Wednesday 23 November 2016

దేశం బయట ఉన్న ఉగ్రవాదుల మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ గ్రాండ్ సక్సెస్, దేశం లోపల ఉన్న అవినీతిపరుల మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ అట్టర్ ఫెయిల్యూర్ - కారణం ఏమిటి?

     రోజువారీ జీవితానికి సంబంధించిన తలనెప్పులతోనే సతమతమయ్యే సామాన్యులకి నల్లధనానికి సంబంధించిన సంక్లిష్టమైన ఆర్ధికరంగపు నడకలు తెలియవు. ఆల్రెడీ నల్లధనం పోగేసుకుని ధనవంతులైన ప్రముఖులు దేశప్రధాని ఎన్నో వెసులుబాట్లు కల్పించి "అయ్యా!బాబూ!!మీ దగ్గిరున్న నల్లధనమంతా తెలుపు చేసుకోండి, ప్లీజ్!!!" అంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు.ఇవ్వాళ ప్రజల తరపున వకాల్తా పుచ్చుకుని మీడియాలో గొంతు చించుకుని అరుస్తున్నవాళ్ళలో ఒక్కరికి కూడా శాస్త్రీయమైన విశ్లేషణలతో ప్రజల జ్ఞానాన్ని పెంచి ఒక మంచి ఉద్దేశంతో చేసిన పనిలో దొర్లిన ఒక చిన్న పొరపాటు ఎట్లా జరిగిందో అర్ధం చేసుకుని సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకునేలా చెయ్యాలన్న బాధ్యత లేదు.

     ఆర్ధికరంగ నిపుణుల్లో ఎవ్వరూ ప్రధాని ఉద్దేశాన్ని తప్పు పట్టటం లేదు.నలధనాన్ని తెల్లధనంగా మార్చటానికి ఇంతకు మించిన మార్గం కూడా లేదంటున్నారు.ఈ ఒక్క చర్యతోనే అద్భుతాలు జరిగిపోవనీ గొలుసుకట్టు చర్యలు అన్నీ పూర్తయినాక తప్పకుండా ధరలు తగ్గుతాయనీ అప్పటినుంచీ నల్లధనం క్రమంగా తెల్లధనంగా మారి ప్రజలకు గట్టిమేలు జరుగుతుందనీ బల్లగుద్ది చెబుతున్నారు. ప్రధాని మొత్తుకుంటున్నది కూడా అదే అయినప్పుడు అతను ప్రజల్ని ఇబంది పెట్టడానికే ఇదంతా చేసినట్టు ఈ అరిగోల ఏంటి?నిజమే. నల్లధనం దాచుకున్నవారు ఎవరూ బ్యాంకుల ముందు క్యూలో కనబడటం లేదు - అయితే ఏమిటి?అక్కడా ఇక్కడా పారేస్తున్నారుకోటికి ముప్పయి లక్షలు కమిషన్లు చెల్లించుకుంటూ నష్టపోతూ అఘోరిస్తున్నారు. ఏమాత్రం కామన్సెన్సు ఉన్నవాడు ఎవడయినా అలాంటివాళ్ళు ఏంచేస్తారని అనుకుంటాడో అవే చేస్తున్నారు వాళ్ళు!

     అవినీతికీ నల్లధనానికీ ద్రవ్యోల్బణానికీ అధికధరలకీ సామాజిక అసమానతలకీ ఉగ్రవాదానికీ అవినాభావ సంబంధం ఇప్పుడు కొత్తగా ఏర్పడినది కాదు.పాలకులే పాలితుల్ని అడ్డగోలుగా దోచుకోవడమనే మాయాజాలం విదేశీయులైన ఇంగ్లీషువాళ్ళ కాలంలో పుట్టి స్వదేశీయులైన కాంగ్రెసువాళ్ళ  సుదీర్ఘమైన పరిపాలనలో అడయార్ మర్రిచెట్టులా వూడలు దించుకుని ఉన్నది.ఈ దేశపు అవినీతిపరులు మహా మొండివాళ్ళు - "నేను నా దేశమును ప్రేమించుచున్నాను,ఈ దేశసంపద నాకు గర్వకారణము,దానిని భక్షించుటకు నా శాయశక్తులా కృషి చేసెదను" అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నారు.సామాన్యులు ఎంతో ఓర్పుతో క్యూలలో నిలబడి అపురూపమైన సహనాన్ని ప్రదర్శిస్తుంటే ప్రభుత్వం వారిమీద సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు హోరుగాలిలో చిగురుటాకుల్లా కంపించిపోతూ యుద్ధభేరీలు మోగిస్తున్నవాళ్ళు స్వతంత్రం వచ్చిన తదాది వ్యవసాయం దిక్కుమాలినదై అన్నదాతలు ఉరితాళ్ళకు వేలాడుతుండటం చూశాక కూడా ఇన్ని దశాబ్దాలుగా ఏమాత్రం ఆందోళన చెయ్యకుండా కడుపునిండా అన్నమెలా తినగలుగుతున్నారు?

     ఏపీ ముఖ్యమంత్రి రుపే కార్డు అంటున్నాడు,అలాంటి క్రియేటివిటీ భాజపా వాళ్ళకి ఎందుకు లేదు?అతనే బ్యాంకుల్ని ప్రజలకి మీడియేటర్లని ఫీల్డులో ఉంచటం గురించి ఇచ్చిన సూచన కూడా బాగుంది - దీనివల్ల అందరూ బ్యాంకుల దగ్గిర గుమిగూడటం తగ్గుతుంది.కొన్నిచోట్ల కొత్తనోట్ల బండిల్సు వీధుల్లోకి వచ్చాయని మీడియాలో చూపిస్తున్నారు - బ్యాంకు ఉద్యోగులు మోళీ చేస్తున్నారు! రద్దు చేసినది 500,1000 రూపాయలయితే అప్పటివరకు పుష్కలంగా వచ్చిన 100 రూపాయలు ఏటీయం బాక్సుల్లోకి అప్పటినుంచే ఎందుకు మాయమైపోయినాయి?బ్యాంకులోపల రశీదుల ద్వారా జరిగే జమలు,చెల్లింపుల మీద ఆడిట్ చెక్ ఉంటుంది కానీ ఏటీయం బాక్సుల్లో పేట్టే కరెన్సీకి మాత్రం ఈరోజు ఈ బాక్సులో ఇంత పెట్టాం అని లెడ్జరులోకి మాత్రం ఎక్కించి సరిపెడతారు.ఇవ్వాళ జనం పడుతున్న ఇబ్బంది మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల కాదు,ఆ లొసుగు ఆధారంగా బ్యాంకుల స్టాఫ్ తమ చేతివాటం కడుపు కక్కుర్తి చూపించటం వల్ల!ఒక ఏటీయం బాక్సులో 10,000 మాత్రమే పెట్టి 50,000 పెట్టినట్టు రాసి 40,000 మొత్తాన్ని దొడ్డిదారిని బ్యాంకు బయటికి పంపిస్తారు.ఇలా మొదలైన కార్యకారణశృంఖల దళారీలూ,బ్రోకర్లూ,ఏజెంట్లూ,థర్డ్ పార్టీ మీడియేటర్లని పర్సెంటీజీల వారీగా పునీతుల్ని చేస్తూ చివరకు నల్ల కుబేరులకు శ్వేతమోక్షాన్ని ప్రసాదిస్తున్నది!

