Wednesday 28 March 2018

ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయాలు - తిరుమల

1.ఆలయం పేరు (Name of the temple)
శ్రీ వేంకటేశ్వర స్వామి 
2.ఆలయ చరిత్ర (history of the temple)
          చారిత్రక పరంగా చూస్తే తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారమైన ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు.ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారికి మామగారైన ఆకాశరాజుకు సోదరుడు.
          కలియుగంలో భక్తులను తరింపజేయటానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి తిరుమలను కలియుగ వైకుంఠంగా నిలబెట్టాడు.ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వారించి నిలబెట్టినాడు.అప్పుడు వారిరువురి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది.శ్రీమహావిష్ణువు వారి దగ్గిరకి వచ్చినప్పుడు వారిరువురు ఎవరి గొప్పతనం వారు చెప్పుకుంటూ ఉంటే వారికి గర్వభంగం కలిగీంచాలని ఒక పరీక్ష పెడతాడు.మేరుపర్వతం ఉత్తరభాగంలో ఉన్న ఆనందశిఖరాన్ని గట్టిగా చుట్టుకోమని ఆదిశేషునికి చెప్పి వాయుదేవునితో ఆ పర్వతాన్ని అక్కడ నుంచి కదల్చగలవేమో ప్రయత్నించమని చెబుతాడు.

         ఈ పరీక్షలో తన బలాన్ని ప్రదర్శిస్తున్న వాయుదేవుని ధాటికి సమస్త లోకాలూ తల్లడిల్లుతుంటే బ్రహ్మ అభ్యర్ధన మేరకు ఆదిశేషుడు తన పట్టును కొంచెం సడలిస్తాడు.అంతట వాయుదేవుని ప్రభావం వల్ల ఆనంద శిఖరం కదిలిపోయి సర్వముఖి నది ఒడ్డున పడుతుంది.ఇది తెలిసి ఆదిశేషుడు బాధ పడుతుంటే బ్రహ్మ ఆ వేంకటాద్రిలో నిన్ను విలీనం చేస్తాను, అక్కడ శ్రీమహావిష్ణువు వెలుస్తాడు అని చెప్పి సముదాయించాడు. ఆదిశేషుడు విలీనం అయిన వేంకటాద్రి మీద విష్ణువు  పడగ అయిన శేషాద్రి పైన శ్రీనివాసుడుగా, మధ్యభాగమైన అహోబిలంలో శ్రీ నారసింహ స్వామిగా వెలిస్తే తోకభాగమైన శ్రీశైలంలో శివుడు శ్రీమల్లికార్జునుడుగా వెలిశారు అని పురాణాలు చెబుతున్నాయి.
          ఇది ఆదిశేషుడు తిరుమలగిరిగా నిలిచి ఉండటానికి సంబంధించిన కధ,ఇక శ్రీమహావిష్ణువు శ్రీనివాసునిగా అవతరించటానికి మరొక కధను చెబుతారు. ఒకానొకప్పుడు ఋషివర్యులు ఒక యజ్ఞఫలాన్ని అందుకోవడానికి త్రిమూర్తులలో సత్వరజస్తమో గుణాలను అధిగమించిన శ్రేష్ఠునికి ఇవ్వాలని నిశ్చయించారు.అది తేల్చుకొనడానికి అరికాలిలో మూడవ నేత్రం ఉన్న త్రిలోక సంచారి భృగు మహర్షిని నియోగించారు. భృగు మహర్షి మొదట సత్యలోకం వెళ్ళాడు.అక్కడ చతుర్ముఖుడు సృష్టికార్యంలోనూ వాగ్దేవి కచ్చపీ గానంలోనూ లీనమై ఉండి ఇతని రాకను గమనించనే లేదు.బ్రహ్మ తమోగుణాన్ని ప్రదర్శించాడు గనక ఆలయదైవంగా ఉండే అర్హత లేదని శపించి నిరాశతో అక్కడి నుండి కైలాసం వెళ్ళాడు భృగు మహర్షి.అక్కడ శివపార్వతులు ఆనందనృత్యం చేస్తూ ఇతనిని గమనించకపోవడంతో నిరాశ ఆగ్రహంగా మారింది.శివుడు రజోగుణాన్ని ప్రదర్శించాడని భావించి మూర్తిపూజకు తగడని శపించి అసహనంతో అక్కడి నుండి బైటపడి వైకుంఠం దారి పట్టాడు.

