పొలిటికల్ ఎనలిష్టులకి సైతం కనిపించని ఒక మిస్టరీ ఉంది!

జగన్మోహాన్ రెడ్డి గారి అభిమానులు "రావాలి జగనన్న!కావాలి జగనన్న! టటంటం,టటంటం." అని పిచ్చ పాటలు పాడుకోవటానికీ విషయాన్ని బట్టి దాదాపు ప్రతి రాజకీయ నాయకుణ్ణీ తప్పుంటే విమర్శించి ఒప్పుంటే సమర్ధించి నూటికి తొంబై తొమ్మిది శాతం Credibilityని maintain చేస్తున్న నన్ను పట్టుకుని "నువ్వు జగన్ని తిట్టినంత ఘాటుగా చంద్రబాబుని తిట్టట్లేదు గాబట్టి నువ్వు బాబు ఫ్యానువే" అంటూ నామీద పడి యాడవటానికీ తప్ప ఇంకెందుకూ పనికిరాని బుర్రతక్కువసన్నాసులు.జగన్మోహాన్ రెడ్డి గారి అరెస్టు జరిగిన పద్ధతిని గమనించిన ప్రతి ఒక్కరూ యధాలాపం అనుకుని పట్టించుకోని కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని ఒక వరసక్రమంలో పేర్చి వాటిలోని అసంబద్ధతని గమనించినప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు.

01).2011 ఆగస్టు 10న మాజీ మంత్రి P Shankar Rao రాష్ట్ర హైకోర్టులో జగన్మోహాన్ రెడ్డి గారి మీద CBI విచారణ కోసం పిటిషన్ వేశాడు,

02).2012 మార్చి 31న CBI మొదటి చార్జిషీటు దాఖలు చేసింది,మే 25న విచారణ ప్రారంభించిన CBI మే 27న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించింది - అప్పటి జగన్మోహాన్ రెడ్డి గారి కారాగార వాసం అతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విచారణ కోసం కోర్టు తన ఆతిధ్యంలో ఉంచుకోవడం లాంటిది మాత్రమే,

03).జగన్మోహాన్ రెడ్డి గారి ఆర్ధిక కార్యకలాపాలకి ప్రోత్సాహం ఇచ్చారని CBI చార్జిషీట్లలో పేర్లు ఉన్న గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ వంటివారు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ ఉన్నారు,

04).తమ పార్టీని నష్టపెట్టిన జగన్మోహాన్ రెడ్డి గారి మీద అంత కసిబూని కేసులు పెట్టి జైలుకి పంపించిన కాంగ్రెసు ప్రభుత్వం జైలులో పడ్డాక జగన్మోహాన్ రెడ్డి గారిని పండక్కి అత్తారింటికి వచ్చిన కొత్తల్లుడిలా చూసింది,

05).2013 సెప్టెంబర్ 23న పదహారు నెలల ఏకాంతవాసం తర్వాత CBI కోర్టు అతనికి నిబంధనలతో కూడిన బెయిలును మంజూరు చేసింది.

06).CBI కోర్టు యొక్క సాంకేతిక పరిభాషలో అతను దోషి అని కానీ నిర్దోషి అని కానీ నిరూపణ కాలేదు - ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి CBI కోర్టు యొక్క ప్రత్యక్ష విచారణ పూర్తి కాలేదు.

అప్పటి జగన్మోహాన్ రెడ్డి గారి కారాగార వాసం CBI కోర్టు జగన్మోహాన్ రెడ్డి గారు బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని భావించి విచారణ కోసం కోర్టు తన ఆతిధ్యంలో ఉంచుకోవడం అయినప్పుడు జగన్మోహాన్ రెడ్డి గారి ఆర్ధిక కార్యకలాపాలకి ప్రోత్సాహం ఇచ్చారని CBI చార్జిషీట్లలో పేర్లు ఉన్న గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ వంటి వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉండటం తప్పు కదా!

ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చేత తప్పుడు పనులు చేయించితే ఇద్దరి స్థాయీ ఒకటే కావచ్చు గానీ ఒక వ్యక్తి ప్రభుత్వం చేత తప్పుడు పనులు చేయించితే అప్పుడు కూడా ఇద్దరి స్థాయీ ఒకటే అనడం ఎట్లా కుదురుతుంది?జగన్మోహాన్ రెడ్డి గారి మీద చేసిన నేరారోపణ తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని  ప్రజాధనం కొల్లగొట్టాడని అయినప్పుడు అందరు ప్రజలకీ ధన మాన ప్రాణాలకు సమానమైన రక్షణ ఇస్తామని ప్రమాణం చేసిన మంత్రులూ ప్రభుత్వాధికారులూ ముఖ్యమంత్రి కొడుకు కాదు అసలు ఒక అనామకుడికి అలాంటి సహాయాలు చేసినప్పటికీ వాళ్ళే కదా అసలు నేరస్థులు!

అసలు A1 స్థాయి అప్పుడు ప్రభుత్వంలో ఉండి అంత తీవ్ర స్థాయిలో ప్రజాద్రోహనేరం చేసిన గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ గార్లకి ఇవ్వాలి, అవునా?CBIకి గానీ ఆ తతంగాన్ని గమనిస్తున్న మేధావులకు గానీ ఇంత చిన్న ధర్మసూక్షం ఇప్పటికీ అర్ధం కావడం లేదంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు నాకు.ఒక్క జగన్మోహాన్ రెడ్డి గారిని మాత్రమే జైలుకి పంపించి గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ లాంటివాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లా ప్రభుత్వంలో ఎందుకు ఉంచారో ఎవరు జవాబు చెప్తారు?మాజీ CBI జేడీ లక్ష్మీనారాయణ గారిని అడగాలి - జవాబు చెప్తారో లేదో!

నేను ఎత్తి చూపించిన పాయింట్లు జగన్మోహాన్ రెడ్డి గారు కానీ జగన్మోహాన్ రెడ్డి గారి అభిమానులు కానీ పట్టించుకుని న్యాయపోరాటం చేసి ఉంటే ఇంత కాలం జగన్మోహాన్ రెడ్డి గారు రెంటికి చెడ్డ రేవడిలా అంత యాతన పడి ఉండేవారు కాదు.