     దేశంలో ఉన్న ప్రతి ఏటీయం బాక్సునీ ఈ పద్ధతిలో వాడుకుంటే ఎంత భీబత్సం జరగాలో లెక్క ప్రకారం అదే జరుగుతున్నది ఇప్పుడు.అయితే దీన్ని అదుపు చెయ్యాల్సిన పెద్దలు మాత్రం "ఒక మంచిపని జరగాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు - అర్ధం చేసుకోండి!" అని చిలకపలుకులు పలుకుతూ పనులన్నీ మానుకుని కష్టాన్ని పళ్ళబిగువున భరించి తప్పనిసరై క్యూలల్లో నిల్చున్న అమాయకుల్ని చూపించి ప్రజలు మమ్మల్నే మెచ్చుకుంటున్నారని మురిసిపోతున్నారు.ప్రజలకి ఇబ్బంది కలగనిదే మంచిపని అయినప్పుడు ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నది మంచిపని ఎట్లా అవుతుంది?అధికారంలో ఉన్నవారు బ్యాంకుల దగ్గిర జరుగుతున్న భాగోతం తెలియనంతటి అమాయకులా! కొన్ని గంటల్లోనే ఇదంతా వ్యవస్థీకృతం అయిపోయి నల్లగద్దల్ని కొట్టి బ్యాంకు కాకులకి పెడుతున్నట్టు జరుగుతున్న పబ్లిక్ వ్యవహారం చూస్తుంటే నాకెందుకో అధికారంలో ఉన్నవారు తస్మదీయులైన నల్లకుబేరుల నుంచి వడకట్టి అస్మదీయులకి కట్టబెట్టడానికి ముందస్తు ప్లాను ప్రకారమే ఇదంతా చేస్తున్నట్టు అనుమానంగా ఉంది.వీళ్ళ యాభైరోజుల లిమిట్ తస్మదీయుల నుంచి అస్మదీయులకి నల్లధనం పూర్తిగా చేరడానికి పట్టే సమయం కాబోలు! ఆదర్శాల చాటున అధర్మాలు చేస్తూ ప్రజల్ని మోసగించటంలో కాంగ్రెసు యాభయ్యేళ్ళలో సాధించిన పరిణితిని భాజపా ఇరవయ్యేళ్ళలోనే సాధించేసిందా- మాయురే భాజపా గోమాయువులు!వారు నిజంగానే అమాయకులయి బ్యాంకుల్ని కంట్రోల్ చెయ్యలేకపోయామని చెప్పుకున్నా దేశాన్ని ఒక్కరోజు కూడా పరిపాలించటానికి అనర్హులేనన్నది సత్యం!అనుభవం లేని ఆర్.యం.పీ డాక్టరు చేసినట్టు ఇలాంటి ఎనస్థీషియా ఇవ్వని ఆపరేషన్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే జనం పిచ్చెక్కి పోతారు - భాజపాని శవాన్ని చేసి చెట్టెక్కిస్తారు, అది ఖాయం!

     కాలం అతివేగంగా మారుతున్నది.మా తాతగారి కాలంలో ఒక వూరినుంచి మరోవూరికి కొంచెం ఎక్కువ డబ్బు తీసుకెళ్ళాలంటే నాణాల్ని సంచుల్లో వేసి ఎడ్లబళ్ళ మీద పెట్టుకుని వాటికి కాపలాగా పహిల్వాన్లని తోడు తెసుకుని వెళ్ళేవాళ్ళు.ఒక్కొక్క నాణెం ఒక రూపాయి అనుకుంటే పది రూపాయలు ఇవ్వాలంటే పది నాణాల సంచి ఇచ్చేవాళ్ళు,యాభై రూపాయలు ఇవ్వాలంటే  యాభై నాణాల సంచి ఇచ్చేవాళ్ళు - మోత బరువు, అయినా బాగానే జరిగిపోయంది!ఇప్పుడు కాగితం రూపాయిలు వాడటం వల్ల మోతబరువు తగ్గింది నిజమే,కానీ బరువుకీ అది చేసే పనికీ సంబంధం ఉందా?లేదు!నోట్లని లెక్కబెట్టగలిగిన చదువు ఉంటే సంతకం చెయ్యడం పెద్ద కష్టమా!బ్యాంకులో అకవుంటు తీసుకోవడానికి అది చాలు గదా!అకవుంటుతో పాటు డెబిట్ కార్డు వస్తుంది, ఇప్పుడు పచారీ కొట్లలో కూడా స్వైపింగ్ మెషీన్లు ఉన్నాయి - కొత్తగా ఆలోచించితే ఒకటి రెండు రోజుల్లో సమస్య తీరిపోయేదానికి ప్రజల్ని ఎందుకింత భయోత్పాతానికి గురి చేస్తూ ఫిడేలు వాయంచుకుంటూ కూర్చున్నారు?నోట్లకట్టల్ని దొంగలు కొట్టేస్తారనే భయం ఉంటుంది, కార్డు పోతే బ్యాంకుని మెస్సేజి పంపిస్తే చాలు మనీ సెక్యూర్ - తోపుడు బళ్ళవాళ్ళు కూడా మొబైల్ వాడుతున్నారే!ఎప్పటికైనా అలవాటు చేసుకోవాల్సిన కొత్తదనాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఇప్పుడు కూడా అలవాటు చేసుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు?చురుకైనవాళ్లు నేర్చుకోవాలిమిగతావాళ్లకి నేర్పాలి - ఈ అతి ముఖ్యమైన పని చెయ్యాల్సిన అధికార పార్టీకి చెందినవాళ్ళు ఇప్పటికీ ఇంకో యాభై రోజులు ఇబ్బంది పడండని చిద్విలాసంగా చెబుతున్నారు, మరోదారి లేక విసుక్కుంటూనే ఓపిగ్గా క్యూలల్లో నిల్చున్న జనాల్ని చూసి ఇంకా మమ్మల్ని చీకొట్టటం లేదులెమ్మని మురిపాల స్టేటుమెంట్లు గుప్పించి వదుల్తున్నారు - మీదకురికి చొక్కాలు చింపితే గానీ కంగారు పుట్టదు కాబోలు!దాచుకున్న కోపాన్ని ఎన్నికల్లో చూపించి పుట్టి ముంచాక గానీ కళ్ళు తెరిచి చూడరు కాబోలు! .

     తమ పార్టీ అధికారంలో ఉంది,ప్రధాని తీసుకున్న చర్యని ఆర్ధిక శాస్త్రవేత్తలు కూడా ప్రశంసిస్తున్నారు, ఆఖరు నిమిషాల్లో చిన్న సమస్య జనాన్ని అతలాకుతలం చేసి గంప లాభం చిల్లి తీసిందన్నటు గాలి తమకి వ్యతిరేకంగా మారుతున్నది - అయినా క్యూల దగ్గిరకి వెళ్ళి చాయ్ ఇవ్వండని క్లూ ఇచ్చి ఇన్ని గంటలైనా కింది స్థాయి కార్యకర్తల్లో చలనం లేదు!తమ పార్టీ ప్రభుత్వంలో ఉంది గాబట్టి ప్రభుత్వాధికారుల నుంచి వీలున్నంత ఎక్కువ సమాచారం రాబట్టి ప్రజలకి చెప్పవచ్చునే!భాజపా కార్యకర్తలకి ఎక్కడో ఉన్న అయోధ్యలో రామాలయం కట్టటానికి ఇటుకలు సేకరించటం, గుడి కట్టనివ్వటం లేదని ముస్లిముల్ని తిట్టటం లాంటి మోటుపన్లు తప్ప ఇట్టాంటి  క్రియేటివ్ పన్లు చెయ్యటం నామోషీయా!మోదీ ఒక్కడే చాలు మాపార్టీకి అనే ధీమా తప్ప ఏడుపు తన్నుకొచ్చేటంత కష్టంలో ఉన్న మోదీకి సాయం చెయ్యగలిగిన దమ్మున్న కుర్రాడు భాజపా కార్యకర్తల్లో ఒక్కడు కూడా లేడా!ఇలాంటప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల పక్కన నిలబడితే గుడి కట్టినదాని కన్నా ఎక్కువ పాప్యులారిటీయే వస్తుంది కదా!సాక్షాత్తూ వైకుంఠవాసుడికి డబ్బు కావాలంటే ఆదిలక్ష్మి మేడం చెక్కో క్యాషో ఇవ్వాలి, వీళ్ళు ఆవిడ బ్యాంకుకే కన్నమేస్తున్నారు - రామాలయం కట్టటానికి ఆమె డబ్బెట్లా ఇస్తుంది?