          వైకుంఠం చేరిన భృగు మహర్షి అక్కడ శేషతల్పం మీద పవళించి ఉండి శ్రీమహాలక్ష్మి పాదాలు ఒత్తుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూసి ఆగ్రహం పట్టలేక పాదంతో గుండెలపైన తన్నినాడు.శ్రీమహావిష్ణువు ఏమాత్రం కోపాన్ని ప్రదర్శించకుండా లేచి కూర్చుని భృగువును ఆదరించి ఆసనంపై కూర్చుండబెట్టి సేవలు చేస్తూ భృగువు పాదంలోని మూడవ నేత్రాన్ని చిదిమివేశాడు.దానితో భృగువు అహంకారమూ నశించింది,త్రిమూర్తులలో యజ్ఞఫలానికి విష్ణువే అర్హుదని తెలిసింది.
          అయితే లక్ష్మీదేవి తన నివాసస్థలాన్ని తన్నిన భృగువు చేసిన అవమానాన్ని సహించలేక అతనిని శిక్షించని భర్తపైన కూడా ఆగ్రహించి ఆవెదనతో వైకుంఠం విడిచి వెళ్ళింది.శ్రీమహావిష్ణువు యదార్ధం తెలపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శ్రీమహాలక్ష్మి భర్త ఎంత నచ్చజెప్పినా సమాధాన పడలేక భూలోకానికి దిగివచ్చి తన పుట్టినింటికి సమమైన గొల్లాపురం చేరి తపోనిష్ఠలో ఉండిపోయింది.లక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేక నారయణుడు కూడా వైకుంఠం విడిచి భూమిపై అడుగుపెట్టి వరాహగిరిపై వెలసిన ఆది వరాహమూర్తిని కొంతకాలం అక్కడ నివసించటానికి అనుమతి పొంది ఒక పుట్టలో అమరి తపోధ్యానంలో మునిగిపోయాడు.