నిజానికి కాంగ్రెసు పార్టీ జగన్మోహాన్ రెడ్డి గారిని అప్పుడు అరెస్టు చేసింది ఆయన అవినీతి గురించి కాదు.జగన్ మీద కేసు వెయ్యటంలో అవినీతి గురించి కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తే గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ లాంటివాళ్ళు కూడా జగనుతో పాటు జైలుకి వెళ్ళేవాళ్ళు.ఒకవేళ కాంగ్రెసు పార్టీ జగన్మోహాన్ రెడ్డి గారిని అప్పుడు అరెస్టు చేసింది అధినేత్రిని ధిక్కరించినందుకూ పార్టీని దెబ్బ తీస్తున్నందుకూ కక్షతో ఎందుకు కాకూడదు, అన్ని మోటివులూ అంత హేతుబద్ధమై కనిపిస్తుంటే ఇందులో మిస్టరీ ఏముంది అని అనుకుంటున్నారు కదూ!

కక్ష ఉంటే ఆగమేఘాల మీద విచారణ పూర్తి చేసి నేరస్థుడని తేల్చేసి శిక్ష పడేలా చూస్తారు గానీ ఒక్క జగన్మోహాన్ రెడ్డి గారిని మాత్రమే జైలుకి పంపించి గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ లాంటివాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లా ప్రభుత్వంలో ఎందుకు ఉంచుతారు?అసలు జగన్ అప్పటికి విచారణ పూర్తయిన నేరస్థుడు కాదు.అప్పటి జగన్ కారాగార వాసం అతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విచారణ కోసం కోర్టు తన ఆతిధ్యంలో ఉంచుకోవడం లాంటిది మాత్రమే!

ఆ సమయంలో కూడా నాగార్జున జైలుకి వెళ్ళి కలవడం లాంటి వార్తల వల్ల ఫోకస్ రింగ్ అతని మీద పడుతూనే ఉంది.కొందరు సీనియర్ జర్నలిస్టులు చెప్పినదాన్ని బట్టి సినిమా రంగంలో జగన్ బీనామీ సంస్థ అయిన R R Creations నుంచి తనకు రావల్సిన బకాయిల కోసం నాగార్జున వెళ్ళినట్టు తెలుస్తున్నది.అంతే కాదు, కాంగ్రెసు నుంచీ తెలుగుదేశం నుంచీ డజనుకు పైన శాసనసభ్యులు అతన్ని కలిశారు - తెదెపా నాయకులు అతను చంచల్ గూడ జైలుని తన పార్టీ ఆఫీసు కింద మార్చడానికి అధికార పార్టీ సహాయం చేస్తున్నదని ఆరోపించారు కూడాను.అధినేత్రిని ధిక్కరించినందుకూ పార్టీని దెబ్బ తీస్తున్నందుకూ కక్షతో ఉన్నవాళ్ళు ప్రజలు అతన్ని మర్చిపోయారని అనిపించినప్పుడు ఏదో ఒక సన్నివేశం సృష్టించి ఫోకస్ రింగు వేస్తూ రాజకీయపరమైన సహాయాలు ఎందుకు చేస్తారు?

నేను అర్ధం చేసుకున్నంత మేరకు అప్పుడు కాంగ్రెసు పార్టీ కేసు వేసింది జగన్మోహాన్ రెడ్డి గారిని దోషి అని నిర్ధారించి శిక్ష వేసే ఉద్దేశంతో కాదు - అతన్ని దోషి అని నిర్ధారించి శిక్ష వేసే ఉద్దేశం ఎవరికీ లేదు, CBI కోర్టుతో సహా ఆ ఉద్దేశం ఎవరికీ లేదు!మరి, 2012 మే 27న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన CBI పదహారు నెలల ఏకాంతవాసం తర్వాత 2013 సెప్టెంబర్ 23న ఎందుకు నిబంధనలతో కూడిన బెయిలును మంజూరు చేసింది?

జగన్మోహాన్ రెడ్డి గారిని అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన సంక్లిష్టస్థితినీ పదహారు నెలల తర్వాత జగన్మోహాన్ రెడ్డి గారికి బెయిలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన సంక్లిష్టస్థితినీ మాత్రమే గమనించితే కాంగ్రెసు పార్టీలోని పెద్దలు తమకు ఎదురు తిరిగినందుకు అణిచివేసి తమ దారికి తెచ్చుకోవకోవడానికి ఆ కేసులు పెట్టినట్టు అనిపిస్తుంది.అయితే, జగన్మోహాన్ రెడ్డి గారిని అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ పదహారు నెలల తర్వాత జగన్మోహాన్ రెడ్డి గారికి బెయిలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ మాత్రమే కాక జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే మారిపోయిన రాజకీయపరమైన స్థితినీ కలిపి గమనించితే రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటు చేసి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రయోజనం చేకూర్చటానికి గాక నేను ప్రతిపాదించిన "హిందువులు ఎక్కువున్న తెలంగాణను విడదీస్తే ఆంధ్రప్రాంతంలోని క్రైస్తవుల సంఖ్య ఆమాంతం రెండింతలు పైకి లేస్తుంది!" అనే సిద్ధాంతం ప్రకారం పెరిగిన క్రైస్తవ వోట్లతో క్రైస్తవుడైన జగన్మోహాన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యడానికి జరిగిన కుట్ర అనేది తెలుస్తుంది.

2009లో కేసీయార్ గారు సెలైన్ డ్రిప్పు పెట్టుకుని చేసిన నిరాహార దీక్షకీ గడ్డం పెంచేసిన కేసీయార్ దొంగ మూలుగులకీ కేసీయార్ ఇంకో గంటకో అరగంటకో చచ్చేలా ఉన్నరన్నంత బిల్డప్ ఇచ్చి తెలంగాణ ఇవ్వడం ఖాయం అని ప్రకటించాక కూడా అన్నేళ్ళు ముందుకు కదలని విభజన బెయిలు మీద విడుదలైన జగన్మోహన రెడ్డి గారు 2013 అక్టోబర్ 26న Hyderabad నగరంలోని Lal Bahadur Shastri stadium వద్ద లక్ష మంది హాజరైన బహిరంగ సభలో అప్పటి వరకు తన తండ్రి అభీష్టం అంటూ రాష్ట్రాన్ని కలిపి ఉంచటానికి పోరాడుతున్న పాత లక్ష్యానికి తూట్లు పొడుస్తూ “Bifurcation is a very important issue for everyone in the state, so we have to go ahead” అని ప్రకటించిన వెంటనే తెలంగాణ ఏర్పాటు శరవేగాన ముందుకు సాగడం ఆశ్చర్యంగా లేదూ!