రాముడొక్కడే దేవుడు కాదు, లక్ష్మీదేవి కూదా దేవతయే - కాస్త ఆవిణ్ణి కూడా పట్టించుకోండి!

Tuesday 8 November 2016

హిందువుల దేవాలయాలు అంటే విగ్రహాలూ గోడలూ మాత్రమేనా?వాటిలో ఉన్న ఈనాటివారిని మించిన సైన్సు ఎవరికీ కనపడదా!

శ్రీ గురుభ్యో నమః

     ప్రాచీన కాలంలో ఎక్కడైనా ఒక ఆలయం కట్టాలంటే ఎంతో పరిశోధన జరిగేది.కట్టాలనుకున్నవాళ్ళు కూడా భక్తిశ్రద్ధలతో అప్పటికి సంపాదించిన సమస్తం దానికే ఖర్చుచేసి నిర్మించేవాళ్ళు.ఎందుక్నటే ఆలయం అనేదాని ఆ కట్టినవాడికి సప్తసంతానాల్లో ఒకటిగా చెప్పారు గనక!సనాతన ధర్మం ప్రకారం వివాహం యొక్క మొదటీ ఆఖరి పరమార్ధం శృంగారం కానే కాదు - సంతానం కోసమే!మళ్ళీ సంతానం కూడా ఇవ్వాళ్టిలా ముసలితనంలో అక్కరకొస్తారనే స్వార్ధం వల్ల కూడా కాదు. తాము  ధర్మబద్ధంగా అప్పటివరకూ సంపాదించిన జ్ఞానాన్నీ సంపదనీ క్షేమంగా తర్వాత తరానికి అందించి పిల్లల మీద ఆధారపడి ఉండకుండా వానప్రస్థం అన్న నాలుగో ఆశ్రమం పేరుతో దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు - ఇందులో ముసలితనంలో అక్కరకొస్తారనే స్వార్ధం ఎక్కడ ఉంటుంది!ఇంకా ముందుకు చూస్తే సంతానం అంటే ఇవ్వాళ్టివాళ్ళలా లక్షలు కోట్లు ఖర్చు చేసయినా సరే,సంవత్సరాల తరబడి డాక్టర్లని బాగు చేసయినా సరే మా దేహాల నుంచే రప్పించుకోవాలి అనే పట్టుదల కూడా ఉండేది కాదు.ఎట్టి పరిస్థితుల్లోనూ  ఇద్దరిలో ఎవరికీ పిల్లలు పుట్టరని తెలిస్తే దత్తత తెచ్చుకునేవాళ్ళు,ఎవరో ఒకరికి సంతానయోగ్యత ఉంటే పరస్పరాంగీకారంతో దేవరన్యాయం లాంటివి పాటించేవాళ్ళు,అదీ కుదరకపోతే తమ యావదాస్తినీ వినియోగించి సప్తసంతానాల్లో ఒకటైనది గనక ఒక ఆలయం కట్టి సరిపెట్టుకునే వాళ్ళు!

     వూరికే ఒక గుడి కట్టేస్తే ఏమి లాభం?ఆ గుడి పదికాలాల పాటు భక్తులను రప్పించుకుంటే గదా తన యశస్సు నిలబడేది!అందుకోసం ఆలయనిర్మాత తను నిర్మించే ఆలయానికి ఒక ప్రత్యేకత కోసం తపించేవాడు - ఆ తపన వల్లనే ఆధ్యాత్మికత, సౌందర్యం, శాస్త్రీయత, ప్రజాక్షేమం కలబోసి ఆలయాలను నిర్మించేవారు.ఆలయయంలో ఉన్న ప్రత్యేకతని తెలుసుకుని ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులకు కనీసపు సౌకర్యాలు కలిగించాలన్నా ఆలయాలకి ఆదాయం అవసరమే కదా!కస్టమరుని మోసం చెయ్యని వ్యాపారం కూడా తప్పు అంటే మనిషి ఒక్క క్షణం కూడా బతకలేడు.నువ్వు కోరుకున్నవి అన్నీ నీ చుట్టుపక్కలే ఉంటే ఫరవాలేదు.మరి దూరంగా ఉన్నవాటిని నీకు దగ్గర చేసినవాడు లాభం తీసుకోకూడదా!నిజానికి అప్పట్లో చావు ఎక్కడబడితే అక్కడ కనబడుతూ ఉండేది.ఎంత ధనవంతుడైనా వూరికి మశూచికం సోకితే దరిద్రుడిలాగే ఎగిరిపోతున్నప్పుడు ఇంత సంపాదించి నేనేం చెసుకుంటాను అనే ప్రశ్న తప్పకుండా వొస్తుంది.అలా ప్రాణం విలువ తెలిసినవాళ్ళు గనకనె ప్రతి ఆలయంలో అన్నదానం చెయ్యటం లాంటి ధార్మికదృష్టి ఉండేది. రోగాల్ని నియంత్రించుకుని ప్రాణభయం పోయిన ఇవ్వాళ్తి కాలంలో అనుకంప తగ్గింది - ఎంత విచిత్రం!రాం కుమార్ అనే ఒక టెనేజి కురాడు అనే ఒక టీనేజి కురాడు కేవలం తన పక్కలోకి రానన్నాదని ఒక ఆడపిల్లని కొని వందల మంది తిరిగే చోట వేట కొదవలితో నరికేశాడు.కనీసం భయపడి పారిపోకుండా తాపీగా నడుచూంటూనే అక్కణించి తప్పించుకున్నాడు. నేను చేసింది తప్పు కాదు, నన్నెవరూ ఆపలేరు, నన్ను పట్టుకోవడం అసాధ్యం అని అంత ధీమా వాడికి ఎట్లా వచ్చింది?తీరా పోలీసులు చుట్టుముట్టినప్పుడు తనని తనే ఎందుకు చంపుకోవాలని ప్రయత్నించాడు?మళ్ళీ అన్ని ఆధారాలు కనబడుతున్నా మొండిగా నేను చెయ్యలేదు అని వాదించటంలో ఉన్న లాజిక్ ఏంటి?"నేను మాత్రమే బాగుండాలి!నా ప్రాణమే విలువనది!నా సుఖం కోసం ఇతరుల్ని పీడించినా తప్పు లేదు!నన్ను వ్యతీరెకించినవాళ్లని, నా కోరిక తీర్చనివాళ్ళని చంపటం న్యాయమే!" అన్న ధోరణి అది. ఇలాంటివి చాలా జరుగుతున్నా ఈ ఒక్క ఉదాహరణనే నేను ఎందుకు తీసుకున్నానంటే అక్కడ అంత స్పష్టంగా కనబడే ఈ ధోరణి దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఉంది - పర్సెంటజి తేడా, అంతే!

     వాడంటే కురాడు,పెద్దల బుద్ధి కూడా అలానే నడుస్తున్నది గదా!ఇవ్వాళ ఆలయాలు కడుతున్నవాళ్ళే ప్రాచీనుల మాదిరి స్థల ప్రాముఖ్యం చూసుకోకుండా ఎక్కడబడితే అక్కడ కట్టేసి వాటిని ఆర్జనామార్గాలుగా చేసుకుంటున్నారు.ఆలయవాస్తులోని అతి ముఖ్యమైన సూత్రం ఆలయగోపురం నీడ మనుషులు కాపురముండే ఏ ఇంటిమీదా పడకూడదు, అలా పడితే ఆ గృహానికి అరిష్టం అనేది.అంటే, ఆలయాలు జనావాసాలకి కొంచెం దూరంగా ఉందాలి అని అర్ధం. మరి ఇప్పుడు ట్రాఫిక్ మధ్యలో కూడా కట్టేసి తొలగించబోతే ఆలయాన్ని కూల్చడం సనాతన ధర్మానికి హాని అని బెదిరించడం ఏమిటి?