          శ్రీహరి ఆకలిని తీర్చడానికి ఈశ్వరుడూ బ్రహ్మదేవుడూ గోవత్సములుగా మారితే పార్వతి వాటిని వరాహగిరి ఉన్న ప్రదేశానికి రాజైన చోళ మహారాజుకు సమర్పించింది.రాజుగారి ఆలమందలో చేరిన బ్రహ్మమహేశ్వరులు విష్ణువు తపస్సు చేసుకుంటున్న పుట్టపైన పాలధారను కురిపించి అతని ఆకలిని తీర్చసాగారు.కొత్తగా వచ్చిన ఆవు పాలివ్వడం లేదని తెలిసి పశువుల కాపరి వాటిని రహస్యంగా వెంబడించి విషయం గ్రహించి రాజుకు నివేదించాడు.మరుసటి రోజు ఇద్దరూ వాటి వెనక వచ్చారు.ఆవు పాలు కురిపించే దృశ్యం చూడగానే పశువుల కాపరి కోపం పట్టలేక ఆవును తన కొడవలితో కొట్టాడు.అదే సమయానికి ఆవు తప్పించుకుని పుట్టనుండి బయటకు వస్తున్న విష్ణుమూర్తి తలకు గాయమై రక్తం ధారగా కారడం మొదలైంది.
          అది చూసిన గొల్లవాడు బెదిరి మూర్ఛిల్లాడు, రాజు చెట్టుచాటు నుంచి బైటికొచ్చి క్షమించమని వేడుకున్నాడు. కానీ వేదనలో ఉన్న విష్ణుమూర్తి రాజును పిశాచమై తిరుగునట్లు శపించాడు.బహువిధాల ప్రాధేయపడిన రాజుకు మరుజన్మలో ఆకాశరాజుగా జన్మించి అతని పుత్రికయైన పద్మావతిని తను విహాహమాడినప్పుడు శాపం పోతుందని అనుగ్రహించినాడు.భువిపైన తొలిసారి తనను దర్శించిన గొల్లవానికి తన క్షేత్రంలో తొలి దర్శనం గొల్లవారికే లభిస్తుందని అనుగ్రహించినాడు. తలకు తగిలిన గాయానికి మందు కోసం వెతుకుతూ శ్రీహరి కృష్ణభజన చేసుకుంటున్న వకుళమాత ఆశ్రమం చేరాడు.అమ్మా అని పిలుస్తూ తలుపు తటిన శ్రీహరిని ఆమె గాయానికి కట్టుకట్టి శ్రీనివాసుడనే పేరు పెట్టి కన్నతల్లిలా ఆదరించింది.
          చోళ మహారాజు తన శాపవిముక్తి కోసం ఆకాశరాజుగా జన్మించి చాలాకాలం పాటు సంతానం లేక సంతానప్రాప్తి కోసం యజ్ఞం చేస్తూ యజ్ఞభూమిని దున్నుతుండగా భూమినుండి ఒక పెట్టె బయటపడింది.పెట్టెను తెరిచి చూడగా అందులో సహస్రదళపద్మంలో పరుండి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఆడపిల్ల కనిపించింది.పద్మంలో ఉండి కనిపించింది గనక పద్మావతి అని పేరు పెట్టాడు ఆకాశరాజు.పద్మావతి నవయవ్వనవతియై ఒకనాడు చెలికత్తెలను వీడి విహరిస్తూ ఉండగా ఏనుగు తరుముతుంటే అదే వనంలో వేటకోసం తిరుగుతూ ఉన్న శ్రీనివాసుడు ఆమెను రక్షించాడు.శ్రీనివాసుని వివరాలు తెలియగానే పద్మావతికి అతనిపై ప్రేమ పుట్టింది.ఆమె ఎవరో తెలియకుండానే మోహించిన శ్రీనివాసుడు సోదెమ్మ వేషంలో నగరానికి వెళ్ళి ఆమె ఆకాశరాజు కూతురని తెలుసుకున్నాడు.శ్రీనివాసుని చూసిన తదాది బెంగగా కనబడుతున్న కుమార్తె గురించి తెలుసుకోవాలని రాణి సోదెమ్మని పిలిస్తే నీ బిడ్డ వనంలో చూసిన పురుషుని ప్రేమించింది,అతడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే,సందేహం లేకుండా పెళ్ళి జరపించమని ఆ సోదెమ్మ చెప్పింది.
          దానితో ఆకాశరాజు శ్రీనివాసునితో పద్మావతికి వివాహం నిశ్చయించాడు.శ్రీనివాసుడు తన వివాహ వేడుకను తిలకించి కొత్త దంపతులను ఆశీర్వదించడానికి సకల దేవతలను శుకమునీంద్రుల వారిని పంపి ఆహ్వానించాడు.పెండ్లి ఖర్చుల నిమిత్తం కుబేరుని వద్దనుండి ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు.కలియుగాంతంలో చెల్లు చేస్తాను. అంతవరకు వడ్దీ ఇచ్చుకుంటూ వస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.మునీశ్వరులు ఆశీస్సులూ దేవతలు పుష్పవృష్టీ కురిపిస్తూ పర్జన్యుడు మంగళతూర్యనాదాలు చేస్తూ పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం కన్నులపండువుగా జరిగింది.
          నారద మహర్షి వలన శ్రీనివాసపద్మావతుల కళ్యాణవార్తను విని గొల్లాపురంలో తపస్సు చేసుకుంటున్న మహాలక్ష్మి అప్పుడు శ్రీనివాసపద్మావతులు అతిధులుగా ఉంటున్న అగస్త్యాశ్రమం చేరి తనకు జరిగిన అన్యాయం గురించి నిలదీసింది.రామావతారంలో తనకు బదులుగా అగ్నిజ్వాలలను భరించిన వేదవతియే పద్మావతి అనీ,ఆమె చేసిన త్యాగానికి ప్రతిగా ఆమెను కూడా వివాహమాడమని సీతగా తనకు మాత్రమే సాధ్యపడిన సహజసిద్ధమైన ఔదార్యంతో సూచించినప్పుడు అప్పటి ఏకపత్నీవ్రతనిష్ఠని భగ్నం చెయ్యకూడదని చెప్పి శ్రీనివాసుడిగా ఆమెను వివాహమాడతానని తను చేసిన వాగ్దానం గుర్తు చేశాడు శ్రీనివాసుడు.అంతటితో లోకమాత శాంతించి తిరిగి తన నిజనివాసమైన భర్త వక్షస్థలాన్ని చేరడంతో శ్రీనివాసుడు తిరుమల గిరిపైన తనను భక్తితో కొలిచేవారికి భవసాగరాన్ని మోకాలిలోతును మించి పైకి రానివ్వనని వాగ్దానం చేస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు.
          పద్మావతీ దేవి తిరుచానూరులో వెలిసి బ్రహ్మేంద్రాది దేవతలు సైతం ఎవరి దర్శనానికి వేత్రహస్తుల దెబ్బల్ని కూడా తట్టుకుంటూ పడిగాపులు పడుతూ ఉంటారో ఆ కందర్పదర్పహరసుందరదివ్యమూర్తిని తలచినదే తడవుగా తన వద్దకే రప్పించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నది.అప్పుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళినీ కూడా చూడలేని కొరతని ఇప్పుడు వకుళమాతగా జన్మించి తీర్చుకున్న యశోదమాతను తులసిమాలగా కంఠసీమలో అలంకరించుకున్నాడు శ్రీచక్ర శుభనిలయుడైన శృంగార శ్రీనివాసుడు!
          రామాయణ,భారత,భాగవతాది కధలలోని తన సంపూర్ణకృపకు నోచుకోని భక్తశిఖామణులను చరితార్ధులను చేస్తూ తన సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుకున్నవారికి బ్రహ్మేంద్రాదులకు కూడా సాధ్యపడని తన నిజతనుస్పర్శను కూడా ప్రసాదించిన విశేషం ఈ శ్రీనివాసుని కధలో అంతర్లీనమై ఉండి భక్తవరదుని శిష్టజనవాత్సల్యాన్ని నిరూపిస్తున్నది!
3.ఆలయ విశిష్టత (importance of the deity)
          ఇక్కడి స్వామికి ఆపద మొక్కుల వాడు అని పేరు.ఏదయినా కోరిక నెరవేరాలంటే స్వామివారికి సమర్పించడం కోసం ముడుపు కట్టుకుని ఆ కోరిక తీరగానె స్వామిని దర్శనం చేసుకుని ఆ ముడుపు కట్టిన దాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీ.