ఇప్పుడు, ఒకసారి 1997 మొదలు 2014 వరకు జరిగిన అన్ని సన్నివేశాల్నీ ఒక వరసలో పేర్చి మొదటిసారి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనబడు తెలంగాణ యేర్పాటు కోసం జరిగాయనుకుంటే ఒకదానికొకటి పొంతన లేనట్టు కనిపించేవి కాస్త రూటు మార్చి క్రైస్తవుడైన జగన్మోహాన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యడానికి జరిగాయనుకుంటే ఒకదానికొకటి అతుక్కుని ఉన్నట్టు కనిపిస్తాయి కదూ!ఒకే ఒక్కటి మిస్సయ్యింది?"జగన్మోహన్ రెడ్డిని ఆ కేసు వేసి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని చెప్పి అరెస్టు చేసి జైలుకి పంపించకపోతే ఏమవుతుంది?జగన్ జైలుకి వెళ్ళడానికీ తెలంగాణ ఏర్పడడానికీ కాదనీ లేదనీ అనడానికి వీల్లేనంత బలీయమైన సంబంధం ఏంటి?" అని అడుగుతారు మీరు - నాకు తెలుసు.భలేవారండీ మీరు!అప్పటికి తండ్రి బౌద్ధిక వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న అతను గనక తన రాయలసీమ ముఠాతత్వపు ఫ్యాక్షనిష్టు-లాయలిస్టు రెడ్లమందని తీసుకొచ్చి ఎలా విడగొడతారో చూస్తానని అడ్డుపడితే కేసీయారు లాంటి అర్భకుడికి రాష్ట్రాన్ని విడగొట్టటం సాధ్యమా? జైలులో ఉండి అన్ని వైపుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలంగాణకి ఒప్పుకుంటే ఆంధ్ర ముఖ్యమంత్రి పీఠం తనదేనని తనే తెలుసుకున్నాడో ఇతరులు ఉప్పందించారో గానీ ఒప్పందం కుదిరాకే CBI పదహారు నెలల ఏకాంతవాసం తర్వాత 2013 సెప్టెంబర్ 23న నిబంధనలతో కూడిన బెయిలును మంజూరు చేసింది!

1887లో తన అన్న అలెగ్జాండర్ అప్పటి జార్ ప్రభుత్వాన్ని ఎదిరించి చనిపోయినప్పుడు తను అన్నలా కాక జార్ ప్రభువును గలిచి తీరాలని సంకల్పం చెప్పుకుని కేవలం 30 యేళ్ళ తర్వాత 1917కి అంత దుష్కరమైన లక్ష్యాన్ని సాధించిన కామ్రేడ్ లెనిన్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు - "Politics is nothing but concentrated economicd" అని.అది నిజం.ఆ వెలుగులో చూస్తే తప్ప తెలంగాణ ఆవిర్భావ చరిత్ర వెనక ఉన్న అసలైన చీకటి కోణం అర్ధం కాదు.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలే తెలంగాణ వాళ్ళు " మీతో కలిసి ఉండటం వల్ల మాకు అన్యాయం జరిగింది!" అని అంత గొడవ చేస్తున్నప్పుడు "మీకు నిధులు ఇవ్వను, నీ దిక్కున్న చోట చెప్పుకో ఫో!" అనటం ఏంటి?ఉత్తినే!అంతా నాటకం.దేశ విభజన తప్పనిసరి అని హిందువుల చేత ఒప్పించడం కోసం మోహన దాసు గాంధీ  సత్యాగ్రాహం పేరు చెప్పి ఆడిన తమ మీద దాడి చేస్తున్న మిస్లిముల మీద హిందువుల్ని ప్రతీకారం తీర్చుకోనివ్వని దొంగనాటకం లాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రాష్ట్ర విభజన తప్పనిసరి అని నమ్మించడానికి తన వంతు నాటకం తను ఆడాడు తప్పిస్తే అతనికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే దురద లేదు.

అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ మాగాణం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో రాష్ట్ర విభజన వ్యూహకర్తల అంచనాలనూ లాభనష్టాలనూ తారుమారు చేస్తూ 102/175 స్థానాలను గెల్చుకున్న తెలుగుదేశం పార్టీ తరపున 2014 జూన్ 08 మొదలు 2019 మే 29 వరకు (32)నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర దేశపు ముఖ్యమంత్రి అయ్యారు.తెలంగాణ ఏర్పాటు ఉద్యమ కాలంలో ప్రతి క్షణం కేసీయారు  మొదలు వీధి స్థాయి తెరాసా కార్యకర్త వరకు ఆంధ్రలో తమ మిత్రబాంధవసచివుడైన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి "తెలంగాణ ద్రోహి!","ఆంధ్రప్రదేశ్ విభజనకు మూలకారణం" అని తిట్టీ తిట్టీ ఎన్ని పోస్ట్ హైప్నటిక్ సజెషన్లు ఇచ్చినప్పటికీ ఆంధ్ర వోటర్లు వాళ్ళ రాక్షసమాయల్ని పసికట్టి కీలకమైన ఎన్నికలో అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

అమరావతికి, 2015 అక్టోబర్ 22న భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శంకుస్థాపన జరిగింది.అప్పుడే అమరావతిని ప్రపంచ స్థాయి నగరం కింద తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని వివరిస్తే అతిధులు ఆనందించి ఆశీస్సులు ఇచ్చారు. ఏప్రిల్ 2016 నాటికి చంద్రబాబు అమరావతి పక్కనున్న వెలగపూడి నుంచే పరిపాలన మొదలుపెట్టాడు.మార్చి ఇరవయ్యేడుకల్లా లెజిస్లేచర్ అసెంబ్లీ భవనం పూర్తయ్యింది.అక్టోబరు నాటికి ఉన్నతాధికారులు తమ శాఖలలో కూర్చుని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.కేవలం ఒక్క సంవత్సరంలోనే ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ, నిక్కచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భౌతికపరమైన శరీరం అనదగ్గ అన్ని మంత్రిత్వ శాఖలూ వెలగపూడిలో కనిపిస్తున్నాయి.అప్పటికే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయ్యింది.