     ఈ పూర్వరంగం అంతా అర్ధమయితే గానీ ఇక్కడ చెప్పబోయే విశేషాలు అర్ధం కావు.అందుకే ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చాను.ఇప్పుడు కొని ప్రాచీనకాలంలో కట్టిన ఆలయాలలోని ఆధునికులకి కూడా సాధ్యం కాని వైజ్ఞానిక విశేషాల్ని గురించి చెబుతాను.ఈ పోష్టు కేవలం హైందవధర్మం యొక్క విశిష్టత మీద గౌరవం ఉండి దాని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవాళ్ళ కోసమే రాశాను.అందుకే ఇంతవరకూ పెట్టగూడదనుకున్న మోడరేషన్ కూడా పెట్టాను.కాబట్టి మీ అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పవచ్చును.వీలున్నంతవరకూ చదివిన వారు తమ ప్రతిస్పందన కూదా తెలియజేస్తే ఇతరులకీ ఉత్సాహంగా ఉంటుంది!మీకు నచ్చితే దీనికి ఎంత ప్రచారం కలిగిస్తే అంత ఫలితం ఉంటుంది.

ద్వాదశ జ్యోతిర్లింగాల వెనక ఫిబినోసి సీక్వెన్సు ఉంది.


     శివుని ప్రతిరూపాలుగా భావించే మొత్తం 64 జ్యోతిర్లింగాలలో ఒక పన్నెండు అతి విశిష్ఠమైనవి.. భూమిపై నివసించే సమస్త జంతుకోటికీ ఆకాశంలో కనిపించే నక్షత్రాలు,గ్రహాల నుంచి నిరంతరం వెలువడుతున్న విద్యుత్ తరంగాల నుండి ఉద్భవించే జ్యోతిరూపమైన శక్తి  ఈ 12 లింగాల ద్వారా సమతౌల్యతను పొంది భూమిని ఆవాసయోగ్యంగా నిలబెట్టాయి.అందువల్లనే సాధారణమైన ఆలయాలలో వలె వీటికి లింగప్రతిష్ఠలు గానీ ప్రాణప్రతిష్ఠలు గానీ లేకపోయినా సృష్టి ఉన్నంతకాలం జ్యోతిశ్శక్తి వెలువడుతూనే ఉంటుంది.

     ఈ 12 జ్యోతిర్లింగాల స్థాపనలో దాగున్న సైన్సును పరిశీలించి చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. మ్యాధ్స్ సబ్జెక్టులో ఏ కొంచెం పరిచయం ఉన్నవారికైనా ఫిబోనసి సీరిస్ గురించి తెలిసుంటుంది. ఈ సీక్వెన్సులోని ప్రతి సంఖ్యా దానికి ముందరి రెండు అంకెలను కలపితే వస్తుంది - 0,1,1,2,3,5,8,13,21,34... ఇలా వీటిని ఆధారం చేసుకొని గ్రాఫ్ గీసుకుంటూ పోతే ఫిబోనసి గ్రాఫ్ ఏర్పడుతుంది. ఇది ఓ బిందువు నుండి సర్పిలాకారంగా తిరుగుతూ క్రమంగా కేంద్రం వద్ద పరిసమాప్తం అవుతుంది.
     మన ఇండియా మ్యాపును తీసుకొని మన దేశంలోని జ్యోతిర్లింగాలను దానిపై గుర్తించి ఉత్తరాఖండ్ లోని కేదారి నాథ్ నుండి మొదలుపెట్టి ప్రతి జ్యోతిర్లింగాన్ని టచ్ చేసుకుంటూ వృత్తాకారపు రేఖలతో ఒక్కొక్కటిగా కలుపుకుంటూ పోతే - అది వైద్యనాథ్, రామేశ్వరం, సోమనాధ్..శ్రీశైలం మీదుగా సాగి సాగి మహారాష్ట్రలోని ఘృష్టీశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఆగుతుంది. ఇప్పుడు మనం పూర్తి చేసిన స్పైరల్ షేపును చూస్తే - ఇదే ఫిబోనసి సీరిస్ గ్రాఫ్!
     ఈ క్లూ కనుక్కున్నది మెల్విల్లె అనే అమేరికన్ కాస్మాలజిస్టు.కనుక్కున్న పెద్దమనిషికి ఆ రహస్యం తెలుసుకోవటానికి రోజులు,వారాలు బహుశా కొన్ని నెలలు పట్టి ఉండొచ్చు.కానీ వాటిని ఒక మనిషి ఇండియా మ్యాపు మొత్తాన్ని ఎదురుగా పెట్టుకుని చుక్కలు పెట్టేసి ఇక్కడిక్కడ ఈఈ గుడులు కడితే ఇట్లా  ఫిబ్బినోస్సి సీక్వెన్స్ వచ్చేస్తుంది అని ఒకేసారి కట్టెయ్యలేదు.ఒకో గుడి ఒకో కాలంలో కడుతూ మొత్తం పన్నెండూ కట్టేశాకనే సీక్వెన్సు గ్రాఫ్ పూర్తి అయ్యింది.అదీగాక ఇవన్నీ స్వయంభూ లింగాలు,అంటే ముందుగా ఇక్కడొక ఆలయం కట్టాలని న్ర్ణయించుకుని శిల్పులతో చెక్కించి ప్రతిష్ఠ చేసినవి కావు!అవి అంతకు ముందే వ్యక్తమయి ఉంటే స్థలాన్ని వెతికి కనుక్కోవాలి, లేదా అవి స్వయంవ్యక్తం అయ్యేవరకు ఎదురు చూడాలి, వ్యక్తం అయ్యాక వాటినుంచి ఏవైనా సిగ్నల్స్ వస్తే వాటిని పట్టుకుని అక్కడ ఆలయనిర్మాణం చెయ్యాలి - తల్చుకుంటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి!అప్పుడు మహామేధావులైన మనవాళ్ళు ఏమి చేసారో మన కోడిమెదడుతో వూహించలేము గానీ వీటిల్లో ఏ పద్ధతి ఫాలో అయినా మొత్తం దేశమంతటా ఉన్న ఆలయ నిర్మాణాలు చేసేవాళ్ళ మధ్యన ఒక నిరంతర సమాచార ప్రవాహం ఉండి తీరాలి!ఎక్కడ ఏ ఆలయం కట్టాలన్నా మొత్తం దేశంలో ఉన్న అన్ని ఆలయాల గురించిన మొత్తం సమచారం కూలంకషంగా తెలియాలి,తెలుసుకునేవాళ్ళు,జ్ఞానాన్ని పంచుకునేవాళ్ళు!వాస్తవం ఇట్లా ఉంటే ఒక అలయంలో ఉన్న వింత మరొకదానిలో ఉండకపోవటానికి మన వెర్రి చరిత్రకారులు చేసిన విశ్లేషణ ఏమిటో తెలుసా, ఒక రాజ్యంలో ఎవరయినా శిల్పి ఒక అపురూపమైన ఆలయం నిర్మిస్తే మరొక చోట అలాంటిది కట్టకుండా అతన్ని చంపేసేవాళ్ళట!

     ఒక ఆలయం నిర్మించడం అంటే చీకట్లో ఒక్కడే కూర్చుని చేసే రహస్య భాగోతమా?ప్లాను గీసుకోవాలి,మేస్త్రీలకి పనులు అప్పగించాలి,కట్టేటప్పుడు తేడాలు వస్తే ప్లాను మార్చి కరెక్ట్ చేసుకోవాలి,అసలు తనకి సాధ్యం కాని సమస్య వస్తే వేరేచోట ఉన్న సీనియర్లని అడగాలి - ఇదంతా కట్టాక చంపేస్తారనే భయం ఉన్నవాడు చెయ్యగలిగిన పనులా!ఏ దేశంలోనూ ఏ జాతిలోనూ తమ దేశపు వెనకటి కాలంలోని వాళ్ళ గురించి ఇంత బూతులు రాసినవాళ్ళు లేరు - వీళ్ళ కన్నా ఇంగ్లీషువాళ్ళే నయం! 