          శ్రీవారి దివ్యమంగలవిగ్రహం ఎత్తు పది అడుగులు.శిలాతోరణద్వారం ఎత్తూ ఈ ఎత్తూ సమానం - అంటే ఈ మూర్తి అలా నడుచుకుంటూ శిలాతోరణాన్ని దాటితే వంగనక్కరలేదు,తల మీద ఖాళీ ఉండదు.విగ్రహం మెద ఉలి చెక్కడపు ఆనవాళ్లు కనపడవు - ఒక మనిషి తనకు తానే శిలారూపం దాల్చినంత జీవకళ కనపడుతుంది ఆ మూర్తిలో!అసలు శిల్పులు అర్చామూర్తులని చెక్కదానికి సంబంధించిన ఆగమశాస్త్రనియమాలు ఈ మూర్తికి వర్తించవు.ఈ మూర్తి స్వయంభువు అని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలు.ఎప్పుడు ఎవరు కొలిచినా శ్రీవారి విగ్రహం యొక్క ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది.ఎన్ని రకాల నిత్యాభిషేకాలు జరిగినప్పటికీ వెంటనే ఆరిపోతాయి,ఆవన్నీ ఆరిపోయిన వెంటనే మూర్తి 110 డిగ్రీలకి చేరుకుంటుంది!
          మనం క్యూలో వెళ్తున్నప్పుడు విగ్రహం ద్వారానికి ఎదురుగా అంటే గుడి లోపల మధ్యకి ఉన్నట్టు కనబడుతుంది,కానీ వాస్తవానికి విగ్రహం గర్భగుడిలో కుడివైపు మూలన  ఉంటుంది,మరి నాకి మధ్యలో ఉన్నట్తు ఎలా కనబడుతున్నది?గర్భగుడిలోనే స్వామివారికి వెనక ఒక జలపాతం ఉంటుంది.స్వామివారికి సమర్పించిన పువ్వుల్ని బయటికి తీసుకురారు,ఆ జలపాతంలోకి విడుస్తారు.అవి అకక్ద పోగుపదవు,జలపాతం వెంబడి పోయి పోయి వేర్పేడు దగ్గిర బయటకి వచ్చి కనబడతాయి.స్వామి వెనక వైపు నుంచి ఎప్పుడూ సముద్రపు అలల హోరు వినబడుతూ ఉంటుంది.స్వామివారి వీపుని ఎన్నిసార్లు తుడిచినా సరే మళ్ళీ కొద్ది సేపట్లోనే చెమటతో తడిసినట్టు అయిపోతుంది.