అయితే ఇది ప్రపంచస్థాయి రాజధాని కాదు కదా, ఈ తాత్కాలిక నిర్మాణాలని చూపిచటం మోసం చెయ్యటమే కదా అనేవాళ్ళకి ఒకటే జవాబు - ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రిటైరయ్యాక తన కలల భవంతిని నిర్మించుకోవాలంటే శంఖుస్థాపాన చేసిన వెంటనే గృహ ప్రవేశం చెయ్యలేడు కదా, మరి ఆలోపు అతను ఆరుబయట ఉండలేడు కదా, తను కట్టుకోబోయే ఇంటికి దగ్గిర్లో ఒక అద్దె ఇంటిని తీసుకుని సర్దుకుపోవడం లేదా!

తాత్కాలిక నిర్మాణాలను ఇలా ఉంచితే అసలైన రాజధానిని నిర్మించడాన్ని ascendas అనే సింగపూర్ సంస్థకి అప్పగించారు.ఇది అర్బన్ డెవలప్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న సంస్థ.ఆరు నుంచి ఏడు సంవత్సరాలలో పూర్తి స్థాయి అమరావతి నగర నిర్మాణం కోసం టార్గెట్ పెట్టారు.ఆలస్యం జరిగితే కంపెనీ మనకి నష్టపరిహారం ఇచ్చే క్లాజు కూడా చేర్చారు.వీళ్ళు వచ్చి నిర్మాణాలు మొదలుపెట్టారు.చాలా వేగంగానే పనిచేస్తున్నారు.అమరావతి అనే ప్రాజెక్టు విలువ 33,000 కోట్లు.HUDCO సంస్థ 7500 కోట్లు పెట్టుబడి పెట్టింది.ప్రపంచ బ్యాంకు కూడా తన వంతు సహాయం కింద 300 మిలియన్ల USD పెట్టుబడి పెట్టింది.కేంద్రం కూడా ముందుకు వచ్చి 2500 కోట్ల వరకు నిధులు కేటాయించింది, అందులో 1500 కోట్లు గ్రాంటు కింద విడుదల కూడా చేసింది.ఇక రాష్ట్రప్రభుత్వం తన వంతు 500 కోట్లను ఇందులో పెట్టింది.ఇది జమాఖర్చుల వివరం అయితే ఆకారం ఎలా ఉంటుందో చూస్తే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన రాజధాని నగరం ఇంకెక్కడా లేదనిపించేటట్టు ప్లాన్ చేశారు.అమరావతి అనేది ఒక నగరం కాదు, తొమ్మిది నగరాలతో కూడిన మహేంద్రనగరం!

ఇప్పటివరకు రాజధానులను నిర్మించినవారిలో ఎవరికీ ఇలాంటి వూహయే రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు - పూర్తయిన అమరావతిలో నివసించడానికి ఎంతో అదృష్టం కావాలని అనిపిస్తుంది ఇందులో ఇమిడ్చిన అంశాలను చూస్తే! ఇరుగువాళ్ళ పొరుగువాళ్ళ అక్కడివాళ్ళ ఇక్కడివాళ్ళ ఈర్ష్యాదృష్టులు తగిలి అంత గొప్ప నగరంలో నివసించే అదృష్టం ఆంధ్రులకు లేకనే చంద్రబాబు నాయుడు గారు వోడిపోయి జగన్మోహన రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారేమో అనిపిస్తున్నది నాకు!

Sports City, Media City, Health City, Justice City, Finance City, Tourism City, Knowledge City, Electronics City వంటి స్వయం నిర్ణయాత్మక శక్తి కలిగినవి, మొత్తం రాష్ట్రానికి తేజస్సునీ ఓజస్సునీ రాజసాన్నీ గర్వాన్నీ ఇవ్వగలిగినవి, దేవసభలోని ఐరావతాలతో మాత్రమే పోల్చగలిగినవి - వికసిత మానవాత్మలు నిత్యం ప్రఫుల్ల వదనాలతో సంచరించే కల్పవృక్షాలు అవి!ఆరోగ్యం అనగానే గుర్తొచ్చే మెడికల్ కాలేజిలు, అన్ని రకాల సౌకర్యాలూ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్, పిలవగానే "కుయ్యి కుయ్యి"మంటూ వచ్చే ambulance సౌకర్యాలు - అన్నింటినీ ఒకచోట చేరిస్తే సాధారణం నుంచి అత్యవసర వైద్యసేవల్ని ఎంత త్వరగా అందించవచ్చునో వూహించుకోండి.

ఇవన్నీ పక్కాగా జరగాలి కాబట్టి Norman Fostar అనే సంస్థనీ Haffez Contractor అనే సంస్థనీ NRDC అనే సంస్థనీ సంప్రదించి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు అప్పగించారు.వీటిలో వేటిలోనూ A1, A2 స్థాయి నేరచరిత్ర ఉన్నవారు లేకపోవడం వల్లనే ప్రస్తుత ప్రభుత్వానికి ఆయా కంపెనీల పట్ల అంత వ్యతిరేకత వస్తున్నదేమో మరి!ఇక అమరావతి రైల్వే స్టేషనును గుంటూరు, తెనాలి, విజయవాడ  వంటి ప్రముఖమైన రైల్వే స్టేషన్లకు అనుసంధానించే ప్రాజెక్టు కూడా మొదలైంది - దీనికయ్యే ఖర్చు పదివేల కోట్లు, సెంట్రల్ గవర్నమెంటుతో మాట్లాడి ఒప్పించి పనులు మొదలు పెట్టారు.

కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ బ్రాంచీల్ని ఇక్కడ తెరిచాయి.వీటిలో ప్రముఖమైన వాటిని మాత్రమే నేను చెప్తున్నాను.మొత్తం చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది.Pi Data centre - ఇది ఆయియా ఖండంలోనే నాల్గవ ర్యాంకులో ఉన్న అతి పెద్ద ఫెసిలిటీ సెంటర్ - అమరావతిలో తమ సంస్థను పెట్టడానికి వాళ్ళు 600 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధపడ్డారు!HCL - భారతదేశంలో అతి పెద్ద కంప్యూటర్ సంబంధిత సేవలు అందిస్తున్న కంపెనీ - అమరావతిలో క్యాంపస్ పెట్టడానికి భూమిని కొన్నారు!BRS Medicity - 1.8 మిలియన్ డాలర్లు అమరావతిలో తమ సంస్థను పెట్టడానికి కేటాయించుకున్నారు, ప్రభుత్వం స్థలం ఇచ్చింది, పనులు చేస్తూ కొనసాగుతున్నారు!ఇదీ 2014 నుంచి 2019 మధ్య అయిదేళ్ళలో ప్రపంచ స్థాయి గల ప్రముఖ వాణిజ్య సంస్థలు అమరావతిని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అని గుర్తించి చూపిస్తున్న నమ్మకంతో కూడిన అభిమానం.

చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూనే పోలవరం పనుల్ని వారానికోసారి సమీక్షిస్తూ శరవేగాన నడిపించారు.అది పూర్తవడానికి చాలాకాలం పడుతుంది కాబట్టి మొదట పట్టిసీమని రికార్డు టైంలో పూర్తి చేసి రాయలసీమకి అందించారు.నిలవలో వచ్చిన రాష్ట్రం కాదు.అక్షరాల 73, 856 కోట్ల అప్పుతో విడిపోయింది.ప్రత్యేక హోదా ఇవ్వలేదు.తనే పూనుకుని ప్యాకేజీ తయారు చేస్తే బాబు-జైట్లీ-ప్లాను అని పేరు తగిలించుకున్నారు గానీ దాని ప్రకారం నిధులు ఇవ్వటానికి మాత్రం రోజుకోసారి యేడ్చి చచ్చారు, వాళ్ళ బాబుగాడి ముల్లె యేదో వాళ్ళ సొంత జేబుల్లోనుంచి తీసి ఇస్తున్నట్టు పూటకోసారి లెక్కలు అడిగారు.

2014 నుంచి 2019 మధ్య అయిదేళ్ళలోనే SRM University, VIT AP,AMITY UNiversity,Amriita University వంటి ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయి,స్థలాలు కొనుక్కున్నాయి, భవనాలు కట్టుకున్నాయి, పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా మొదలుపెట్టాయి.ఇంక అమరావతి అనంతపూర్ హైవే, దీన్ని క్రాస్ చేస్తూ కడప కర్నూలును కలుపుతూ వెళ్ళే ఫీడర్ వే - విల్లునుంచి ఎక్కుపెట్టిన బాణంలా ఉండి 16వ జాతీయ రహదారితో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాలను కలిపేస్తున్న పనులు మొదలయ్యాయి.ఇది హైదరబాదు ఔటర్ రింగు రోడ్డుకి బాబు లాంటిది!

అయితే, ఇన్ని అద్భుతమైన విజయాల తర్వాత 2019 నాటి ఎన్నికలు 23/175 అసెంబ్లీ సీట్లనీ 03/25 లోక్ సభ సీట్లనీ మాత్రమే ఇచ్చేసరికి అశ్శరభ తశ్శరభ అంటూ తను నిద్రపోకుండా అధికారుల్నీ నిద్రపోనివ్వకుండా పడిన కష్టం సాంతం బూడిదలో పోసిన పన్నీరు చందం అయిపోయింది - 2004 నాటి లాగే 2019 నాడు కూడా అభిమానులు "నువ్వు వోడిపోవటం ఏంటయ్యా!" అని ఘొల్లుమన్నారు.

చంద్రబాబు నాయుడు గారికీ తెలుగుదేశం అభిమానులకీ అర్ధం కావడం లేదేమో గానీ 2004, 2019 ఎన్నికల ముందువెనుకలను పరిశీలించి చూస్తే అప్పుడూ ఇప్పుడూ జరిగిన మోసం ఏమిటో అర్ధం అయింది నాకు.

అప్పుడు యె.సం.రాజశేఖర రెడ్డి గారు 2003 ఏప్రిల్ 09న పాదయాత్ర అని పిలుచుకునే "ప్రజా ప్రస్థాన యాత్ర" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుంచి మొదలై రంగా రెడ్డి, మెదక్, నిజామాబద్, కరీమ్నగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం తదాది 11 జిల్లాలను దాటుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద 2003 జూన్ 15న ఆగింది, మొత్తం నడిచినది 1,475 Kms!చంద్రబాబు నాయుడు గారు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ భయంకరమైన అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.మీదు మిక్కిలి ఎన్నికల వేళకు భారతీయ జాతీయ కాంగ్రెసు పార్టీ, భారత జాతీయ కమ్యూనిష్టు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిశారు.అభిమానులూ ప్రచార కర్తలూ రాజశేఖరరెడ్డి గారిలోని ఫ్యాక్షనిస్టుని సూపర్ మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

ఇప్పుడు యె.సం.జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 06న పాదయాత్ర అని పిలుచుకునే "ప్రజా సంకల్ప యాత్ర" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - కడప జిల్లాలోని YSR Ghat నుంచి మొదలై 341 రోజులపాటు 124 బహిరంగ సభలతో 55 సామాజిక ముఖాముఖిలతో మొత్తం 178 నియోజక వర్గాలలో 130 నియోజకవర్గాలను చుట్టుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద 2019 జనవరి 09న ఆగింది, మొత్తం నడిచినది 3,648 Kms.చంద్రబాబు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.మీదు మిక్కిలి ఎన్నికల వేళకు భారతీయ జనతా పార్టీ, యుశ్రారై కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిశారు.అభిమానులూ ప్రచార కర్తలూ జగన్మోహన్ రెడ్డి గారిలోని ఫ్యాక్షనిస్టుని సూపర్ మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

అప్పుడూ ఇప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఓడిపోవటం ఆసంభవమని అనుకుంటున్న తనను ఒకే రకం శత్రు కూటమి ఏర్పడి ఓకే రకం ప్రచార వ్యూహం అనుసరించి అంత దయనీయమైన ఓటమికి గురి చేశాక కూడా తనను రెండు సార్లు ఓడించిన కీలకం ఏమిటో తెలుసుకోలేని చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ఎలా గెలుస్తారు?రెండవసారి అదే రకం శత్రు కూటమి ఏర్పడి అదే రకం ప్రచార వ్యూహం అనుసరిస్తున్నప్పుడు కనిపెట్టలేని తెలుగుదేశం పార్టీ అభిమానులు వైకాపా చెప్పిన అబద్ధాల్ని నమ్మి మోసపోయారని ఆంధ్ర వోటర్లని నిదించడం దేనికి?