చాయా సోమేశ్వరాలయం మిస్టరీ వీడటానికి ఇన్నేళ్ళు పట్టింది!

     సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోళులు (నల్లగొండ/నీలగిరి చోళులు) పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్బుతం.

     ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. ఛాయా సోమేశ్వర ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న చిన్న మండపాలు .... వీటి చుట్టూ మూడు గర్భగుడులు ఉన్న దేవాలయం ఉంటుంది. దీనినే 'త్రికూటాలయం' అంటారు.ఈ ఆలయానికి పడమర ఉన్నటువంటి గర్భగుడిలో శిలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చల ఛాయ, సూర్యుని స్థానముతో సంబంధం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పడడం ఈ ఆలయం సంతరించుకున్నటువంటి అద్భుతం. ఆ నీడ ఏ వస్తువుది అన్న విషయము కూడా ఇంతవరకూ అంతు చిక్కలేదు.

     దేవాలయం గర్భగుడి గోడపై గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్ధానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్ధానాన్ని మార్చుకోదు అనేది ఇప్పటివరకూ ఎవరికీ అంతుచిక్కని విషయం. అలనాటి నిర్మాణకౌశలం, శిల్ప నైపుణ్యం మరియు శాస్త్ర సిద్ధాంతాల మేళవింపుకు ప్రతీకగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు.

     ఆలయ మధ్యభాగంలో చతురస్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే, తూర్పు, పడమర, ఉత్తరాన మూడు గర్భగుడులు కలిగి ఉంది. అయితే మూడు గర్భగుడులు కూడా ఒకేరీతిగా ఉన్నప్పటికీ కేవలం పడమటి గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయను తిలకించగలము. ఆలయ శిల్పి నీడలను ఏర్పరచడానికి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణము చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం జరిగింది.

     అలాంటి పరిస్థితిలో సూర్యుని స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయ శిల్పి ఉద్దేశ్యము ప్రకారం ఛాయ నిశ్చలంగా ఉండాలంటే తూర్పు లేదా పడమర ఛాయలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని కలిపే తలము, తూర్పు నుండి పడమరకు సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉంటుంది. సూక్ష్మంగా వివరించాలంటే, పడమటి గర్భగుడి ముందు ఉన్నటువంటి కీలకమైన నాలుగు స్తంభాల నీడలు కలిసి ఏకఛాయలాగ ఏర్పడతాయి. ఈ ఛాయను మనము వెన్నెలకాంతిలో కూడా వీక్షించవచ్చు. ఏకనిశ్చలఛాయ ఏర్పాటులో అయిదు ప్రధానాంశాలు కీలకపాత్ర పోషిస్తాయి అవి ....

1 స్తంభాల మధ్య దూరం 

2 స్తంభాల నుండి గర్భగుడి వెనుక గోడ దూరం 

3 స్తంభాల నుండి కాంతిలోనికి ప్రవేశించే మార్గాల దూరం 

4 కాంతి జనకం (సూర్యుడు) ప్రయాణించే దిశ 

5 స్తంభాలతో కాంతి జనకాల స్థానం చేసే కోణం

     ఆలయానికి రాళ్ళతో కూడిన పునాదిని ఎంచుకోవడం ద్వారా శిల్పి భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాస్తవానికి పూర్వం గ్రామాలలో, పట్టణాలలో వివిధ కార్యాలకు అంటే వివాహాలకు, కచేరి, పండుగలు, మతకృత్యాలు మొదలైన వాటికి ఆలయాలే కేంద్రంగా ఉండేవి. కాబట్టి రాజులు వాటికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి నిర్మించేవారు. ఆలయాలకు భక్తులను రప్పించడానికి శిల్పులు ఏదో ఒక ప్రత్యేకతతో ఆలయాలను నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి నిశ్చలఛాయను అనుసంధానించారు.

     ఈ మధ్యనే సూర్యాపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పీజీకాలేజిలో పనిచేస్తూ సివిల్సుకి ప్రిపేర్ అవుతున్న శేషగాని మనోహర గౌడ్ మాయా,మంత్రం,మోసం,దగా లాంటివి ఏమీ లేకుండా కాంతిశాస్త్ర పరిజ్ఞానంతో సాధించవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపించారు.ఆరేడేళ్ళ క్రితం స్నేహితుడు ఈ ఆలయానికి తీసుకెళ్ళి చూపించి ఎలాగూ నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా,ప్రయత్నుంచి చూడమన్నాడు.అప్పట్నుంచీ ఆ గుడి మొత్తాన్నీ అబ్జర్వ్ చేసి ధర్మోకోల్ మోదల్ కట్టి కొవ్వొత్తుల్ని స్తంభాలుగా వాడి చీకటిగదిలో టార్చిలైటుని సూర్యుడిగా వాడి ఎట్టకేలకు అదే ఎఫెక్టుని సాధించి మిస్టరీని చేదించగలిగాడు.

     ఇందులోని అసలైన ట్రిక్కు కాంతి పరిక్షేపణం(Light Diffusion) అనే దృగ్విషయాన్ని ఉపయోగించుకోవటం.కాంతి విశ్వాంతరాళంలో ప్రయాణించేటప్పుడే కాదు భూమి వాతవరణంలో ప్రయాణించేటప్పుడు కూడా కొంచెం వంగుతుంది.ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు యొక్క ఉపరితలం మీద కూడా ఆ వస్తువుకి ఉండే గురుత్వాకర్షణ వల్ల ఆ వస్తువు వైపుకి కొద్దిగా వంగుతుంది.ఇది మెకాలే పండితుడి ద్వారా దేహం మాత్రం భారతదేశపు తిండి తింటూ పెరిగి బుద్ధిలో మాత్రం ఆంగ్లేయుల వలె ఆలోచించే విధంగా మార్చబడిన పరదెశపు బానిసలకి వారి యజమానులు చెప్పాకనే తెలిసింది గానీ మన దేశపు ఆలయ శిల్పులకీ ఆ ఆలయాల్ని సందర్శించే భక్తులకీ ఎప్పుడో తెలుసు!

అరసవిల్లికీ తిరువనంతపురానికీ మధ్యన ఉయ్యాల వూగుతున్న సూర్యదేవుడు.

     అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికీ బెంగుళూరు గావి గంగాధరస్వామి ఆలయానికీ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయానికీ ఒక విచిత్రమైన సంబంధం ఉంది.సూర్యగమన సిద్ధాంతం ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలకు తెలుసు.ఆ సూర్యగమన సిద్ధాంతం ఆధారంగా ఆలయవాస్తుని నిర్ణయించి చేసిన నిర్మాణాలు కావడం వల్లనే ఈ మూడు ఆలయాల మధ్య ఒక సారూప్యత ఏర్పడింది.సూర్యుడు రాశి మారే ప్రతి సమయంలోనూ ఒక సంక్రాంతి వస్తుంది. ప్రతి నెలా ఒక మాససంక్రాంతి వస్తుంది,అయితే కొన్ని ప్రత్యేకమైన సమయాలలో సూర్యకిరణాలు ఆలయంలోని అర్చామూర్తులపై ప్రసరించే విధంగా నిర్మించడం అప్పటి మనవారి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.అందువల్లనే ఈ మూడు ఆలయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

     అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యుని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. మార్చి 9 నుండి 12 వరకు(మేష సంక్రాంతి),అక్టోబరు 1 నుండి 3 వరకు(తుల సంక్రాంతి) ఉదయ సంధ్యలోని తొలి సూర్యకిరణాలు ఈ స్వామివారి పాదాలను తాకుతాయి. బెంగుళూరు గావి గంగాధరేశ్వరస్వామి ఆలయంలో కేవలం మకరసంక్రాంతి నాడు మాత్రమే స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి.తుల సంక్రాంతి నాడు తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయగోపురంలోని అన్ని ద్వారాల గుండా సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఆలయాన్ని నిర్మించారు.