          స్వామివారికి ప్రతి రోజూ పూసే పచ్చ కర్పూరం చాలా ఘాటైనది,ఒక మామూలు రాతికి రోజూ దాన్ని పూస్తే కొద్ది రోజులకే పగుళ్ళు రావటం ఖాయం - మరి,ఇన్ని సంవత్సరాల నుంచి ధృవబేరుకి మాత్రం ఏమీ కావడం లేదు,ఎందుకని?
          రమణ దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం స్వామివారి ముఖం ఉదయం బాలకుని పసితనాన్ని చూపిస్తుంది,మధ్యాన్నం నడివయస్కుని గాంభీర్యాన్ని చూపిస్తుంది,సాయంకాలం శతవృద్ధుని వైరాగ్యాన్ని చూపిస్తుంది.ఆయా వేళల్లో దర్శించిన భక్తులు కూడా  ఈ భేదాన్ని తెలుసుకోవచ్చు!ఊదయవేళ దర్శించినవారికి విద్యలో వృద్ధీ చిరాయువూ, మధాహ్నవేళ దర్శించినవారికి ధృఢదేహమూ ఐశ్వర్యప్రాప్తీ, సాయంవేళ దర్శించినవారికి జ్ఞానవృద్ధీ మోక్షమూ ప్రాప్తించడం అనుభవైకవేద్యమే!
          అసలు కన్న కొసరు ముద్దు అన్నట్టు స్వామి వారి కన్న లడ్డు ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది - GI certificate కూడా ఉంది!పెద్ద లడ్లూ చిన్న లడ్లూ అలిపి రోజుకి రెండున్నర లక్షల లడ్లు వినియోగం అవుతున్నాయి - పురుషులందు పుణ్యపురుషుల వలె లడ్డులందు తిరపతి లడ్డు వేరయా!చిటికెడు కొకైనుకి లక్షలు తగలేసేవాళ్ళకి,గుక్కెడు పులిసిన ఫ్రెంచి మద్యానికి వేలం పాడి కోట్లు కుమ్మరించేవాళ్ళకి ఈ లడ్డుకున్న గొప్పదనం తెలియదు - కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు.వూరికే కరకరమని నమిలి మింగదం కాదు,స్వామిని తలుచుకుంటూ తినాలి - అప్పుడే వస్తుంది అసలైన కిక్కు!

          శ్రీవారి మూర్తికి గోళ్ళు పెరుగుతున్నాయనీ జుట్టు ఉందనీ అనుకుంటున్నవి పూర్తి అసత్యాలు - అలాంటివాటితో కూడుకుని ఉండటానికి అది భౌతిక అదెహం కాదు,అఖిలాందకోటి బ్రహ్మాండనాయకుడి తేజూమయరూపం!రామ్న దీక్షితులు గారు చెబుతున్న అసలైన అద్భుతం శ్రీవారి మూర్తికి పది అడుగుల దూరంలో పది అడుగుల వ్యాసం కలిగిన ప్రదేశంలో జరుగుతుందట!దేసాద్యక్షులు గానీ,పారిశ్రామికాధిపతులు గానీ,ప్రజాస్వెవారనంలో ఉన్నవారు గానీ ఆ ప్రదేశంలో నిల్బడినప్పుడు అంతకుముందు వారికి అపరిష్కృతమైన సమస్యలకి సమాధానాలు లభిస్తున్నాయట - అలా వారి వల్ల జరగాల్సిన లోకకల్యాణ యాత్రకు విఘ్నాలు తొలగుతున్నాయి!బహుసా దీనికి కారనం ఒకటి కావ్చ్చు - శ్రీవారు తిరుమలలో ఆవ్తరించాల్ని సంకల్పించిన అత్ర్వాత తొలి అడుగును ప్రస్తూతం శ్రీవారి పాదాలు అని పిలుస్తున్న చోత ఉంచారు,రెందవ అడును శిలాతొరనద్వారం దగ్గిర మోపారు అంటున్నారు,కానీ త్రిగుణ సాంఖ్యం ప్రకారం పడాల్సిన మూడవ అడుగు ఏది?బహుశా అవతరణ వేదిక మీదకై ఎక్కి ఇటువైపుకి తిరిగి దర్సనం ఇచ్చే ముందు అటువైపుకి వేసిన మూడవ అడుగును ఇక్కద మోపి ఉండవచ్చు - అందుకే ఆ పర్దేసానికి అనత్ మాహ్త్వం వచ్చింది!