అప్పటికే పొరుగు రాష్ట్రం నుంచి అక్కడి ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినందుకు పగబట్టిన Telangana Rashtra Samithi (TRS) అధ్యక్షుడు "The people of the state will give him a guaranteed gift - a well deserved rest." అని బల్లగుద్ది చెప్పేశాడు.మరి, ఇక్కడ అధికారంలో ఉండి తన ప్రతికూలతలను తను తెల్సుకోలేక పోవడం ఏమిటి?భారతీయ జనతా పార్టీ, యుశ్రారై కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిసినప్పుడు గెలుపు నల్లేరు మీద బండి నడక అని ఎలా అనుకున్నారు?

అలా చంద్రబాబు నాయుడు గారి తర్వాత 2019 మే 30న ముఖ్యమంత్రి అయిన జగన్మోహన రెడ్డి గారు నేటి 2020 ఆగస్టు 05 నాటికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.జగన్మోహన రెడ్డి గారు 2004 నాటి ఎన్నికల్లో ప్రచారసభల్లో పాల్గొని రాజకీయ రంగప్రవేశం చేశారు.2009లో కడప నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యు డయ్యారు.తండ్రి చనిపోయిన మరుక్షణమే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ అయిన ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఇతనెంత పట్టుదలతో శ్రమించాడో వారంత పట్టుదలతో తిరస్కరించేశారు.

తిరస్కరించడంలో అధిష్ఠానం తప్పు ఎంత మాత్రం లేదు.అప్పటికి జగన్మోహాన్ రెడ్డి గారి వయస్సు 37 మాత్రమే.ఇంత చిన్న వయస్సు వాడు ఎకాఎకిన ముఖ్యమంత్రి అయిపోయి తనకన్న వయస్సులోనూ అనుభవంలోనూ మిన్నయిన వారిమీద అధిపత్యం చెలాయించడం మర్యాద కాదు గద!నీలం సంజీవ రెడ్డి గారి నుంచి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి వరకు దాదాపు అందరూ తమ యవ్వన కాలంలోనూ నడి వయస్సులోనూ రాజకీయాలలోకి వచ్చినవారే.అయినా సరే, పార్టీ అప్పగించిన బాధ్యతల్ని సక్రమమైన రీతిలో నెరవేరుస్తూ  దీర్ఘ కాలం పాటు సీనియర్ నాయకుల ముఖ్యమంత్రిత్వంలో మంత్రి పదవుల్ని తీసుకుని అనుభవం గడించి ఎప్పటికో ముఖ్యమంత్రులు కాగలిగారు.కొన్ని దశాబ్దాల తరబడి ఏ పదవిలోనూ లేని పార్టీ పనుల్లోనే బతికిన వయోవృద్ధులు కూడా ఉన్నారు.అలాంటిది లేడికి లేచిందే పరుగన్నట్టు పార్టీలో చేరిన నాలుగేళ్ళకే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపట్టటం అన్యాయం,అక్రమం,అమర్యాద కాదూ!పోనీ, వయసు హుషారు కాబట్టి ముచ్చట పడ్డాడని అనుకోవటానికీ వీల్లేదు.ముఖ్యమంత్రి పదవే కావాలని మంకుపట్టు పట్టాడు, ఇవ్వకపోయేసరికి పార్టీనుంచే బయటికి పోయాడు.పోటీగా పార్టీ పెట్టి కాంగెసు పార్టీని నష్టపెట్టాడు.ఎందుకంత మంకుపట్టు?ఎందుకింత పిచ్చితనం?

తన ముఖ్యమంత్రిత్వాన్ని మెజార్టీ సభ్యులు కోరుకుంటున్నారే అనుకోండి,అధిష్ఠానం కుదరదని అన్నప్పుడు రాజీపడి రోశయ్య గారి ముఖ్యమంత్రిత్వంలో కీలకమైన శాఖని తీసుకుని అనుభవం గడించి అప్పుడు తన పనితనం చూపించి తన ముఖ్యమంత్రిత్వం వల్ల పార్టీకి వచ్చే లాభాల్ని చూపించి మరోసారి ప్రయత్నించాలని ఎందుకు అనుకోలేకపోయాడు?తండ్రి రాజశేఖర రెడ్డి సైతం ముప్పయ్యో యేటి నుంచే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పటికీ తనలా పోట్లాడి బైటికి పోక పార్టీలోనే ఉండి నిత్య అసమ్మతి వాదిలా ప్రయత్నించి ప్రయత్నించి ఆఖరికి యాభై దాటాకనే గోల్ కొట్టగలిగాడు - మరి ఇతని కేమైంది?

కొడుకే కాదు, తండ్రి కూడా సీనియర్ల ముఖ్యమంత్రిత్వంలో కీలకమైన శాఖని తీసుకుని అనుభవం గడించి అప్పుడు తన పనితనం చూపించి తన ముఖ్యమంత్రిత్వం వల్ల పార్టీకి వచ్చే లాభాల్ని చూపించి మరోసారి ప్రయత్నించాలని ఎందుకు అనుకోలేకపోయాడు?ఇస్తే ముఖ్యమంత్రిత్వం తీసుకోవాలి, ఇవ్వకపోతే నక్కలు బొక్కలు వెదికినట్టు సీనియర్ల మీద అవినీతి ఆరోపణల్ని చేసి పార్టీ పరువుని నడిబజార్న పడేసి పైరవీ ఆటలు ఆడుకోవాలని ఎందుకు అనుకున్నాడు?