     ఈ మేష, తుల సంక్రాంతులలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి.ఇలాంటి ప్రత్యెకమైన రోజులలో ఆ రోజుకు సంబంధించిన విశేషాన్ని తెలిపే విధంగా ఈ ఆలయాలని నిర్మించటానికి శిల్పులకూ స్థపతులకూ కాలమానం, కాంతిశాస్త్రం, వాస్తుజ్ఞానం అన్నీ తెలిసి ఉండాలి - అన్నింటికన్నా ప్రజలకి శాస్త్రీయతని పరిచయం చెయ్యాలనే ఉత్సాహం ఉండాలి!

చిదంబరం గొప్పదనాన్ని కీర్తిస్తున్నది హిందూమతతత్వవాదులు మాత్రమే కాదు!

     చిదంబరం, కాంచీపురం, శ్రీకాళహస్తి - ఈ మూడూ పంచభూతలింగ క్షేత్రాలు.సమస్త ప్రకృతికి ఆధారభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే ఈ పంచభూతాలలో భాగమై కనిపించని పరమేశ్వర తత్వాన్ని గ్రహింపజేయడానికా అన్నట్టు ఈ మూడు క్షేత్రాలూ ఉన్న స్థలాలలోని విశేషాన్ని గమనిస్తే మన పూర్వీకులు ఏ ఆలయాన్నీ ఏ విధమైన ప్లానూ లేకుందా ఎక్కడో ఒకచోట కట్టేద్దాం అనుకుని హడావిడిగా కట్టెయ్యలేదని తెలుస్తుంది. అలాగే దేశంలోని అనేకమైన ఆలయాలు దేశంలోని ఇతర ఆలయాలతో సంబంధం కలిగి ఉండటాన్ని గమనిస్తే ఆనాటికే వారిలో ఆధ్యాత్మికంగా ప్రజలని ఏకం చెయ్యాలనే తపన ఎంతగా ఉందో తెలుసుకోవచ్చును. పృధ్వీలింగమైన కంచి ఏకాంబరేశ్వర లింగం, ఆకాశలింగమైన చిదంబరం నటరాజ మూర్తి, వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వర లింగం ఉన్న ప్రదేశాల్ని గూగుల్ మ్యాపులో చూస్తే ఒకే సరళరేఖలా 79 డిగ్రీల 41 నిమిషాల లాంగిట్యూడ్ మీద ఉన్నాయి!

     మానవశరీరంలోని నవరంధ్రాలకు ప్రతీకగా చిదంబరం ఆలయానికి నవద్వారాలు ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మానవుడు ఒకరోజు చేసే ఉఛ్చ్వాసనిశ్వాసాల మొత్తం 21600(15X60X24=21600), ఈ ఆలయం పైకప్పు సరిగ్గా 21600 బంగారు పలకలతో తాపడం చేసి ఉంటుంది. ఈ 21600 పలకలను 72000 బంగారు మేకులు పట్టి ఉంచుతున్నాయి. అది మానవుని దేహంలోని నాడుల సంఖ్యకు సమానం.మన శరీరంలో ప్రసరిస్తూ కంటికి కనబడకుండా అంతర్లీనమై ఉన్న జీవశక్తియే అసలైన చిదంబర రహస్యం!ప్రాచీన కాలం నుంచి ఇలాంటి సత్యాలు ఎన్నెన్నో ఒకటొకటిగా తెలుస్తూ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి.

     పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిది సంవత్సరాలు పరిశోధించి చిదంబరం నటరాజస్వామి విగ్రహం ఉన్న స్థలం భౌమఅయస్కాంతక్షేత్రం యొక్క కేంద్రస్థానంలో ఉందని తేల్చిచెప్పారు.ఇదే విషయాన్ని తమిళ శాస్త్రవేత్త తిరుమూలార్ అయిదువేల యేళ్ళ క్రితమే నిరూపించినట్లు తెలుస్తున్నది. చిదంబరంలోని తిరుమందిరం తనలో ఇముడ్చుకున్న శాస్త్ర సాంకేతికమైన విషయాల్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం సామాన్యులకే కాదు శాస్త్రవేత్తలకి కూడా చాలా కష్టం - దాదాపు అసాధ్యం!

మార్కోపోలో కన్నా ముందే మనవాళ్ళకి ఆఫ్రికానర్స్ గురించి తెలుసు


     నిశితంగా పరిశీలిస్తే మహాబలిపురం అంతరిక్ష పరిశోధనలకు చాలా అనువుగా ఉంటుంది.ఇస్రో కూడా ఇలాంటి వాతావరణంలోనే ఉంది..ఇక్కడి దేవాలయాలు కూడా శిల్పకళ వల్లనే ప్రత్యేకమైనాయి తప్ప పుణ్యక్షేత్రాలుగా వీటికి ప్రాధాన్యత అంతగా లేదు.అప్పటి పల్లవరాజు అంతరిక్ష పరిశోధనలు జరిపించాడనేటందుకు గణేశరధంలో చాలా ఆధారాలు కంబడుతున్నాయి.పూర్వం ఇక్కడ ఏ ఆలయమూ లేదు.కేవలం యాభై సంవత్సరాల క్రితమే గణేశమూర్తిని ప్రతిష్ఠించి పూజాదికాలు ప్రారంభించారు.ఇక్కడి గోపుర శిల్పాలలో దేవతామూర్తులు లేకపోగా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక రాకెట్ లాంచింగ్ వెహికిల్,రాకెట్ లాంటి రూపాలు కనిపిస్తాయి.అవన్నీ ఇప్పుడు మనం ఇస్రోలో చూస్తున్న రాకెట్ లాంచింగ్ సిస్టం మాదిరిగానే ఉన్నాయి. గణేశరధం సమీపంలో ఉన్న ఒక ఖచ్చితమైన వృత్తాకారపు తొట్టి కూడా రాకెట్ లాంచింగ్ కోసం ఉపయోగపడే విధంగానే ఉంది.ఆలయం పైభాగంలో త్రిశూలంలా కనిపించే ఆకారం నిజానికి తలమీద రెండు కొమ్ములతో అలంకరించబడిన హెల్మెట్ ధరించిన ఒక మానవ శిరస్సు - ఇలాంటి హెల్మెట్ ధరించిన రూపాలు ఏ హిందూ దేవాలయపు శిఖరకలశంలోనూ మనం చూడము.ఈజిప్ట్ పిరమిడ్లలో కనిపించే స్ఫింక్స్ రూపాలను పోలిన సగం మానవ ఆకారం సగం సింహం ఆకారం కలిసిన సింహికలు కూడా ఇక్కడి శిల్పాలలో కనబడుతున్నాయి. గోపురం మీది శిల్పాలలో ఒక చోట యూరప్ జాతీయుడి ముఖం మరొకచోట ఆఫ్రికా జాతీయుడి ముఖం స్పష్టంగా గోచరిస్తాయి.

     మార్కోపోలో మన దేశానికి రావడానికి పూర్వమే ఈ శిల్పాలలో ఇతర దేశీయుల రూపాలు కనబడడం చూస్తే అప్పటికే మన దేశస్థులకు ఇతర భూఖండాల వారితో సంబంధాలు ఏర్పడిన విషయం నిర్ధారణ అవుతున్నది.ఇక్కడ మరొక విశేషం శ్రీకృష్ణుని వెన్నముద్ద అని పిలిచే ఒక వింత రాయి.