          దాదాపు ప్రతి భక్తుడికీ భక్తురాలికీ తిరుమల యాత్రలో కలిగే ఒక ప్రత్యేకమైన అనుభూతి యేమిటో తెలుసా!తిరుమల అనే కాదు ఏ అలయానికి వెళ్ళినా ఎదో ఒక తీరని కోరికని స్వామికి నివేదించడానికే వెళ్తాము,అవునా?కానీ మనం ఎంత పెద్ద లిస్టుతో వెళ్ళినా సరే స్వామిని చూస్తున్నప్పుడు మాత్రం ఆ కోరికల్ని చెప్పుకోవాలనే స్పృహయే ఉండదు,కదా!గోవింద నామస్మరణ వల్లనో మూర్తి సౌందర్యం వల్లనో అనుకుంటాం మనం.కానీ అది కాదు అసలు రహస్యం! స్వామి వారి చుట్టూ సిద్దులు,తాపసులు దేవతలు  నిరంతరం ఆయనను అర్చిస్తూ ఆవరించి ఉంతారు - అదృశ్యలైన వారి తపఃఫలం మనకు కూడా నిరపేక్షతని అంటిస్తుంది.

          ఇంకొక విశేషం ఏమిటంటే చూస్తున్నంత సేపు ఆ రూపం ఎంత ఆనందం కలిగించినా ఆ మూర్తి నుంచి చూపు మరల్చిన తర్వాత ఒక్క క్షణం సైతం ఆ రూపం మనస్సులో నిలవదు అదేమిటో,అజ్ఞానం కొద్దీ ఇహలోకపు యావలో పడిపోయామని మనల్ని మనం తిట్టుకుంటాం,కానీ అది కూడా ఒక లీలయే - మళ్ళీ మనస్సులో ఆ రూపం నిలవాలంటే మళ్ళీ ఆ మూర్తిని చూడాల్సిందే,మళ్లీ తిరుమల రావల్సిందే!

          రోజుకి యాభై వేల మంది నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు స్వామిని అరక్షణం చూసినా చాలుననే తపనతో - వీరిలో దశాబ్దాల ముందు నుంచి రావాలని అనుకున్న వారు,ఆరు నెలల మునదే ప్రణాళికలు వేసుకున్నవారు,అసహాయుల నుంచి దేశాద్యక్షుల వరకు సంవత్సరానికి 30 నుంచి 40 మిలియన్లు ఉంటారు!స్వామివారి వీదెశీమారకద్రవ్యం,అదే బంగారు నిల్వలు ఇప్పటికి 52 టన్నులు - తెలుపు లెక్కల ప్రకారం!స్వామివారి వార్షికాదాయం 6 బిలియన్ డాలర్లు - మరి, పన్ను కడుతున్నాడో లేదో?కట్తమంటే విజయ్ మాల్యాలాగ పారిపోడు గద!
          తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే.అయితే,బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు.
          స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి.బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'.ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు.బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది.ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు.ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం(దించడం) చేస్తారు. 
          ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే!
4.ఆలయ మార్గము (how to reach)
          తిరుపతి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా లోని ప్రముఖ నగరం.ఇక్కడికి రాష్ట్రము లోని అన్ని ప్రముఖ నగరాల నుండి బస్సు సౌకర్యము కలదు.

1 comment:

  1. chaala baaga vivaraalu andinchaaru, thanks sir, kalyanotsavam enduku chestaru, prajalu enduku interest chupistaru koncham elaborate cheyandi

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...