అసలు వాళ్ళిద్దరే కాదు, politically motivated devout Christians(see Kanche Ailayya, Kadiri Krishna etc.) ఎవరూ క్రైస్తవేతరులు తమకన్న పైన ఉండి తమమీద అధికారం చెలాయించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోరు.బైబిలులో చాలాచోట్ల వాళ్ళ దేవుడు తనని నమ్మితే తనకి దహనబలులు ఇస్తే వాళ్ళకి అతీత శక్తుల్ని ఇచ్చి తనే ముందుండి యుద్ధం చేసి వాళ్ళ శత్రువుల్ని చంపేసి ఆ రాజ్యాల్ని అప్పగిస్తానని వాగ్దానం చేస్తాడు.

రాజశేఖర రెడ్డి గారికన్న భిన్నమైన శైలిలో జగన్మోహన్ రెడ్డిగారి క్రైస్తవీకరణ ఉంటుంది.ప్రస్తుతం జరుగుతున్నది కాంగ్రెసు పార్టీ పెంచిన రెడ్డి కుల నాయకులకు పోటీగా రామారావు మొదలు చంద్రబాబు నాయుడు గారి వరకు పెంచిన నిమ్న కులాల నుంచి పైకెదిగిన బలమైన నాయకుల్ని తుదముట్టించడం.తర్వాత ఇతర ప్రాంతాల నుంచి లాక్కున్న అస్సైండ్ భూముల్నీ బీజేపీ సహకారంతో రాజధాని రైతుల నుంచి లాక్కున్న భూముల్నీ మొదట రాయలసీమలోని తమ లాయలిస్టులకి పందేరం చేస్తారు.తర్వాత వీళ్ళ ట్రైనింగుతో ఎక్కడికక్కడ తమకు లాయలిస్టులను ఏర్పాటు చేసుకుంటారు.ఈ రెండవ దశ పూర్తయ్యాక అప్పుడు మొదలుపెడతారు మధ్యయుగాల నాటి క్రూసేడ్ల తరహా మతమార్పిడి తతంగాన్ని.రాజశేఖర రెడ్డి గారు అయిదేళ్ళ పాటు అంత బహిరంగ మతమార్పిడి చేస్తుంటే ఆపలేనివాళ్ళు ఇప్పుడు ఆపగలుగుతారనుకోవడం మూర్ఖత్వమే!

కొందరు తెలుగుదేశం అభిమానులైన విశ్లేషకులు అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డిగారు చేస్తున్నవి అనాలోచిత చర్యలు కావు, వాటి వెనకాల గొప్ప వ్యూహనిర్మాణ చాతుర్యం ఉంది - ఎవరూ నన్నేమీ చెయ్యలేరనే ధైర్యంతో చేస్తున్నారు.తమ వైపునుంచి ఎంత బలమైన కారణంతో చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు 2019లో జగన్మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చేలా చేసిన తప్పుకి ఫలితం యేమిటంటే, కోర్టుల నుంచి వచ్చిన ఒత్తిడితో సహా ఎంత బలమైన కారణం ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన మరుక్షణం ఆంధ్రలో రక్తపుటేరులు పారడం ఖాయం - పాస్టరు విజయ కుమార్ దగ్గిర్నుంచి వాటికన్ పోపు వరకు ప్రపంచ క్రైస్తవ సమూహం అతని వెనక నిలబడి తీరుతుంది!

2014 నుంచి 2019 మధ్య రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు చంద్రబాబుని పొమ్మనకుండా పొగబెట్టినట్టు చిత్ర హింసలు పెట్టి తన్ని తగిలేసి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించడానికి పైకి కనిపిస్తున్న "చంద్రబాబు పోలవరాన్ని ఏటీయంలా వాడుకోవటం,రాజధాని విషయంలో అవినీతికి పాల్పడటం" వంటివి గాక వాళ్ళకి రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న వ్యాపార సహకార రాజకీయ  బంధుత్వాలే కారణం అనుకుంటున్నాను నేను.

తెర ముందు కనిపిస్తున్న సన్నివేశాలను బట్టి భాజపా- వైకాపా మధ్యన తెర వెనుక జరుగుతున్న వ్యవహారం అందరూ అనుకుంటున్నట్టు కేసుల భయంతో ఇతను వాళ్ళకి లొంగితే చంద్రబాబును భూస్థాపితం  చెయ్యటానికి వాళ్ళు వాడుకోవటం గాక జగన్మోహన రెడ్డి గొప్ప వ్యూహనిర్మాణ చాతుర్యం ప్రదర్శిస్తూ భాజపా నేతలకి చంద్రబాబు మీద ఉన్న కసిని ఉపయోగించుకుని వాళ్ళ మీద ఆధిపత్యం సాధించి వాళ్ళనుంచి తనకు కావలసిన సహాయాల్ని పొందుతున్నట్టు కనిపిస్తున్నది నాకు.

ఇవ్వాళ అధికారం కోసం పోటీ పడుతున్న పార్టీలలో జగన్మోహన రెడ్డి పార్టీ వాళ్ళు తప్ప ఆంధ్ర ప్రాంతపు ప్రజాబాహుళ్యపు సామాజిక సమీకరణాలను రాష్ట్ర విభజనకు ముందులాగే ఉన్నాయి అనుకుంటూ గందరగోళానికి గురై తప్పుడు వ్యూహాలను పన్నుతున్నారు.తెలుగుదేశం పార్టీ వాళ్ళు A1,A2లను మాత్రమే టార్గెట్ చేసుకుని వాళ్ళిద్దరి మీద వ్యక్తిగత విమర్సలు చేస్తూ తమను సెక్యులరిస్టులుగానూ ఆదర్శవాదులుగానూ ప్రొజెక్ట్ చేసుకుంటే చాలు ప్రజలు అధికారం కట్టబెడతారని అనుకుంటున్నారు. భాజపా వాళ్ళు జగన్ క్రైస్తవాన్ని రగిలిస్తున్నాడని చెప్పి హిందూత్వని రగిలిస్తే మెజారిటీ హిందువులు తమవైపుకు వచ్చేస్తారని అనుకుంటున్నారు. పొరపాటు!మెజారిటీ హిందువుల వైపున చంద్రబాబు,సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ వీళ్ళ వోట్ల కోసం పోటీ పడితే వోట్లు చీలి మైనారిటీల వైపున జగన్మోహన రెడ్డి ఒకే ఒక్కడు ఉండటం వల్ల అన్ని వోట్లూ జగనుకే వెళ్తాయి.