     సుమారు 20 అడుగుల పొడవు,వెదల్పు,ఎత్తు గల ఈ రాయి అసలే ఏటవాలుగా ఉన్న కొండమీద భూతలంతో 40 డిగ్రీల కోణంలో వాలిపోయి కిందవున్న రాతినేలను కేవలం రెండు చదరపు గజాల మేర మాత్రమే తాకుతూ నిలబడి చూపరులకు ఆశ్చర్యాన్నీ భయాన్నీ కలిగిస్తున్నది.చూడటానికి ఆనించినట్టు కనబడుతున్న ఈ 250 టన్నుల బరువైన రాయి పెనుగాలులకి కూడా కదలకుండా నిలబడి ఉండటం నిజంగా అద్భుతమే! క్రీ.శ 1908లో ఆర్ధర్ లాలీ అనే బ్రిటిష్ అధికారి ఇది చాలా అపాయకరంగా ఉందని తొలగించడానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులను కట్టి ఏడు ఎనుగులతో లాగించాలని చూసినా దానిని కదిలించలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ఒక కధనం ఉన్నది. ఇలాంటి రాళ్ళు పెరూలోని మాచుపిచులోనూ, కొన్ని మెక్సికన్ నగరాలలోనూ, ముఖ్యంగా గ్రహాంతరవాసులకి సంబంధించిన కధలు ప్రచారంలో ఉన్నచోటనే కనపడుతున్నాయి.


ఒకానొకప్పుడు సోమనాధ లింగం గాలిలో తేలుతూ ఉండేదని మీకు తెలుసా!

     13వ శతాబ్ధపు అరబ్ భూగోళశాస్త్రవేత్త జకారియా అల్ క్వాజ్విని వ్రాసిన "వండర్స్ ఆఫ్ తింగ్స్ క్రియేటెడ్ అండ్ మార్వెల్స్ ఆఫ్ తింగ్స్ ఎగ్జిస్టెడ్" వ్రాతల సారాంశం కింద ఇవ్వబడింది. ఇది సోమనాధ్ ఆలయ వివరణ మరియు దాని ధ్వంసం గురించి వివరిస్తుంది. ‘సోమనాధ్: భారతీయుల చేత పవిత్రక్షేత్రంగా భావించబడి సముద్రతీరాన ఉపస్థితమైన క్షేత్రం సోమనాధ్. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం. ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత. హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధానదైవమఇన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగరూపంలో నిలిచి ఉండడం ఒకవేళ ముసల్మాన్ కాని నాస్థికుడు కాని ఎవరికైనా ఒక వర్ణించ లేని అద్భుతం. చంద్రగ్రహణ కాలంలో లక్షకంటే అధికులైన హిందువులు ఇక్కడకి పవిత్రయాత్రార్ధం రావడం ఆనవాయితీ.

     ఎప్పుడైతే సుల్తాన్ యామిను డి దౌలా మహ్ముద్ సుబుక్తిజిన్ భారతదేశం మీద మతపరమైన దండయాత్ర చేసాడో ఆయన సోమనాధ్‌ను స్వాధీనపరచుకొని ధ్వంసం చేయడానికి గొప్ప ప్రయత్నం చేసాడు. అందువలన హిందువులు ముహమ్మదీయులుగా మారతారని విశ్వసించబడింది. ఫలితంగా వేల మంది హిందువులు బలవంతంగా ఇస్లామ్ మతానికి మార్చబడ్డారు. ఆయన అక్కడికి 416 ఎ హెచ్ (ఎ డి 1025 డిసెంబర్)లో వచ్చాడు. రాజు ఈ లింగరూపాన్ని చూసి విస్మయం చెందాడు. తరువాత ఇక్కడి నిధులను మళ్ళించడానికి పడగొట్టడానికి అదేశాలు జారీచేసాడు. అక్కడ గొప్ప ప్రముఖల చేత ఆలయానికి దానంగా ఇవ్వబడిన అనేక స్వర్ణ మరియు రజత విగ్రహాలు, ఆభరణాలతో నిండిన పాత్రలు కనుగొనబడ్డాయి. ఆలయంలో కనుగొనబడిన వస్తువుల విలువ 20 వేల దినార్లకు పైబడి ఉంది.’ - ఈ విధంగా మొత్తం హిందువుల ఆలయాల నుంచి ఎంత స్థాయిలో సంపద కొల్లగొట్టారో తెలుసుకుంటే హృదయమున్న ప్రతివారికీ భారతదేశం మీద అపారమయిన జాలివేస్తుంది!

     ఒక విదేశీయుడు,అదీ వాళ్ళ మతస్థుడే వాళ్ళు చేసింది మతయుద్ధమే అని ఢంకా బ్జాయించి చెప్తుంటే మన ప్రగతిశీల చరిత్రకారులు మాత్రం "అబ్బెబ్బే!వాళ్ళు ఆలయాల్లో ఉన్న సంపదని దోచుకుపోవడానికే వచ్చారు,అవి మతయుద్దాలు కావు కావు కావు కావు.హిందూ రాజులు మాత్రం యుద్ధాలు చెయ్యలేదా?వాళ్ళూ అంతే!" అని దోచుకున్న పరాయివాళ్ళని సపోర్టు చేస్తూ వాళ్ళ చేతుల్లో దెబ్బతిన్న సొంతవాళ్ళని దబాయించడం చూస్తుంటే  వాళ్ళు అందరు మనుషుల్లాగే పుట్టి పెరిగినవాళ్ళేనా,లేక చిన్నప్పట్నించీ అశుద్ధం లాంటిది ఏదయినా తిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదని ప్రమాణం చేసుకుని అబద్ధాలు మాత్రమే చెప్పి ఎదటివాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనే దుగ్ధతో పెరిగి అలా తయారయ్యారా అని నాకు అనుమానంగా ఉంది.

     అన్నిసార్లు కొల్లగొట్టినా అతి తక్కువ కాలంలోనే మళ్ళీ అంత సంపద సృష్టించగలిగిన హిందువులు ఆలయాల్ని రక్షించుకోవటంలోనూ అన్యాయానికి గురికాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవటంలోనూ మాత్రం పూర్తిగా వెనకబడిపోయిన వివేకశూన్యులు - ఇప్పటికీ బుద్ధి రాని మొద్దురాచిప్పలు!

     ఒకనాడు తరగని సిరిసంపదలతో తులతూగి మొత్తం రాజ్యాన్ని కూడా ఒంటిచేతి మీద పోషించగలిగిన ఆలయాలు ఇవ్వాళ అందులో పనిచేసే పూజారులకి జీతాలు కూడా ఇచ్చుకోలేని  దుస్థితికి దిగజారడానికి కారణం ఏమిటి?ఇవ్వాళ మనం భక్తిగా కళ్ళు విప్పార్చి చూస్తున్న చాలా దేవాలయాల్లోని అర్చామూర్తులలో ఎన్ని అసలువో ఎన్ని నకిలీవో ఎవరికయినా తెలుసా!అన్ని ఈతర మతాలకి సంబంద్జించిన ఆలయాల్ని పూర్తి అటాన్మస్ స్టేటస్ ఇచ్చి వారి వారి మతస్థుల అధీనంలో వదిలేసి హిందువుల ఆలయాల్ని మాత్రమే ఎందుకు ప్రభుత్వనిర్వహణలో ఉంచవలసి వచ్చింది?ఆలయాల్ని పరిరక్షించడానికి అని చెప్తే జీతాలు ఇవ్వకపోవడాన్ని చూసినా అర్చామూర్తులు స్మగుల్ అవడం చూసినా అది అబద్ధం అని తెలిసిపోదా?ప్రభుత్వం తరపున ఆలయాల మీద పడి తింటూ పేను పెత్తనం వెలగబెడుతున్న ఎండోమెంట్ అధికార్లకి అందుతూనే ఉన్నాయిగా, మరి పూజారులకి జీతాలు ఇవ్వడానికి ఏడుస్తున్న ప్రభుత్వాలు వాటిని ఏమి రక్షిస్తున్నట్టు?మిగతా అన్ని శాఖలకి సంబంధించిన వాటినీ కాస్త మెయింతెనెన్స్ అకష్తమైతే చాలు వేఅలమేసి మరీ ప్రైవేట్ సెక్టారుకి అప్పగించగెసిన వాళ్ళు అబ్కారీ శాఖనీ ఎండోమెంట్సు శాఖనీ వదలటం లేదు, ఎందుకని?

     ఎక్కడ విగ్రహాల స్మగ్లింగ్ కేసు బయటపడినా ఆలయానికి సంబంధించిన ఎండోమెంట్స్ ఉద్యోగికి ఖచ్చితంగా సంబంధం ఉంటున్నది!వీళ్ళు ఒక అలయంలో డ్యూటీకి దిగిన మరుక్షణం నుంచీ అర్చామూర్తి వీళ్ళకి బెల్లం ముక్కలా కనపడుతుంది కాబోలు!తిరుమలలో జరిగుతున్న వూవహారాలు చూస్తుంటే హియ్యర్ స్వామి సన్యాసి గాబట్టి క్లబ్బు అని సరిపెట్టేశాడు గానీ వీఐపీలకి పక్కలేసే బ్రోతల్ హౌవుసు స్థాయికి దిగజార్చారు దొంగ నా కొడుకులు!ఇవ్వాళ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే:

"దొంగలంజకొడుకులు అధికారం పల్లకీని ఎక్కారు,
దొంగలదోపిడి గాడిదగత్తర బతుకిచ్చి ప్రజల్ని బోయీల్ని చేశారు -
డెబ్బయ్యేళ్ళ తర్వాత పోలిస్తే వీళ్ళకన్నా ఇంగ్లీషోళ్ళే నయమనిపిస్తున్నారు - చీచీ!"

     లేకపోతే ఎంటిది?లెక్క పెట్టి శిశుపాలుడి కంటే పది తప్పులు ఎక్కువ చేస్తూ కూడా సరిచేసుకుంటాం అని చెప్పి కూడా దున్నపోతుల్లా చలనం లేకుండా ఉన్నారంటే "ఈ కలియుగంలో వైకుంఠవాసుడు స్తంభాన్ని చీల్చుకుని వస్తాడా పెడతాడా?ఎన్ని తప్పులు చేసినా మనల్ని శిక్షించగలిగిన వాడెవడూ లేడు!" అనే ధైర్యం కాదూ వాళ్ళది.ఇవ్వాళ ఈ భూప్రపంచంలో దేవుడు లేని చోటు ఏదయినా ఉందంటే అది తితిదే వారి బోర్డు కార్యాలయమే!అది విస్తరించి గర్భగుడి వరకూ వెళ్ళిందంటే గోవిందో గోవిందా!!

     మామూలు భక్తులు అంత కష్టపడి దూరాభారం అనుకోకుండా వస్తుంటే ఒక సెకను సేపయినా చూడనివ్వరు,మొండిగా నెట్టేస్తారు,వీఐపీలని మాత్రం గంటల తరబడి కూర్చోనిస్తారు - పూజార్లు పాలేర్ల మాదిరి వీఐపీల గుమ్మాల దగ్గిర పడిగాపులు పడటం!ఇది నిజంగా దేవాలయమేనా?ఎప్పుడూ అక్కడ తిరిగే మనుషుల్ని కూడా నీతిగా ఉంచలేనప్పుడు అక్కడున్న మూలవర్ ఉత్త బొమ్మే కదా!భక్తి అంటేనే ఇంద్రియ నిగ్రహం.మరి తప్పులు చేస్తున్నాం అని ఒప్పుకుని సరిదిద్దుకుందాం అని లెక్చర్లు కూడా దంచి మన్నుతిన్నపాముల్లా పడిఉండటం అంటే బద్ధకమా?నిర్లక్ష్యమా?పొగరా?

     ఇవ్వాళ తిరుమలేశుడి భక్తులకి రెండే రెండు దార్లు - చిన జియర్ స్వామిలాగే తిరుపతి వెళ్ళకుండా ఉండటం,వెళ్తే "ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా?ఉంటే మిమ్మల్నెందుకు మార్చలేకపోతున్నాడు?" అని నిలదీసి అడగటం.ఆయనే చూసుకుంటాడులే అనుకోవటానికి ఆలయాలు కట్టమని ఆయన అడిగాడా?మనం తిరుగాడుతున్న ఈ భూమండలంతో పాటు అనేకానేక పాలపుంతల్నీ కృష్ణబిలాల్నీ అనంతకోటి వ్శ్వాల్నీ కుక్షిలో దాచుకున్న బ్రహ్మాండ నాయకుడు తన సృష్టిలో ఏ వంతులో ఉందో తెలియని ఈ పిసరంత భూమి మీద కట్టిన గవ్వకు సాటిరాని ఈ గుడిలో ఏదో అనర్ధం జరిగినట్టు పరిగెత్తుకురావల్సిన అవసరం ఆయన కేమిటి?మన నిష్ఠ కోసం మన నమ్మకం కోసం మన సాధన కోసం  మనం కట్టుకున్నవి గనక మనమే బాగు చేసుకోవాలి.అసలైన దరిద్రం ఏంటటే, మనం ఇంత గట్టిగా సంప్రదాయం పాటించమనీ జరుగుతున్నాయని వాళ్ళే ఒప్పుకున్న అనాచారాల్ని ఆపమనీ ఒత్తిడి పెట్టాల్సి వస్తున్నది హిందూమతం అంటే ఏంటో తెలియని నాస్తికుల్ని కాదు, తాము పాటించి మనకి పాటించమని చెప్పాల్సిన ఆలయనిర్వహణలో ఉన్నవాళ్ళని - ఇంతకన్నా నికృష్టం ఎక్కడైనా ఉంటుందా?

     అన్ని చోట్లా ఇలాగే ఉంది కాబట్టి అన్ని ఆలయాల్నీ ప్రభుత్వం పెత్తనం నుంచి లాగేసుకుని మనమే నడుపుకోవాలి.హిందువుల సామాజికార్ధికాధ్యాత్మిక విషయాలన్నీ ఆలయంతో పెనవేసుకుని ఉన్నాయి - అవి పరహస్తగతం కావడం వల్లనే అణగారిపోయింది దేశం!  మైనారిటీల హక్కులి రక్షించటానికి మెజార్టీ ప్రజల హక్కుల్ని భక్షించాలా - ఇదేమి సెక్యులరిజం?ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ఒప్పుదలతో అధికారం చేపట్టి అందరి సౌభాగ్యం కోసం కృషి చెయ్యటం అనే నిర్వచనం ఉందని తెలిసి కూడా మెజారిటీ ప్రజల్ని మతతత్వవాదులు,జాత్యహంకారులు అని తిటిపొయ్యటం ఇక్కడే చూస్తున్నాం - ఎదవ సెక్యులరిజం!ఆరోజున ఒప్పుకున్నవాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారో తెలియదు గానీ ఈరోజున హిందువులు తమ ఆలయాల్ని ప్రభుత్వ పెత్తనం నుంచి లాక్కోవటానికి అంతర్యుద్దం చ్గేసినా తప్పు లేదు. ఎప్పటికయినా సాధించాల్సింది అదే గానీ ప్రస్తుతం అంత సాహసం చెయ్యలేం అనుకుంటే కనీసం చిన జియర్ స్వామికి మద్దతుగా నిలబడినా చాలు.


స్వస్తి
-----------------------------------------------------------------------------------------------------------------
P.S:పైన చెప్పిన ఆలయాల గురించి మరింత ఎక్కువగా తెలుసుకుని ప్రయోజనం పొందాలని అనుకుంటే శ్రీకృష్ణ తెలుగు క్యాలెండర్ అనే యాండ్రాయిడ్ యాప్ మీ మొబైల్ ఫోనులో గానీ యాండ్రాయిడ్ ద్వారా పనిచేసే ఎందులో అయినాసరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...