రాష్ట్రంలో బ్రాహ్మణ జనాభా 4.9 క్షత్రియ జనాభా 1.9%శాతం ఆర్యవైశ్య(కొమట్ల) జనాభా 2.9% శాతం వేలమ జనాభా 4.5 శాతం మంది.కాపు జనాభా 16.2%శాతం. కమ్మ జనాభా 5.5%శాతం.రెడ్డి జనాభా 8.5%శాతం ఉంటే అందులో 4.5 మంది రెడ్లు క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు, ఇది చాలా మందికి తెలియదు. దళిత జనాభా 2.0 కోట్లు ఉంటే అందులో సగం మంది క్రిస్టియన్ మతానికి convert అయ్యారు.ఇప్పుడు జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న అండదండలతో క్రైస్తవీకరణ శరవేగంగా పెరిగింది, పెరుగుతున్నది.

వీళ్ళందరూ మర్చిపోతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్నికల గెలుపోటముల్ని నిర్ణయించే స్వింగ్ ఫ్యాక్టర్ 4 శాతం ఎటువైపు మొగ్గు చూపితే అటు వైపు వాళ్ళు గెలిచే పరిస్థితిలో విజయావకాశాలు జగనుకే ఎక్కువ ఉన్నాయి. హిందూ పార్టీలు అన్నీ ఇదే రకం రాజకీయాలను కొనసాగిస్తే కాలం గడిచే కొద్దీ విజయావకాశాలు అతని వైపుకే మొగ్గు చూపుతాయి.కానీ, వ్యాపార లావాదేవీలూ వ్యక్తిగత అహంభావాలూ వీళ్ళని కలవనివ్వవు.

తండ్రి విషయంలో జరిగినట్టు ప్రకృతి శక్తులు రంగంలోకి దిగితే తప్ప మానవమాత్రుడు ఎవడూ మోసంలోనూ క్రౌర్యంలోనూ తండ్రిని మించిన తనయుడి అరాచకత్వాన్ని నిలువరించలేడనేది వ్యాసపరాశరాది చతుర్యుగ పర్యంతం ఉన్న ఆచార్య పరంపర పాదాలకు నమస్కరించి మూడు కాలాలనూ ముడివేసి చూడగలిగిన నేను చెప్తున్న పరమ సత్యం.ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది.ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది.

సత్యం శివం సుందరం!!!

4 comments:

  1. తమరి తండ్రిగారు ఎలా చనిపోయారు?

    ReplyDelete
    Replies
    1. చాలా ప్రశాంతమైన చావు!

      రాజశేఖార్ రెడ్డి గారి లాంటి నీచులకే దుర్మరణాలు వస్తాయి!మా వూరి మాలపల్లెలో మూడు శిలా విగ్రహాలు ఉన్నాయి.జాతీయ స్థాయి నాయకుడైన అంబేద్కర్, రాష్ట్ర స్థాయి నాయ్కుడైన యడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి, మా నాన్నగారు.హిందూ సంపర్దాయంలో పాడెను ఇంటి దగ్గిర పైకి లేపితే స్మశానం వైపుకి తప్ప ఇంకొక వైఉకు పోనివ్వరు, నేల మీద దించరు.కానీ వాళ్ళ అభిమానం వల్ల మాలపల్లి తీసుకెళ్ళి చర్చి ముందు నిలబెట్టి ప్రార్ధనలు కూడా చేయించాం.ఒక్కొక్కళ్ళు వాళ్ళింట్లోని చిన్నపిల్లల్తో మా నన్నగారి భౌతిక దేహానికి దణ్ణాలు పెట్టించారు!

      మీలాంటి అధములు నా కాలిగోటిని కూడా పీకలేరు నేలబారు కామెంట్లతో.కరిస్రవం చక్కగా పాటించుకునే మంచివాళ్ళతో నాకు పేచీ లేదు.కానీ, హేతువాదం ముసుగు కప్పుకుని హిందూమతం మీద విషం కక్కే మీలాంటి అధముల్ని మాత్రం ఒక్కణ్ణి కూడా వదలను, నరికి పోగులు పెడతాను.

      Delete
  2. Mee posts tho frustration .Meeru entha gaa feel Ithe Alaa react avuthunnaaro? Mee research ki Johar.*

    ReplyDelete
    Replies
    1. నీ మనస్సులో ఉన్న ఫ్రష్ట్రేషన్ మాటేమిటి?

      ఫ్రస్ట్రేషన్ ఉన్నవాడు అంత రీసెర్చి చెయ్యడం సాధ్యమా?నువ్వు ట్రై చేసి చూడు. ఇక్కడ హరిబాబు భవిష్యత్తుని వూహించి చెప్పలేదు.జరిగిన వాట్నే రాశాడు.ఏ సన్నివేశాన్నీ మార్చలేదు.ఉద్రేకాలు పెంచే ఆవేశపూరితమైన భాషనీ వాడలేదు.ఎవడి మీదా అనవసరమైన సానుభూతి చూపించలేదు.ఆయా నాయకుల తప్పొప్పుల్ని కూడా ఏది ఎంతవరకు చెప్పాలో లెక్క ప్రకారమే చెప్పాడు.అయినా మీకు ఫ్రస్ట్రేషన్ కనిపించింది - ఎందుకలా?

      "హరిబాబు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి రాశాడు,అంతే!ఇవేవీ నిజాలు కావు" అని పిడుగు మోతకి దడుచుకుని వీపు బాదుకుంటూ అర్జున నామాలు తల్చుకుంటూ ఫ్రస్ట్రేషన్ని దాచుకునే టెక్నిక్ ఇది.

      నీ ప్లేసులో చిరు డ్రీంస్ ఉంటే ట్రోలింగు కామెంట్లు వేస్తూ అదీ ఇదీ కార్చుకుని శునకానందమ్‌ని పొందేవాడు - సిగ్గు లేని జన్మాలు,ధూ!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...